
ఢిల్లీ : దేశంలో అత్యధికంగా మామిడి సాగు జరిగే ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కేంద్రానికి తెలియజేశారు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు గురుమూర్తి లేఖ రాశారు. ఎంపీ గురుమూర్తి రాసిన లేఖలో పేర్కొన్న అంశాల్లో కొన్ని..
🔹దేశంలో అత్యధికంగా మామిడి సాగు అయ్యే రాష్ట్రంగా ఏపీ – 12.35 లక్షల ఎకరాల్లో సాగు
🔹 చత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి సాగు దెబ్బతిన్నది – రైతులు దిగులులో ఉన్నారు.
🔹 కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.12 కంటే వాస్తవంగా ధర కేవలం రూ.1 నుంచి రూ.4/kg మాత్రమే అందుతుంది
🔹 ధర పతనం వల్ల 52 ప్రాసెసింగ్ యూనిట్లలో 28 మూతపడ్డాయి – వేలాది మంది రైతులకు ఆదాయ నష్టం జరిగింది
🔹 దేశ మామిడి ఎగుమతుల్లో 20% మేరకు ఏపీ వాటా ఉన్నప్పటికీ రైతులకు లాభం లేకపోవడం దురదృష్టకరం
🔹 తక్షణమే తోటపురి మామిడి కొనుగోలుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి – ఎంపీ విజ్ఞప్తి
🔹 మామిడి ధరలు, ఎగుమతులపై సమన్వయం చేసేందుకు ‘జాతీయ మామిడి బోర్డు’ ను తిరుపతిలో ఏర్పాటు చేయాలి
🔹 మామిడి పరిశోధన కోసం చిత్తూరులో ‘నేషనల్ మామిడి రీసెర్చ్ స్టేషన్’ ఏర్పాటుచేయాలి
🔹 రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి