
ఈ ఏడాది, అమర్నాథ్ యాత్ర జూలై 3 నుండి ఆగస్టు 9, 2025 వరకు జరుగుతుందని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) ధృవీకరించింది.

సోనామార్గ్ : ఒక అందమైన హిల్ స్టేషన్. దీనిని అమర్నాథ్ యాత్రకు వెళ్లే సమయంలో చూడొచ్చు. దీనిని "మెడో ఆఫ్ గోల్డ్" అని కూడా అంటారు.

గంగాబాల్ : గంగాబాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు ఉత్తరాన ఉన్న గందర్బల్ జిల్లాలో ఉంది. ఇది కాశ్మీర్ లోయ పరిసరాలలో ఉన్న రెండవ ఎత్తైన పర్వత శిఖరం అయిన హరముఖ్ పర్వతం వద్ద ఉంది.

వైష్ణో దేవి ఆలయం : వైష్ణో దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది.

శ్రీనగర్ : అమర్నాథ్ యాత్ర చివరి దశలో భాగంగా శ్రీనగర్ను కూడా సందర్శించొచ్చు. ఇక్కడ దాల్ లేక్, నిషాత్ బాగ్, షాలిమార్ బాగ్, చష్మా-ఎ-షాహి వంటి ప్రసిద్ధ, అందమైన ప్రదేశాలను చూడొచ్చు.

బేతాబ్ వ్యాలీ: తాబ్ వాలీ ఇక్కడ ఉండే సుందర దృశ్యాలకు పెట్టింది పేరు. పైన్ వృక్షాలు, మంచు పర్వతాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

ఆరు వ్యాలీ : ఆరు వ్యాలీ పెహల్గాంకు సుమారు 11కి.మీల దూరంలో సముద్ర మట్టానికి 2408మీ.ల ఎత్తున ఉంది. ప్రకృతి ప్రేమికులు బాగా ఇష్టపడే ప్రదేశం ఇది.