vennupotu dinam
-
అమాయక ప్రజలను బాబు మోసం చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, రౌడీలు.. పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిపి ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు హామీ ఇచ్చి చంద్రబాబు వెన్నుపోటు(Chandrababu Vennupotu) పొడిచారు. అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన చేపడతాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నష్టపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన దోపిడీతో మొదలైంది. సూపర్ సిక్స్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచింది.. .. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. రేషన్ డోర్ డెలివరీ(Ration Door Delivery System) విధానాన్ని కూడా చంద్రబాబు తొలగించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. .. ఉచిత బస్సు, అమ్మకి వందనం అంటూ ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రౌడీరాజ్యం , పోలీసు రాజ్యం నడుస్తోంది. విజయవాడలో శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి చూస్తోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ను కిడ్నాప్ చేయడం దారుణం. అసలు బెజవాడ నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరంలో బుడమేరు వరదల్లో 12 డివిజన్లు నీట మునిగాయి అని మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి(Vijayawada Deputy Mayor Sailaja Reddy) మాట్లాడుతూ.. ‘‘జగన్ను ఒంటరిగా ఢీ కొనలేక మూడు పార్టీలు ముందుకు వచ్చాయి. చంద్రబాబు అమాయక ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఒక్క హామీ అమలు చేయలేదు. టీడీపీ మహానాడుతో ప్రజలకు ఏం ఉపయోగం లేదు. జగన్ను తిట్టేందుకు.. లోకేష్ ను పొగడ్తలతో ముంచేందుకే మహానాడు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు అని అన్నారామె. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.ఇదీ చదవండి: అలాంటి వారిని ఇలాగే శిక్షస్తారా?.. మేడమ్! -
ఆంధ్రప్రదేశ్ ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు
-
వెన్నుపోటుకు ఏడాది
-
‘కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది’
ఎన్టీఆర్ జిల్లా: ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పతనం మొదలైందన్నారు మైలవరం నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి జోగి రమేష్. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరించడానికే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 4వ తేదీన వైఎస్సార్ సీపీ చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఈరోజు(ఆదివారం) పోస్టర్ ను ఆవిష్కరించారు జోగి రమేష్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వ చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం, మైలవరం నియోజకవర్గంలో జూన్ 04 న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. జూన్4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇచ్చిన హామీలన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది. జూన్ 04 న మైలవరం డాక్టర్ లక్కిరెడ్డి హనిమి రెడ్డి కాంప్లెక్స్ వద్ద నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీని జరుగనుంది’ అని జోగి రమేష్ తెలిపారు. -
‘వెన్నుపోటు దినం’పై చంద్రబాబు కుట్రలు
సాక్షి, విజయవాడ: జూన్ 4న వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఇందులో భాగంగా వెన్నుపోటు దినం రోజున వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనల్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తోంది. జూన్ 4 న వైఎస్సార్సీపీ నేతలు చేపట్టే నిరసనలకి పోలీసులు అనుమతి నిరాకరించారు. శ్రీకాకుళం, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో వెన్నుపోటు దినం నిమిత్తం వైఎస్సార్సీపీ నేతలు అనుమతుల కోసం పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. అయితే, నేతల విజ్ఞప్తుల్ని పోలీసులు నిరాకరించారు. పలుచోట్ల సెక్షన్ 30 అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రజాస్వామ్య విధానాలు,రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసేలా కూటమి ప్రభుత్వం అరాచకానికి దిగింది. వైఎస్సార్సీపీ నాయకులు కోరుతున్న అనుమతులు తిరస్కరించేలా చంద్రబాబు పోలీసుల్ని వాడుకోవడం గమనార్హం.కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేలా వెన్నుపోటు దినంప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారు. ‘జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని వైఎస్ జగన్ కోరారు. -
కూటమిపై కన్నెర్ర
-
ఆ పదానికి పేటెంట్ చంద్రబాబే: వైఎస్సార్సీపీ
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ వంచనకు పాల్పడిందని.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వెన్నుపోటు దినం పోస్టర్ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్పొరేటర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 175 నియోజక వర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ పాటిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఏడాదిలో వైఎస్ జగన్ 80 శాతం హామీలను అమలు చేశారు. జూన్ 4న జిల్లా పరిషత్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తాము’’ అని బొత్స పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా: వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్ అని.. కూటమి సర్కార్.. మోసాలకు, అరాచకాలకు నిరసనగా జూన్ 4న రాజంపేట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన చేపట్టే వెన్నుపోటు దినం పోస్టర్ను ఆయన విడుదల చేశారు.వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటు దినం’ పోస్టర్ను వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 4వ తేదీన చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపడుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతపురం: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మోసకారి అంటూ దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. హామీలంటే ఇప్పుడు భయమంటున్నారు. సూపర్ సిక్స్ హామీలను ఎందుకు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శన ను విజయవంతం చేయాలని తోపుదుర్తి పిలుపునిచ్చారుకృష్ణా జిల్లా: 4న చేపట్టే ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమ పోస్టర్ను కానూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని.. అబద్దపు హామీలతో సీఎం అయ్యారంటూ మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి?. వెన్నుపోటుకి నిర్వచనం చంద్రబాబు. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచాడు. అబద్దానికి నిలువెత్తు రూపం చంద్రబాబు. నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని పార్టీ నేతలకు దేశభక్తుని చక్రవర్తి పిలుపునిచ్చారు. -
గన్నవరం లో సౌండ్ చేస్తే.. అమరావతికి వినపడాలి
-
వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించిన YSRCP నేతలు
-
వెన్నుపోటు దినంగా జూన్ 4.. పోస్టర్ ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జూన్ 4న పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోంది. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ, ఏడాదిలోనే తొంబై తొమ్మిదిశాతం అమలు చేసిన ఘనత వైయస్ జగన్ది. అలాగే విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి, ఆచరణలోకి తీసుకువచ్చి, ప్రజల వద్దకే సుపరిపాలనను తీసుకువెళ్ళి అందించి చరిత్ర సృష్టించారు. దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవిచూపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో కూడా చంద్రబాబు నిరూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆనాడే వైఎస్ జగన్ స్పందిస్తూ, వాటిని అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి హామీలు ఇస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పీ-4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మోసం బహుశా ఎక్కడా మనకు కనిపించదు. 1995లో సొంత మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తరువాత 1999, 2014, 2024లోనూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. గతంలొ హామీలను అమలు చేస్తానంటూ అబద్దాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బరితెగించి, హామీలను అమలు చేయడం కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలుచంద్రబాబు సీఎంగా తొలి ఏడాదిలోనే రూ.1.49 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ సొమ్ము దేనికి వినియోగించారో తెలియదు. ఆనాడు మామాకు వెన్నుపోటు పొడిస్తే, ఈ రోజు నేరుగా తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారు. దీనిని ప్రశ్నిస్తూ వైయస్ఆర్సీపీ వెన్నుపోటుదినంను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్ళి స్థానికంగా ఉన్న అధికారులకు మెమోరాండంలు సమర్పిస్తాయి. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు మోసపోయిన ప్రజలు కూడా పాల్గొని, ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, సాకె శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, కుంభా రవి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాయకులు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, ఎన్.చంద్రశేఖర్రెడ్డి, కొమ్మూరి కనకారావు, చల్లా మధుసూధన్రెడ్డి, మనోహర్రెడ్డి, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు.