
ప్రతి వ్యక్తి అందానికీ దోహదం చేసేవాటిలో నీరు, ఆహారం ప్రధానమైనవని బ్యూటీ క్వీన్, నటి మనసా వారణాసి అన్నారు. కొత్తపేటలో నూతనంగా నెలకొల్పిన సికారా క్లినిక్స్లో సౌందర్య పోషణలో ఏఐ ఆధారిత ఉత్పత్తుల వినియోగం, తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
మన సంప్రదాయ ఆహారం, సౌందర్య సాధనాల విలువ అమూల్యమైనదని, అయితే ఆధునిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ట్రీట్మెంట్లు తప్పవని అన్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన హైడ్రో ఫేషియల్ వంటి చికిత్సలు తనకు ఇష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సౌదర్య చికిత్స నిపుణులు, సంస్థ నిర్వాహకులు రాఘవేందర్, శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య నిపుణులు సైతం కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు తాగమని సూచిస్తుంటారు. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే గాక, శరీరంలోని మలినాలను బయటకు పంపించేస్తుంది. తద్వారా చర్మం తాజాగా, కాంతిమంతంగా ఉంటుందనేది సౌందర్య నిపుణుల వాదన. ఇది ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే తేలికపాటి అందుబాటులో ఉన్న రెమిడీ. అంతేగాదు చల్లటి నీటిలో ముఖంపై పెట్టిన రక్తసరఫరా జరిగి మృతకణాలు పోతాయని కూడా అంటుంటారు నిపుణులు. అందువల్ల నీళ్లని తప్పనిసరిగా ఎక్కువగా తాగేలా ప్రయత్నిద్దాం. ఆరోగ్యంగానూ, అందంగానూ ఉందాం.
(చదవండి: World Motorcycle Day: రైడింగ్ స్కిల్తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!)