లోక్‌అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలి

Jun 21 2025 3:09 AM | Updated on Jun 21 2025 3:09 AM

లోక్‌

లోక్‌అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయ

సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వెన్నెల

రేపల్లె: లోక్‌అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీసులు పనిచేయాలని మండల న్యాయాధికార సంస్థ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వెన్నెల కోరారు. జులై 5వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారం కోసం శుక్రవారం స్థానిక కోర్టు హాలులో డివిజన్‌ పరిధిలోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌, పోలీసులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలన్న లక్ష్యంతో న్యాయశాఖ లోక్‌అదాలత్‌తోపాటు ప్రతి నెలా జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తోందన్నారు. డివిజన్‌ పరిధిలో పరిష్కారమయ్యే కేసులను గుర్తించి పరిష్కారం అయ్యేలా చేయాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దేవీసాయి శ్రావణి, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గీతా భార్గవి, రేపల్లె రూరల్‌ సీఐ సురేష్‌బాబు, నగరం ఎకై ్సజ్‌ సీఐ శ్రీరామ్‌ ప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జీవీ గిరిధర్‌, కార్యదర్శి యు.శ్రీనివాసరావు, రేపల్లె, భట్టిపోలు, నిజాంపట్నం, చెరుకుపల్లి ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

నేషనల్‌ యోగా ఒలింపియాడ్‌లో మహేష్‌కు పతకం

వేటపాలెం: నేషనల్‌ యోగా ఒలింయాడ్‌లో మండలంలోని అక్కాయిపాలెం గ్రామానికి చెందిన అనుభం మహేష్‌కుమార్‌ బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు చైన్నె కన్యాకుమారిలో యోగా నేషనల్‌ ఒలింపియాడ్‌ పోటీలు జరిగాయి. ఈ ఒలింపియాడ్‌లో యువకుడు పాల్గొని మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. తండ్రి అనుభం వెంకట సురేష్‌ చేనేత కార్మికుడిగా పనిచేస్తుంటాడు. మహేష్‌ ఒంగోలు నవోదయలో ఇంటర్‌ చదువుతున్నాడు. మహేష్‌ని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు అభినందించారు.

వ్యవసాయ శాఖలో బది‘లీలలు’

కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖలో సహాయ సంచాలకుల(ఏడీఏ) బదిలీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ ఉదయం మండల వ్యవసాయ అధికారులతో పాటు, ఏడీఏల బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నడూ లేని విధంగా పైరవీలు జరగడంతో మార్పులు, చేర్పులకు అంతే లేకుండా పోయింది. ఎట్టకేలకు వ్యవసాయ అధికారుల బదిలీల వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ.. ఏడీఏల బదిలీల వ్యవహారానికి ముగింపు లభించలేదు. ఏడీఏల బదిలీలను జోనల్‌ యూనిట్‌గా తీసుకొని చేపట్టారు. అయితే, ఒక పోస్టులో ఇద్దరు, ముగ్గురిని నియమించడం, జోన్‌–4కు చెందిన ఏడీఏను జోన్‌–3కి బదిలీ చేయడం వంటి తప్పిదాలు భారీగా జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 19 మంది ఏడీఏలు బదిలీ అయ్యారు. వీటికి తోడు సిఫారసులు, పైరవీలు కూడా ఊపందుకోవడంతో బదిలీ ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే వీటిని హోల్డ్‌లో పెట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏడీఏలు ఎవ్వరూ రిలీవ్‌ కావద్దనే ఆదేశాలు వచ్చాయి. అయితే, పది రోజులు గడిచినా రివైజ్డ్‌ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో పాత స్థానాల్లో కొనసాగలేక, కొత్త స్థానాల్లో చేరలేక ఏడీఏల పరిస్థితి దయనీయంగా మారింది. పైరవీలు పెద్దఎత్తున జరుగుతుండటంతో బదిలీలపై అనిశ్చితి మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి బదిలీలపై బ్యాన్‌ వచ్చింది. ఏడీఏల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం అవసరం ఉందనే చర్చ వ్యవసాయ శాఖలో కొనసాగుతోంది.

నగదు రహిత వైద్యం అందించాలి

నరసరావుపేట: డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవలో పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గనోరే సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయంలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది.

ఏడీఏల బదిలీల్లో కొలిక్కిరాని పైరవీలు

బదిలీల్లో భారీగా తప్పిదాలు

ఒకే పోస్టులో ఇద్దరు, ముగ్గురు నియామకం

లోక్‌అదాలత్‌లో అధిక కేసులు     పరిష్కారమయ్యేలా కృషి చేయ1
1/1

లోక్‌అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement