దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400 | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400

Jun 24 2025 3:41 AM | Updated on Jun 24 2025 3:41 AM

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400

భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (దుర్గగుడి)కి హుండీ కానుకల ద్వారా రూ.3,70,41,400 ఆదాయం లభించింది. ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహామండపం ఆరో అంతస్తులో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేర్చారు. 18 రోజులకు రూ.3,70,41,400 నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించాయి. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్‌ పర్యవేక్షించగా అసిస్టెంట్‌ కమిషనర్‌ సీహెచ్‌ రంగారావు, దేవదాయ శాఖ సిబ్బంది, వన్‌టౌన్‌ పోలీసులు, ఎస్‌పీఎఫ్‌ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement