కోడి పందేల నిర్వాహకులు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కోడి పందేల నిర్వాహకులు అరెస్టు

Jun 26 2025 6:39 AM | Updated on Jun 26 2025 6:39 AM

కోడి

కోడి పందేల నిర్వాహకులు అరెస్టు

ఇంకొల్లు(చినగంజాం): మండలంలోని దుద్దుకూరు గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3,300 నగదు, రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఎస్‌ఐ జి. సురేష్‌ బుధవారం వెల్లడించారు.

తాళం పగులగొట్టి నగదు, బంగారం చోరీ

సంతమాగులూరు (అద్దంకి): తాళం వేసిన ఇంటిలో బంగారం, నగదు చోరీకి గురైన సంఘటన కుందుర్రులో మంగళవారం సాయంత్రం జరగ్గా, బుధవారం వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. ఆలకుంట లింగయ్య భార్య గురవమ్మ ఈ నెల 24న తన ఇంటికి తాళం వేసి తాళం చెవిని ఇంటి గుమ్మంపైన పెట్టింది. తర్వాత పొలం పనులకు వెళ్లింది. తిరిగి సాయంత్రం ఆరు గంటలకు వచ్చి చూడగా, ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లోని బీరువాలో దాచిన రూ.20 వేలు, నాలుగు గ్రాముల బంగారు దుద్దులు చోరీకి గురయ్యాయి. బుధవారం క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పట్టాభి తెలిపారు.

కోడి పందేల నిర్వాహకులు అరెస్టు 1
1/1

కోడి పందేల నిర్వాహకులు అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement