
యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
బాపట్ల: అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా బాపట్ల మండలం సూర్యలంక బీచ్ తీరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పరిశీలించారు. 10వేల మందితో సూర్యలంక బీచ్లో యోగాసనాలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు. కార్యక్రమానికి ప్రజలందరూ హాజరుకావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉదయం 5 గంటలకు యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.