బాబు, లోకేష్ కోసం పవన్ జాకీలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని బుధవారం ఉదయం నుంచీ ఇన్స్టాగ్రామ్ వినియోగ దారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో యాప్ను ఉపయోగించడంలో సమస్యలొస్తున్నా యంటూ వేలాదిమంది యూజర్లు గగ్గోలే పెడుతున్నారు. ఇన్స్టాలో సందేశాలను పంపలేక పోతున్నారని లేదా వాటికి ప్రత్యుత్తరం ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో సందేశాలు, మీమ్స్తో హల్ చల్ చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం 10,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఫ్లాగ్ చేశారు, వీరిలో అమెరికా యూజర్లే ఎక్కువున్నారు. ఇండియాలో వందల సంఖ్యలో ఇలాంటి సమస్యలను నివేదించారు. అయితే మెటా యాజమాన్యంలోని కంపెనీ ఇన్స్టాగ్రామ్ దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందించ లేదు.యూజర్ల ఫిర్యాదులు యాప్ పనిచేయకపోవడంతో, వినియోగదారులలో గందరగోళం, నిరాశకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్ DMలు పనిచేయడం లేదంటూ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు, మరొకరు “ఇన్స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా... నేను కుక్ అయ్యానా” , “ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అది నేను మాత్రమేనా?” అని మరొకరు ప్రశ్నించారు. మరికొతమంది నెటిజన్లు ట్విటర్లో తమ సమస్యను రిపోర్ట్ చేశారు. “ఇన్స్టాగ్రామ్ పనిచేయడం మానేసిందా? నేను నా స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను” అని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్లో (గతంలో ట్విట్టర్)లో ఒక వినియోగదారు పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట
అమెరికాలో ముఖేష్ అంబానీ లక్షల కోట్ల పెట్టుబడులు
వాషింగ్టన్: అమెరికా ఇంధన రంగంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి భారత ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో ఆయిల్ రిఫైనరీ కేంద్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 300 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టేలా ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేశారు. రిలయన్స్ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేస్తూ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘అమెరికా ఎనర్జీ రంగంలో తన ఆధిపత్యాన్ని తిరిగి సొంతం చేసుకోనుంది. 50 సంవత్సరాల తర్వాత తొలిసారి టెక్సాస్లోని బ్రౌన్స్విల్లే వేదికగా కొత్త ఆయిల్ రిఫైనరీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను. ఇది చారిత్రాత్మక 300 బిలియన్ డాలర్ల ఒప్పందం. అమెరికా చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి. ఇది అమెరికన్ కార్మికులు, శక్తి రంగం, దక్షిణ టెక్సాస్ ప్రజలకు గొప్ప విజయం. భారత్లోని మా భాగస్వాములకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ‘భారత్లోని మా భాగస్వాములకు, వారి అతిపెద్ద ప్రైవేట్ ఎనర్జీ కంపెనీ రిలయన్స్కు ధన్యవాదాలు. మా అమెరికా ఫస్ట్ అజెండా. అనుమతులను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే బిలియన్ల డాలర్ల పెట్టుబడులు తిరిగి మా దేశానికి వస్తున్నాయి. బ్రౌన్స్విల్లే పోర్టులో కొత్త రిఫైనరీ అమెరికా మార్కెట్లకు ఇంధనం అందిస్తుంది, జాతీయ భద్రతను బలోపేతం చేస్తుంది. అమెరికా ఎనర్జీ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన రిఫైనరీగా నిలుస్తుంది. ఇది గ్లోబల్ ఎగుమతులకు శక్తినిస్తుంది. వేలకొద్దీ ఉద్యోగాలను సృష్టిస్తుంది. అభివృద్ధిని తెస్తుంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రాంతానికి ఇది గొప్ప వరం. ఇదే అమెరికా ఎనర్జీ ఆధిపత్యం ఎలా ఉంటుందో చూపిస్తోందని పునరుద్ఘాటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎనర్జీ కంపెనీలలో ఒకటి. ఇప్పటికే జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్వహిస్తున్న రిలయన్స్ ఇప్పుడు అమెరికాలో కూడా తన ముద్ర వేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రిలయన్స్ అమెరికా ఎనర్జీ రంగంలో కీలక పాత్ర పోషించనుంది. అమెరికాలో పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ మార్పుల నేపథ్యంలో ఈ కొత్త రిఫైనరీ నిర్మాణం చాలా ముఖ్యమైనది. ఇది అమెరికా ఎనర్జీ భద్రతను పెంచడమే కాకుండా, కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. America is returning to REAL ENERGY DOMINANCE! Today I am proud to announce that America First Refining is opening the FIRST new U.S. Oil Refinery in 50 YEARS in Brownsville, Texas. THIS IS A HISTORIC $300 BILLION DOLLAR DEAL — THE BIGGEST IN U.S. HISTORY, A MASSIVE WIN for…— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) March 10, 2026
టాలీవుడ్లో మరో వివాదం.. సారీ చెప్పిన డైరెక్టర్
పవన్ కల్యాణ్తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తీసిన దర్శకుడు హరీశ్ శంకర్.. హీరో మహేశ్ బాబు అభిమానుల్ని హర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం అంతా ట్విటర్లో ఈ విషయం గురించే చర్చ నడిచింది. ఇప్పుడు ఇది కాస్త సీరియస్ అయ్యేసరికి సదరు డైరెక్టర్.. మహేశ్ ఫ్యాన్స్కి క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్)అసలేం జరిగింది?మంగళవారం సాయంత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'ని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. బాబు రికార్డులు లేపేయాలని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా 'తథాస్తు' అని రీట్వీట్ చేశాడు. సెకన్ల వ్యవధిలో విషయం అర్థమై హరీశ్ శంకర్.. తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ మహేశ్ బాబు అభిమానులు మాత్రం హరీశ్ శంకర్ని ఘోరంగా ట్రోల్ చేశారు. 'ఉస్తాద్..' మూవీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. దీంతో ఇప్పుడు హరీశ్ శంకర్.. మహేశ్ అభిమానులకు సారీ చెప్పాడు.హరీశ్ ఏమన్నాడు?'సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తమన్ స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పనులతో నిన్నంతా బిజీగా గడిచింది. అదే టైంలో జర్నలిస్టులు, అభిమానుల మెసేజులకు రిప్లై ఇస్తూ ఆ హడావుడిలో ఓ ట్వీట్ని పూర్తి చదవకుండానే రీట్వీట్ చేశాను. నా టీమ్ అలెర్ట్ చేయగానే నిమిషం లోపే ట్వీట్ డిలీట్ చేశాను. మహేశ్ బాబుపై నాకు ఎంతో గౌరవముంది. 'పోకిరి' గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. 'వారణాసి'తో ఆయన పేరుమీద మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నాను''ఆయనని కానీ ఆయన అభిమానులని కానీ బాధపెట్టాలని ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. సినిమా మరో 10 రోజుల్లో విడుదలయ్యే ఈ టైంలో ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఓ సినిమా రికార్డులు సృష్టించాలనే అందరి హీరోల అభిమానుల మద్దతు అవసరం. అయినప్పటికీ నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని హరీశ్ శంకర్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)
ఎవరు అడ్డుపడినా చంపేస్తా.. ఆసక్తికరంగా ‘వదలా’ గ్లింప్స్!
భగవత్ గైడెన్స్.. టాప్–100లో 37 మంది!
టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్కు ఇచ్చిపడేసిన గంభీర్
ల్యాండింగ్ సమయంలో ఊడిన చక్రం.. తప్పిన ప్రమాదం
స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..
మూడు వారాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నా.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
కేకేఆర్కు భారీ షాక్.. రూ.18 కోట్ల ప్లేయర్ ఔట్?
'విశ్వంభర' కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నా
IPL 2026: కోహ్లీ ప్రాక్టీస్.. ఐపీఎల్ జరుగుతుందా?
T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ
ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా
ఈ క్షిపణులను ఇరాన్ ధనాధనా వేసిందనుకో..
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
దా‘రుణ’మైన ‘పెళ్లి కానుక’
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
సూపర్ సిక్స్ అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఎత్తేయడానికి మీరు భలే ప్లాన్లు వేస్తున్నారు సార్!
సోషల్ మీడియాలో పరిచయం… లాడ్జికి పిలిచి..!
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్
విజయ్-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్
అంటే అర్హులు జాబితాలో ఉంటారన్న గ్యారంటీ ఇవ్వరన్నమాట..!
గిరిజన యువతిగా క్రేజీ హీరోయిన్.. ఫస్ట్ లుక్ విడుదల
శ్రీలంక హెడ్ కోచ్గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి
ఎవరు అడ్డుపడినా చంపేస్తా.. ఆసక్తికరంగా ‘వదలా’ గ్లింప్స్!
భగవత్ గైడెన్స్.. టాప్–100లో 37 మంది!
టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్కు ఇచ్చిపడేసిన గంభీర్
ల్యాండింగ్ సమయంలో ఊడిన చక్రం.. తప్పిన ప్రమాదం
స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..
మూడు వారాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నా.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
కేకేఆర్కు భారీ షాక్.. రూ.18 కోట్ల ప్లేయర్ ఔట్?
'విశ్వంభర' కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నా
IPL 2026: కోహ్లీ ప్రాక్టీస్.. ఐపీఎల్ జరుగుతుందా?
T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ
ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా
ఈ క్షిపణులను ఇరాన్ ధనాధనా వేసిందనుకో..
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు - యుద్ధంతో భగ్గుమన్న ధరలు
దా‘రుణ’మైన ‘పెళ్లి కానుక’
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
సూపర్ సిక్స్ అమలు చేయకపోగా ఉన్న పథకాలు ఎత్తేయడానికి మీరు భలే ప్లాన్లు వేస్తున్నారు సార్!
సోషల్ మీడియాలో పరిచయం… లాడ్జికి పిలిచి..!
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్
విజయ్-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్
అంటే అర్హులు జాబితాలో ఉంటారన్న గ్యారంటీ ఇవ్వరన్నమాట..!
గిరిజన యువతిగా క్రేజీ హీరోయిన్.. ఫస్ట్ లుక్ విడుదల
శ్రీలంక హెడ్ కోచ్గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి
ఫొటోలు
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
అంగరంగ వైభవంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం (ఫొటోలు)
హైదరాబాద్లో ఫోన్లు చోరీ.. మూడు కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ (ఫొటోలు)
'డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు' తెర వెనక ఇలా (ఫొటోలు)
కూతురితో బిగ్బాస్ సోనియా హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
విజయ్-రష్మిక మెహందీ సెలబ్రేషన్ ఫొటోలు
బాక్సర్లా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
సినిమా ఈవెంట్లో మెరిసిన అనన్య నాగల్ల (ఫొటోలు)
విశాఖపట్నంలో వైభవంగా పైడిమాంబ తొలేళ్ల సంబరం (ఫొటోలు)
సినిమా
ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ బోలెడన్ని సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్.. గతేడాది అర డజను మూవీస్ చేసింది. వాటిలో దాదాపు మూడు నాలుగు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. కొత్త ఏడాదిలోనూ ఓ థ్రిల్లర్తో వచ్చింది. ఇప్పుడా సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ')అనుపమ లీడ్ రోల్ చేసిన తమిళ థ్రిల్లర్ మూవీ 'లాక్ డౌన్'. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులో దీన్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకనో వాయిదాల మీద వాయిదాలు పడింది. ఎట్టకేలకు ఈ జనవరి 30న రిలీజైంది. కానీ ఫ్లాప్ అయింది. లాక్డౌన్ అనేది ముగిసిన కాన్సెప్ట్. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూపించాలనుకున్నారు. అస్సలు వర్కౌట్ కాలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.'లాక్డౌన్' విషయానికొస్తే.. చదువు పూర్తి చేసిన అనిత(అనుపమ పరమేశ్వరన్) ఉద్యోగం ప్రయత్నాల్లో ఉంటుంది. ఓ రోజు స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంది. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. దీనిని ఇంట్లో వాళ్ల నుంచి దాచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ రావడంతో వైద్య సహాయం అందక ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఆదాయం కోల్పోయిన కుటుంబం, ఊరికి వెళ్లలేక చిక్కుకున్న కార్మికుడు, ప్రాణాలని లెక్కచేయకుండా పనిచేసే వైద్యులు, ఒంటరితనంతో బాధపడే యువత, విరహ వేదలో ఉన్న ప్రేమ జంటలు కూడా ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాయి. చివరకు అనిత జీవితం ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)
చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్
తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. సొంత భాషలో హిట్స్ ఉన్నప్పటికీ తెలుగు, తమిళంలో చేసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా చేస్తోంది. అయితే తమిళంలో చేసిన మూవీస్ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు రుక్మిణి మరో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)వరుస సినిమాలతో అలరిస్తున్న తమిళ హీరో ధనుష్.. ప్రస్తుతం విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో 'కర' మూవీ చేశాడు. మమిత బైజు హీరోయిన్. వచ్చే నెల 30న థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'అమరన్' తీసిన రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలోనూ ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. డీ55 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్స్. సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీని తర్వాత ధనుష్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నట్లు టాక్.ఇందులోనే దక్షిణాది క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్.. ధనుష్ సరసన నటించనుందట. ఇదే నిజమైతే వీళ్లిద్దరి కాంబోలో రూపొందే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ ప్రాజెక్టుకి అనిరుధ్ సంగీంతమందించనున్నాడట. ఇందులో ప్రతినాయకుడిగా విజయ్ కుమార్ నటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో)
ఇద్దరు బ్యూటీస్తో ఆర్య.. ఇందులో 'బేబి' కూడా
డిఫరెంట్ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు ఆర్య. ఇంతకు ముందు నాన్ కడవుల్, మద్రాసు పట్టణం, మహాముని, టెడ్డీ, సార్పట్ట పరంపరై తదితర మూవీస్ చేశాడు. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో 'వెట్టవన్'లో నటిస్తున్నాడు. దీని తర్వాత 'సార్పట్ట పరంపరై 2'లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు. తన 40వ చిత్రాన్ని జీవశంకర్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులో నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)నిఖిల్ మురళి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 12న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఆర్యతో హీరోయిన్లు నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య జిమ్లో కలిసి వర్కౌట్స్ చేస్తున్నట్లు ఫొటోలకు పోజులిచ్చారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం.. రొమాంటిక్ ప్రేమకథగా ఉండనుందని తెలుస్తోంది. 'బేబి' మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్యకు ఇదే తమిళంలో తొలి మూవీ.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో)
ఓటీటీలో తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన
గత నెలలో వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వచ్చి హిట్ అయిన తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ఏ మాత్రం అంచనాల్లేకుండా గత నెలలో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్లు క్లిక్ కాలేదు. ఓ వారం తర్వాత ప్రభాస్తో మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూ చేసింది. తర్వాత నుంచి వసూళ్లు కాస్త పికప్ అయ్యాయి. ఓవరాల్గా డీసెంట్ నంబర్లతో థియేట్రికల్ రన్ ముగించుకుంది. గత నెల 14న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(మార్చి 13) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'కపుల్ ఫ్రెండ్లీ' విషయానికొస్తే.. శివ(సంతోష్ శోభన్)ది నెల్లూరు. ఉద్యోగ అవకాశాల కోసం చెన్నై వెళ్తాడు. కానీ ఎంతకీ జాబ్ దొరక్క పార్ట్ టైమ్ బైక్ రైడర్గా పనిచేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఓ రోజు మిత్ర(మానస వారణాసి) పరిచయమవుతుంది. ఆమెది శివ లాంటి కథే. దీంతో ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తున్నానని అబద్ధాలు చెబుతూ చెన్నైలో బతికేస్తుంటుంది. అనుకోని పరిస్థితుల్లో మిత్ర కూడా శివతో కలిసి ఉండాల్సి వస్తుంది. మరి పెళ్లికి ముందే కలిసున్న శివ-మిత్ర జీవితాలు చివరకు ఎలా మారాయి? ఈ ప్రేమకథ సుఖాంతమైందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడు విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో)
క్రీడలు
గంభీర్కు వ్యతిరేకంగా అగార్కర్ నిర్ణయాలు!.. ఫలితం?
టీమిండియా హెడ్కోచ్గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్.. వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తిరుగులేని కోచ్ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ గెలిచిన భారత్.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ ఆసియాకప్ను కైవసం చేసుకుంది.తాజాగా టీ20 ప్రపంచకప్-2026లోనూ చాంపియన్గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్ విజయవంతమైన కోచ్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.క్రెడిట్ గంభీర్ ఒక్కడిదే కాదు!అయితే, భారత జట్టు వరుస విజయాల్లో.. ముఖ్యంగా టీ20 వరల్డ్కప్ గెలవడంలో క్రెడిట్ గంభీర్ ఒక్కడికే కాకుండా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్.అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.హార్దిక్ స్థానంలో సూర్యను ఎంపిక చేసిఅయితే, అనూహ్య రీతిలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు.సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో.. ఓపెనర్గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిసింది.గిల్పై వేటు వేస్తూ సంచలన నిర్ణయంగిల్ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్పై వేటు వేసింది. ప్రపంచకప్ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.ఈ విషయంలో గంభీర్- అగార్కర్ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. గంభీర్ గిల్ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్ వాదించినట్లు తెలుస్తోంది.ఇషాన్ విషయంలోనూ..అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్ కిషన్.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్ బాల్ క్రికెట్లో అతడు టాపార్డర్లో ఆడతాడు.మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్ పంత్. ధ్రువ్ జురెల్ కారణంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్ను ఎంపిక చేయడంలోనూ చీఫ్ సెలక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇటు ఇషాన్.. అటు సంజూఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్ కిషన్ వరల్డ్కప్ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.ఇదిలా ఉంటే.. భారత్ వరల్డ్కప్ గెలిచిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. అగార్కర్కు క్రెడిట్ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'⭐ 2007 ⭐ 2024 ⭐ 2026History repeated. History defeated. 🇮🇳💙#T20WorldCup pic.twitter.com/dRrraSdOoi— Star Sports (@StarSportsIndia) March 8, 2026
స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!
జస్ప్రీత్ బుమ్రా.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్త, పాత బంతి అనే తేడా లేకుండా తన వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్తో డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్గా తయారయ్యాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలవడమే గాక జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో సెమీఫైనల్, న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ సందర్భంగా డెత్ ఓవర్లలో తన విలువేంటో మరోసారి నిరూపిస్తూ భారత్ను చాంపియన్గా నిలిపాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడమే గాక వికెట్లు పడగొట్టడంలోనూ విజయ వంతమయ్యాడు. మరి బుమ్రా స్లో బంతుల వెనుక దాగున్న కథాకమీషును ఒకసారి పరిశీలిద్దాం. బుమ్రా స్లో డెలివరీ కథ తెలియాలంటే 16 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరముంది.అహ్మదాబాద్ వేదికగా కిషోర్ త్రివేదీ క్రికెట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో బుమ్రా తొలిసారి త్రివేదీ కోచింగ్ సెంటర్కు వచ్చాడు. అయితే ఆ సమయంలో బుమ్రాకు క్రికెట్ పట్ల ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు. కానీ అతని బౌలింగ్లో ఏదో తెలియని వైవిధ్యాన్ని కిశోర్ త్రివేదీ ఆనాడే కనిపెట్టాడు. బుమ్రా బంతులు వేయడానికి ముందు రనప్కు కొంత దూరమే తీసుకోవడం.. కొంత పరిగెత్తడం, కొంత నడవడం చేయడం వింతగా అనిపించింది. అంతేకాదు బంతిని బాగా బౌన్స్ వేసేవాడు. దీంతో కిశోర్ త్రివేది కోచింగ్ సెంటర్లో ఉన్న మిగతా పిల్లలు బుమ్రా బౌలింగ్ చూసి భయపడిపోయేవారు. బంతిని విడుదల చేసే పాయింట్ క్లిష్టంగా ఉండడంతో ఇతర పేసర్ల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉండడంతో బ్యాటర్లు తరచూ ఇబ్బంది పడేవారు. కోచ్ మాటలు పాటించి..బౌన్సర్లు తగ్గించి స్వింగ్, యార్కర్లపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి బౌలర్గా ఎదిగే అవకాశముంటుందని కోచ్ కిశోర్ బుమ్రాకు సలహా ఇచ్చాడు. కోచ్ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన బుమ్రా కాలక్రమంలో తన బౌలింగ్లో బౌన్సర్లు తగ్గించుకొని యార్కర్లు ఎక్కువగా వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బంతిని స్వింగ్ చేసే కళను కూడా ఒంటబట్టించుకున్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బుమ్రా తన మీడియం స్లో బౌలింగ్తో చేస్తున్న అద్భుతాలను కళ్లారా చూస్తూనే ఉన్నాం.తొలి పరిచయం!బుమ్రా వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్పై అతని చిన్ననాటి కోచ్ కిశోర్ త్రివేది స్పందించారు. ‘16 ఏళ్ల వయసులో బుమ్రాను తొలిసారి చూశాను. చూసినప్పుడే బుమ్రా బౌలింగ్లో ఒక వైవిధ్యత కనిపించింది. బౌలింగ్ యాక్షన్ మార్చుకోమని ఆనాడే చెప్పి ఉంటే బుమ్రా ఇవాళ ఒక సాధారణ స్థాయి బౌలర్గా మిగిలిపోయేవాడు. బుమ్రాది ఒక యూనిక్ బౌలింగ్ యాక్షన్. స్లో ఆర్థడాక్స్ను మీడియం బౌలింగ్కు మిక్స్ చేస్తూ బంతులను విడుదల చేయడం కాస్త కఠినతరంగా ఉంటుంది. కానీ బుమ్రా దీనిని చక్కగా ఒంటబట్టించుకున్నాడు. బుమ్రాకు అది సహజత్వంగా రావడంతో బౌన్స్ను తగ్గించుకొని యార్కర్లపై దృష్టి సారించాలని చెప్పాను. ఇవాళ బుమ్రా స్థాయి ఏంటో మీ అందరికీ తెలిసిందే’ అంటూ పేర్కొన్నారు.ఇటీవల టీ20 ప్రపంచకప్లో బుమ్రా 8మ్యాచ్లాడి 14 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా బుమ్రా తన అంతర్జాతీయ కెరీర్లో 52 టెస్టుల్లో 234 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు, 95 టీ20ల్లో 121 వికెట్లు పడగొట్టాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ బుమ్రా సభ్యుడిగా ఉన్నాడు.
బాబర్ ఆజం సంచలన నిర్ణయం
టీ20 ప్రపంచకప్-2026లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగాంగానే బంగ్లాదేశ్తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంను సెలెక్టర్లు తప్పించారు. వన్డే జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా ఉన్న బాబర్ను తప్పించడం పెద్ద చర్చానీయంశమైంది.దీంతో 2027 వన్డే ప్రపంచకప్లో అతడు ఆడడం కష్టమేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్లో బాబర్ దారుణ ప్రదర్శన కనబరిచాడుటీమ్ మేనేజ్మెంట్ అతని బ్యాటింగ్ ఆర్డర్ మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది.బాబర్ 4 ఇన్నింగ్స్ల్లో 22.75 సగటుతో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే పీసీబీ సెలెక్షన్ కమిటీ అతడిపై వేటు వేసింది. ఇక జట్టు నుంచి ఉద్వాసనకు గురైన బాబర్ ఆజం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ నుండి అతడు తప్పుకున్నాడు.కొన్నాళ్లపాటు పోటీ క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు 'జియో న్యూస్' తమ కథనంలో పేర్కొంది. బాబర్ తన బ్యాటింగ్ టెక్నిక్లోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. అతడు తన ఫామ్ను తిరిగి పొందేందుకు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.బాబర్ను తిరిగి మళ్లీ పాకిస్తాన్ సూపర్-2026 సీజన్లో చూసే అవకాశముంది. ఈ టోర్నీలో పెషావర్ జల్మీ కెప్టెన్గా ఆజం వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు'
'భారత్ గొప్ప జట్టేమి కాదు'.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అక్కసు
టీ20 వరల్డ్కప్-2026 ట్రోఫీని భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసిన టీమిండియా.. మూడోసారి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ టైటిల్ గెలిచినప్పటికీ, టోర్నీలో అత్యుత్తమ జట్టు దక్షిణాఫ్రికానేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ అసాంతం భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి, సూపర్-8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అదే విషయాన్ని స్టీవ్ హార్మిసన్ ప్రస్తావించాడు."న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యమే భారత్ను విజేతగా నిలిపింది. ఫ్లాట్ పిచ్లపై జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనే ఇతర జట్లకు, భారత్కు మధ్య తేడా చూపించింది. ఈ టోర్నీలో భారత్ అత్యుత్తమ జట్టు అని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో దక్షిణాఫ్రికానే అత్యుత్తమ జట్టు. టీమిండియా కేవలం 'బెస్ట్ మొమెంట్ టీమ్' మాత్రమే. మ్యాచ్ మలుపు తిరిగే కీలక సమయాల్లో వారు అద్భుతంగా రాణించి విజేతగా నిలిచారు. గ్రూపు స్టేజిలో భారత్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్లోనూ టీమిండియా ఇబ్బందులను ఎదుర్కొంది.కొంతమంది మ్యాచ్ విన్నర్ల కారణంగా ఓటమి నుంచి భారత్ గట్టెక్కింది. వారే భారత్కు బలం. ఇక టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా, సెమీఫైనల్లో ఫిన్ అలెన్ విధ్వంసం వల్లే ఓడిపోయింది. సూపర్-8లో భారత్ను సైతం సౌతాఫ్రికా ఓడించందని" టాక్స్పోర్ట్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు'
న్యూస్ పాడ్కాస్ట్
ఇక్కడ బాబు, అక్కడ BR నాయుడు కోట్లల్లో భారీ స్కాం
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
హాజరైన సెలబ్రిటీలు... విరోష్ రిసెప్షన్ కు
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
బిజినెస్
ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్..
దేశంలో ఎల్పీజీ కొరత ప్రభావంతో ఇండక్షన్ కుక్కర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించడంతో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్లు అలాగే ఆన్లైన్ వేదికల్లో ఇండక్షన్ కుక్కర్లకు భారీగా డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా గత శనివారం నుంచి అమ్మకాలు, ఎంక్వైరీలు అసాధారణంగా పెరిగినట్లు వెల్లడించారు.ఇంతకు ముందు కొన్ని షోరూమ్ చైన్లు రోజుకు సుమారు 35–40 ఇండక్షన్ కుక్కర్లను మాత్రమే విక్రయించేవి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరువైందని వ్యాపారులు చెబుతున్నారు.ఇండక్షన్ కుక్కర్లకు పెరుగుతున్న డిమాండ్ ప్రభావం స్టాక్ మార్కెట్పై కూడా కనిపించింది. ఈ రంగానికి చెందిన కంపెనీల షేర్ ధరలు ఒక్క రోజులో గణనీయంగా పెరిగాయి. బోరోజ్ షేర్లు సుమారు 13 శాతం, బజాజ్ ఎలక్ట్రికల్స్ 7 శాతం, టిటికే ప్రెస్టీజ్ 7 శాతం, హాకిన్స్ 4.8 శాతం లాభపడ్డాయి. బటర్ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్ షేర్లు కూడా సుమారు 2 శాతం పెరిగాయి.భారతదేశంలో ఎల్పీజీ వార్షిక వినియోగం సుమారు 31.3 మిలియన్ టన్నులు. ఇందులో 87 శాతం వినియోగం గృహ రంగానిదే. ఎల్పీజీ కొరత, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరగడం, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలపై భయాలు ఉండటంతో ఇండక్షన్ కుక్కర్లపై ప్రజలు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడం, అవసరమైన రంగాలకు మాత్రమే సిలిండర్ల సరఫరాను పరిమితం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలకు మాత్రమే ఎల్పీజీ సరఫరా కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు.దేశీయ ఉత్పత్తిని సుమారు 10 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఆంక్షలను సడలించే అవకాశముందని కేంద్రం, చమురు కంపెనీలు తెలిపాయి.
జోయాలుక్కాస్ నాలుగు కొత్త షోరూమ్లు
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయా లుక్కాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగు కొత్త షోరూమ్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 12న వరంగల్లో రెండో షోరూమ్ను, 13వ తేదీన విజయనగరం, శ్రీకాకుళంలో, 14న గుంటూరులో రెండో షోరూమ్ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా వేగవంతమైన విస్తరణ చేపడుతున్నట్టు పేర్కొంది.కొత్తగా ప్రారంభించే ప్రతీ షోరూమ్ ఆధునిక ఇంటీరియర్, విశాలమైన విస్తీర్ణం, అత్యుత్తమ సౌకర్యాలతో వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభూమతిని ఇచ్చేలా రూపొందించినట్టు తెలిపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆభరణాల తయారీ చార్జీలపై 40 శాతం ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల 29 వరకే అందుబాటులో ఉంటుంది. మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూమ్లను ప్రారంభించడం ద్వారా తమ నెట్వర్క్ను బలోపేతం చేసుకుంటున్నట్టు జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జోయ్ అలుక్కాస్ తెలిపారు.
విమాన టికెట్లకు రెక్కలు..!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఈ నెల 12 నుంచి ఇంధన సర్చార్జీ విధింపునకు తెరతీశాయి. దేశీ విమాన ప్రయాణికులపై ఒక్కో టికెట్కు రూ.399 చొప్పున ఫ్యూయెల్ సర్చార్జీని వసూలు చేసేందుకు నిర్ణయించాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలను సైతం పెంచేందుకు నిర్ణయించాయి. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ పరిస్థితుల కారణంగా జెట్ ఫ్యూయెల్ ధరలు పెరగడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే దశలవారీగా వీటిని అమలు చేయనున్నాయి.తొలి దశలో ఈ నెల 12 నుంచి దేశీ విమాన టికెట్లపై రూ. 399 వసూలు చేయనున్నాయి. సార్క్ దేశాల విమాన సర్వీసులకు సైతం వీటిని వర్తింపచేయనున్నాయి. ఇక పశ్చిమాసియా విమాన సర్వీసులపై ఇంధన సర్చార్జీని ఒక్కో టికెట్కు 10 డాలర్లు చొప్పున విధించనుంది. ఆఫ్రికా ప్రయాణాలపై 30 నుంచి 90 డాలర్ల వరకూ ఈ చార్జీల మోత మోగనుంది. ఆగ్నేయ ఆసియా దేశ సర్వీసులపై 20–60 డాలర్ల మధ్య ఈ అదనపు చార్జీ వసూలు చేయనుంది. సింగపూర్ ప్రయాణాలుసహా ఈ మార్పులన్నీ మార్చి 12 నుంచి అమల్లోకిరానున్నాయి. ప్రస్తుతం సింగపూర్ విమాన సర్వీసులపై ఇంధన సర్చార్జీ లేకపోవడం గమనార్హం!
సిల్వర్ హిట్.. క్రూడ్ ర్యాలీకి బ్రేక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక–రాజకీయ పరిణామాలతో మంగళవారం వెండి పరుగులు తీయగా, ముడి చమురు ధరలు కుదేలయ్యాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి రేటు కేజీకి రూ. 10,975 పెరిగి రూ. 2,79,275కి ఎగసింది. తద్వారా మూడు సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది. 99.9% స్వచ్ఛత బంగారం కూడా రూ. 400 పెరిగి రూ. 1,64,300కి చేరింది.ఇన్వెస్టర్లను కునుకు లేకుండా చేస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు త్వరలోనే పరిష్కారం ఉండబోతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా ప్రకటించడం భౌగోళిక–రాజకీయ మార్పులకు దారి తీయడంతో పసిడి, వెండి రేట్లు పెరిగాయని లెమన్ మార్కెట్స్ డెస్క్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గర్గ్ తెలిపారు.అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో వెండి ఔన్సుకి (31.1 గ్రాములు) 1.38 డాలర్లు పెరిగి 88.33 డాలర్లకు చేరగా, పసిడి 1 శాతం పెరిగి 5,172.86 వద్ద ట్రేడయ్యింది. మరోవైపు, న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో సిల్వర్ మే నెల కాంట్రాక్టు 5.07 డాలర్లు (సుమారు 6 శాతం) పెరిగి 89.59 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి 90 డాలర్ల దగ్గర ఉన్న నేపథ్యంలో 95 డాలర్ల (దేశీయంగా రూ. 2.85 లక్షలు) వైపుగా వెళ్లే అవకాశం ఉందని ఆగ్మంట్ హెడ్ (రీసెర్చ్) రెనిషా చెయినాని తెలిపారు. దిగొచ్చిన చమురు..: మూడు రోజులుగా ర్యాలీ చేస్తున్న ముడిచమురు ధరలకు ట్రంప్ భరోసాతో బ్రేక్ పడింది. ఎంసీఎక్స్లో మార్చి డెలివరీ క్రూడ్ కాంట్రాక్టు బ్యారెల్కి రూ. 1,483 (సుమారు 17 శాతం) క్షీణించి రూ. 7,366 వద్ద ట్రేడయ్యింది. అదే విధంగా ఏప్రిల్ కాంట్రాక్టు కూడా రూ. 1,245 (15 శాతం) తగ్గి రూ. 7,300 వద్ద ట్రేడయ్యింది. అటు అంతర్జాతీయంగా నైమెక్స్ క్రూడ్ ఏప్రిల్ డెలివరీ 18 శాతం క్షీణించి 88 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ మే కాంట్రాక్ట్ 16 శాతం తగ్గి 84 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.
ఫ్యామిలీ
ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..
ఆడపిల్లలను బయటకు పంపించని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాహసోపేతమైన రైడర్ ఆమె. భర్త ప్రోత్సాహంతో సవాలుతో కూడిన డ్రైవ్లను సర్క్యూట్ రేసింగ్లను చాలా చాకచక్యంగా చేసేసిందామె. అలాగే విధి కన్నెర్రజేసి భర్తను తీసుకుపోయినా..అజేయమైన ధైర్య సాహసాంతో కుటుంబాన్ని నడిపించింది. భర్త నింపిన స్థైర్యాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిది పదుల వయసులోనూ డ్రైవింగ్ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. సమస్యలు, కష్టాలు నీ గమనాన్ని ఆపే యత్నం చేస్తాయి..అంతమాత్రాన చేతులెత్తేస్తే జీవితమే ఉండదు అని అంటోంది ఈ డైనమిక్ బామ్మ..!.ఆ ధీర వనితే ముంబైకి చెందని 82 ఏళ్ల జరీన్. బొంబాయిలోని ముస్లీం కుటుంబంలో పెరిగిన ఆమె..కళాశాలకు వెళ్ళి చదువుకున్న మొట్టమొదటి అమ్మాయి కూడా జరీనానే. సాంప్రదాయ అడ్డంకులని ఆ టీనేజ్ వయసులోనే అధిగమించి శెభాష్ అనుపించుకుంది. అంతేగాదు బాల్య దశలోనే డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. అయితే అందుకు ప్రోత్సాహం, నేర్పేవాళ్లు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. పెళ్లితో ఆమె భర్త తన అభిరుచికి అండగా నిలిచాడు, ప్రోత్సహించాడు. హైవేలపై మినీ బస్సులను నడపడం నుంచి బెంగళూరు నుంచి దాదాపు నిరంతర డ్రైవింగ్ సవాలు వరకు అన్ని డ్రైవ్లను స్వీకరించేలా ప్రోత్సహించాడు. ఇరవైల నాటికి సర్క్యూట్ రైసింగ్ ప్రయత్నించి..థ్రిల్ ఫీల్ని ఎంజాయ్ చేసింది. ప్రతి అనుభవం సాయంతో డ్రైవింగ్లో మరింత స్కిల్ని పుణికిపుచ్చుకుంది జరీన్. దాంతో ఆమెకు డ్రైవింగ్ అభిరుచికి మించినదిగా జీవితంలో భాగమైంది. 1996లో ఆమె భర్త అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టింది. పిల్లలను పెంచుతూ..సొంతంగా డిపార్ట్మెంట్ స్టోర్ని నడిపేది కూడా. ప్రస్తుతం ప్రతి ఉదయం మనవరాళ్లను పాఠశాలకు తీసుకువెళ్తోంది. ఆమె రోజు అపాయింట్మెంట్లు, సామాజిక పని, సమావేశాలతో బిజీగా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది కూడా. అంతేగాదు జరీన్ డ్రైవింగ్ అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఒక మార్గానికి మించినదని చెబుతోంది. ఇది స్వాతంత్ర్యం, విశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నం. చాలా మందికి, చక్రం తిప్పడం అనేది వారి స్వంత మార్గాన్ని రూపొందించుకునేలా చేయడమే గాక సాహసోపేతంగా సవాళ్లను స్వీకరించే శక్తిని, పరిమితుల నుంచి విముక్తి పొందే సామర్థ్యాన్ని అందిస్తుందని ఆత్మస్థైర్యంగా చెబుతోంది జరీన్. నెటిజన్లు కూడా ఈ అమ్మమ్మ నిజంగా గ్రేట్. ఎనభైలలో కూడా డ్రైవింగ్ చేస్తున్న ఈ బామ్మ సదా స్ఫూర్తి, ప్రేరణ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!)
చక్కని గాజులు.. చెక్కిన చేతులు..
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిల అలంకరణల్లో ఎన్ని రకాల నగలున్నా.. గాజుల స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే, ఒకప్పటిలా నిండుగా కాకుండా.. ఆఫీసుకైనా, కాలేజీకైనా సింపుల్గా ఓ గాజు వేసుకుంటే చాలనుకుంటున్నారు. దీంతో పాటు కస్టమైజేషన్ గాజులంటే మరింతగా ఇష్టపడుతున్నారు. దీంతో చార్మినార్ ప్రాంతంలోని లాడ్ బజార్లో ‘లైవ్ బ్యాంగిల్ మేకింగ్’ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. అక్కడ కస్టమర్ల అభిరుచి మేరకు వారి కళ్ల ఎదుటే, నచి్చన డిజైన్లలో గాజులు తయారు చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియను పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా సోమవారం ఓ యువతి కళాకారుడి సూచనల మేరకు స్వయంగా గాజులు తయారుచేయించుకుంది.
సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!
