లాభాల తీపి పంచుతున్న నల్ల చెరకు | - | Sakshi
Sakshi News home page

లాభాల తీపి పంచుతున్న నల్ల చెరకు

Jun 23 2025 5:40 AM | Updated on Jun 23 2025 5:40 AM

లాభాల

లాభాల తీపి పంచుతున్న నల్ల చెరకు

బల్లికురవ: ఆహార ధాన్యమైన వరి సాగుకు పెట్టుబడులు పెరగటం, గిట్టుబాటు ధర దక్కనందున రైతులు నల్లచెరకు వైపు చూస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో తిరనాళ్లు, జాతర్లలో అమ్మే నల్లచెరకు సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది. 18 ఏళ్ల క్రితం మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామాల్లో 15 ఎకరాల్లో చేపట్టిన సాగు నియోజకవర్గంలోని బల్లికురవ, అద్దంకి మండలాల్లో 960 ఎకరాలకు చేరింది.

సారవంతమైన భూముల ఎంపికతో..

నీటి వసతి, సారవంతమైన భూములను చెరుకు సాగుకు ఎంపిక చేస్తారు. వేసవి దుక్కుల అనంతరం ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు తోలి భూముల్లో చల్లారు. తర్వాత మే రెండవ వారంలో కురిసిన వర్షాలకు ట్రాక్టర్‌తో చెరుకు ముక్కలు నాటేందుకు బోదెలు చేశారు. ఆ బోదెల్లో నీటిని వదులుతూ అడుగు ముక్కలను ఎకరాకు 8 వేల నుంచి 9 వేల వరకు నాటుతున్నట్లు రైతులు తెలిపారు.

960 ఎకరాల్లో సాగు..

బల్లికురవ మండలంలోని గొర్రెపాడు, కూకట్లపల్లి, కొత్తూరు, కొప్పరపాడు, వైదన, ఎస్‌ఎల్‌ గుడిపాడు, రామాంజనేయపురం, అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం, చక్రాయపాలెం గ్రామాలు చెరకు సాగుకు పెట్టింది పేరు. వాతావరణం అనుకూలిస్తే పంట వేసిన ఎనిమిది నెలల నుంచి గడలు పక్వానికి వచ్చి అమ్మకానికి సిద్ధమవుతాయి. ఒక్కో గడ దాదాపు 6 నుంచి 7 అడుగుల వరకు పెరుగుతుంది. నాటిన ముక్కలు పిలకలతో ఎకరాకు 20 వేలకుపైచిలుకు గడలు ఇస్తాయి. వ్యాపారులు ఆయా తోటల వద్దకు వచ్చి కొనుగోళ్లతో దళారుల బెడద లేదు.

ఆదాయం ఆర్జిస్తున్న రైతన్నలు..

సొంత భూమి కలిగిన రైతుకు ఎకరా పంటకు రూ. 1.5 లక్షల నుంచి రూ 1.7 లక్షల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే తిరునాళ్ల, ఉత్సవాలకు ఇక్కడి నుంచే గడలు వ్యాపారులు కొనుగోలుతో ఎగుమతి చేస్తున్నారు. గడల వంతున ఒక్కో గడ రూ. 15 నుంచి రూ. 17, ఎకరాల వంతున రూ. 3 లక్షలకు గత రెండేళ్లు ధర పలికాయి. పెట్టుబడులు పోను ఎకరాకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 1.7 లక్షల వరకు నికర ఆదాయం దక్కిందని రైతులు వివరించారు.

అకాల వర్షాలతో ఇబ్బంది

మే నెలలో కురిసిన అకాల వర్షాలు తమను నట్టేట ముంచాయని రైతులు తాడిపర్తి అంజిరెడ్డి, పులి శరత్‌, గోగులమూడి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బోదెలు చేసి చెరుకు ముక్కలు నాటగా.. అకాల వర్షాలకు ఆ బోదెల్లో నీరు నిల్వతో ముక్కలు కుళ్లి మొలక శాతం తగ్గిందన్నారు. చేసేదిలేక తిరిగి బోదెలు వేసి ముక్కలు నాటుతున్నట్లు రైతులు వివరించారు.

రెండేళ్లుగా లాభాలు రావడంతో

పెరిగిన సాగు విస్తీర్ణం

అద్దంకి నియోజకవర్గంలో

960 ఎకరాలలో సాగు చేస్తున్న రైతులు

ఎకరాకు రూ. 1.5 లక్షల నుంచి

రూ. 1.7 లక్షల వరకు లాభం

లాభాల తీపి పంచుతున్న నల్ల చెరకు 1
1/2

లాభాల తీపి పంచుతున్న నల్ల చెరకు

లాభాల తీపి పంచుతున్న నల్ల చెరకు 2
2/2

లాభాల తీపి పంచుతున్న నల్ల చెరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement