బాబు 'సూపర్‌ 6' వెన్నుపోటుపై తిరుగుబాటు | AP People Angry Over Chandrababu Coalition govt Frauds | Sakshi
Sakshi News home page

బాబు 'సూపర్‌ 6' వెన్నుపోటుపై తిరుగుబాటు

Jun 5 2025 4:45 AM | Updated on Jun 5 2025 6:51 AM

AP People Angry Over Chandrababu Coalition govt Frauds

కూటమి ప్రభుత్వ మోసాలపై కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం 

వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదలివచ్చి.. కదంతొక్కిన జనం

సూపర్‌ సిక్స్‌ పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు.. ఇలా ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు పొడిచావు 

నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబూ? 

వైఎస్‌ జగన్‌ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేశావు 

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు.. శాంతి భద్రతలను నిర్వీర్యం చేశావు

నీ అబద్ధపు హామీలతో అందరినీ వంచించావు 

ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి రెడ్‌ బుక్‌తో టెర్రర్‌ సృష్టిస్తున్నావు 

కుట్రలు ఆపి.. సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ఊరూరా ప్రజల డిమాండ్‌ 

ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసుల విఫలయత్నం 

కూటమి సర్కార్‌ కుట్రలు.. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని నిరసనల్లో పాల్గొన్న ప్రజలు 

బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ, వెన్నుపోటు చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అధికారులకు డిమాండ్‌ పత్రాలు అందజేత 

ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలే నిదర్శనమంటోన్న రాజకీయ పరిశీలకులు 

‘వెన్నుపోటు దినం’ గ్రాండ్‌ సక్సెస్‌తో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం 

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ సహా 143 వాగ్దానాలతో నమ్మించి, ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా హామీలు అమలు చేయకుండా వెన్ను­పోటు పొడిచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌­సీపీ నేతృత్వంలో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. కూటమి ప్రభుత్వం కుట్రలు.. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఉప్పెనలా కదలివచ్చి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’లో కదంతొక్కారు. 

బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ.. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు.. అంటూ ప్లకార్డులు చేతబూని.. తక్షణమే హామీలు అమలు చేయాలని.. లేదా మోసం చేసిన సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ర్యాలీల్లో నినదించారు. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి.. తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ అధికారులకు వైఎస్సార్‌సీపీ నే­తలు డిమాండ్‌ పత్రాలను అందజేశారు. 

‘సూపర్‌ సిక్స్‌ పే­రుతో మహిళలు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్క­రికీ వెన్నుపోటు పొడిచావు.  నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబూ? వైఎస్‌ జగన్‌ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేశావు.. విద్య, వై­ద్యం, వ్యవసాయ రంగాలు.. శాంతి భద్రతలను నిర్వీర్యం చేశావు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి రెడ్‌బుక్‌తో టెర్రర్‌ సృష్టిస్తున్నావు.. ఇక చా­లు మీ నిర్వాకం. 

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో తమ వాహనాలతో కూటమి ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రేషన్‌ వాహనాల డ్రైవర్లు   

ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చే­యాలి’ అని ఊరూరా ప్రజలు డిమాండ్‌ చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా నిరసన ర్యాలీలకు తండోప తండాలుగా జనం కదలి రావడమే కూట­మి ప్రభుత్వంపై ఏడాదిలోనే పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తు­న్నా­రు. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ 26 జిల్లాల్లోనూ వెన్నుపోటు దినం, నిరసన ర్యాలీలు గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో వైఎస్సార్‌సీపీ కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. 
 


ఆ పిలుపే ప్రభంజనమై.. 
సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని చంద్రబాబు కూటమి విజయం సాధించి బుధవారం (జూన్‌ 4)తో సరిగ్గా ఏడాది పూర్తయింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్‌ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని.. కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీస్తూ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలుపుతూ ర్యాలీలు నిర్వహించి, తక్షణమే హామీలు అమలు చేయాల­ని అధికారులకు డిమాండ్‌ పత్రాలు అందజేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చా­రు. 

 కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన పథకాల బోర్డులను ప్రదర్శిస్తూ నెల్లూరు సిటీలో నిరసన తెలుపుతున్న ప్రజలు  

అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమా­ల్లో పాల్గొనాలని కోరా­రు. జగన్‌ పిలుపు ప్రభంజనమై.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడానికి సిద్ధమవుతున్నారని గ్రహిం­చిన కూటమి ప్రభుత్వం దాన్ని విఫలం చేయ­డానికి కుట్ర­లు చేసింది. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం–నిర­సన ర్యాలీలను అడ్డుకోవడానికి యధావిధిగా రెడ్‌ బుక్‌­తో భయానక వాతావరణం సృష్టించేందుకు విఫలయత్నం చేసింది.  

గుంతకల్లు 

ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి పోలీసులను ఉ­సిగొల్పింది. బుధవారం ఉదయమే అనేక ప్రాంతాల్లో వైఎ­స్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు వారి­ని హౌస్‌ అరెస్టు చేశారు. మాచర్లలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు.. బయటకు వస్తే కేసులు పెడతామని నాయకులు, కార్యకర్తలను తీవ్ర స్థాయిలో బెదిరించారు. 

గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. కూటమి కుట్రలు.. పోలీసుల ఆంక్షలను చిత్తు చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనం కదం తొక్కారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement