
ఘనజీవామృతంతో నేల సారవంతం
మాదల(ముప్పాళ్ళ): ప్రకృతి వ్యవసాయ విధానం పాటించే రైతులు పంటలను సాగు చేసే ముందుగా వారి పొలంలో ఘనజీవామృతం ఒక ఎకరాకు 500 కిలోలు చల్లితే భూమి ఆరోగ్యంగా ఉండి పంట దిగుబడి పెరుగుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయం ఏపీఎం కె.అమలకుమారి అన్నారు. మండలంలోని మాదల గ్రామంలో మాజీ ఎంపీపీ గోగినేని కోటేశ్వరరావు నిర్వహిస్తున్న గోశాలను గురువారం సందర్శించారు. గోశాలలో 400 టన్నుల ఆవు పేడ, మూత్రంతో 300 టన్నుల ఘనజీవామృతం, పంచగవ్య తయారు చేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటుగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ గోశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. సత్తెనపల్లి ఎంటీ మధుబాబు, సౌజన్య పాల్గొన్నారు.