జిల్లా కోర్టు భవన సముదాయానికి భూమి కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

జిల్లా కోర్టు భవన సముదాయానికి భూమి కేటాయింపు

Jun 26 2025 6:39 AM | Updated on Jun 26 2025 6:39 AM

జిల్లా కోర్టు భవన సముదాయానికి భూమి కేటాయింపు

జిల్లా కోర్టు భవన సముదాయానికి భూమి కేటాయింపు

బాపట్ల: జిల్లా కోర్టు భవన సముదాయానికి అవసరమైన 2.80 ఎకరాల భూమి సిద్ధంగా ఉంచామని జిల్లా కలెక్టర్‌ జె. వెంకట మురళి తెలిపారు. రాజధాని అమరావతి నుంచి సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో జిల్లా కోర్టు భవన సముదాయానికి కావలసిన భూమి సిద్ధంగా ఉంచినట్లు ఆమె దృష్టికి కలెక్టర్‌ తీసుకువెళ్లారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై ఆడిట్‌ నిర్వహించాలని జయలక్ష్మి అన్నారు. జాతీయ రహదారులకు భూ సేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లా నుంచి జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్‌ గౌడ్‌, ఆర్‌డీఓపీ గ్లోరియా, ఉప కలెక్టర్‌ లవన్న, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కనకరాజు, వ్యవసాయశాఖ అధికారి రామకృష్ణ, కలెక్టరేట్‌ ఏవో మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల: నాటు సారా రహిత జిల్లాగా బాపట్ల నిలిచిందని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి తెలిపారు. నవోదయం 2.0 నాటు సారా నిర్మూలన కమిటీ జిల్లా స్థాయి సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా రూపొందించిన గోడపత్రాలను కలెక్టర్‌ విడుదల చేశారు. నాటు సారా ఉత్పత్తిని జిల్లాలో పూర్తిగా అరికట్టామని చెప్పారు. గడిచిన రెండు నెలల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి 5,240 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశామన్నారు. 17 గ్రామాలలో 42 కేసులు నమోదు చేశామని తెలిపారు. 34 మందికి పునరావాస కల్పనకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 64 మందిని బైండోవర్‌ చేశామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేశారని ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ శాఖ సహాయ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కమిటీలోని అధికారులు పాల్గొన్నారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లక్ష్యాలు సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement