Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Latest Oct 23rd Press Meet Highlights Full Speech1
వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌.. హైలైట్స్‌

సాక్షి, గుంటూరు: ఏపీలో నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తోందని, చేసిన తప్పును అవతలి వాళ్ల మీదకు నెట్టేయడం చంద్రబాబుకి, ఆయన తనయుడు నారా లోకేష్‌ అలవాటైన పనేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డాటా సెంటర్‌పై కూటమి ప్రభుత్వం.. దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాల్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే ఉద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేస్తోంది తెలియజేస్తూనే కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు.జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారుగ్రామ సచివాలయం, వలంటీర్‌లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారుపొలిటికల్‌ గవర్నరెన్స్‌ వల్లే రాష్ట్రం అతలాకుతలం అవుతోంది ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకని పరిస్థితిబీమా సంగతి పట్టించుకోవడం లేదువర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం రైతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేయలేదుసబ్సిడీ విత్తనాలు ల్లేవ్‌ఉల్లి రైతులను గాలికి వదిలేశారుఅరటి, టమాట, పత్తికి డిమాండ్‌ లేదుక్వింటాల్‌ పత్తికి ఒకప్పుడు రూ.12 వేలు ఉండేది.. ఇప్పుడు రూ.5 వేలు కూడా లేదుటమాట రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారుపరిస్థితులు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారురాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలోనే కనిపిస్తున్నాయిస్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్‌ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయిందివిద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదువైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయిప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కలేదుకనీసం రూ.5 కోట్ల టర్న్‌ ఓవర్‌ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారుమా హయాంలో మెడికల్‌ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారుమెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోందిదానిని గవర్నర్‌కు సమర్పించి.. రాష్ట్ర ప్రజల రెఫరండంను తెలియజేస్తాంఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారుజీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదుఐఆర్‌ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదుఉద్యోగులకు జీపీఎస్‌ లేదు.. ఓపీఎస్‌ లేదుఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారుఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారుటీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారుఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారుమొత్తంరూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారుప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు.. ఒక్క నెల ఇచ్చారంతేకనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదుకాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారుపోలీసులకు ఇచ్చే సరెండర్‌ లీవ్స్‌ పెండింగ్‌లో పెట్టారుఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదుఅధికారంలోకి వచ్చిన వారంలోనే ఐఆర్‌ ఇచ్చాంకోవిడ్‌ సమయంలోనూ వాళ్ల సంక్షేమం గురించే ఆలోచించాంమేం తెచ్చిన జీపీఎస్‌ను కేంద్రం, రాష్ట్రాలు ప్రశంసించాయిఆనాడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో ఉద్యోగులనూ చంద్రబాబు మోసం చేశారునాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారుఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదుఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారుఅది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్‌లో ఇస్తామని అంటున్నారు)డీఏ బకాయిలు కూడా రిటైర్‌ అయ్యాక ఇస్తామని ప్రకటించారుదీనికే దీపావళి సంబురాలు అంంటూ ప్రకటనలు చేస్తున్నారుకోవిడ్‌ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదుఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం తనను చూసే గూగుల్‌ వైజాగ్‌కి వచ్చినట్లు చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారుహైదరాబాద్‌ సైబర్‌ టవర్స్‌ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారుదాని పేరే హైటెక్‌ సిటీహైటెక్‌ సిటీకి ఆరు ఎకరాల్లో పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్‌కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరుఅసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్‌తో సంబంధమే లేదుఅయినా అభివృద్ధి తనదేనంటూ బిల్డప్‌ ఇస్తుంటారువాస్తవం ఏంటంటే.. 2003-04 వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచే హైదరాబాద్‌లో నిజమైన అభివృద్ధి మొదలైందిఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయిఆ తర్వాత వైఎస్సార్‌ లేకపోయినా.. ఆ అభివృద్ధి అలా కొనసాగిందికేసీఆర్‌ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్‌మెంట్‌ జరిగిందిక్రెడిట్‌ ఇవ్వకపోవడం చంద్రబాబుకి ఉన్న దుర్మార్గపు నైజంహైదరాబాద్‌ అభివృద్ధికి అసలు చంద్రబాబుకే సంబంధం లేదు డాటా సెంటర్‌ వల్ల ఉద్యోగవకాశాలు తక్కువే, కానీ, భవిష్యత్తులో ఎకో సిస్టమ్‌ బిల్డ్‌ అవుతుందిభవిష్యత్తులో పెద్ద మార్పులకు డాటా సెంటర్‌ కీలకందీనికి వైఎస్సార్‌సీపీ హయాంలోనూ నాంది అప్పుడే పడిందిఅందుకే తక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా నాడు అదానీతో ఒప్పందం చేసుకున్నాంఅదే సమయంలో.. ఐటీ పార్క్‌ రీక్రియేషన్‌, స్కిల్‌ సెంటర్‌ పెట్టి 25 వేల ఉద్యోగాలు కావాలని కోరాం ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్‌ డాటా సెంటర్‌ వైజాగ్‌కి రాబోతోందిముమ్మాటికీ వైఎస్సార్‌సీపీ వేసిన విత్తనమే ఇదివేరేవాళ్లకి క్రెడిట్‌ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారుఅదానీ గూగుల్‌ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్‌అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్‌ డాటా సెంటర్‌అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారువైజాగ్‌లో అదానీ ఇన్‌ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్‌ డాటా సెంటర్‌ని నిర్మిస్తున్నాయిఅదానీ కట్టాక గూగుల్‌ దీనిని వాడుకుంటుందిఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు గూగుల్‌ ప్రతినిధి లేఖ కూడా రాశారుచంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదుజగన్‌ సర్కార్‌కు ఆ క్రెడిట్‌ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదువైఎస్సార్‌సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు 2020లో.. కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్‌ ఒప్పందానికి బీజం వేశాం2021 మార్చిలో సింగపూర్‌ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ రాశాం2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు వైజాగ్‌లో శంకుస్థాపన కూడా చేశాంఆనాడే.. సింగపూర్‌ నుంచి సబ్‌సీ కేబుల్‌ తీసుకొచ్చే అంకురార్పణ జరిగిందిదీనికి కొనసాగింపుగానే గూగుల్‌ డాటా సెంటర్‌ వచ్చిందివైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇదివైఎస్సార్‌సీపీ వేసిన బీజానికి కొనసాగింపే వైజాగ్‌ గూగుట్‌ డాటా సెంటర్‌ గూగుల్‌ డాటా సెంటర్‌ గురించి మాట్లాడుకుందాం..వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాంరాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయిందిఏదో యాడ్‌ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందిక్రెడిట్‌ చోరీలో చంద్రబాబు పీక్‌.. రాష్ట్రపరిస్థితి వీక్‌వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్‌ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు లేని ఎవిడెన్స్‌ క్రియేట్‌ చేయడం దారుణంలిక్కర్‌ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగిందిఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేశారుకోర్టుకు వెళ్లడంతో సైలెంట్‌ అయిపోయారుచంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్‌ అసలు జనార్దన్‌రావు ఎవరు?జనార్దన్‌తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్‌ క్లారిటీ ఇచ్చారుఏదో ఫంక్షన్‌లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారుతన రెండు ఫోన్‌లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్‌ సవాల్‌ చేశారుతప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్‌ కోర్టును ఆశ్రయించారుఈలోపే డైవర్షన్‌ పాలిటిక్స్‌తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించిందిలాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్‌ షాపులు రద్దు చేశాంషాపుల సంఖ్య తగ్గించాంటైమింగ్‌ పెట్టి నడిపించాంఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు లేవుక్యూ ఆర్‌ కోడ్‌ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్‌ చేసి అమ్మేవాళ్లుకాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాంఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు ఇదసలు హైలైట్‌ కావాల్సిన అంశంలిక్కర్‌ షాపుల నుంచి ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌ల దాకా అంతా చంద్రబాబు మనుషులే దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?ఎవరి క్యూఆర్‌కోడ్‌.. ఎవరి స్కాన్‌? ఎవరు చేసేది?మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్‌ కోడ్‌ ఎందుకు?క్యూఆర్‌ కోడ్‌ అంటూ మరో డైవర్షన్‌ ఇది ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్‌ దందా నడుస్తోందిరేపల్లే పేకాట కింగ్‌.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారునకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులేతమకు సంబంధించిన లిక్కర్‌ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులేబెల్ట్‌ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులేసీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయిఅందుకే బాబు సిట్‌ ముద్దు అంటున్నారు జనార్దన్‌రావు వీడియోలో ఎలా మాట్లాడారు?.. ఫోన్‌ పోయిందని జనార్దనే చెప్పాడు. మరి ఫోన్‌ పోతే చాటింగ్‌ ఎలా బయటకు వచ్చింది?. అసలు లుకౌట్‌ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?ఈ 20 రోజుల్లో జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?.. పాస్‌పోర్టును ఎందుకు సీజ్‌ చేయలేదు?.. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పుడు.. పెద్దిరెడ్డి సోదరుడిపై జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎందుకు పోటీకి నిలబెట్టారు? టీడీపీ టికెట్‌ ఎలా ఇచ్చారు?తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని అఫిడవిట్‌లోనే జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.. మరి అప్పుడు ఆఫ్రికా లింకులు చంద్రబాబుకి, ఆయన టిష్యూ పేపర్‌లకు కనిపించలేదా?పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది?నకిలీ మద్యం బయటపడ్డాక ఎన్ని తనిఖీలు నిర్వహించారు? ఎన్ని బాటిళ్లను పట్టుకున్నారు?అన్ని చోట్ల దొరుకుతుందనే తనిఖీలు చేయలేదా?చంద్రబాబుకు ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనార్దన్‌ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?నిందితులకు మా పార్టీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారుఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌చేయడం చంద్రబాబు, లోకేష్‌లకు అలవాటేఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్‌ మీడియా బిల్డప్పులుమాజీ మంత్రి జోగి రమేష్‌ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారుఏబీఎన్‌, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్‌ చాటింగ్‌లంటూ హడావిడి చేశారుచేసేది వీళ్లే.. కథా స్క్రీన్‌ప్లే అంతా వాళ్లదే ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!ఒక మొలకల చెరువులోనే 20 వేల లీటర్ల నకిలీ మద్యం బయటపడిందికల్తీ లిక్కర్‌ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లేచేసింది.. చేయిస్తోంది చంద్రబాబేటాపిక్‌ డైవర్ట్‌ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారుప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది విజయవాడ సీపీ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారుఅక్రమ మద్యం కేసులో మా పార్టీ వాళ్లను అనవసరంగా వేధిస్తున్నారుఅన్నమయ్య జిల్లా తంబళపళ్లె, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా పరవాడ, పాలకొల్లు, నెల్లూరులోనూ నకిలీ మద్యం బయటపడిందిపట్టుబడకుంటే వేల లీటర్ల మద్యం తయారయ్యేదే రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయిప్రైవేట్‌ మద్యం మాఫియా నడుస్తోందిపోలీసుల భద్రత నడుమ గ్రామాల్లో అమ్మకాలుఆక్షన్లు వేసి మరీ బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నారుబెల్ట్‌ షాపులే కాకుండా ఇల్లీగల్‌ పర్మిట్‌రూమ్‌లు నిర్వహిస్తున్నారుడబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు‍ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లకు గండి కొడుతున్నారువాటాల్లో తేడాలు రావడంతోనే ఇదంతా బయటపడింది ఏపీలో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతమైందిఇలాంటి మాఫియా ప్రపంచంలో ఎక్కడా చూడలేదునకిలీ మద్యం కోసం చిన్నపాటి పరిశ్రమల్నే ఏర్పాటు చేశారునకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది వాళ్లే.. బెల్ట్‌షాపులు పెట్టి నడిపిస్తోంది వాళ్లే ఇవాళ నాలుగు అంశాల మీద మాట్లాడుకుందాంనకిలీ మద్యం కేసులో నాణేనికి రెండో వైపు గురించి.. విశాఖలో డేటా సెంటర్‌ గురించి చంద్రబాబు చేస్తున్న గిమ్మికులు, డ్రామాల గురించి, అసలు వాస్తవాలేంటివి అనేది..ఉద్యోగులకు ఏరకంగా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు?.. ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నారనేదానిని మీడియా మీద ప్రజల దృష్టికి తీసకెళ్తా.. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, ఈ ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా..

YS Jagan Reacts On Chiranjeevi Balayya Assembly Episode2
చిరు-బాలయ్య ఎపిసోడ్‌పై స్పందించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి మీద కాస్త దురుసు వ్యాఖ్య చేశారు. ఇది అటు అభిమానుల మధ్యే కాదు.. ఇటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు.అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్‌ కల్యాణ్‌ మౌనంపై ఓ రిపోర్టర్‌ వైఎస్‌ జగన్‌ను స్పందన కోరారు. ‘‘అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి?. పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుతించారు?. అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్‌కు బుద్ది లేదు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోంది. అలా మాట్లాడినందుకు సైకలాజికల్‌ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి’’ అని జగన్‌ అన్నారు. ఇదిలా ఉంటే..శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఆనాడే ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదని, ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Women's CWC 2025: Team India Scored Huge Total In Must Win Game Against New Zealand3
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) భారీ స్కోర్‌ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్‌ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్‌ (55 బంతుల్లో 76 నాటౌట్‌; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్‌ ఆడింది. ఫలితంగా వర్షం​ కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్‌ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 10, రిచా ఘోష్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో రోస్‌మేరీ మైర్‌, అమేలియా కెర్‌, సూజీ బేట్స్‌కు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాలంటే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్‌ బెర్త్‌ కోసం భారత్‌, న్యూజిలాండ్‌ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: గర్జించిన బంగ్లాదేశ్‌ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు

This Week Friday Ott Releases Movies  List Goes Viral4
ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!

దీపావళి సెలవులు ముగిసిపోయాయి. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం థియేటర్లలో దీపావళికి టాలీవుడ్ చిత్రాలు చేశాయి. ఇక ఈ వారంలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తనయుడు హీరోగా వస్తోన్న బైసన్ రిలీజవుతోంది. ఇది తప్ప పెద్దగా బజ్ ఉన్న సినిమాలేవీ రావడం లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే ఇప్పటికే హిట్‌ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు ఆడియన్స్. ఈ శుక్రవారం జాన్వీ కపూర్ పరమ్ సుందరి, విజయ్ ఆంటోనీ భద్రకాళి, కురుక్షేత్ర లాంటి యానిమేషన్ సినిమాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. ఓటీటీ ప్రియులు ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్‌కురుక్షేత్ర - 2 (యానిమేటెడ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 24ఎ హౌజ్‌ ఆఫ్‌ డైనమైట్‌ - అక్టోబర్‌ 24పరిష్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 24ది డ్రీమ్‌ లైఫ్‌ ఆఫ్‌ మిస్టర్‌ కిమ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25అమెజాన్‌ ప్రైమ్‌..ఈడెన్‌ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్‌ 24పరమ్‌ సుందరి(బాలీవుడ్ సినిమా) - అక్టోబర్‌ 24అడ్వెంచర్ టైమ్- ఫియాన్ అండ్ కేక్-సీజన్2 (యానిమేషన్)- అక్టోబర్‌ 24బోన్ లేక్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24(రెంట్‌ పద్దతిలో)జియో హాట్‌స్టార్‌..భద్రకాళి(తమిళ సినిమా) - అక్టోబర్‌ 24ది కర్దాసియన్స్ (సీజన్-7)- అక్టోబర్ 24మహాభారత్‌: ఏక్‌ ధర్మయుధ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25ఆహా..అక్యూజ్‌డ్(తమిళ సినిమా)- అక్టోబర్ 24లయన్స్ గేట్ ప్లే..ది అప్రెంటిస్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24నడికర్(మలయాళ సినిమా)- అక్టోబర్ 24ఫ్రీ లాన్స్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24యాపిల్ టీవీ ప్లస్..స్టిల్లర్‌ అంజ్ మియారా నథింగ్ ఈజ్ లాస్(హాలీవుడ్)- ‍అక్టోబర్ 24సన్‌ నెక్ట్స్‌..టేల్స్ ఆఫ్ ట్రేడిషన్(తమిళ సినిమా)- అక్టోబర్ 24జంబూ సర్కస్(కన్నడ సినిమా)- అక్టోబర్ 24హెచ్‌బీవో మ్యాక్స్..వెపన్స్-(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24

Sovereign Gold Bonds Deliver 325pc Return as RBI Announces Final Redemption Price5
నక్క తోక తొక్కిన ‘గోల్డ్‌ బాండ్లు’.. రూ.100కు రూ.325

ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 325 శాతం రాబడిని వస్తోందన్నమాట.వాస్తవానికి అక్టోబర్ 2017లో గ్రాముకు రూ.2,987 వద్ద జారీ చేసిన బాండ్లు ఇ‍ప్పుడు రూ. 9,717 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 17, 20, 22 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్‌ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్‌ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.ఎస్‌జీబీలకు (Sovereign Gold Bonds ) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్‌ గోల్డ​్‌ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌లు అందుబాటులో లేనప్పటికీ డిజిటల్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికీ ఇప్పటికీ ఇతర మార్గాలు ఉ‍న్నాయి. అవే గోల్డ్‌ ఈటీఎఫ్‌లు (Gold Exchange Traded Funds - Gold ETFs). వీటిని మ్యూచువల్ ఫండ్ సంస్థలు జారీ చేస్తాయి. వీటిలో పెట్టిన పెట్టుబడులు స్టాక్‌ ఎక్స్చేంజ్‌లలో షేర్లలా ట్రేడ్ అవుతాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ధర బంగారం మార్కెట్ ధరకు నేరుగా అనుసంధానమై ఉంటుంది. బంగారం ధర పెరిగితే, ఈటీఎఫ్‌ యూనిట్‌ విలువ కూడా పెరుగుతుంది.

Marriage Certificate at Wedding Venue Kerala K-Smart Sets Benchmark in Digital Services6
కేరళలో పెళ్లి వైరల్‌ : ఎన్‌ఆర్‌ఐలకు పండగే!

కేరళలోని కవస్సేరిలో జరిగిన ఒకముచ్చటైన పెళ్లి నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీపావళి నాడు పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు లావణ్య , విష్ణు వివాహం సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అయితే అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఆ విశేషమేమిటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మ్యారేజ్‌ హాలులోనే పంచాయితీ అధికారి ద్వారా వివాహ ధృవీకరణ పత్రాన్ని అందుకోవడమే ఈ స్టోరీలోని ప్రత్యేకత. అదీ డిజిటల్ విధానం ద్వారా. పెళ్లి అయిన మరుక్షణమే ఈ నూతన జంట మ్యారేజ్‌ రిజిష్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ అందుకుంది. కేరళలో వివాహ రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'K-SMART' అనే డిజిటల్ వేదిక ద్వారా ఇది సాధ్యమైంది. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్‌కు ఇదొక మైలు రాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు. వివాహం జరిగిన వెంటనే, ఈ జంట K-స్మార్ట్ వీడియో KYC వ్యవస్థ ద్వారా వారి వివాహ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు. అంతేకాదు దీపావళి సెలవు రోజు అయినప్పటికీ కవస్సేరి పంచాయతీ అధికారులు దరఖాస్తును రియల్ టైమ్‌లో ప్రాసెస్ చేసి ఆమోదించడం, సర్టిఫికెట్‌ను నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా జంటకు అందించడం విశేషం. పంచాయతీ సభ్యుడు టి వేలాయుధన్ నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. కవస్సేరి పంచాయతీ సిబ్బంది వారి అంకితభావానికి విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.Kerala sets an example !! In Kawassery, Kerala, Lavanya and Vishnu got married and registered their marriage instantly through Video KYC.The Panchayat member even handed over a digitally verified certificate with their photo on the same day.Respected Panchayati Raj Minister… pic.twitter.com/HGAnoU5cu0— Sreekanth B+ve (@sreekanth324) October 23, 2025దీంతో చాలా మంది కాబోయే జంటల్లో ఇది ఎంతో సంతోషాన్ని నింపింది. ఎందుకంటే పెళ్లి తరువాత, వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకునేందుకు, ఫోటోలు, సర్టిఫికెట్లు పట్టుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగి కష్టాలేమీ లేకుండానే, ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ కావడం, క్షణాల్లో సర్టిఫికెట్‌ రావడం సంతోషమే కదా. కేరళ ఒక ట్రెండ్‌ సెట్‌ చేసిందంటూ కొనియాడుతున్నారు ‍ప్రజలు'K-SMART' అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, వీడియో KYC ద్వారా వివాహ నమోదును పూర్తి చేయవచ్చు . తక్షణమే డిజిటల్లీ సైన్డ్‌ సర్టిఫికెట్ పొందవచ్చు. వీడియో KYCలో జంటలు, సాక్షులు ఆధార్ ఆధారిత OTP లేదా ఇమెయిల్ ద్వారా తమ గుర్తింపును వీడియో ద్వారా ధృవీకరించుకోవచ్చు. ఇది పూర్తయిన తరువాత డిజిటల్ సంతకం చేసిన వివాహ ధృవీకరణ పత్రాలు జారీ అవుతాయి. వీటిని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ విధానం ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు (NRIs) ఎంతో సౌకర్యవంతంగా ఉంది, ఎందుకంటే వారు భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం లేదు. కె-స్మార్ట్ ప్రారంభించినప్పటి నుండి, కేరళ 1.5 లక్షలకు పైగా వివాహ రిజిస్ట్రేషన్లు నమెదయ్యాయి. దాదాపు 63 వేలు వీడియో KYC ద్వారా పూర్తయ్యాయి.

Kolikapudi Srinivasa Rao Sensational Comments On Tdp Mp Kesineni Chinni7
‘ఎమ్మెల్యే టికెట్‌ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారు’

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఎమ్మెల్యే టికెట్‌ కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు. కేశినేని చిన్నికి సంబంధించిన ఆధారాలను కొలికపూడి బయటపెట్టారు. రూ.5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్‌ ఇచ్చారన్న కొలికపూడి.. సంచలన ఆధారాలను బయటపెట్టారు.2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను ఐదు కోట్లు అడిగాన్న కొలికపూడి.. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్‌ఫర్ చేశారో ఆయన బయటపెట్టారు. ‘‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశా. 2024 ఫ్రిబవరి 8న మరో రూ. 20 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశా. 2024 ఫిబ్రవరి 14న రూ. 20 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశా. కేశినేని చిన్ని పీఏ మోహన్‌కు రూ. 50 లక్షలు.. గొల్లపూడిలో నా మిత్రుల ద్వారా రూ.3.5 కోట్లు ఇచ్చా.. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం’’ అంటూ కొలికపూడి సంచలన పోస్టు పెట్టారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.మరోవైపు.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్‌ ఇచ్చారు. ‘‘తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకూ రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లాయి’’ అని చిన్ని వ్యాఖ్యానించారు.

woman with Parkinsons disease plays clarinet during brain surgery 8
ఆపరేషన్‌ మధ్యలో క్లారినెట్‌ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు

ఇటీవల బ్రెయిన్‌కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్‌ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒ​క మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్‌ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.లండన్‌లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్‌లో క్రౌబేర్‌కు చెందిన 65 ఏళ్ల డెనిస్‌ బెకన్‌(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్‌తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్‌ స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ థెరపిస్ట్‌ అయినా ఆమె పార్కిన్సన్స్‌ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ ఆపరేషన్‌ చేయించుకోవాలనుకున్నారు. ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్‌ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్‌స్టెడ్ కచేరీ బ్యాండ్‌ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్‌కి ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంది బేకన్‌. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్‌. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు. అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్‌ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్‌ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్‌ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్‌ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్‌ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. Patient with Parkinson's disease plays clarinet during brain procedure at London hospital pic.twitter.com/en2vpRRfaA— The Associated Press (@AP) October 23, 2025 (చదవండి: కూతురి డ్రీమ్‌, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..)

YS Jagan Serious Comments On CBN Govt Over Liquor Mafia9
ఇలా క్రైమ్‌ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో వ్యవస్థీకృత పద్దతిలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోందన్నారు. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని తెలిపారు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోంది. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. ఆక్షన్లు వేసి మరీ బెల్లు షాపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఇది బయటకు వచ్చింది. ములకలచెరువులోనే 20208 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయి. 1050 లీటర్ల ‍స్పిరిట్‌ అక్కడ దొరికింది. వీటితో వేల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేయవచ్చు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారు.ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అనకాపల్లి జిల్లా పరవాడలోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీకి బయటకు వచ్చింది. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లే, నెల్లూరులోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ప్రైవేటు మాఫియా ఆధ్వర్యంలోని మద్యం షాపులకు బెల్టుషాపులు, ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లకు సరఫరా చేస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!. కల్తీ లిక్కర్‌ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లే.. చేసింది.. చేయిస్తోంది చంద్రబాబే. టాపిక్‌ డైవర్ట్‌ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారు. ఎల్లో మీడియా బిల్డప్పులు..ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది. జనార్దన్‌ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?. నిందితులకు మా పార్టీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌ చేయడం చంద్రబాబు, లోకేష్‌లకు అలవాటే. ఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్‌ మీడియా బిల్డప్పులు. మాజీ మంత్రి జోగి రమేష్‌ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారు. ఏబీఎన్‌, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్‌ చాటింగ్‌లంటూ హడావిడి చేశారు. చేసేది వీళ్లే.. కథా స్క్రీన్‌ప్లే అంతా వాళ్లదే. ఇలా క్రైమ్‌ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు అన్నీ మోసాలే. తప్పులు చేయడం.. వేరే వారిపై నెపం నెట్టేయడం బాబుకే సాధ్యం. బాబు నేరాలను కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. టాపిక్‌ డైవర్షన్‌లో భాగంగా ఎదుటివారిపై బురద చల్లుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తారు. నకిలీ మద్యం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి నిందితుడు. విదేశాల్లో ఉన్న జనార్థన్‌ రావు రెండు రోజుల్లో లొంగిపోతాడంటూ ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ సెంటర్‌ను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తారు. క్యూ ఆర్‌ కోడ్‌ తెచ్చిందే మా ప్రభుత్వం..అసలు జనార్దన్‌రావు ఎవరు?. జనార్దన్‌తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్‌ క్లారిటీ ఇచ్చారు. ఏదో ఫంక్షన్‌లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారు. తన రెండు ఫోన్‌లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్‌ సవాల్‌ చేశారు. తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్‌ కోర్టును ఆశ్రయించారు. ఈలోపే డైవర్షన్‌ పాలిటిక్స్‌తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించింది. లాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్‌ షాపులు రద్దు చేశాం. షాపుల సంఖ్య తగ్గించాం. టైమింగ్‌ పెట్టి నడిపించాం. ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు లేవు. క్యూ ఆర్‌ కోడ్‌ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్‌ చేసి అమ్మేవాళ్లు. కాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారురేపల్లే పేకాట కింగ్‌..క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు. ఇదసలు హైలైట్‌ కావాల్సిన అంశం. లిక్కర్‌ షాపుల నుంచి ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌ల దాకా అంతా చంద్రబాబు మనుషులే. దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?. ఎవరి క్యూఆర్‌కోడ్‌.. ఎవరి స్కాన్‌? ఎవరు చేసేది?. మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్‌ కోడ్‌ ఎందుకు?. క్యూఆర్‌ కోడ్‌ అంటూ మరో డైవర్షన్‌ ఇది. ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్‌ దందా నడుస్తోంది. రేపల్లే పేకాట కింగ్‌.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే తమకు సంబంధించిన లిక్కర్‌ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే. బెల్ట్‌ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులే. సీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయి. అందుకే బాబు సిట్‌ ముద్దు అంటున్నారు. లేని ఎవిడెన్స్‌ క్రియేట్‌ చేయడం దారుణం. లిక్కర్‌ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగింది. ఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్‌’ అని విమర్శించారు.

allegations against Chhattisgarh IPS Ratanlal Dangi10
సంచలనం.. డీజీపీ వద్ద ‘లైంగిక వేధింపుల పంచాయితీ’లో ఐపీఎస్ vs ఎస్సై భార్య

రాయ్‌పూర్‌: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులపై లైంగిక ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల పంజాబ్‌ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవటంతోపాటు కుమారుడు మరణానికి కారణం అయ్యాడన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా,ఛత్తీస్‌గఢ్‌లో ఐజీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి రతన్‌లాల్ డాంగీపై ఓ ఎస్‌ఐ భార్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది2003 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఐజీ హోదాలో ఉన్న రతన్‌లాల్ డాంగీపై ఓ ఎస్‌ఐ భార్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఐపీఎస్‌ అధికారి రతన్‌లాల్‌ డాంగీపై బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేశారు.డీజీపీకి చేసిన ఫిర్యాదులో బాధితురాలు రతన్‌లాల్‌ డాంగీ తనపై గత ఏడు సంవత్సరాలుగా మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందుకు ఊతం ఇచ్చేలా తనవద్ద కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పారు.వాటి ఆధారంగా ఈ కేసు విచారణ పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.ఈ క్రమంలో బాధితురాలు తనపై డీజీపీకి ఫిర్యాదు చేయడంపై రతన్‌ లాల్‌ డాంగీ అప్రమత్తయ్యారు. తిరిగి బాధితురాలిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో డాంగీ బాధితురాలిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. డాంగీ తనను తాను మహిళా బాధితుడినంటూ డీజీపీ వద్ద మొరపెట్టుకున్నారు. బాధితురాలు తనను బలవంతంగా వీడియో కాల్స్‌లో అసభ్యంగా ప్రవర్తించమని ఒత్తిడి తెచ్చిందన్నారు. ఇంకా చెప్పుకోలేని విధంగా మహిళ తనని ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే, డాంగీ చేసిన ఆరోపణలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ సీనియర్‌ ఐపీఎస్ అధికారి.. ఎస్సై భార్యను వేధిస్తుంటే ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడే.. ఐపీఎస్‌ రతన్‌లాల్‌ డాంగీ డీజీపీతో ఎందుకు భేటీ అయ్యారు?. ఉన్నతస్థాయిలో ఉన్న ఐపీఎస్‌ అధికారిని ఎస్‌ఐ భార్య ఎలా వేధిస్తారు?. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు?ఇది ఐపీఎస్ అధికారిపై ఆరోపణల కేసు కావడంతో, పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులపై ఒత్తిడి ఉందా? విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందా?. ఈ కేసు విచారణను పారదర్శకంగా, న్యాయంగా జరిపి బాధితుడెవరో, నిందితుడెవరో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఛత్తీస్‌గఢ్ డీజీపీపై ఉంది. ఒకవేళ ఈ కేసును పోలీస్‌శాఖ మసిపూసిమారేడుగాయగా చేస్తే పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందనే అభిపప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు విచారణలో నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం ఎవరికి దక్కుతుందో? బాధితులు ఎవరో? కాలమే నిర్ణయించాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement