కూటమి ప్రభుత్వ పాలనపై వెల్లువెత్తిన నిరసన  | YSRCP Vennupotu Dinam Super Success | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వ పాలనపై వెల్లువెత్తిన నిరసన 

Jun 5 2025 9:03 AM | Updated on Jun 5 2025 9:03 AM

 YSRCP Vennupotu Dinam Super Success

ప్లకార్డులు, నినాదాలతో కదం తొక్కిన వైఎస్సార్‌ సీపీ నేతలు, ప్రజలు 

ఎన్నికల హామీలపై నిలదీత  

భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు  

ఎన్నికల హామీలు నెరవేర్చాలని అధికారులకు వినతి పత్రాలు  

జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజక

వర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ సక్సెస్‌  

సాక్షి, రాజమహేంద్రవరం:   కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.. ప్రభుత్వ మోసాలను ఎండగట్టింది.. భారీ స్థాయిలో రోడ్డుపైకి వచ్చింది.. ప్లకార్డులు, నిరసన ప్రదర్శనలతో కదం తొక్కింది. ఏడాది పాలనలో ఏం సాధించారు..? ఏం ఇచ్చారు..? అంటూ ప్రశ్నించింది.. ఏ వర్గం వారిలో సంతోషం లేదని ఆవేదన చెందింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన నయ వంచనను ఎత్తి చూపుతూ భారీ ర్యాలీలు చేపట్టింది.. కూటమి అరాచకాలను ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు చేసిన దగాపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు సమరి్పంచారు.  

రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసం, సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా జాంపేట ఆజాద్‌ చౌక్, జెండాపంజా రోడ్, సూర్య హోటల్, సబ్‌ కలెక్టరేట్‌ ఆఫీస్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘బాబు ష్యూరిటీ మోసం, ఉచిత పంటల బీమాకు పంగనామాలు, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావ్‌ బాబూ’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్ల కార్డులు, నల్లబెలూనుŠల్‌ చేతబట్టి, నల్ల కండువాలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.  

పోలీసుల ఆంక్షలు  
నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. బెలూన్లు, నల్ల కండువాలను లాక్కున్నారు. డీజేను సీజ్‌ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీసులు లాక్కెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తొక్కిసలాట  చోటు చేసుకుంది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఎక్కడి న్యాయమని మాజీ ఎంపీ భరత్‌ నిలదీశారు. పార్టీ శ్రేణులను లాక్కెళ్లడాన్ని అడ్డుకున్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్‌ సీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డితో కలిసి ఆర్డీఓ కృష్ణానాయక్‌కు వినతి పత్రం సమరి్పంచారు.  

అనపర్తి
నియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ రైల్వే స్టేషన్‌ రోడ్‌ మెయిన్‌ రోడ్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిర్వహించారు. పార్టీ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం సమరి్పంచారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement