వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత పంజం సుకుమార్‌రెడ్డి మృతి | YSRCP Panjam Sukumar Reddy Passed Away Due To Health Issues In Chennai | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత పంజం సుకుమార్‌రెడ్డి మృతి

Jun 28 2025 7:13 AM | Updated on Jun 28 2025 9:06 AM

YSRCP Panjam Sukumar Reddy Passed Away

రైల్వేకోడూరు అర్బన్‌: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండల వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి (64) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు పార్టీ నేతలు సంతాపం తెలిపారు. 

సుకుమార్‌రెడ్డి రాజకీయాల్లో తొలి నుంచి వైఎస్‌ కుటుంబంతోనే ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ మండలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2000–2011 మధ్య అనంతరాజుపేట పంచాయతీ సర్పంచ్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలో వైఎస్సార్‌ హార్టికల్చర్‌ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌గా నియామకమై ప్రభుత్వ పథకాలను రైతులకు అందించడంలో ఎంతో కృషి చేశారు. కోడూరు డాల్ఫిన్‌ డేల్‌ పేరిట విద్యాసంస్థను ప్రారంభించి నాణ్యమైన విద్య అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement