
మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు పురస్కారాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకులను సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది డిసెంబర్లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించిన ఆర్. రిషబ్ ఓస్వాల్, జూన్–2024లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ప్రథమ ర్యాంకు కై వసం చేసుకున్న కొత్తపేట తేజస్వినిని ఈనెల 23న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి సత్కరించారని వివరించారు. వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు 55 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించారని, అయితే గతేడాది జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులను కై వసం చేసుకోవడం అరుదైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి మోహన్ అభినందనలు తెలియజేశారు.

మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు పురస్కారాలు