కురుగంటి కవిత... మన దేశంలో రైతుల హక్కులు, సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఓ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి. దేశవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు, రైతు శాస్త్రవేత్తలు, దేశీ విత్తన పరిరక్షకులు, స్వతంత్ర శాస్త్రవేత్తలు, పౌర సంస్థలు, వ్యక్తులతో కూడిన ఒక విస్తృతమైన నెట్వర్క్ ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా)’. దీనికి కవిత జాతీయ కన్వీనర్గా సేవలందిస్తున్నారు. ఆషా–కిసాన్ స్వరాజ్, జాతీయ మహిళా రైతుల హక్కుల సంఘం (మకాం), ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ (ఎన్సీఎన్ఎఫ్), కోలిషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా వంటి అనేక జాతీయ వేదికల్లో ఆమె దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. స్వావలంబనే శ్వాసగా కదిలే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులకు, రైతు శాస్త్రవేత్తలకు, రైతుల హక్కుల కోసం కృషి చేసే స్వచ్ఛంద కార్యకర్తలు, సంస్థలకు బలమైన సమష్టి గొంతుకగా ఆషా–కిసాన్ స్వరాజ్ నెట్వర్క్ నిలుస్తోంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మితేనే వారికి సముచిత ఆదాయం వస్తుంది. సేంద్రియ మార్కెట్ల నిర్వహణకు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో రైతులకు కాస్త చోటివ్వమని నగర/పట్టణవాసులకు ఆమె పిలుపు ఇచ్చారు. ఆరో కిసాన్ స్వరాజ్ సమ్మేళనాన్ని (kisan swaraj sammelan 2026) ఇటీవల మైసూరులో ఘనంగా నిర్వహించిన కవిత కురుగంటితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు.‘ఆషా’ ఎప్పుడు, ఎలా పుట్టింది? కురుగంటి కవిత (kavitha kuruganti): 15 ఏళ్ల క్రితం ‘ఆషా’ కిసాన్ స్వరాజ్ సంస్థ పుట్టింది. బీటీ వంగ ప్రతిఘటన ఉద్యమకాలంలో ‘కోలియేషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా’ను మేమంతా 2004లో సేవాగ్రామ్లోని గాంధీ ఆశ్రమంలో కూర్చొని ఏర్పాటు చేసుకున్నాం. బీటీ పత్తి మన దేశంలోకి వచ్చి అప్పటికి రెండేళ్లు గడిచాయి. బీటి పత్తి (BT Cotton) వల్ల ఆచరణలో ఎదురవుతున్న సమస్యలు ఆధారసహితంగా తెలిసివస్తున్న రోజులవి. కార్పొరేట్ కంపెనీల నియంత్రణ నుంచి బయటకు రావటం కోసం, స్వావలంబన సేద్యం కోసం రైతులు అనుసరించవలసిన పద్ధతులు, విష ముక్త, రుణ ముక్త, ఆత్మహత్య ముక్త జీవనోపాధుల వ్యవస్థ సాధించాలన్నది మా లక్ష్యం. అప్పుడు మేం అనుకున్నదేమిటంటే.. రైతు తన పొలంలో నడుము వంచి పనిచేసుకుంటున్నప్పుడు ఏదైనా ఎద్దు చేనులోకి చొరబడితే చేతిలో పని ఆపేసి ముందు ఆ ఎద్దును బయటకు తరమాలి కదా. అలాగే మిగతా పనులన్నీ పక్కనపెట్టి జన్యుమార్పిడి పంటలను పారదోలాలని అనుకున్నాం. ఆ విధంగా దేశంలో ఒక ఉద్యమం నిర్మించటానికి ఆరేళ్లు విపరీతంగా కష్టపడ్డాం.కేంద్ర పర్యావరణ మంత్రి జయరామ్ రమేశ్ 2009 డిసెంబర్ నుంచి జీఎం వంగపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల చేత నో అనిపించటం కోసం, సైంటిస్టులను, డాక్టర్లను ఈ ఉద్యమంలోకి తేవటం కోసం దేశమంతా తిరుగుతూ, చర్చలు పెడుతూ.. రాత్రి, పగలు అవిశ్రాంతంగా పని చేశాం. 2010 ఫిబ్రవరి 9న బీటీ వంగపై నిరవధిక మారటోరియం ప్రకటించారు. అదే మా తొలి విజయం. అదే సంవత్సరం మార్చిలో నాగపూర్లో మేం మళ్లీ కలిసి కార్యాచరణ నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతాల్లో ‘కిసాన్ స్వరాజ్ యాత్ర’ చేపట్టాం. 71 రోజులు 220 మందిమి 20 వేల కిలోమీటర్లు 20 రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేసి రాజ్ఘాట్లో ముగించి, సోనియా గాంధీకి మా డిమాండ్ల పత్రాన్ని ఇచ్చాం.మేము బయలుదేరిందేమో ఆత్మహత్య దారితీయని సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వ్యాప్తి కోసమని. అయితే, దేశవ్యాప్తంగా రైతులు ఇతర సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ఆర్గానిక్ సేద్యం (Organic Farming) కన్నా ముందు గిట్టుబాటు ధర, భూసేకరణ, వ్యవసాయంపై పారిశ్రామిక కాలుష్యం ముప్పు వంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో రైతులు కోరారు. సిటీల్లో ప్రజలు తమకు రసాయన అవశేషాల్లేని ఆహారం కావాలని అడిగారు. ముంబైలో మహేశ్ భట్ వంటి బాలీవుడ్ పెద్దలూ మాకు స్వాగతం పలికారు. ఈ యాత్ర నుంచే ‘ఆషా–కిసాన్ స్వరాజ్’ పుట్టింది. ‘కిసాన్ స్వరాజ్ నీతి’ పేరుతో మార్గదర్శకాలను నిర్దేశించుకొని, వాటి సాధన కోసం పని చేస్తున్నాం.మీరు సాధించిందేమిటి?కవిత: దేశంలో వ్యవసాయం మీద ఇష్టం ఉన్నవాళ్లకి మనం ముందుకెళ్లాల్సిన దారి ఏమిటో దిశా నిర్దేశం చెయ్యటంలో ఆషా–కిసాన్ స్వరాజ్ విజయం సాధించింది. గందరగోళాన్ని పారదోలింది. బీటీ వంగ పంట రాకుండా ఆపింది. రసాయనిక వ్యవసాయంతో ఎదురవుతున్న రకరకాల సంక్షోభాలు, జన్యుమార్పిడి పంటలతో (genetically modified crops) సమస్యలు వంటి వాటిపై వాస్తవ గణాంకాల ఆధారిత నివేదికలను రూపొందించటం, సంబంధిత సమగ్ర జ్ఞానాన్ని అందుబాటులోకి తేవటంలో మేం సఫలమయ్యాం. ఉదాహరణకు.. రైస్ ఫోర్టిఫికేషన్. అధ్యయన నివేదికలు రూపొందించాం. ఇది ప్రజారోగ్యానికి హానికరం కాబట్టి వద్దు అని చెప్పాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశాం. 23 ఏళ్లుగా మరో జన్యుమార్పిడి పంటను వాణిజ్యపరంగా బయటకు రాకుండా ఆపగలిగాం. అంతేకాదు, ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ క్షేత్ర ప్రయోగాలు జరపకుండా కూడా ఆయా ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించగలిగాం.ప్రజల నుంచి మీరేమి ఆశిస్తున్నారు?కవిత: ఆరోగ్యదాయకమైన ఆహారం గురించి అందరూ చైతన్యం పెంచుకోవాలి. మీ కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఈ పని చెయ్యగలిగితే.. అనేక విధాలుగా మేలు కలుగుతుంది. మీ ఆరోగ్యం బాగవుతుంది. వ్యవసాయంపై కార్పొరేట్ కంపెనీల నియంత్రణ కొంత తగ్గుతుంది. ఎక్కువ మంది రైతులు స్వావలంబనతో కూడిన వ్యవసాయం వైపు మొగ్గుచూపుతారు. నగరాలు, పట్టణాల్లో ప్రజలను నేను కోరుతున్న మరో విషయమేమిటంటే.. సేంద్రియ/ ప్రకృతి రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటానికి చోటివ్వండి. మీ ఇళ్లు/ గేటెడ్ కమ్యూనిటీలు/ కాలనీల్లో తరచూ సేంద్రియ సంతల నిర్వహణకు చోటు కల్పించండి. తద్వారా మధ్యవర్తుల బెడద తీరి, రైతుల ఆదాయం పెరుగుతుంది. అర్హులైన రైతులను గుర్తించి, సమన్వయపరచడానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు కొదువ లేదు. చెన్నై, మాండ్యలలో రైతులే నిర్వహించుకునే సేంద్రియ మార్కెట్లే ఇందుకు నిదర్శనాలు.ఏమిటా ‘కిసాన్ స్వరాజ్ నీతి’ సూత్రాలు?కవిత: డా. జయతీఘోష్, డా. డి. నరసింహారెడ్డి వంటి చాలా మంది మేధావులతో లోతుగా చర్చించి 4 మార్గదర్శకాలను నిర్దేశించుకున్నాం. 1. కనీస మద్దతు ధర కావాలని రైతులు అడుగుతుంటారు. అయితే, అది దొరికినా ఆదాయ భద్రత దొరక్కపోవచ్చు. అందుకే రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి. 2. ప్రభుత్వం వ్యవసాయ విధాన నిర్ణయం ఏది చేసినా అది పర్యావరణ సుస్థిరతకు లోబడి ఉండేలా చూడాలి. 3. భూమి, విత్తనం, నీరు వంటి వ్యవసాయ వనరులపై హక్కు రైతు సముదాయం చేతుల్లోనే ఉండాలి. 4. వినియోగదారులందరికీ వైవిధ్యభరితమైన, భద్రమైన, పుష్కలంగా, పోషక సంపన్నమైన ఆహారాన్ని అందించాలి. మా లక్ష్యం కేవలం సుస్థిర వ్యవసాయం కాదు. ఇవన్నీ కలిసి ఉండే హోలిస్టిక్ అగ్రికల్చర్. ఈ మార్గదర్శకాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. మహిళా రైతులు, కౌలు రైతులు, ఆదివాసీ రైతుల హక్కులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.‘ఆషా’ నిర్మాణం ఎలా ఉంది?కవిత: మాది సభ్యత్వం, ఎన్నికల ఆధారంగా పనిచేసే సంస్థ కాదు. దేశవ్యాప్తంగా భావసారూప్యత ఉన్న సంస్థలు, వ్యక్తుల్ని కలుపుకొని వెళ్లే ఒక వేదిక మాత్రమే. ఆషా స్వచ్ఛంద సంస్థ కాదు. మాకు బ్యాంకు ఎకౌంట్ లేదు, ఆఫీసు, సిబ్బంది లేరు. ఇళ్ల నుంచే మేం పనిచేస్తున్నాం. మా సొంత డబ్బునే ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నాం. వేరే యూనియన్ల మాదిరిగా ఇది వద్దు, అది వద్దు అనే వైఖరికి పరిమితం కాకుండా.. సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలను చూపే సంఘర్ష్, నిర్మాణ్లతో కూడిన వేదికగా ‘ఆషా’ను తీర్చిదిద్దాం. మాలో చాలా మందిమి ధర్నాల్లో పాల్గొంటాం, ప్రభుత్వ సలహా బృందాల్లోనూ సభ్యులుగా ఉంటాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యటానికని కేంద్ర ప్రభుత్వం నియమించిన అశోక్ దల్వాయి వర్కింగ్ కమిటీలో నేను, కిరణ్ సభ్యులుగా ఉండి, మూడు సంపుటాలలో మా సూచనలిచ్చాం. అదే సమయంలో కిసాన్ ముక్తి యాత్ర వంటి ఆందోళనలు నిర్వహించాం.చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’తెలుగు బిడ్డ!కురుగంటి కవిత తెలుగింటి బిడ్డే! ఆమె తల్లిదండ్రులు గంగాభవాని (తూ.గో. జిల్లా పలివెల), రమేశ్ (గుంటూరు). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మే చదివిన తర్వాత జహీరాబాద్ వద్ద పస్తాపూర్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్)లో దళిత మహిళా రైతుల అభ్యున్నతి కోసం ఐదేళ్లపాటు పనిచేశారు. తదనంతరం బెంగళూరులో (ఈ మధ్యనే మైసూరుకు మారారు) స్థిరనివాసం ఉంటూ జాతీయ రైతాంగ ఉద్యమం నిర్మాణానికి కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 400కుపైగా సంస్థలు, వ్యక్తులతో కూడిన ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా) ఉద్యమాన్ని గత 15 ఏళ్లుగా ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో గుణాత్మక మార్పు కోసం జరిగే పోరాటాల్లో ఆమె కీలక పాత్ర నిర్వహిస్తున్నారు.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి
ఉమెన్ సివిల్ పవర్
ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...⇒ 24 - 35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మహిళలప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.⇒ 41%: 2023 ఐఏఎస్ బ్యాచ్లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.⇒ 18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.అసామాన్య విజేతలుఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ⇒ డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడి΄ోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్లో ఆమె 483 ర్యాంక్. ⇒ పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. ⇒ పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్దీప్ కౌర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు. ⇒ కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి. ⇒ గుజరాత్లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. ∙పంజాబ్లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్లో లైన్మన్గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణి.⇒ మధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్.
అంతర్జాతీయం
దుబాయ్లో ‘అత్యవసర’ మార్గదర్శకాలు విడుదల
దుబాయ్: ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎమిరేట్ పూర్తిస్థాయిలో సురక్షితంగా ఉందని, అన్ని కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే అత్యవసర హెచ్చరికలు జారీ అయిన సందర్భంలో నివాసితులు, సందర్శకులు ఎలా స్పందించాలనే విషయంపై ముందస్తు జాగ్రత్త సూచనలు ఇచ్చారు.మొబైల్ ఫోన్లకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికలు అందినప్పుడు ప్రజలు ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరించేలా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపారు.మార్గదర్శకాల ప్రకారం.. హెచ్చరిక అందిన సమయంలో బయట ఉన్నవారు భయపడకుండా వెంటనే సమీప భవనంలోకి వెళ్లాలని సూచించారు. వాహనం నడుపుతున్నవారు కూడా సమీపంలోని ఇండోర్ ప్రదేశానికి సురక్షితంగా చేరుకోవాలని, కిటికీలు, బాల్కనీలు లేదా బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే భవనాల బయటి గోడలు, గాజు ప్యానెల్స్ సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు.ప్రజలు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే నమ్మాలని, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన అప్డేట్స్నే అనుసరించాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే ధ్రువీకరించని సందేశాలు, వాయిస్ రికార్డింగులు లేదా వీడియోలను షేర్ చేయవద్దని కూడా స్పష్టం చేశారు.ఇంట్లో ఉన్నవారికి సూచనలుఇళ్లలో లేదా కార్యాలయాల్లో అప్పటికే భవనాల లోపల ఉన్నవారు కిటికీలు, బాల్కనీలు, బహిరంగ ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని గైడ్ సూచించింది. అవసరమైతే భవనం లోపల మరింత సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని తెలిపింది.అదేవిధంగా పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్స్ లేదా భద్రతా సిబ్బంది ఇచ్చే సూచనలను గమనించాలని, ప్రత్యేకంగా సూచించని వరకు ఎలివేటర్ల వినియోగాన్ని నివారించాలని అధికారులు పేర్కొన్నారు. పెద్ద గాజు ఉపరితలాలు లేదా గాజు గోడల సమీపంలో ఉండకూడదని సూచించారు.పరిస్థితి పూర్తిగా ముగిసిందని అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి “ఆల్ క్లియర్” నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రజలు తమ ప్రస్తుత స్థానంలోనే ఉండాలని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. అనంతరం సాధారణ కార్యకలాపాలను ప్రశాంతంగా పునఃప్రారంభించవచ్చని పేర్కొంది.
ఇరాన్ భద్రతా దళాల కీలక స్థావరాలు ధ్వంసం
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇరాన్లోని ఇలామ్ ప్రావిన్స్లో ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థలకు గణనీయమైన నష్టం కలిగించామని వెల్లడించాయి. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) ఐడీఎఫ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇరాన్కు చెందిన కీలక వ్యవస్థలు, సామర్థ్యాలను క్రమబద్ధంగా లక్ష్యంగా చేసుకుంటోందని తెలిపింది.గత వారం రోజులుగా ఇరాన్ అంతటా ఉన్న అంతర్గత భద్రతా దళాలు, బసిజ్ బలగాలకు చెందిన మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించి వాటికి తీవ్ర నష్టం కలిగించామని ఐడీఎఫ్ పేర్కొంది.ఈ దాడుల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇలామ్ ప్రావిన్స్ ఒకటిగా పేర్కొంది. ఈ ప్రావిన్స్లోని భద్రతా దళాలు గతంలో పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు, అలాగే డిసెంబర్–జనవరి నెలల్లో ఇరాన్ వ్యాప్తంగా జరిగిన నిరసనలను అణచివేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఐడీఎఫ్ ఆరోపించింది.ఇలామ్ ప్రావిన్స్లోని పలు కీలక స్థావరాలు ధ్వంసమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. వాటిలో అంతర్గత భద్రతా దళాల ప్రధాన కార్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కేంద్ర కార్యాలయం, నిరసనలను అణచివేసే బెటాలియన్లకు బాధ్యత వహించే ఐఆర్జీసీ (IRGC) కమాండ్ సెంర్, అంతర్గత భద్రతా దళాల్లోని స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ ప్రధాన కార్యాలయం, పలు బసిజ్ యూనిట్ కేంద్రాలు, ఐఆర్జీసీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
ట్రంప్ను ఖతం చేస్తాం: ఇరాన్ సంచలనం
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. “నిన్ను మించిన వారికి కూడా ఇరాన్ను నాశనం చేయడం సాధ్యం కాలేదు. జాగ్రత్తగా ఉండు.. లేకపోతే నువ్వే ఖతం అవుతావు” అని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని పై విధంగా స్పందించారు.కాగా, ‘హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ చమురు సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే గత దాడుల కంటే అమెరికా 20 రెట్లు ఎక్కువ తీవ్రతతో దాడులు చేస్తుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ మళ్లీ ఎప్పటికీ పునర్నిర్మాణం కాలేదు. అంతలా ఆ దాడులు ఉంటాయి’ అని తెలిపారు. కానీ, అలా జరగకూడదని తాను ఆశిస్తూ, ప్రార్థిస్తున్నానని అని ట్రంప్ అన్నారు.మొజ్తాబాను కూడా ట్రంప్ హెచ్చరిస్తూ ఆయన ప్రశాంతంగా జీవించలేరని చెప్పారు. ఇరాన్ ఎంచుకున్న లీడర్ తనకు నచ్చలేదని ట్రంప్ చెప్పారు. అలీ ఖమేనీ రెండో కుమారుడిని కొత్త నాయకుడిగా ఎన్నుకోవడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మోజ్తబా ఖమేనీ నియామకానికి ముందు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో అమెరికా పాత్ర కూడా ఉండాలని చెప్పారు. గతంలో వెనెజువెలా విషయంలో అమెరికా జోక్యం ఉన్నట్లే ఇప్పుడూ ఇరాన్ విషయంలో ఉండాలని అన్నారు.ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దాంతో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైంది.హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ఎగుమతులు నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హోర్ముజ్ జలసంధి నుంచి ఒక లీటర్ చమురు కూడా ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని చెప్పింది. పర్షియన్ గల్ఫ్ సముద్రం నుంచి ప్రపంచానికి చమురు రవాణా జరిగే అత్యంత కీలక సముద్ర మార్గమే హోర్ముజ్ జలసంధి.ఈ యుద్ధంలో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. మంగళవారం ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరిగింది.బహ్రెయిన్ రాజధాని మనామాలో ఇరాన్ దాడి ఒక నివాస భవనాన్ని తాకింది. 29 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఎనిమిది మంది గాయపడ్డారు. సౌదీ అరేబియా తూర్పు చమురు ప్రాంతంపై వచ్చిన 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. కువైట్ నేషనల్ గార్డ్ 6 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రువైస్ పారిశ్రామిక సిటీలో డ్రోన్ దాడి తర్వాత అగ్ని ప్రమాదం చెలరేగింది. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో సైరన్లు మోగాయి. టెల్ అవీవ్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ నుంచి వచ్చిన దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు పని చేశాయి.
హర్మూజ్ జలసంధిపై.. ట్రంప్ కీలక ప్రకటన
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంటుందని ప్రకటించారు. ఇదే జరిగితే చమురు సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.పశ్చిమాసియాలో పరిస్థితులు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ ఏ మాత్రం తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతుంది. గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా హర్మూజ్ జలసంధిని ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ముడిచమురు రవాణాలో 20 శాతం వరకూ ఈ మార్గం మీదుగానే రవాణా అవుతుంది. దీనిని ఇరాన్ బ్లాక్ చేసింది. నౌకలు కదిలితే పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో భారత్తో పాటు చాలా దేశాలకు ముడిచమురు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికసంక్షోభం తలెత్తే అవకాశం తలెత్తే అవకాశం ఉందని పలు సంస్థలు హెచ్చరించాయి.ఈ నేపథ్యంలోనే ట్రంప్ హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా తలెత్తిని చమురు సంక్షోభానికి పులిస్టాప్ పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రతరం చేస్తున్న ఇరాన్.. హర్మూజ్ను స్వాధీనం చేసుకుంటే మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఈ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
జాతీయం
అర్హులెవ్వరినీ తొలగించం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రధాన ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు. బెంగాల్లో ఎన్నికల సన్నద్ధతపై రాజకీయ పార్టీలు, ఉన్నతాధికా రులతో ఈసీ వరుస సమీక్షా సమావేశాలు నిర్వ హించిన అనంతరం మంగళవారం కోల్కతాలో ఈసీలోని ఇతర సభ్యులతో కలిసి జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.ఢిల్లీ వెళ్లాక రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తామ న్నారు. బెంగాల్లో సర్ అమలు పలు వివాదాలకు, ఉద్రిక్తతలకు దారితీయడంపై ఆయన స్పందిస్తూ.. అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగించడమే కాదు, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 6 వేల మందికి పైగా శతాధిక వృద్ధులతోపాటు కొత్తగా నమోదైన 18–19 ఏళ్ల గ్రూపులోని 5.23 లక్షల మంది యువజనులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వివరించారు.
ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు
స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. – కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కొందరు మహిళా ఎంపీలపైఆయన నిరాధార ఆరోపణలు చేశారని, కొన్ని అంశాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.స్పందించిన అధికార పక్షం, ఓం బిర్లాను తొలగించేందుకు తీసుకువచ్చిన తీర్మానం వార్తల్లో నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించింది. ఓం బిర్లా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారంటూ మద్దతు తెలిపింది. స్పీకర్ స్థానంలో ఉన్న వారు తమను తాము సమర్థించుకునేందుకు సభలో జరిగే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటింగ్కు దూరంగా ఉండాలని బిర్లా నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో బుధవారం ఈ తీర్మానంపై చర్చ ముగియనుంది.తటస్థంగా ఉంటారని ఆశించాం. కానీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు.సభా మర్యాదను కాపా డేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకే స్పీకర్ను తొలగించేందుకు ప్రతిపక్షం తీర్మానం తీసుకు రావాల్సి వచ్చిందన్నారు. ‘స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు’అని గొగోయ్ ఆరోపించారు. సభలో వాక్ స్వాతంత్య్రం లేనేలే దన్నారు. సభ్యులందరికీ వ్యక్తిగతంగా స్పీకర్తో సత్సంబంధాలే ఉన్నప్పటికీ, ఈ తీర్మా నం తేవాల్సి రావడం విచారకరమని గొగోయ్ పేర్కొన్నారు. అందరికీ అవకాశమిచ్చారు: మంత్రి రిజిజుఈ చర్చ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్పై ఆగ్రహం వ్యవక్తం చేశారు. వాస్తవానికి ఓం బిర్లా సభ్యుల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారన్నారు. అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులకే తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎక్కువ అవకాశాలిచ్చారని తెలిపారు. అధికారం కోల్పోయిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈసారి స్పీకర్ పదవినే లక్ష్యంగా చేసుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. డీఎంకే నేత టీఆర్ బాలు, టీడీపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, శివసేన(యూబీటీ) సభ్యుడు అర్వింద్ సావంత్, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చలో పాల్గొన్నారు.
వంటగ్యాసే ఫస్టు!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశంలో వంట గ్యాస్ సరఫరా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గృహ వినియోగానికి ప్రస్తుతం ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగినంత లేకపోవడంతో ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. రవాణా రంగానికి అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోతోంది.సమస్య పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయాలని ఆదేశించింది. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి, తర్వాత ఎరువుల ఉత్పత్తికి, అనంతరం తేయాకు పరిశ్రమ, పారిశ్రామిక వినియోగదారులకు, ఆ తర్వాత సిటీ గ్యాస్ సరఫరాదారులకు సహజ వాయువును సరఫరా చేయాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గ్యాస్ను మొదట ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎలీ్పజీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) తయారీకి అందజేయాలని తేలి్చచెప్పింది. పారిశ్రామిక వినియోగదారులకు 80%ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తిలో సహజ వాయువును ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఒక ఉపఉత్పత్తి ఎల్పీజీ. అలాగే సహజ వాయువును ప్రాసెస్ చేయడం ద్వారా ఎల్పీజీని తయారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ సహజ వాయువును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లో గత ఆరునెలల సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని అందులో 100 శాతం సరఫరా చేయాలి. ఈ మూడు రంగాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఎరువుల తయారీ, తేయాకు పరిశ్రమతోపాటు ఇతర పారిశ్రామిక వినియోగానికి గ్యాస్ అందజేయాలి.ఎరువుల తయారీ రంగానికి గత ఆరు నెలల సగటు డిమాండ్లో కనీసం 70 శాతం సరఫరా చేయాలి. ఇక తేయాకు పరిశ్రమ, ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగదారులకు గత ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం సహజ వాయువు అందజేయాలి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సిటీ గ్యాస్ సరఫరాదారులకు(సీజీడీ) ఆరు నెలల సగటు డిమాండ్లో 80 శాతం ఇవ్వొచ్చు. దేశీయంగా నిత్యం 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు అవసరం. దేశంలో రోజువారీ మొత్తం అవసరాల్లో సగం దేశీయ సహజ వాయువే తీరుస్తోంది. పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఈ గ్యాస్ను సరఫరా చేయకుండా నియంత్రణ విధించారు. మూసివేత దిశగా హోటళ్లువాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత హోటళ్లు, రెస్టారెంట్లపై పెను ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆహారశాలలు మూతపడుతున్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఔరంగాబాద్, నాగపూర్, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రానున్న రెండు రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు సాగర్ దర్యానీ మంగళవారం చెప్పారు. పశ్చి మాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయినట్లు తెలియజేశారు.ఎల్పీజీ ఉత్పత్తి 10% పెంపు దేశంలో ఎల్పీజీ సంక్షోభం లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. తమ ఆదేశాల మేరకు చమురు శుద్ధి కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచాయని వెల్లడించింది. రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. వంట గ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలెవరూ నమ్మొద్దని కోరింది. ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ప్రజలు ఇబ్బంది పడొద్దు⇒ చమురు, గ్యాస్ సరఫరా, ధరల విషయంలో సమన్వయంతో పనిచేయండి ⇒ కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశం న్యూఢిల్లీ: పశ్చి మాసియా సంక్షోభం, తద్వారా దేశంలో చమురు, వంట గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. పశ్చి మాసియా యుద్దం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరల విషయంలో మన దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హొర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మన వినియోగదారులపై పడకుండా చూడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అంతేకాకుండా చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ధరలు పెరుగుతున్న తీరుపైనా ప్రధానమంత్రి సమీక్షించారు. పశ్చి మాసియా నుంచి చమురు సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా, అమెరికా, వెనెజువెలా, ఆ్రస్టేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపాయి.
'వేడి'.. ప్రాణాలపై దాడి
మూడు అత్యధిక ఉష్ణ సంవత్సరాలుగా 2023, 2024, 2025 రికార్డు సృష్టించినట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుత లానినా వాతావరణ పరిస్థితులు చూస్తుంటే 2026 కూడా ఈ వరుసలో చేరేలా ఉంది. ప్రపంచ సగటుతో పోల్చితే ఆసియా ఖండంలో వేడి రెట్టింపవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ మన దేశంలో అధిక వేడి ముప్పు స్థితిగతులు ఎలా ఉన్నాయి? అధ్యయనాలేం చెప్తున్నాయి? ప్రభుత్వాలేం చేస్తున్నాయి? -సాక్షి, స్పెషల్ డెస్క్విపత్తు అంటే? భారతీయ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం పగటి ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్, కోస్తా తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీలు దాటితే వడగాడ్పు (హీట్వేవ్) పరిస్థితులు ఏర్పడినట్లు భావిస్తారు. ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే వడగాడ్పు రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే తీవ్ర వడగాడ్పుల రోజుగా ప్రకటిస్తారు. ఎవరికి ఎక్కువ ముప్పు? ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు, వస్తువులు అమ్ముకునే చిరువ్యాపారులు, రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ఎండ దెబ్బ ముప్పు మరీ ఎక్కువ. ఇతర వయసు్కల కంటే వృద్ధులు, పిల్లలకు ముప్పు ఎక్కువ. 20 డిగ్రీల సెల్సియస్కు మించి పెరిగే ఎండ వల్ల ప్రతి డిగ్రీకి 2–3 శాతం మేరకు పని సామర్థ్యం తగ్గిపోతోంది.57 శాతం జిల్లాలకు అధిక వేడి ముప్పు కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలోని సగానికి పైగా (57%) జిల్లాల్లో అధిక స్థాయి నుంచి అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 734 జిల్లాలకు గాను 151 జిల్లాలు అధిక వేడి ముప్పును, 266 జిల్లాలు అత్యధిక వేడి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ జిల్లాల్లోనే జీవిస్తున్నారు. గత 40 ఏళ్లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పగళ్ల కంటే రాత్రులే ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఏసీలు, కూలర్ల వాడుక ఎంత? మండే ఎండలను తట్టుకునేందుకు గదుల్లో కూలింగ్ సదుపాయం కల్పించుకోవటం ప్రజలకు నిత్యావసరంగా మారుతోంది. నేషనల్ శాంపిల్ సర్వే (2024) గణాంకాల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం కుటుంబాలు, నగరాలు/పట్టణాల్లో 42 శాతం కుటుంబాలు మాత్రమే ఎయిర్ కండిషనర్లు లేదా కూలర్లను ఉపయోగిస్తున్నాయి. రిఫ్రిజిరేటర్లను మాత్రం 33 శాతం గ్రామీణ కుటుంబాలు, 68 శాతం నగర/పట్టణ కుటుంబాలు వాడుతున్నాయి. ఏటా5.46 లక్షల మంది మృతి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యయనం ప్రకారం ఆరుబయట పనులు చేసే 160 కోట్ల మందికి అధిక వేడి ముప్పుఎక్కువగా ఉంది. కూలింగ్ సదుపాయాలు తక్కువగా ఉన్న భారత్ సహా 77 దేశాల్లోని 100 కోట్ల మందికి ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంది. ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 5,46,000 మంది చనిపోతున్నారని ‘సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్ ఆల్’సంస్థ నివేదిక చెబుతోంది. 2024లో మేల్కొన్న ప్రభుత్వంఅధిక వేడి ముప్పు గత మూడేళ్లలో ఉధృతం కావటంతో అధిక వేడిని తట్టుకునే ప్రత్యేక ప్రణాళికలతో పాలకులు సంసిద్ధతను పెంచుకోవటం తప్పనిసరైంది. అధిక వేడిని ఒక విపత్తుగా పరిగణిస్తూ 2024లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. వడగాడ్పుల బాధితుల కోసం విపత్తు సహాయక నిధులను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు దీంతో అవకాశం ఏర్పడింది. అనేక రాష్ట్రాలు నగర, జిల్లా, స్థానిక స్థాయిలో హీట్ యాక్షన్ ప్లాన్లను రూపొందించుకోవటం ప్రారంభించాయి. ఫలితంగా కొన్ని చోట్ల అధిక వేడిని తట్టుకునే ఉపాయాలను ప్రభుత్వ స్థాయిలో అమలు చేయడం మొదలైంది.
ఎన్ఆర్ఐ
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ)
క్రైమ్
సోషల్ మీడియాలో పరిచయం… లాడ్జికి పిలిచి..!
కర్ణాటక : శ్రీమంతులను గురి పెట్టి పరిచయం చేసుకొని తీయని మాటలతో వల వేసి దోచేస్తున్న కిలాడీ బాగోతమిది. బాగలకోట జిల్లా మహాలింగపురకు చెందిన దీప అవటగి (35)ని బెళగావి పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె స్నేహితుడు శివానంద మఠపతి పరారీలో ఉన్నాడు. శివానంద బెళగావి జిల్లా హుక్కేరివాసి, దీపకు శ్రీమంతుల వివరాలను అందించేవాడు. ఆమె ఫేస్బుక్, ఇన్స్టాలో అలాంటివారిని పరిచయం చేసుకొని బుట్టలో వేసుకొనేది. అశ్లీల చాటింగ్ చేసి, బెళగావిలో లాడ్జికి పిలిచేది. ఇలా ఓ బాధితుడు లాడ్జికి రాగానే స్నానాల గదిలోకి పంపించి, తాళం వేసుకొని బట్టలు, నగదు, మొబైల్, కారు తాళం తీసుకుని పరారైంది. పైగా డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేదని పోలీసుల విచారణలో బయట పడింది. కాల్ రికార్డింగులు, సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితురాలిని బెళగావిలోని తిళకవాడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
రూ.1000 ఇవ్వలేదని చంపేశాడు
హైదరాబాద్: తనకు నచ్చిన ఉద్యోగం ఇప్పించలేదనే అక్కసుతో కన్సల్టెన్సీ యజమానిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని విజయవాడ (ఏలూరు) ప్రాంతానికి చెందిన శశికిరణ్రెడ్డి (35) కొంత కాలంగా నగరంలోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శశికిరణ్ యూసుఫ్గూడలో బీజీఎస్ వారాహి సాయిరాం కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. గత నెలలో ప్రభు కుమార్ అనే 22 ఏళ్ల యువకుడు ఉద్యోగం కోసం వచ్చాడు. శశికిరణ్రెడ్డి కంపెనీ నిబంధనల ప్రకారం అతని వద్ద రూ.2,500 తీసుకుని బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఉద్యోగం ఇప్పించాడు. ఉద్యోగం నచ్చలేదని.. డబ్బులు తిరిగివ్వాలని.. కొన్ని రోజుల తర్వాత తనకు ఉద్యోగం నచ్చలేదని, డబ్బులను తిరిగి ఇవ్వాలని యువకుడు అడిగాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ఒకసారి ఇచి్చన నగదు తిరిగి ఇవ్వలేమని శశికిరణ్ తేల్చి చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన యువకుడు గది తలుపులు వేసి శశికిరణ్ను బెదిరించాడు. చేసేదేమీలేక శశికిరణ్ రూ.1,500 ఇచ్చాడు. మిగతా వెయ్యి రూపాయలు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. యువకుడు వెంట తెచ్చుకున్న కత్తితో శశికరణ్ మెడపై పొడిచాడు. గదిలో గొడవ జరుగుతోందని తెలుసుకున్న రిసెప్షనిస్ట్ లయ యజమాని గది తలుపు తెరిచింది. ఈ క్రమంలో యువకుడు పారిపోతూ లయపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమె పట్టుకునే ప్రయత్నం చేయగా.. పక్క బిల్డింగ్లోకి దూకి పారిపోయాడు. క్షతగాత్రుడిని పోలీసులు భుజాలపై ఎత్తుకుని.. విషయాన్ని సిబ్బంది మధురానగర్ పీఎస్కు సమాచారం అందించగా.. ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్తో కలిసి శశికిరణ్ను భుజాలపై ఎత్తుకుని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు గాయపడిన లయను కూడా ఆసుపత్రిలో చేర్చారు. శశికిరణ్రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. లయ చికిత్స పొందుతోంది. కాగా శశికిరణ్రెడ్డి భార్య నాగ భారతికి 20 రోజుల క్రితమే సీమంతం చేశారు. ఆ ఆనందంలో ఉండగానే.. భర్త హత్యకు గురి కావడంతో భోరున విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు దూసుకొచ్చింది.. ట్రాఫిక్ పోటెత్తింది
ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో..దాన్ని తప్పించబోయిన ఓ పోలీస్ వాహనం డివైడర్ను ఢీకొట్టడం..టైరు వీల్రాడ్ విరగడంతో మంగళవారం ఈఎస్ఐ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా..లిఫ్టింగ్ వాహనం తీసుకువచ్చి పోలీస్ వాహనాన్ని తొలగించారు. అప్పటికే మారి్నంగ్ పీక్ అవర్స్ కావడంతో రోడ్లపైకి వచి్చన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దాదాపు గంటసేపు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. –సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్
రెండో భార్య హత్యకు కుట్ర.. రియల్టర్ అరెస్టు
సాక్షి,హైదారబాద్: రెండో భార్యపై అనుమానం పెంచుకుని హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఓ రియల్టర్తోపాటు మరో ఇద్దరిని చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాటు తుపాకీ, మ్యాగజైన్, ఆరు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు మంగళవారం వివరాలు వెల్లడించారు. మల్కాజ్గిరి మారుతినగర్కు చెందిన దామర అరుణ్కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన రెండో భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను హతమార్చాలని కుట్ర పన్నాడు. చెన్నపురం చౌరస్తా వద్ద పాన్షాపు నిర్వహించే మహమ్మద్ అబ్బు ద్వారా యాకత్పురకు చెందిన విద్యార్థి మీర్ ముజమ్మిల్ అలీఖాన్ను పరిచయం చేసుకున్నాడు. తుపాకీ అందించడానికి అలిఖాన్ అంగీకరించడంతో అడ్వాన్స్గా రూ.20 వేలు ఇచ్చాడు. ఈ ఏడాది జనవరి మొదటివారంలో అలీఖాన్ తన బంధువు సలామత్ సల్మాన్తో కలిసి బీహార్ వెళ్లాడు. ముంగేర్కు చెందిన తాబిష్కు రూ.35 వేలు చెల్లించి ఒక నాటు తుపాకీ, పది బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లను కొనుగోలు చేసుకొని రాగా, వీటిని అరుణ్కుమార్ తీసుకొని మరో రూ.1.10 లక్షలు ఇచ్చాడు. ఈ తుపాకీని పరీక్షించడానికి అరుణ్ కుమార్ తన పొలంలో నాలుగు తూటాలు పేల్చి సంతృప్తి చెందాడు. భార్యను చంపే కుట్రలో అలీఖాన్, సల్మాన్లను భాగస్వాముల్ని చేసే నిమిత్తం సోమవారం అంబర్పేటలోని అలీకేఫ్ చౌరస్తా వద్ద వారితో సమావేశమయ్యాడు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు ఎం.మహేష్ కె.రామారావు, కె.స్వామి వలపన్ని ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. కేసును అంబర్పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సలామత్ సల్మాన్, తాబిష్ కోసం గాలిస్తున్నారు.
వీడియోలు
కోటం రెడ్డికి ఎదురు తిరిగినందుకు.. టీడీపీ నేత ఇల్లు కూల్చివేత..!
మా 11 మంది దమ్ము ఏంటో అర్థమైందా.. వెళ్తూ వెళ్తూ పవన్ కి ఇచ్చిపడేసిన జగన్
BR నాయుడు రాసలీలలుపై వైఎస్ జగన్ రియాక్షన్
ఎదో రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు.. ఆటలు, పాటలు, డాన్సులు.. రఘు రామ వేషాలు..
అన్నదాత సుఖీభవ 20 వేలు ఇస్తా.. లైవ్ లో చంద్రబాబు వీడియో చూపిస్తూ ఏకిపారేసిన వైఎస్ జగన్..
15 వేల మాట దేవుడెరుగు.. తల్లికి వందనం డబ్బులు ఎక్కడ అని అడిగితే..
చంద్రబాబు, పవన్ కలిసి లోకేష్ ను జాకీలు పెట్టి మరీ లేపుతారు.. కానీ ఏం లాభం..
YSRCP ఐదు ఏళ్లలో చేసిన అప్పులు చంద్రబాబు 2 ఏళ్లలో చేసేసాడు
టీడీపీ ఏడాదిలో చేసిన అప్పులు.. ఆధారాలతో బయట పెట్టిన వైఎస్ జగన్
యుద్ధం మరింత భీకరం.. టార్గెట్ అమెరికా

