ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన! | YSRCP Women Wing Meet At Vijayawada Over AP Govt Ruling | Sakshi
Sakshi News home page

ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన!

Jun 14 2025 3:38 PM | Updated on Jun 14 2025 5:25 PM

YSRCP Women Wing Meet At Vijayawada Over AP Govt Ruling

విజయవాడ: వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన’ పై చర్చా వేదిక నిర్వహించారు విజయవాడ వేదికగా జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి,  ఎమ్మెల్సీ కల‍్పలతారెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ భాగ్యలక్ష్యి, పార్టీ మహిళా నేతలు, వైద్యులు, వాలంటీర్లు, విద్యావంతులు, మహిళలు పాల్గొన్నారు అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించిన అనంతరం చర్చా వేదికను ప్రారంభించారు

దీనిలో భాగంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘అవినీతి పాలన, అప్పుల ఆంధ్రాగా మారింది ఏడాదిలోనే మహిళల జీవితాలు తలకిందులైపోయాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సాధికారితకు పెద్దపీట వేశారు. ఈ ప్రభుత్వంలో మహిళా భక్షక పాలన సాగుతోంది. మహిళలకు దశ,దిశా లేకుండా పోయింది. 

తొలియేడాదిలో తొమ్మిది శాతం కూడా మహిళలకు ప్రయోజనం చేకూర్చలేదు. రోజుకు 70 మంది మహిళల పై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా?, సందుసందుకి మద్యం షాపులు ఉండటాన్ని స్వర్ణాంధ్ర అంటారా?, 17 ఏళ్లలో చేయనంత అప్పు చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా?,సూపర్ సిక్స్ చేసేశాను..ఎవరైనా అడిగితే వారి నాలుక మందం ఎక్కినట్లే అని సీఎం చెబుతున్నారు. నాలుక మందం ఎక్కడమేంటి దృశ్యం సినిమా మాదిరి ఒకే విషయాన్ని పదేపదే ఒకే విషయాన్ని చెప్పి నమ్మించాలని చూస్తున్నారు. సూపర్ సిక్స్ అడిగిన వారి నాలుక మందం అయితే... ఎగ్గొట్టిన వారిని ఏమనాలి

ఇంటింటికీ బాండ్లు పంచిన వారిని ఏమనాలి గతంలో అమ్మఒడి పై విమర్శలు చేశారు. ఇప్పుడు అవే నిబంధనలు తల్లికి వందనం పథకంలో అమలు చేస్తున్నారు. డ్రాప్ అవుట్స్ ను తగ్గించేందుకు దేశచరిత్రలో తొలిసారి జగన్‌ అమ్మ ఒడిని ప్రవేశపెట్టారు. జగనన్న పథకాలను ఈ ప్రభుత్వం కాపీకొట్టగలదు..కానీ జగనన్న చిత్తశుద్ధిని కాపీ కొట్టలేరు. 

ఏడాది కాలంలో మద్యం, గంజాయి,డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణం,  గతంలో జగనన్న దిశా యాప్ ను తెచ్చి మహిళలకు రక్షణ కల్పించారు. దిశా చట్టాన్ని ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు.  అనంతపురంలో బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారం రోజులు పట్టించుకోలేదు పోలీసుల నిర్లక్ష్యంతో బాలిక శవమై తేలింది. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలిక పై టిడిపి కార్యకర్త ఆరునెలలుగా అత్యాచారం పాల్పడ్డారు’ అని వరుదు కళ్యాణి మండిపడ్డారు.

సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు?
రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచనే తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన కూటమి నాయకుల్లో లేదని ధ్వజమెత్తారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. జగనన్న మహిళలకు పెద్ద పీట వేసిన  విషయాన్ని ఈ సందర్భంగా ఆమె మరోసారి గుర్తుచేశారు. జగనన్న దిశా యాప్‌ తెస్తే ఆ యాప్‌ను ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు. 

అదే దిశా యాప్‌ను పేరు మాత్రమే మార్చి శక్తి యాప్‌ అని పేరు పెట్టారు. దిశా చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తే లోకేష్‌ తెలుగు మహిళలందరినీ పోగేసి ఆ ప్రతును తగలబెట్టించారన్నారు. ‘ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారు.... ప్రజలను సోమరిపోతులను చేసేస్తున్నారని బురదజల్లారు జగనన్నను విమర్శించి అంతకంటే ఎక్కువ పథకాలిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారు. 

ప్రజలకు పథకాలు ఇవ్వాలని ఉన్నా కానీ భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. 40 ఏళ్ల సీనియర్‌నని చెప్పుకునే నాయకుడు అలా చెప్పడమేంటి?, అమ్మఒడి పథకంలో 1000 రూపాయలు పాఠశాలల నిర్వహణకు తీసుకుంటే లోకేష్ అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు తల్లికివందనం పథకంలో లోకేష్ రూ. 2 వేలు కోత పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులుపెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారు 

ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారుల పై అఘాయిత్యాలు జరిగాయి. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు. వైఎస్సార్‌సీపీ వాళ్లకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?, కులం,మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందించాలని జగన్ చెప్పారు. చంద్రబాబుకి...జగన్‌కి ఉన్న తేడా ఇదే. రాష్ట్రం రావణకాష్టంలాగా మారింది.క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనవ్రతం దాల్చారు. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలి’ అని వనిత డిమాండ్‌ చేశారు. 

 ఏపీఐడీసీ మాజీ చైర్మన్‌ బండి పుణ్యశీల మాట్లాడుతూ.. చంద్రబాబుకి అమరావతిలో ఉన్నవారు మాత్రమే మహిళలుగా కనిపిస్తారని, రాష్ట్రంలో ఉన్న మహిళలు గురించి చంద్రబాబుకు మనం గుర్తుచేయాలని ఎద్దేవా చేశారు. అనని మాటలను వైఎస్సార్‌సీపీకి, సాక్షికి ఆపాదించి నానా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.

మేము మాట్లాడితే బూతులా...? బాబు బ్యాచ్ ని ఏకిపారేసిన పుణ్యశీల

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఈ ప్రభుత్వంలో విద్యకు ఒక విధానమంటూ లేకుండా పోయింది. విద్యాశాఖను గాడి తప్పిస్తున్నారు. ఏడాది కాలంలోనే టీచర్లను రోడ్డుమీదకు లాగేశారు. టీచర్ల బదిలీల్లో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్కూల్స్ కు దగ్గర్లోనే మద్యం షాపులు పెట్టారు. జగన్ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించారు. విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చారు’ అని స్పష్టం చేశారు. 

టీడీపీకి ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారు

తిరుపతి మేయర్‌ శిరీష మాట్లాడుతూ..  ‘ ఆరోగ్యానికి జగన్‌ పెద్దపీట వేశారు. వైద్య విభాగంలో 47 వేల మంది నియామకాలు చేపట్టడం ఒక చరిత్ర. నాడు -నేడులో 16 వేల కోట్లతో ఆసుపత్రుల రూపురేఖలు మార్చేశారు. ఉద్ధానంలో కిడ్నీ బాధితుల కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. రూ. 750 కోట్లతో ఉద్ధానం ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించారు. డాక్టర్ అవ్వాలనే పేద విద్యార్ధుల కలను నెరవేర్చడానికి వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. మెడికల్ సీట్ల కోసం ప్రభుత్వాలు పోరాడుతుంటాయి. కానీ వచ్చిన మెడికల్ సీట్లను వద్దని చెప్పిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే’ అని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement