
సాక్షి, గుంటూరు: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చి.. ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏడాదిగా ఆ హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’(Vennupotu Dinam)గా పాటించాలని నిర్ణయించి నిరసనలకు దిగింది.
👉చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు
- కూటమి ప్రభుత్వత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళన
- వెన్నుపోటు దినంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు
- కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని ప్రజాగ్రహం
- చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు
👉ప్రకాశం జిల్లా:
- చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రోజు
- ఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజు ఈరోజు
- అప్పుడు మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు
- చంద్రబాబు గతంలో కూడా చెప్పిన హామీలను నెరవేసిన ఘనత ఎప్పుడూ లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు
- చంద్రబాబు మారాడు మారాడు అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ మారడు
- చంద్రబాబు ఎప్పటికీ మారకపోవడం, వెన్నుపోటు ఆయన రక్తంలోనే ఉంది
- అందుకే ఈరోజు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
👉నంద్యాల జిల్లా
- డోన్లో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం
- వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది
- అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు
- గత ప్రభుత్వంలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశారు.
- కరెంట్ బిల్లులు పెంచబోమని చెప్పి ఇష్టం వచ్చినట్లు పెంచి, సూపర్ సిక్స్ అంటూ పిల్లల నుంచి ముసలి వారి వరకు మోసం చేసారు.
- సంపద సృష్టిస్తాం అని చెప్పి చివరకు పథకాల హామీలలో చేతులు ఎత్తేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు
👉వైఎస్ఆర్ జిల్లా
- పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం
- కూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలు
- వెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగం
- ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు
- బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు
- గత ఐదు సంవత్సరాలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసింది
- బాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్ష 55000 కోట్లు అప్పు చేసింది
- ఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదు
- మహిళలకు ఉచిత బస్సు, నెలకు రూ. 1500, రైతన్నలకు ఏడాదికి ూ. 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.
- పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది
- పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేదు
👉తిరుపతి జిల్లా :
- నేడు వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినానికి పిలుపు.
- కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
- ప్రజలను వెన్నుపోటు పొడిచారు చంద్రబాబునాయుడు.
- చంద్రబాబునాయుడు చేసిన మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చిన మాజీ మంత్రి రోజా.
- ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి
- రెడ్బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచెయ్యాలి
- కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము
- కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది.
- విద్యార్థులను, మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంద్రప్రదేశ్గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం
- ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు
- పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు
- పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు
- రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం
👉పశ్చిమగోదావరి జిల్లా:
- వైఎస్ జగన్ పిలుపు మేరకు భాగంగా తణుకులో వెన్నుపోటు దినం
- మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ
- పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజలు
👉పశ్చిమగోదావరి జిల్లా:
- పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు వెన్ను పోటు దినం
- పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జీ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- పార్టీ కార్యాలయం నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్కు వినతిపత్రం
- వెన్నుపోటు దినం ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎస్ఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేవర్మ, రాష్ట్ర మహిళా కార్యదర్శిప్రధాన కార్యదర్శి కర్ర జయ సరిత, పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, వైసీపీ శ్రేణులు
👉పశ్చిమగోదావరి జిల్లా:
- పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం
- అంబేద్కర్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు
- సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్
- చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు
👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా:
- రావులపాలెంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆగ్రహం
- ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవటాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం పేరిట పెద్ద ఎత్తున నిరసన
- పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు
- రావులపాలెం పార్టీ కార్యాలయం నుంచి రావులపాడు జంక్షన్ మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ..
👉ఎన్టీఆర్ జిల్లా
- తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం
- వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీ
- ర్యాలీలో పాల్గొన్న నాలుగు మండలాల పార్టీ శ్రేణులు..
- బొసబొమ్మ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సర్కిల్ కార్యాలయం వైఎస్సార్ విగ్రహానికి నల్లగట్ల స్వామిదాస్ నివాళులు
- చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు
👉అనకాపల్లి జిల్లా:
- అనకాపల్లిలో ప్రారంభమైన వెన్నుపోటు దినం కార్యక్రమం
- పాల్గొన్న అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు
👉విశాఖ .. ఈస్ట్.
- విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెన్నుపోటు దినం
- గురజాడ కళాక్షేత్రం నుంచి జిల్లా పరిషత్ వరకు నిరసన కార్యక్రమం
- ఈస్ట్ ఇంచార్జి మళ్లీ అప్పారావు
- భారీ ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు
👉గుంటూరు:
- గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం
- పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతన మహేష్ ,గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు
👉విజయవాడ
- తూర్పు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం
- భారీ ర్యాలీ నిర్వహించిన వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
👉గన్నవరం

- ఎమ్మార్వో ఆఫీస్ ముందు బైటాయించి నిరసన తెలుపుతున్న పేర్ని నాని
- ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు
- జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారు
- జగన్ చెప్పిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు
- 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు
- ఉచిత బస్సు తుస్సు మంది
- సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు
- రోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయి
- పనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదు
- పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది
- రూపాయి లేదని చెపుతారు
- లోకేష్ పవన్ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు
- లోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడనైకి ప్రజల సొమ్ముతో తిరుగుతాడు
- అమ్మ ఓడికి ఇవ్వలేదు
- ఒక్కరు నోరు మెదపరు
- దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు
- చికెన్లో కూడా కమిషన్ అడుగుతారు
- Mla లు MLC లు బ్రాందీ యాపరంలో మునిగి తెలుతున్నారు
- ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారు
- రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు
- దేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారు
- అన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులకు మాత్రమే అంటున్నారు
- మోడీని, మోడీ భార్యని తిట్టి. మోడీకి చంద్రబాబు, పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు
- లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు
- లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలి
- గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చకు రమంటే పారిపోయాడు
- వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు 2019లో పట్టాలు దొంగపట్టాలను ఇప్పుడు చంద్రబాబుకి గుర్తుకు వచ్చింది
- తప్పు ఉంటే MROని జైల్లో వేయాలని వంశీపై తప్పుడు కేసు పెట్టాడు
- ఆస్తి తగదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు
- వంశీ పై 11 కేసులు పెట్టారు
- మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు
- వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు..
- కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం
- కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది
- ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది
👉ఎన్టీఆర్ జిల్లా
- మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైన వెన్నుపోటు దినం
- మైలవరం పట్టణంలో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం
- భారీగా హాజరైన కార్యకర్తలు అభిమానులు నాయకులు
- కూటమి పాలనను నిరసిస్తూ నినాదాలు
👉అనంతపురం:
- చంద్రబాబు మోసాలపై ఉరవకొండలో వెన్నుపోటు దినం
- వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
- ఉరగాద్రి ఫంక్షన్ హాల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన.
👉అనంతపురం:
- రాయదుర్గంలో వెన్నుపోటు దినం
- వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమం
- వినాయక సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన
👉గన్నవరం
- వైఎస్సార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమం
- కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని
- వెన్నుపోటు కార్యక్రమానికి భారీగా హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు
- వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు
👉విశాఖ:
- పశ్చిమ నియోజకవర్గంలో వెన్నుపోటు నిరసన
- గాజువాక డిపో వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకులు సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్
👉కర్నూలు జిల్లా
- ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ..
- పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ
- భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు
- సబ్ కలెక్టర్కు మెమోరాండం అందజేత
👉అన్నమయ్య జిల్లా:
- రాజంపేటలో పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం
- వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
- కూటమి పాలనపై నిరసనగా విశేషంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, పట్టణ ప్రజలు
- రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొంటున్నారు
👉తిరుపతి:
- ఈ ప్రభుత్వంపై ప్రజలు పూరిస్తున్న మొదటి శంఖారావం
- చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాం
- మాపై తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటాం
- ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అమ్మకు వందనం, నిరుద్యోగులకు 3వేల రూపాయలు ఇవ్వలేదు
- ఏడాది కాలంలో పార్టీ నాయకులపై 2666 పై కక్ష్య సాధింపు చర్యలు చేశారు
- 796 మందిపై హత్య ప్రయత్నం చేశారు
- 380 మందిని అరెస్ట్ చేయించారు
- అక్క చెల్లెమ్మలు తో ఈరోజు నుంచి పోరాటాలు ప్రారంభం అయ్యాయి
- తిరుపతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తాం , వారికి అండగా నిలుస్తాము
డాక్టర్ శిరీష, మేయర్ కామెంట్స్
- వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
- అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు
- సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు
- ఈరోజు కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది
భూమన అభినయ్ రెడ్డి
- ఈరోజు తిరుపతి లో ఈ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు
- రాష్ట్రంలో మొదటిగా ప్రభుత్వంపై గళం విప్పిన నియోజకవర్గం తిరుపతి
- కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉంటాం
👉శ్రీసత్యసాయి జిల్లా:
- పెనుకొండలో చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం కార్యక్రమం
- మాజీమంత్రి, జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ. నిరసన ప్రదర్శన.
👉వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో..
- పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం
- కూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలు
- వెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగం
- ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు
- బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు
- గత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసింది
- బాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష 55000 కోట్లు అప్పు చేసింది
- ఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదు
- మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.
- పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది
- పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10% పనులను ఈ ప్రభుత్వం చేయలేదు
👉అనంతపురం జిల్లా:
- కళ్యాణదుర్గం మండల కేంద్రంలో చంద్రబాబు మోసాల పై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- విన్సెంనెట్ పెరర్ విగ్రహం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన
👉అనంతపురం గుంతకల్లులో
- చంద్రబాబు మోసాలపై గుంతకల్లులో వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ,
- ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన.
- పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి.
👉శ్రీ సత్య సాయి జిల్లాలో..
- చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపీ నేతలు వెన్నపూస రవీందర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ,
- వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన

👉వైఎస్సార్ జిల్లాలో..
- వైఎస్సార్ పార్టీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు దినం
- ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న వైఎస్సార్ పార్టీ అభిమానులు
- ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ నుండి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీ
- మునిసిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వనున్న మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు
👉శ్రీ సత్యసాయి జిల్లా:
చంద్రబాబు మోసాలపై పుట్టపర్తి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
👉అనంతపురంలో..
చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అనంతపురం నగరంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ దాకా నిరసన ప్రదర్శన
👉తిరుపతి, సత్యనారాయణపురంలో..
సత్యనారాయణ పురం సర్కిల్ నుంచి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీ కార్యక్రమం.
పాల్గొన్న భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు
👉విజయనగరం జిల్లా, బొబ్బిలిలో..
బొబ్బిలిలో మొదలైన ర్యాలీ
- బొబ్బిలి వైయస్సార్సీపి ఆద్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ.
- అబద్దపు హామీల కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నిరసన.
- హాజరైన మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు.
👉అనకాపల్లి. నర్సీపట్నం
వెన్నుపోటు కార్యక్రమంనకు ఆటంకాలు పెడుతున్న కూటమి ప్రభుత్వం.
- నర్సీపట్నం లో నిరసనకు బైక్ ర్యాలీ కి నెల రోజులముందు దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్.
- నిన్నటి వరకు సమాధానం చెప్పని పోలీస్.
- నిన్న సాయంత్రం బైక్లతో కాకుండా పాదయాత్ర కు మాత్రమే అనుమతి అంటూ నోటీసులు ఇచ్చిన పోలీస్.
- ర్యాలీ కి వస్తున్న ప్రజలపై కేసులు రాస్తూ భయాందోళన కలిగిస్తున్న పోలీసులు.
👉అనంతపురం:
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
- అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం
- చంద్రబాబు సర్కార్ మోసాలపై యాడికిలో నిరసన కార్యక్రమం ఏర్పాట్లు
- ఏర్పాట్లు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
- అప్రమత్తమైన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
- ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి హైకోర్టు అనుమతి
- అయినా, అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం
👉విజయనగరం జిల్లా:
శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
- నేడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
- కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నిరసనలు
- చీపురుపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం
- పాల్గొననున్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
- 7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
- ఆర్బీఐ సెక్యురిటీల వేలం ద్వారా అప్పుల సమీకరణ
- చంద్రబాబు సీఎం అయ్యాక రికార్డ్ స్థాయిలో అప్పులు
- ఇప్పటివరకు లక్ష 51 వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం
- ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన ప్రభుత్వం
ఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
- నమ్మించి.. నట్టేట ముంచిన బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం
- సూపర్ సిక్స్ సహా 143 హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు
- ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో నాడు ఇంటింటా బాండ్లు పంపిణీ
- ఏడాదిలో రూ.1,51,604 కోట్లు అప్పు చేసినా ఒక్క హామీ అమలు చేయని సర్కారు
హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్బుక్ కుట్రలతో నొక్కేస్తున్న వైనం
- టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట
- ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్ జగన్ పిలుపు
- ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు
- తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్లకు, అధికారులకు ఆ హామీల డిమాండ్ పత్రాలు ఇవ్వనున్న నేతలు