వెంకట జయవర్ధన్‌ రెడ్డి అకాలమృతి బాధాకరం | - | Sakshi
Sakshi News home page

వెంకట జయవర్ధన్‌ రెడ్డి అకాలమృతి బాధాకరం

Jun 20 2025 6:07 AM | Updated on Jun 20 2025 6:07 AM

వెంకట జయవర్ధన్‌ రెడ్డి అకాలమృతి బాధాకరం

వెంకట జయవర్ధన్‌ రెడ్డి అకాలమృతి బాధాకరం

సత్తెనపల్లి: యువకుడు పాపసా ని వెంకట జయవర్ధన్‌రెడ్డి అకాల మరణం బాధాకరమని వైఎస్సా ర్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 16వ వార్డు వడ్డవల్లి ఏరియాకు చెందిన పాపసాని వెంకట జయవర్ధన్‌ రెడ్డి బుధవారం సొమ్మసిల్లి పడిపోయి గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం నిర్వహించిన అంతిమ యాత్రలో గజ్జల సుధీర్‌ భార్గవ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన కుమారుడు అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. వెంకట జయవర్ధన్‌రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతికలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం వెంకట జయవర్ధన్‌రెడ్డి మృతి వార్త తెలియడంతో డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డితో పాటు మాజీమంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, యర్రం వెంకటేశ్వరరెడ్డి, నాయకులు చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, రోళ్ల మాధవిలు పార్ధివదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. అశ్రునయనాల నడుమ అంతిమయాత్ర జరిగింది. ప్రత్యేక వాహనంపై వెంకట జయవర్ధన్‌రెడ్డి పార్ధీవ దేహాన్ని ఏర్పాటు చేసి పట్టణంలో ప్రదర్శన చేశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, మృతుడి మిత్ర బృందం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

జయవర్ధన్‌రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం

పట్టణంలోని 16వ వార్డు వడవల్లి ఏరియాకు చెందిన యువకుడు పాపసాని వెంకట జయవర్ధన్‌రెడ్డి (32) బుధవారం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో సొమ్మ సిల్లి పడిపోగా వైద్యశాలకు తరలించగా గుండెపోటుతో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. పాపసాని వెంకటజయవర్ధన్‌రెడ్డి మృతదేహానికి రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో గురువారం ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా పట్టణ ఎస్‌ఐ ఎం.పవన్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement