అలాంటి నీచ చరిత్ర చంద్రబాబుది: వైఎస్‌ అవినాష్‌రెడ్డి | MP YS Avinash Reddy Slams Chandrababu At Vennupotu Dinam Protests | Sakshi
Sakshi News home page

అలాంటి నీచ చరిత్ర చంద్రబాబుది: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Jun 4 2025 12:42 PM | Updated on Jun 4 2025 2:56 PM

MP YS Avinash Reddy Slams Chandrababu At Vennupotu Dinam Protests

సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఏడాది కాలంలో ఎన్నో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక పథకం అందించలేకపోయిందని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన. 

ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. కానీ, ఏడాది తిరిగేలోపే.. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలోని ఐదేళ్లలోని ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్షా 55,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ప్రజలకు ఒక పథకం అందిచలేకపోయింది.  

.. మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్‌కి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి అయితే.. మిగిలిన పది శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేదు’’ అని అవినాష్‌ రెడ్డి మండిపడ్డారు. కూటమి వైఫల్యాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement