వంచనపై గర్జన | Vennupotu Dinam Grand Success | Sakshi
Sakshi News home page

వంచనపై గర్జన

Jun 5 2025 8:24 AM | Updated on Jun 5 2025 8:24 AM

Vennupotu Dinam Grand Success

వెన్నుపోటు దినానికి పోటెత్తిన ప్రజానీకం 

జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో  వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీలు  

కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డుల  ప్రదర్శన...పెద్ద ఎత్తున నినాదాలు  

ఏడాది చంద్రబాబు పాలనపై   ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు  

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో “వెన్నుపోటు దినం’ కార్యక్రమం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన ఆందోళనకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. సీఎం చంద్రబాబు వ్యవహారశైలిపై వైఎస్సార్‌సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులను కూడా కొనసాగించకుండా దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఒరిగింది శూన్యమని చంద్రబాబు ఏడాదికే విఫలమయ్యారని ఆరోపించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. 

వైఎస్సార్‌ కడప జిల్లా కేంద్రమైన కడపలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, ఎన్‌టీఆర్‌ కూడలి, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్‌డీఓ కార్యాలయం వద్దకు చేరింది. ఆర్‌డీఓ అందుబాటులో లేకపోవడంతో ఏఓ శంకరయ్యకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్‌ పాల్గొన్నారు.  

పులివెందుల పట్టణంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి జనం పోటెత్తారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీ‹Ùరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌ రోడ్డు మీదుగా పాత ఆర్‌టీసీ బస్టాండు మీదుగా ఆర్‌డీఓ కార్యాలయం వరకూ చేరింది. అనంతరం ఆర్‌డీఓ వెంకటేశంకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  

 ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్‌ నుంచి మొదలైన ఈ ర్యాలీ శ్రీరాములుపేట మీదుగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరింది. అనంతరం కమిషనర్‌ మల్లికార్జునకు వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌  లక్షి్మదేవి, మాజీ ఆప్కాబ్‌ ఛైర్‌పర్సన్‌ మల్లేల ఝాన్సీ, పార్టీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, కోనేటి సునంద  తదితరులు  పాల్గొన్నారు.  

 మైదుకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ అంకాలమ్మ దేవాలయం మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్‌ రామగోవిందరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.  

    బద్వేల్‌ పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీవో కాలనీలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగురోడ్ల కూడలి మీదుగా ఆర్‌డీఓ కార్యాలయం వరకూ సాగింది.  అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఉదయభారతికి వినతి పత్రం సమరి్పంచారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మెన్‌ రాజగోపాల్‌రెడ్డి,  కుడా మాజీ ఛైర్మెన్‌ గురుమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.  

    జమ్మలమడుగు పట్టణంలో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి  రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.  పార్టీ కార్యాలయం నుంచి మొదలైన ఈ ర్యాలీ నారాపురం దేవాలయం, తేరు రోడ్డు, పెద్ద పసుపుల మోటు, సంజామల మోటు, ఎస్‌బీఐ, పాతబస్టాండు మీదుగా ఆర్‌డీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ ఆర్‌డీఓ సాయిశ్రీ కి వినతి పత్రం సమరి్పంచారు. అలాగే యర్రగుంట్లలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సు«దీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం సమరి్పంచారు. ఆయా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల నేతలు హృషికేశవరెడ్డి, రఘునాథరెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు. 
    కమలాపురం పట్టణంలోని ఖాజీపేట రోడ్డులో ఉన్న గయాజ్‌ ఫిల్టింగ్‌ స్టేషన్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ వైఎస్సార్‌సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పోచంరెడ్డి నరేన్‌ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ శివరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ ఛైర్మెన్‌ బాలయ్య,  మండల పార్టీ అధ్యక్షులు ఉత్తమారెడ్డి, వీరారెడ్డి, జీఎన్‌ భాస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మోసం గ్యారంటీ అని రుజువు చేశారు   
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదు. సూపర్‌సిక్స్‌  పేరుతో ప్రజలతో  ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోనికి వచ్చాక వాటి అమలు మరచిపోయారు.   బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటి అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ అంటూ రుజువు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది.  అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్షా 75 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అమరావతి అభివృద్ధి అంటూ  టెండర్లు ప్రక్రియ ప్రారంభించి కమీషన్‌ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు.  ఎంత మంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం అన్నారు. ఇప్పటి వరకు వేయకుండా  తల్లులకు వెన్నుపోటు పొడిచారు.  ఆడబిడ్డ పథకం ఊసేలేదు.  , రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలు ఇస్తామన్నారు. అదీ లేదు.  నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు అన్నారు. వాలంటీర్‌లకు నెలకు పదివేల ఇస్తామన్నారు. ఇంత వరకు ఈ పథకాలను అమలు చేయకుండా  ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు.  మామ ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన  చంద్రబాబుకు ప్రజలందరికీ వెన్నుపోటు పొడవడం నైజంగా మారింది. పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.  
– పి.రవీంద్రనాథ్‌ రెడ్డి,  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు  

రైతులను నిండా ముంచారు..    
రైతులు పంటలకు  గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్సు ఇవ్వలేదు.   చంద్రబాబు , పవన్‌ కల్యాణ్, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను మరచిపోయారు.  జమ్మలమడుగు లో దాలి్మయా పరిశ్రమ వల్ల మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆ గ్రామాల ప్రజలకు న్యాయంజరిగిన తర్వాతే దాలి్మయా రెండోప్లాంట్‌ ప్రారంభం అవుతుందని ప్రజాభిప్రాయ సేకరణకు ముందు గ్రామాల్లో తిరిగి చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో మాట మార్చి సిమెంట్‌  పరిశ్రమకు మద్దతు పలికి గ్రామ ప్రజలను మోసం చేశారు.  కూటమి నేతలు మోసపూరిత  వాగ్దానాలు ఇచ్చి అధికారంలోనికి రాగానే వాటిని తుంగలోతొక్కారు.  కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల తరపున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.   
– రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు   
ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు సూపర్‌ సిక్స్‌ హామీలతోపాటు 143 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించారు.  అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.   మామనే వెన్నుపోటు పొడిచిన  చంద్రబాబుకు, ప్రజలను వెన్నుపోటు పొడవటం పెద్ద లెక్కకాదు. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు. ముస్లిం మైనారీ్టలకు అన్యాయం చేసే వక్ఫ్‌ బిల్లుకు బాబు మద్దతిచ్చి మోసం చేశారు. హామీలు పక్కనబెట్టి అక్రమ కేసులు బనాయిస్తూ.. అరాచక పాలన చేస్తున్నారు. చిన్నారులపై , మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. అభివృద్ధిని పక్కనబెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది.  
– అంజద్‌బాషా, మాజీ డిప్యూటీ సీఎం 
  
ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు 
గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు.  ఏడాది పాలన నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే కడపలో  మహానాడు నిర్వహించారు. మహానాడు సందర్భంగానైనా ఈ జిల్లాకు ఏం చేస్తారో చెప్పలేదు.  బిర్యానీ ప్యాకెట్లు, మద్యం, నగదు ఇచ్చి జనాన్ని మహానాడుకు తరలించారు.  మేము నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి కూటమి నేతలు అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు.   
– సురేష్‌ బాబు, కడప మేయర్‌

ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలేదీ.. ?   
కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.  20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు హామీల సంగతి ఏమైంది.  ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డీఏలను విడుదల చేసి పీఆర్‌సీ వేసి, ఐఆర్‌ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయగా, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మళ్లీ ప్రజలను క్యూ లైన్లలో నిలబెడుతూ ఇబ్బందులు పెడుతోంది.  
–  ఎంవీ రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement