
కాలువ పూడ్చి సీసీ రోడ్డు నిర్మాణానికి యత్నం
పెరవలిపాలెం(వేమూరు): కూటమి నాయకులు డ్రైనేజీ కాలువ పూడ్చి మరీ సిమెంట్ రోడ్డు వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో రైతులు ఆ పనులు చేపట్టరాదని అడ్డుకున్నారు. వేమూరు మండలంలోని పెరవలి పాలెం గ్రామంలో కూటమి నాయకులు పొలాల మురుగు నీరు వెళ్లే కాలువ పూడ్చి సిమెంట్ రోడ్డు వేసేందుకు సిద్ధం అయ్యారు. దీంతో గ్రామంలోని రైతులు వచ్చి రోడ్డు వేయరాదని అడ్డుకున్నారు. పంట పొలాలు మునిగి పోతాయని, రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. దీంతో పనులు నిలిపి వేశారు. సిమెంట్ రోడ్డు కమీషన్ కోసం కాలువలు కూడా పూడ్చి వేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.