సాక్షి: విజయవాడ: డీఎస్సీ అక్రమాలపై నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలపై ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలు చేపట్టింది. డీఎస్సీ స్కామ్లపై ర్యాలీలు చేయెుద్దంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టే ర్యాలీలకు అనుమతి లేదంటూ నోటీసులు అంటించారు పోలీసులు.
డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు 175 నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ర్యాలీకి పోలీసుల అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్కు పోలీసులు నోటీసులిచ్చారు.


