
మోసానికి ప్రతిరూపం చంద్రబాబు
అద్దంకి: ‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకొచ్చే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరవాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు అంటే మోసం అనేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తన తండ్రి తరువాత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పకుండా హామీలన్నీ నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం అని ప్రజలు అనుకునేలా చేశారని తెలిపారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవి వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘యువత పోరు’ జయప్రదం చేయండి
అద్దంకి: బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయర్త పానెం చిన హనిమిరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత తరలి రావాలని కోరారు.
బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు అనుచితం
అద్దంకి: వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అనుచితమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ తీరుపై మండిపడ్డారు. బుచ్చయ్య చౌదరికి నిబద్ధత ఉందా అని ప్రశ్నించారు. ఆయన మొదట ఎన్టీఆర్ వద్ద నుంచి లక్ష్మీపార్వతి దగ్గరకు, ఆ తరువాత చంద్రబాబు వద్దకు వచ్చాడన్నారు. నాలుగు మాటలు చెప్పి బాబును మెప్పించి మంత్రి పదవి పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన మాటలు వింటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు అడ్డంకులు కల్పిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పిన సూపర్ సిక్స్ హామీల ఊసే నేడు లేదన్నారు. సంవత్సరం గడిచినా హామీలు నెరవేర్చకపోవడంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ పట్టం కట్టాలనే ఆలోచనకు వచ్చారని చెప్పారు. దాని ఫలితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు అనూహ్యంగా లభిస్తున్న జనాదరణ అన్నారు. జమిలి ఎన్నికలు అంటున్నారని.. మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ అత్యధిక మెజారిటీలో గెలవడం ఖాయమని చెప్పారు. సమావేశంలో అద్దంకి మండల కన్వీనర్ గుజ్జుల జగన్మోహన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, కొరిశపాడు మండల కన్వీనర్ పాలపర్తి శ్రీధర్, బీసీ సెల్ అధ్యక్షుడు గోలి రమణబాబు, కొల్లా భువనేశ్వరి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ
సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి