
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు సర్కార్ తీరుకి నిరసనగా టీచర్లు వరుస ఆందోళనలు చేస్తున్నారు. మొన్న ఎస్జీటీలు.. నేడు ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. విశాఖలో మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులు రోడ్కెక్కారు. నేడు జరగాల్సిన కౌన్సిలింగ్ను టీచర్లు బహిష్కరించారు. డీఈవో కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఏజెన్సీ వేకెన్సీలు మాత్రమే చూపడంపై టీచర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు
కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను బదిలీలు చేయొద్దని డిమాండ్ చేస్తూ చేశారు. సింగిల్ టీచర్ పోస్టులను నిరాకరిస్తున్న ఉపాధ్యాయులు.. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఒక ఎంటీఎస్ టీచర్ను నియమించాలని డిమాండ్ చేసూ.. డీఈవో కార్యాలయం వద్ద బైఠాయించారు.