ఆలయం ముందు యాచకురాలిపై చెప్పుతో దాడి | woman beggar sitting with her child outside a temple was beaten | Sakshi
Sakshi News home page

ఆలయం ముందు యాచకురాలిపై చెప్పుతో దాడి

Aug 13 2026 9:40 PM | Updated on Aug 13 2026 9:40 PM

woman beggar sitting with her child outside a temple was beaten

కపూర్తలా: ఆలయం బయట చిన్నారితో కూర్చున్న ఓ యాచకురాలిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పంజాబ్ కపూర్తలాలోని చారిత్రక మాతా శ్రీ భద్రకాళి ఆలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో ఓ వ్యక్తి మహిళను చెప్పులతో కొడుతూ కనిపించాడు. అక్కడున్న వారు అతడిని ఆపేందుకు, మహిళను రక్షించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ నిందితుడు మహిళపై కాలితో కూడా దాడి చేశాడు.

ఈ ఘటన వీడియో బయటకు రావడంతో మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కోర్ కమిటీ కూడా స్పందించాయి. పోలీసుల నుంచి వివరాలు కోరాయి. పోలీసులు వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు పవన్ కుమార్ కుమారుడు వికాస్ శర్మగా, షేఖ్‌పూర్ నివాసిగా తెలిపారు. అతడు ఆలయం ఎదురుగా దుకాణం నిర్వహిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

కొందరు చిన్నారులు నిందితుడి బైక్‌తో ఆడుకున్నారు. దీంతో అతడికి కోపం వచ్చింది. ఆ సమయంలో ఆలయ గేటు బయట మహిళ తన పిల్లలతో కూర్చుని ఉంది. దీంతో అతడు ఆమెపై కూడా ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత కోపంతో నిందితుడు మహిళపై దాడి చేయడం ప్రారంభించాడు. వీడియోలో అతడు మహిళను చెప్పులతో కొడుతూ కనిపించాడు. అక్కడున్న వారు మధ్యలో జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ నిందితుడు మహిళను కాలితో తన్నాడు. మొత్తం ఘటన కెమెరాలో రికార్డు అయింది. 

డీఎస్పీ సబ్ డివిజన్ డాక్టర్ శీతల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు వైరల్ వీడియో ఆధారంగా సుమోటో నోటీసు తీసుకుని సిటీ పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడానికి గాలింపు నిర్వహిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement