
సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండ
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) కుటుంబానికి వైఎస్సార్ సీపీ నేతలు గురువారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి కొలకలూరి కోటేశ్వరరావు తదితరులు సింగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులిర్పించారు. పిల్లల చదువులు, తదితర విషయాలను వాకబు చేశారు. కుటుంబానికి వైఎస్సార్ సీపీ కుటుంబం ప్రతి విషయంలో తోడుంటుందని తెలిపారు. పార్టీ తరఫున ఇప్పటికే రూ. 10 లక్షలను ప్రకటించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెండు కుటుంబాల అదృశ్యంపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్నగర్లో నివసించే రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. కారు డ్రైవింగ్కు వెళ్లిన బెవర దుర్గారావు ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు. ఆమె గానీ కుటుంబ సభ్యులు గానీ లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా వారు కనిపించలేదు. తన భార్యతో పాటు తోడల్లుడి కుటుంబం కూడా కనిపించడం లేదని పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన వారిలో దుర్గారావు భార్య సుధారాణి, కుమారుడు నవీన్ కుమార్, కుమార్తె యశ్వణి, తోటికోడలు, మరో ఇద్దరు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాడేపల్లి ఎస్ఐ ప్రతాప్ కుమార్ కేసు నమోదు చేశారు.

సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండ