వైఎస్సార్‌సీపీ ‘యువతపోరు’.. విశాఖలో ఉద్రికత్త | YSRCP Yuvatha Poru Protest against Chandrababu Govt Updates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ‘యువతపోరు’.. కలెక్టరేట్ల వద్ద నిరసనల అప్‌డేట్స్‌

Jun 23 2025 8:18 AM | Updated on Jun 23 2025 1:44 PM

YSRCP Yuvatha Poru Protest against Chandrababu Govt Updates

వైఎస్సార్‌సీపీ ‘యువతపోరు’ అప్‌డేట్స్‌.. 

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..

  • నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారు
  • రెడ్‌బుక్‌పై ఉన్న శ్రద్ధ.. హామీల అమలులో లేదా?
  • కర్నూలు నుంచి పారిపోయి వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరించటం హాస్యాస్పదం
  • టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు
  • తనపై వ్యతిరేక వార్తలు రాసే వారిని రైలు పట్టాలపై పడుకోబెడతానన్న గుమ్మనూరు జయరాంపై ఏ చర్యలు తీసుకోలేదు
  • చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి.


మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..

  • సింగయ్య మరణంతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?
  • వైఎస్ జగన్ వాహనం కింద పడి కార్యకర్త చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • వైఎస్సార్‌సీపీ యువత పోరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు కుట్రలు
  • హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం అయ్యారు.
  • హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలని చెప్పారు
  • చంద్రబాబు కాలర్ పట్టుకోవాలా?
  • పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాలా?
  • నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలా?
  • ఏడాది పాలనలోనే చంద్రబాబు ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్నారు. 

మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్‌..

  • ఇంటింటికీ తిరిగి మోసపు వాగ్ధానాలిచ్చి చంద్రబాబు గద్దెనెక్కారు
  • ఏడాది కాలంలో కేవలం పెన్షన్లు మాత్రమే ఇచ్చారు
  • విద్యకు ప్రాధాన్యం కల్పించిన నాయకులు వైఎస్‌ జగన్‌.
  • చిన్నపిల్లలను కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసింది
  • తల్లికి వందనం 15 వేలు ఇస్తామని చెప్పిన లోకేష్ 13 వేలు ఇచ్చి మోసం చేస్తున్నాడు
  • వైఎస్‌ జగన్ బయటికి వెళితే భద్రత లేదు
  • ఆయనపై కేసులు ఎలా పెట్టాలి.. జైల్లో ఎలా పెట్టాలనేదే కూటమి ఆలోచన
  • సత్తెనపల్లి పర్యటనలో దొంగ సాక్ష్యాలతో జగన్‌పై కేసు పెట్టాలని చూస్తున్నారు
  • ఏం చేశారని సుపరిపాలన జరుపుకుంటున్నారు
  • ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి విజయవాడలో ధర్నా చౌక్ ఖాళీ ఉండటం లేదు
  • లోకేష్ పేరుకే విద్యాశాఖ మంత్రి
  • ఆయన శాఖ తప్ప అన్ని శాఖల పనులూ లోకేష్ చేస్తున్నాడు
  • విద్యార్ధుల ఆవేదనను ఇప్పటికైనా లోకేష్ గుర్తించాలి

 

ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ కామెంట్స్‌..

  • కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసింది
  • యువకుల బాధ్యత నాది అని యువగళంలో లోకేష్ హామీ ఇచ్చాడు
  • ఈరోజు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు
  • నేనుంటాను.. నేను చూసుకుంటానని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు
  • సచివాలయ వ్యవస్థ ప్రజలకు దూరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది
  • కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో కాలక్షేపం చేస్తున్నారు
  • సత్తెనపల్లి పర్యటనలో ప్రమాదానికి వైఎస్‌ జగన్‌ కాన్వాయ్ కారణం కాదని ఎస్పీ చెప్పారు
  • ఫేక్ వీడియో జతచేసి రాజకీయం చేస్తున్నారు..
  • పట్టించుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • గతంలో టీడీపీ నేతలు చేసిందేంటి?
  • కందుకూరు సభ పెట్టి ఎనిమిది మందిని బలి తీసుకున్నారు
  • గుంటూరులో చీరలు పంచి ముగ్గురు చనిపోయేలా చేశారు
  • ప్రజల ప్రాణాలు పోతే వదిలేసి వచ్చిన చరిత్ర మీది
  • తారకరత్న చనిపోతే యువగళాన్ని కొనసాగించిన వ్యక్తి లోకేష్


మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్‌..

  • యువతను ఈ ప్రభుత్వం మోసం చేసింది
  • ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. మెగా డీఎస్సీ అన్నారు
  • హామీలపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి
  • వైఎస్‌ జగన్‌ తెచ్చిన కంపెనీలకు మళ్లీ కొబ్బరికాయలు కొట్టడమేనా మీ అభివృద్ధి
  • ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంతవరకూ చెల్లించలేదు
  • నిన్నటి వరకూ వైఎస్‌ జగన్‌ చుట్టూ ఉన్నవారిపై కేసులు పెట్టారు
  • ఇప్పుడు ఆయనతో పాటు కారులో ఉన్నవారిపైనా కేసులు పెడుతున్నారు
  • సినిమా డైలాగ్ ను చెబితే వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేశారు
  • నీ తల నరకొచ్చుగా అన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ఎవరైనా ఖండించారా?.
  • బుచ్చయ్య చౌదరి పై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు
  • వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు
  • ఆయనను ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలని చూస్తున్నారు
  • ఎన్ని నిర్భందాలు విధించినా మేం ప్రజల పక్షాన నిలబడతాం.. ప్రశ్నిస్తాం


దాడిశెట్టి రాజా కామెంట్స్‌..

  • ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు
  • ప్రజలు, రైతులు, యువత, మహిళల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్
  • వైఎస్ జగన్‌ను ఏదో విధంగా ఎలిమినేట్ చేయ్యాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకుల మాటలు కనిపిస్తున్నాయి.
  • వైఎస్ జగన్ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు..
  • ప్రజల తరుపున ప్రశ్నించకూడదని అనుకుంటున్నారు.
  • బుచ్చయ చౌదరికి ఇంగిత జ్ఞానం.. బుద్ది  లేదా?
  • 80 ఏళ్ళ వయస్సులో ఒక మాజీ ముఖ్యమంత్రి తల నరుకుతానంటున్నావ్!
  • ప్రజలను ఏవిధంగా మోసం చేశారో వైఎస్ జగన్ చెబితే...
  • దానికి సమాధానం చెప్పకుండా రప్పా రప్పా అంటూ డైవర్ట్ చేశారు.
  • వైఎస్‌ జగన్ ప్రెస్‌మీట్‌ డైవర్ట్ కోసం రప్పా..రప్పా
  • ఫీజు రియింబర్స్మెంట్ రప్పా..రప్పా
  • నిరుద్యోగ భృతి రప్పా..రప్పా.

మచిలీపట్నం ఇంఛార్జి పేర్ని కిట్టు కామెంట్స్‌..

  • విద్యార్థులను చంద్రబాబు మోసం చేశాడు
  • ఎన్నికల సమయంలో నోటి కొచ్చిన హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చాక భయం వేస్తుందని మాట మార్చాడు
  • పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకొని యువతను మోసం చేయాలని చూశావు
  • ప్రస్తుతం యువత అంత పిచ్చితనంలో లేరు
  • యువత మిమ్మల్ని నిలదీసే రోజు వచ్చింది.
  • విద్యార్ధులకు ఫీజులు ఎగ్గొట్టిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే చంద్రబాబు
  • విశాఖపట్నంలో యోగ పేరిట డబ్బు ఖర్చు పెట్టావ్
  • ఆ డబ్బులను యువత ఫీజులకి విడుదల చేసుంటే బాగుండేది
  • గిన్నిస్ రికార్డు కోసం యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు
  • విద్యార్థులకు ఫీజులు ఎగ్గొటిన ఏకైక ముఖ్యమంత్రి నేనే అని గిన్నిస్ రికార్డులో ఎక్కాల్సింది

విశాఖలో ఉద్రికత్త..

  • వైఎస్సార్‌సీపీ యువత పోరుబాట ధర్నాను కలెక్టరేట్ వద్దకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం.
  • నాలుగు చోట్ల భారీ కేట్లు పెట్టిన పోలీసులు..
  • వైఎస్సార్‌సీపీ శ్రేణులను నియంత్రించ లేకపోయినా పోలీసులు..
  • పోలీసులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట.
  • పోలీసులను దాటుకొని కలెక్టరేట్‌కు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు..
  • చంద్రబాబు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు..

విజయవాడ..

  • ధర్నాచౌక్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసన
  • నిరసనల్లో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్పార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,
  • వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి,
  • మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు,
  • జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు,
  • పార్టీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర,
  • వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ దొడ్డా అంజిరెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లు, యువత

వైఎస్సార్ జిల్లా..

  • వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు కడపలో భారీ ర్యాలీ
  • వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ర్యాలీని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి
  • పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ
  • జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న యువత
  • కూటమి ప్రభుత్వం అన్ని విధాలా యువతను మోసం చేసిందని నినాదాలు
  • కలెక్టర్ కార్యాలయంలో యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతిపత్రం

విశాఖ..

  • ప్రారంభమైన యువత పోరు కార్యక్రమం..
  • జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ..
  • ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత విద్యార్థులు నిరుద్యోగులు..
  • చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు..
  • ఏడాదికాలంగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు..
  • నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు..
  • ఇంటికొక ఉద్యోగం అన్నారు..
  • ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
  • నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలి..
  • విశాఖ వైఎస్సార్‌సీపీ పార్లమెంటు పరిశీలకుడు కదిరి బాబురావు.

అనంతపురం..

  • యువత సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
  • అనంతపురం కలెక్టరేట్ వద్ద యువత పోరు
  • భారీగా తరలివచ్చిన యువకులు, విద్యార్థులు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు
  • ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహం
  • టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారు
  • ఒక్కో నిరుద్యోగికి మూడు వేల రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైంది
  • ఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7200 కోట్లు
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యువత సమస్యలు పట్టవా అని ప్రశ్నలు. 

యువత పోరు ప్రారంభం..

  • ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ యువత పోరు కార్యక్రమం ప్రారంభం. 

  • కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, నిరుద్యోగులు, యువత నిరసనల్లో పాల్గొంటున్నారు. 

ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌­సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్‌సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్ను­పోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు రాష్ట్రవ్యాప్తంగా యువ­తకు బాసటగా జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్‌­సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు.   

  • అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు

  • అనంతరం కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయం

  • అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ

  • ఉద్యోగాలు కల్పించకపోతే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అంటూ హామీ

  • ఇప్పటికి ఏడాదైనా కనీసం జాబ్ కేలండర్ కూడా ప్రకటించని చంద్రబాబు సర్కార్

  • నిరుద్యోగ భృతి ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వం

  • నిరుద్యోగ భృతి రూపంలో ఇప్పటికే రూ.7,200 కోట్ల బకాయి

  • 2025-26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని చంద్రబాబు

  • చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ నేడు వైఎస్సార్ సీపీ ఆందోళనలు

  • కలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపు

కృతి లేదు.. భృతి లేదు 
2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.

నో జాబ్స్‌..
ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ ని­రు­ద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది.  

అమలు చేసేశామంటూ అబద్ధాలు 
నిరుద్యోగ భృతిని స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యా­ఖ్యానించారు. మరో­వైపు కాలేజీలకే ఫీజు రీయిం­బర్స్‌­మెంట్‌ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా­రు.

తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధి­క వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.­4,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement