
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
వాటాలు పంచుకుంటున్న రెవెన్యూ అధికారులు, పచ్చనేతలు
సాక్షి ప్రతినిధి,బాపట్ల: తాజాగా బాపట్ల, వేటపాలెం, చీరాల మండలాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పచ్చనేతలతో కలసి కబ్జా చేసినట్లు తెలుస్తోంది. బాపట్ల మండలం అడవి పంచాయతీలోని పాండురంగాపురం ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించిన కొందరు టీడీపీ నేతలు వాటిల్లో అక్రమంగా రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. ఆక్రమిత భూముల్లో కొన్నింటికి డీకేటీ పట్టాలు పుట్టించారు. ఒక పచ్చనేత ఆక్రమణలోని 40 ఎకరాలకు డీకేటీలు పుట్టించి కొన్నింటిని ఎకరం రూ.4 కోట్లకు అమ్మగా మిగిలిన భూమిని రొయ్యల సాగుకు వినియోగిస్తున్నారు. ఇదే ప్రాంతంలో చీరాలకు చెందిన మరో టీడీపీ నేత 30 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని కొంతకాలం రొయ్యల చెరువులు సాగుచేసి ఆక్రమిత ప్రభుత్వ భూమిలో సుమారు పది ఎకరాల భూములకు డీకేటీలు పుట్టించి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఆక్రమిత భూములన్నింటిని సదరు పచ్చనేత గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. వారు కొన్న భూమితోపాటు సముద్ర తీరం వరకూ ఉన్న మరికొంత ప్రభుత్వ భూమిని ఇటీవల కబ్జా చేశారు. దీంతో తీరప్రాంతంలోని మత్స్యకారులు ఆక్రమణలకు అడ్డుతగిలారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఇద్దరు నేతలు బాపట్ల రెవెన్యూ అధికారులకు కోట్లలోనే ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఏకంగా సముద్రతీరం వరకూ ఆక్రమించినా ఉన్నతాధికారులు స్పందించక పోవడం విమర్శలకు దారితీస్తోంది.
చీరాలలో భారీగా కబ్జాలు
వేటపాలెం మండలంలోని తీర ప్రాంతంలో రిసార్ట్స్ నిర్మాణం అధికంగా ఉండడంతో ఇక్కడ పచ్చ కబ్జాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. ఇటీవల చీరాల పచ్చనేత 11 ఎకరాలు కబ్జా చేసినట్లు నియోజకవర్గం మొత్తం చర్చ జరుగుతుంది. ఎకరం రూ.5 కోట్లు విలువచేసే ఈ భూమితోపాటు మరో రెండు చోట్ల దాదాపు 22 ఎకరాలు ఆక్రమించినట్లు సమాచారం. వేటపాలెం రెవెన్యూ అధికారి అండతోనే ఈ మొత్తం వ్యవహారం నడిచినట్లు ప్రచారంలో వుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడికి సైతం సదరు రెవెన్యూ అధికారి వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో వందలాది ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములు కట్టబెట్టినట్లు ప్రచారం వుంది. దీంతో ఇటీవల వేటపాలెం తహసీల్దారును జిల్లా కలెక్టర్ వెంకట మురళి సరెండర్ చేశారు. అక్రమాల వ్యవహారాలతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో తహసీల్దారుపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది.
బాపట్ల మండలం అడవి పంచాయతీలో సముద్రం అలల వరకూ పచ్చ నేత ఆక్రమించిన భూమి
న్యూస్రీల్
కక్షతోనే సరెండర్
రెవెన్యూ ఉన్నతాధికారులకు తీరప్రాంతంలో ప్రభుత్వ భూములు అప్పగించలేదన్న కక్షతోనే తనను సరెండర్ చేశారని, ఇప్పటికే ఉన్నతాధికారులు వేటపాలెం తీరప్రాంతంలో పెద్ద మొత్తంలో భూములు కబ్జాచేశారని, త్వరలోనే ఆ వివరాలు మీడియాకు వెల్లడిస్తానని సరెండర్ అయిన తహసీల్దార్ చెబుతున్నారు. కిందిస్థాయి రెవెన్యూ అధికారులు కొందరు దీనిని ధ్రువీకరిస్తున్నారు. ఆ వివరాలు బయటపడితే రెవెన్యూ ఉన్నతాధికారులు ఏ స్థాయిలో భూములు కబ్జా చేశారన్న విషయం వెల్లడి కానుంది. విలువైన ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములను కాపాడాల్సిన అధికారులు పచ్చనేతలతో కలిసి వాటాలు పంచుకోవడం, కబ్జాలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కబ్జా ఆరోపణలున్న పచ్చనేతలు, ఽఅధికారులపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.
తీరం భూములను కబ్జా చేస్తున్న కూటమి నేతలు ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చిన వైనం కొన్నింటికి డీకేటీలు పుట్టించి అమ్మకాలు బాపట్ల, చినగంజాం, నిజాంపట్నం ప్రాంతాల్లో రొయ్యల చెరువులు చీరాల వేటపాలెం మండలాల్లో వెంచర్లు, రిసార్ట్ల నిర్మాణాలు అక్రమాల పేరుతో వేటపాలెం తహసీల్దార్ను సరెండర్ చేసిన కలెక్టర్ చినగంజాం, బాపట్ల మండలాల్లో అధికారుల జోళికి వెళ్లని వైనం కూటమి అధికారంలోకి రాగానే పచ్చనేతల కబ్జా పర్వం

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025