జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవలు విస్తరింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవలు విస్తరింపజేయాలి

Jun 27 2025 4:29 AM | Updated on Jun 27 2025 4:29 AM

జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవలు విస్తరింపజేయాలి

జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవలు విస్తరింపజేయాలి

బాపట్ల: జిల్లాలో రెడ్‌క్రాస్‌ సంస్థ సేవలను విస్తరింప చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవలు వెలకట్టలేనివని అన్నారు. రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదుతో రాష్ట్రంలో బాపట్ల జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. గవర్నర్‌ చేతుల మీదుగా ‘రెడ్‌క్రాస్‌ బెస్ట్‌ అవార్డు’ అందుకోవటం గర్వంగా ఉందన్నారు. కృష్ణానది వరదల సమయంలో వరద బాధితులకు రెడ్‌క్రాస్‌ బృందం అందించిన సేవలు కొనియాడారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో రెడ్‌క్రాస్‌ సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా రెడ్‌క్రాస్‌ సేవలను కొనసాగించాలని అన్నారు.

ప్రజల ఆరోగ్యం, సంరక్షణలో రెడ్‌క్రాస్‌ ముందు ఉంటుందని అన్నారు. సభ్యత్వ నమోదులో ముఖ్య పాత్ర పోషించిన అధికారులకు జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అవార్డులు ప్రదానం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్‌ దిబోరా, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌, బాపట్ల రెవెన్యూ డివిజనల్‌ అధికారి పి.గ్లోరియా, రెడ్‌ క్రాస్‌ సంస్థ అధ్యక్షుడు నారాయణ భట్టు అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement