
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
రెంటచింతల: రెంటచింతల గ్రామ సమీపంలోని గొట్టిముక్కల మేజర్ కాలువ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆంజనేయస్వామి మాన్యం కాలనీకి చెందిన దేవరకొండ నాసరయ్య నర్సరీ పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా దుర్గి మండలం ఓబులేశునిపల్లెకు చెందిన గాజుల ఆంజనేయులు ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తూ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. నాసరయ్యకు ఎడమకాలు విరిగింది. ఆంజనేయులుకు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 ద్వారా గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు