గుంటూరు: ఏపీలో పచ్చమూకల దారుణాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా ఓ మహిళను వివస్త్రను చేసి చావబాదిన ఘటన గుంటూరులో వెలుగుచూసింది. ఓ మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి ఈడ్చుకెళ్లారు టీడీపీ గూండాలు. గుంటూరు 21వ వార్డుకు చెందిన టీడీపీ సెక్రటరీ మల్లెల మూర్తి మూర్తి కుటుంబం ఈ దారుణానికి ఒడిగట్టింది.
నగరంలోని కృష్ణబాబు కాలనీలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళను రోడ్డుపైనే వివస్త్రను చేయడమే కాకుండా ఈడ్చి కొట్టాయి పచ్చమూకలు. అయితే ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో గుట్టుచప్పుడు కాకుండా సెటిల్మెంట్ కోసం రంగంలోకి దిగారు టీడీపీ పెద్దలు.


