టీడీపీకి భారీ షాక్.. జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి ఎస్‌.బాల సుబ్రమణ్యం | Senior Tdp Leader Sugavasi Balasubramaniam Joins Ysrcp | Sakshi
Sakshi News home page

టీడీపీకి భారీ షాక్.. జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి సుగవాసి బాల సుబ్రమణ్యం

Jun 25 2025 4:11 PM | Updated on Jun 25 2025 6:05 PM

Senior Tdp Leader Sugavasi Balasubramaniam Joins Ysrcp

 

సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్‌ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్‌ జగన్‌ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.

సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ మంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి.సతీష్‌కుమార్‌ రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌ బాబు, రమేష్‌ కుమార్‌ రెడ్డి, ఎన్‌.శ్రీనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

 

 

YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement