
ఒకప్పుడూ ఆర్మీలో ఉన్నతాధికారిగా సేవలందించింది. ఇప్పుడు వీధుల్లో ఫుడ్స్టాల్ నడుపుతూ లైఫ్ని లీడ్ చేస్తోంది. అయితే ఆమెలో అప్పుడలా..ఇప్పుడిలా అనే నైరాశ్యం అణువంతైనా తొణికిసలాడదు. నెట్టింట ఆమె కథ వైరల్లగా మారి ఎందరి మనసులనో కథిలించింది.
ఎవరామె అంటే..79 ఏళ్ల ఈ వృద్ధురాలు ఒకప్పుడు ఆర్మీ మాజీ సైనికురాలు. అయితే ఆమె అస్సలు వివాహమే చేసుకోలేదట. ఆమె భారత సైన్యంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి పదవీవిరణమ చేసినట్లు తెలిపింది. అయితే ఆమెకు కుకింగ్ అంటే మహా ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఇండోర్ వీధుల్లో ఒక ఫుడ్స్టాల్ని నడుపుతోంది. ఆమె ముంబైలో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తిచేసినట్లు వెల్లడించింది.
కొన్నేళ్లు జీవితంలో తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నానని కూడా చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తన గత జీవితంలోనూ, ప్రస్తుతం ఎంతో ఆనందంగా సంతృప్తిగా జీవిస్తున్నానని ధీమాగా చెబుతోందామె. ఇక్కడ ఆ మహిళ ఈ వయసులో ఒంటరిగా ఈ వ్యాపారం ఎలా చేయగలను అనే సందేహానికి తావివ్వకుండా సాధికారత, సానుకూలతలను అస్త్రాలుగా చేసుకుని ముందుకు సాగడం ప్రశంసనీయం.
అందుకు సంబంధించిన వీడియోని కాశీష్ సోని అనే సోషల్ మీడియా ఔత్సాహికురాలు నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. పైగా ఆ వీడియోకి లక్షకు పైగా లైక్లు వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు సైతం ఒంటరిగా కూడా మహిళలు లైఫ్ని లీడ్ చేయగలరు అనడానికి ఈ మాజీ భారత ఆర్మీ హీరోనే ఉదాహరణ, ఎందరికో ఆ వృద్ధురాలు స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్ట్లు పెట్టారు.
(చదవండి: World Motorcycle Day: రైడింగ్ స్కిల్తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!)