breaking news
Vijay Hazare Trophy 2025-26
-
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
టీ20 వరల్డ్కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.ఈ జట్టుకు యువ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేరళ జట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఈ టోర్నీలో కేరళ జట్టు గ్రూపు-ఈలో ఉంది. ఈ గ్రూప్లో కేరళతో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.వన్డే జట్టులోకి వచ్చేందుకు..భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు భారత్ తరపున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. కాగా ఈ ఏడాది దేశవాళీ వన్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు:రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), మహమ్మద్ అజహరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.చదవండి: 'అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది' -
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి దేశవాళీ క్రికెట్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ- 2025 వన్డే టోర్నీ కోసం బెంగాల్ జట్టుకు షమీ ఎంపికయ్యాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కనబరిచిన ఫామ్ను.. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో కూడా కొనసాగించాలని షమీ భావిస్తున్నాడు. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. డొమాస్టిక్ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రస్తుత దేశవాళీ సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 36 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టిన షమీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు తీసి బెంగాల్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.బెంగాల్ జట్టులో షమీతో పాటు భారత పేసర్లు ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ సైతం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు కెప్టెన్గా వెటనర్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. బెంగాల్ ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. బెంగాల్ తమ తొలి మ్యాచ్లో 24న రాజ్కోట్ వేదికగా తలపడనుంది.షమీ విషయానికి వస్తే.. చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్నెస్ సమస్యలు అంటూ అతడిని తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్లు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది.విజయ్ హజారే ట్రోఫీకి బెంగాల్ జట్టుఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఘరామి, సుమంత్ గుప్తా, సుమిత్ నాగ్ (వికెట్ కీపర్), చంద్రహాస్ డాష్, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, సయన్ ఘోష్, రవి కుమార్, అమీర్ ఘనీ, విశాల్ భాటి, అంకిత్ మిశ్రా.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్ -
రోహిత్ శర్మ యూటర్న్!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు వార్తా సంస్థ PTIకి వెల్లడించాయి.కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma).. తొలుత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు.. అనంతరం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని వన్డే కెప్టెన్సీ తప్పించింది బీసీసీఐ.మునుపెన్నడూ లేని విధంగాఈ క్రమంలో ఫిట్నెస్పై దృష్టి సారించిన రోహిత్ శర్మ.. దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. మునుపెన్నడూ లేని విధంగా మరింత ఫిట్గా మారి.. ఆసీస్ గడ్డ మీద శతకంతో చెలరేగిన హిట్మ్యాన్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, ప్రస్తుతం రోహిత్తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027కి సిద్ధమయ్యే క్రమంలో రో-కో మ్యాచ్ ప్రాక్టీస్ గురించి చర్చలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బీసీసీఐ భారత జట్టులోని ప్రతి సభ్యుడు కచ్చితంగా కనీసం రెండు దేశీ మ్యాచ్లు అయినా ఆడాలని ఆదేశించింది. రో-కోలకే కాకుండా ప్రతి ఒక్క ఆటగాడికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లి అయితే, ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ శుక్రవారం మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ముంబై జట్టుకు అందుబాటులో లేడని తెలిపాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీకి ప్రకటించిన జట్టులో తొలి రెండు మ్యాచ్లకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది. ఈ పరిణాల క్రమంలో శుక్రవారం రాత్రి ఎంసీఏ వర్గాలు మరోసారి రోహిత్ శర్మ విషయంపై స్పందిస్తూ.. అతడు కనీసం రెండు మ్యాచ్లకు అవైలబుల్గా ఉంటాడని స్పష్టం చేశాయి. కోహ్లి పేరు ప్రకటన తర్వాత రోహిత్ సైతం ఈ మేర యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముంబై జట్టుకు చెందిన టీమిండియా స్టార్లు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ శివం దూబే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. టీ20 ప్రపంచకప్-2026 దృష్ట్యా వారిద్దరికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ముంబై మాజీ కెప్టెన్ అజింక్య రహానే అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత జట్టుతో చేరే అవకాశం ఉంది. కాగా డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మొదలుకానుంది.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్గా రిషభ్ పంత్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్.. ఈ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది.ఇక మరో టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా వీలు చిక్కినపుడు మ్యాచ్లకు వస్తాడని తెలిపిన డీడీసీఏ.. భారత మాజీ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ, నవదీప్సైనీ కూడా ఈసారి జట్టులో భాగం కానున్నారని తెలిపింది. కాగా పంత్ డిప్యూటీగా ఆయుశ్ బదోని వ్యవహరించనుండగా.. తేజస్వి సింగ్ వికెట్ కీపర్గా సేవలు అందించనున్నాడు.2010లో చివరిసారిగాకాగా 2010లో చివరిసారిగా విరాట్ కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. వన్డే క్రికెట్లో రారాజుగా వెలుగొందుతూ అత్యధిక సెంచరీల (53) వీరుడిగా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్ బరిలో దిగనున్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ముంబై తరఫున ఆరంభ మ్యాచ్లకు మాత్రం రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదని ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తాజాగా వెల్లడించాడు.విజయ్ హజారే ట్రోఫీ-2025 మ్యాచ్లకు ఢిల్లీ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని (వైస్ కెప్టెన్), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్ కీపర్), హర్ష్ త్యాగి, సిమర్జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ఆయుశ్ దొసేజా, దివిజ్ మెహ్రా, వైభవ్ కంద్పాల్, రోహన్ రాణా, అనూజ్ రావత్. చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
పాటిదార్ అవుట్.. కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్
వెంకటేశ్ అయ్యర్కు కెప్టెన్గా ప్రమోషన్ వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్లో అతడు మధ్యప్రదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా 2015లో మధ్యప్రదేశ్ తరఫున దేశీ క్రికెట్లో అడుగుపెట్టిన వెంకీ.. ఇప్పటికి ఫస్క్లాస్ క్రికెట్లో 20, లిస్ట్-ఎ క్రికెట్లో 48, టీ20లలో యాభైకి పైగా మ్యాచ్లు ఆడాడు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా సత్తా చాటుతూ పరుగులు రాబట్టడంతో పాటు ఆయా ఫార్మాట్లలో వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్లోనూ అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. ఇప్పటి దాకా కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో కొనసాగాడు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఆల్రౌండర్ను 2025 వేలానికి ముందు రిలీజ్ చేసిన కేకేఆర్.. ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది.రూ. 7 కోట్లకు ఆర్సీబీ సొంతంఅయితే, తాజా ఎడిషన్లో వెంకటేశ్ బ్యాట్, బంతితో పూర్తిగా తేలిపోయాడు. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు అతడిని విడిచిపెట్టగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లోనూ వెంకటేశ్ అయ్యర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అయినప్పటికీ ఆర్సీబీ ఈ మేర భారీ మొత్తమే చెల్లించగా.. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సైతం మరోసారి నమ్మకం ఉంచి ఏకంగా కెప్టెన్గా నియమించింది.పాటిదార్ అవుట్.. కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్అయితే, ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన సారథి, మధ్యప్రదేశ్కు గతేడాది విజయ్ హజారే ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ ఈ జట్టులో లేడు. కెప్టెన్గా అతడి స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్ భర్తీ చేశాడు. ఇక ఈ ఇద్దరు ఆర్సీబీ బాయ్స్తో పాటు జట్టులో కొత్తగా చేరిన మరో మధ్యప్రదేశ్ ఆటగాడు మంగేశ్ యాదవ్ కూడా దేశీ వన్డే టోర్నీ ఆడబోతున్నాడు. కాగా పాటిదార్ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో కోలుకున్న అతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా పొందాడు. అయినప్పటికీ మధ్యప్రదేశ్ జట్టుకు దూరమయ్యాడు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా డిసెంబరు 14- జనవరి 8 మధ్య విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ నిర్వహించనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26కు మధ్యప్రదేశ్ జట్టువెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), యశ్ దూబే, శుభమ్ శర్మ, హర్ప్రీత్ సింగ్, రిషబ్ చౌహాన్, రితిక్ తడా, కుమార్ కార్తికేయ, సారాంశ్ జైన్, శివంగ్ కుమార్, ఆర్యన్ పాండే, రాహుల్ బాథమ్, త్రిపురేష్ సింగ్, మంగేశ్ యాదవ్, మాధవ్ తివారి (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని షాకిచ్చాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ స్వయంగా వెల్లడించాడు.కాగా ప్రస్తుత టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్లు ఆడాలని.. లేదంటే తమ దేశవాళీ జట్ల తరఫున కనీసం రెండు మ్యాచ్లైనా ఆడాలని ఆదేశించింది.ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాల్సిందేడిసెంబరు 24 నుంచి ఈ దేశీ వన్డే టోర్నీ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) సహా ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టులో కోహ్లి పేరు కనిపించింది. మరోవైపు.. తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) మాత్రం టీమిండియా సీనియర్లలో చాలా మంది విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో లేరని తెలిపింది. ముఖ్యంగా భారత జట్టు దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రశ్న ఎదురుకాగా ఎంసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ మాట దాటవేశాడు.అందుబాటులో లేరుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై జట్టుకు చెందిన టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతానికి ఎవరూ మాకు అందుబాటులో లేరు. అలాంటపుడు వారిని జట్టులో చేర్చడం సరికాదు కదా!.. వారికి బదులు యువ ఆటగాళ్లకు జట్టులో చోటునిస్తాం’’ అని సంజయ్ పాటిల్ తెలిపాడు.కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్గా.. మనుపటి కంటే సన్నబడి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, విజయ్ హజారే ట్రోఫీకి అతడు ఎందుకు అందుబాటులో లేడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో సిరీస్తో బిజీగా ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు శివం దూబే కూడా ముంబై జట్టులో ఉండటం లేదు.వారికే సడలింపుటీ20 ప్రపంచకప్-2026 నాటి వీరు పూర్తిస్థాయి ఫిట్గా ఉండటం.. గాయాల బారిన పడకుండా ఉండటం అత్యంత ముఖ్యం. అందుకే వీరికి సడలింపు దొరికినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనారోగ్యం వల్ల ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు.ఇక గాయం నుంచి కోలుకుంటున్న ముంబై మాజీ సారథి అజింక్య రహానే సైతం ఈ టోర్నీకి దూరం కానుండగా.. శ్రేయస్ అయ్యర్దీ ఇదే పరిస్థితి అని సమాచారం. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలోని ముంబై జట్టులో సర్ఫరాజ్ ఖాన్, అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇషాన్ ముల్చందానికి తొలిసారిగా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా డిసెంబరు 24- జనవరి 8 వరకు విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ దశ జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్ -
మయాంక్ కెప్టెన్సీలో ఆడనున్న కేఎల్ రాహుల్
విజయ్ హజారే ట్రోఫీ 2025–26 సీజన్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కర్ణాటక క్రికెట్ అసోసియేషిన్ ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణలు ఉన్నారు. దీంతో కర్ణాటక జట్టు మరింత పటిష్టంగా మారింది.బీసీసీఐ అదేశాలతో వీరిద్దరూ దేశవాళీ వన్డే టోర్నీ బరిలోకి దిగనున్నారు. ఇక ఈ జట్టు కెప్టెన్గా స్టార్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా కరుణ్ నాయర్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా అండర్-23 టోర్నీలో కర్ణాటక తరపున అదరగొట్టిన హర్షిల్ ధర్మాని, ధ్రువ్ ప్రభాకర్లకు సీనియర్ జట్టులో చోటు లభించింది.ఈ టోర్నీలో ధర్మాని తమిళనాడుపై 142 పరుగులు, ప్రభాకర్ విదర్భపై 126 పరుగులతో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా శ్రీష ఆచార్ చోటు దక్కించుకున్నాడు. కర్ణాటక తమ గ్రూప్ దశ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లో ఆడనుంది.ఈ టోర్నీలో కర్ణాటక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. కర్ణాటక టీమ్ తొలి మ్యాచ్లో డిసెంబర్ 24న జార్ఖండ్తో తలపడనుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల సైతం ఈ టోర్నీలో ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ (వైస్ కెప్టెన్), స్మరణ్, శ్రీజిత్, అభినవ్ మనోహర్, శ్రేయాస్ గోపాల్,వ్యాషాక్, మన్వంత్ కుమార్ , శ్రీషా S ఆచార్, అభిలాష్ శెట్టి, శరత్ , హర్షిల్ ధర్మాని, కేఎల్ రాహుల్, ప్రభాకర్ చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు.. -
బీసీసీఐ కీలక ఆదేశాలు
ముంబై: ప్రస్తుత భారత జట్టులోని క్రికెటర్లు ఎవరైనా సరే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి దూరం కావద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. అవకాశం ఉంటే అన్ని మ్యాచ్లు ఆడాలని... లేదా కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదేశించింది. కాగా డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో భారత్ చివరి టీ20 జరిగే డిసెంబర్ 19, న్యూజిలాండ్తో తొలి వన్డే జరిగే జనవరి 11 మధ్య సమయంలో అవకాశం ఉన్న అన్ని మ్యాచ్లు ఆడాలని బోర్డు తేల్చి చెప్పింది. రో-కోలకు మా త్రమే కాకుండాఇక భారత్ తరఫున ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకే కాకుండా ఇతర రెగ్యులర్ క్రికెటర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దక్షిణాఫ్రికాతో రెండో టి20 ముగియగానే ఆటగాళ్లకు ఈ విషయాన్ని బోర్డు వెల్లడించినట్లు సమాచారం.అదే విధంగా.. ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉన్నట్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అన్ఫిట్గా తేలిస్తేనే వారికి సడలింపు ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఒకే రోజు న్యూజిలాండ్తో వన్డే సిరీస్, టీ20 వరల్డ్ కప్ జట్లను సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. కుటుంబ సన్నిహితులు ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతోనే జస్ప్రీత్ బుమ్రా ధర్మశాలలో మూడో టీ20 మ్యాచ్కు దూరమైనట్లు తెలిసింది. అంతా బాగుంటేనే అతడు తర్వాతి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు.క్రీడాసమాఖ్యల జాబితాలో బీసీసీఐ లేదు! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల జాబితాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లేదని క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేసారు. త్వరలో అమల్లోకి రానున్న కొత్త క్రీడా చట్టానికి సంబంధించి లోక్సభలో జరిగిన చర్చపై జవాబిస్తూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీసీఐని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చే అవకాశం ఉందా అంటూ టీఎంసీ ఎంపీ మాల రాయ్ అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానమిచ్చారు. చదవండి: IND vs SA: అక్షర్ పటేల్ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన -
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు ఎగిరి గంతేసే శుభవార్త. ఇటీవల సౌతాఫ్రికాతో వరుస సెంచరీలతో దుమ్ములేపిన ఈ రన్మెషీన్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నాడు. అయితే, ఈసారి టీమిండియా తరఫున కాకుండా.. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లి ఆడనున్నాడు.ప్రాబబుల్స్లో కోహ్లి పేరుఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) గురువారం ధ్రువీకరించింది. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తమకు స్వయంగా తెలిపాడని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) తాజా సీజన్ ప్రాబబుల్స్లో కోహ్లి పేరును చేర్చింది. దీని గురించి డీడీసీఏ వర్గాలు ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..‘‘తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని విరాట్ కోహ్లి (Virat Kohli) డీడీసీఏకు సమాచారం ఇచ్చాడు. క్రికెట్లో అతడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. రిషభ్ పంత్ కూడాఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ సెంచరీలు బాదాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్గా ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాడు. అయితే, అతడు ఈ దేశీ టోర్నీలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు మరింత స్ఫూర్తి పొందుతారు’’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. కోహ్లితో పాటు మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు కూడా ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. ఈసారి ఈ ఇద్దరు ఢిల్లీ తరపున మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.గంభీర్- అగార్కర్ ఒత్తిడి వల్లేనా?కోహ్లి వరల్డ్క్లాస్ బ్యాటర్. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాత.. అత్యధిక సెంచరీలు (84) బాదిన రెండో ఇంటర్నేషనల్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు.సౌతాఫ్రికాతో వన్డేల ద్వారా సూపర్ ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. నిజానికి కొత్తగా నిరూపించుకునేది ఏమీ లేదు. అయితే, వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో ఉండాలంటే నిబంధనల ప్రకారం.. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దేశీ క్రికెట్ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.ముఖ్యంగా హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంలో పంతం పట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరు రో- కోల గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రోహిత్ను అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. వరల్డ్కప్ ప్లాన్లో భాగంగానే ఇలా చేశామని అగార్కర్ చెప్పడం ఇందుకు నిదర్శనం.అంతేకాదు అంతకుముందు వీరిద్దరు కలిసి రో-కో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతూ హవా చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని దేశీ టోర్నీల్లో ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. రో-కో దేశీ క్రికెట్ ఆడాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్: ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టువిరాట్ కోహ్లి, రిషభ్ పంత్, దేవ్ లక్రా, యుగళ్ సైనీ, దివిజ్ మెహ్రా, సుజల్ సింగ్, రజ్నీశ్ దాదర్, అమన్ భార్తి, గోవింద్ మిట్టల్, సుమిత్ బెనీవాల్, శుభమ్ దూబే, కేశవ్ దబాస్, రాహుల్ చౌదరి, సమర్థ్ సేత్, శివమ్ త్రిపాఠి, అన్మోల్ శర్మ, శివమ్ గుప్తా, లక్షయ్ తరేజా, మనన్ భరద్వాజ్, రౌనక్ వాఘేలా, మయాంక్ గుసైన్, కేశవ్ ఆర్సింగ్,, లక్ష్మణ్, దివాన్ష్ రావత్, ప్రణవ్ రాజ్వన్షీ, ప్రన్షు విజయరణ్.చదవండి: వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు


