
నేడు ఖాజీపాలెంలో జాబ్మేళా
ఖాజీపాలెం(కర్లపాలెం): గ్రామంలోని కేవీఆర్, ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి.ప్రణయ్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్మేళాకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదువుకున్న 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీయువకులు వారి బయోడేటాతో హాజరుకావాలని అన్నారు. వివరాలకు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పి.ప్రణయ్ నంబర్ 9640695229ను సంప్రదించాలని తెలిపారు.
పొలాల్లో అస్థిపంజరం లభ్యం
తెనాలి రూరల్: పొలాల్లో అస్థిపంజరాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్లే రోడ్డులో నేలపాడు పంచాయతి పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తూర్పు వైపున ఉన్న పొలంలో అస్థిపంజరాన్ని గుర్తించారు. పోలీసుల ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎముకల గూడు పక్కన గళ్ల లుంగీ ఉంది. ఇదే పాఠశాల సమీపంలో బిచ్చగాడు నెల రోజులుగా కనబడకుండాపోయాడని, అతని అస్థిపంజరం అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెడ్క్రాస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నూతన కమిటీ ఏర్పాటైంది. సోమవారం కలెక్టరేట్లో డీఆర్ఓ ఏకా మురళి అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో చైర్మన్గా మేదరమెట్ల రామశేషగిరిరావు, వైస్ చైర్మన్గా కేఎంఎన్వీ శ్రీనివాసగుప్తా, కోశాధికారిగా డాక్టర్ నంద్యాల రాంప్రసాదరెడ్డిలను నియమించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా పూర్వ అధ్యక్షులు డాక్టర్ కంజుల జగన్మోహన్రెడ్డి, డాక్టర్ ఎస్.రాంప్రసాద్, డాక్టర్ సృజన, బత్తుల మురళి, బీవీఎల్ ప్రసాద్, పి.నరసింహారావు, విన్సెంట్పాల్, భుజంగరావు నియమితులయ్యారు. పరిశీలకులుగా ఏపీ స్టేట్ కోశాధికారి రామచంద్రరాజు వ్యవ హరించారు. నూతనంగా ఎన్నికై న సభ్యుల చేత డీఆర్ఓ ప్రతిజ్ఞ చేయించారు. గత మూడేళ్లలో జరిగిన సేవా కార్యక్రమాలు, ఫైనాన్షియల్ నివేదికను సమర్పించారు. డాక్టర్ కంజుల జగన్మోహన్రెడ్డిని సన్మానించారు.