జోరు కొనసాగించాలని...
ముల్లాన్పూర్: సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఐదు మ్యాచ్ల సిరీస్లో శుభారంభం చేసిన భారత క్రికెట్ జట్టు... గురువారం దక్షిణాఫ్రికాతో రెండో టి20 ఆడనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా మరో తొమ్మిది మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. ఇందులోనే జట్టు బలాబలాలు, కూర్పును సరిచూసుకోవాలని భావిస్తున్న టీమ్ మేనేజ్మెంట్ కటక్లో ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్ బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్లో బంతి కాస్త ఆగి వస్తున్న పిచ్పై మన టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ధనాధన్ ఆటతో మంచి స్కోరు చేసిన టీమిండియా... కట్టుదిట్టమైన బౌలింగ్తో మెరిపించింది. దక్షిణాఫ్రికా టి20 చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుందంటే... అందులో మన బౌలర్ల ప్రతిభ ఎంతో ఉంది.ఇప్పుడు అదే జోరు సాగిస్తూ రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్లో మరింత ఆధిక్యం సాధించాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ భావిస్తుండగా... తొలి మ్యాచ్లో తేలిపోయిన దక్షిణాఫ్రికా ఈ పోరులో సత్తా చాటి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. టాపార్డర్ రాణించేనా! పిచ్, ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూకుడే పరమావధిగా దూసుకెళ్తున్న భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై అందరి దృష్టి నిలవనుంది. ముల్లాన్పూర్లో మంచి అనుభవం ఉన్న ఈ పంజాబ్ చిన్నోడు సొంతగడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో సిక్స్ల వర్షం కురిపించిన అభిõÙక్... అదే పరాక్రమం కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక భారత వన్డే, టెస్టు రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గత మ్యాచ్లో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండగా... మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కీలకం కానున్నారు. పరిస్థితులను బట్టి గేర్లు మార్చే సత్తా వీరిలో పుష్కలం. ఇక గాయం నుంచి కోలుకొని గత మ్యాచ్ ద్వారా పునరాగమనం చేసిన పాండ్యా... తన విలువ ఏంటో చాటుకున్నాడు. అటు బంతితో ఇటు బ్యాట్తో విజృంభించిన హార్దిక్ నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి ప్రదర్శన ఆశిస్తోంది. శివమ్ దూబే, జితేశ్ శర్మ ఫినిషర్ల బాధ్యత నిర్తర్తించనున్నారు. గత మ్యాచ్ ద్వారానే మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డు సృష్టించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో కీలకం కానున్నారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. మార్పుల్లేకుండా సఫారీ జట్టు... స్టార్లతో నిండి ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కటక్ పిచ్పై ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకొని రెండో మ్యాచ్లో పూర్తిస్థాయిలో దుమ్మురేపాలని సఫారీలు భావిస్తున్నారు. డికాక్, మార్క్రమ్, స్టబ్స్, బ్రేవిస్, మిల్లర్, యాన్సెన్ రూపంలో ఆ జట్టులో ప్రతిభకు కొదవ లేకపోవడంతో తొలి మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. తొలి స్పెల్లో అర్ష్ దీప్ కట్టిపడేయడంతో వెనుకంజలో పడ్డ సఫారీలు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. దీంతో అతడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ‘ప్రొటీస్’ కసరత్తులు ప్రారంభించారు. ఇక మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు పరుగుల వేగాన్ని నియంత్రిస్తుండటంతో... దానికి విరుగుడు కనిపెట్టాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఓపెనర్లు, మార్క్రమ్, డికాక్లో ఒకరు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే... మిగిలిన వాళ్లు ధనాధన్ షాట్లతో స్కోరు వేగం పెంచగల సమర్థులే. బౌలింగ్లో ఎంగిడి, నోర్జే, యాన్సెన్ మరోసారి కీలకం కానున్నారు. తొలి మ్యాచ్లో ఎంగిడి భారత టాపార్డర్ పని పట్టాడు. ఊరించే బంతులతో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి అతడిని జాగ్రత్తగా ఎదుర్కోక తప్పదు. యాన్సెన్ వికెట్లు తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇచ్చాడు. ఎటొచ్చి సఫారీ స్పిన్నర్లనే మనవాళ్లు మరోసారి టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ పురుషుల మ్యాచ్. గతంలో ఐపీఎల్ మ్యాచ్లతో పాటు... రెండు మహిళల మ్యాచ్లకు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. పిచ్ అటు బ్యాటర్లతో పాటు ఇటు పేసర్లకు సహకరించనుంది. మంచు ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చు.
ఫిబ్రవరిలో మహాధర్నా
సిరిసిల్ల: ఆటో కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఫిబ్రవరిలో హైదరాబాద్లో వారితో కలిసి మహాధర్నా చేస్తామని చెప్పారు. ఆటోడ్రైవర్లకు నెలకు రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 5వేల మంది ఆటోడ్రైవర్లకు ఆత్మీయ భరోసా పేరిట రూ.5 లక్షల సొంత డబ్బులతో చేయించిన ప్రమాద బీమాకు సంబంధించిన కార్డులను బుధవారం ఆయన పంపిణీ చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు కేసీఆర్ అండ ‘ఆటో అన్నలతో బీఆర్ఎస్కు ఉన్న అనుబంధం కొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో, పార్టీ అధినేత కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేసినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో, ఆటో డ్రైవర్లు కూడా ముందుండి పోరాడారు. ‘తెలంగాణ కావాలే’అని ర్యాలీలు తీసి కేసీఆర్కు మద్దతుగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికులపై కేసీఆర్ తన ప్రేమను చాటుకున్నారు. రాష్ట్రంలోని సుమారు 6.5 లక్షల నుంచి 7 లక్షల మంది ఆటో కార్మికులు అడగకుండానే, పార్టీ మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగమాటలు చెప్పకుండానే రూ.5 లక్షల ప్రమాద బీమాను కల్పించారు. రైతుబీమాను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చింది కేసీఆర్ ఒక్కరే. డ్రైవర్లకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన కార్మిక పక్షపాతి కేసీఆర్. ఆటో డ్రైవర్లతోపాటు అసంఘటిత రంగంలోని దాదాపు 13.50 లక్షల మంది డ్రైవర్లకు (వ్యాన్లు, జీపులు, ట్రాక్టర్లు, ట్యాక్సీలు, లారీలు) రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు బీమా ఊడగొట్టింది. మా ప్రభుత్వంలో మంచిగా దర్జాగా బతికిన ఆటో డ్రైవర్ మష్రత్ అలీ, రాహుల్గాంధీ ఇచ్చిన హామీలతో నేడు రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకునే పరిస్థితి వచ్చింది..’అని కేటీఆర్ చెప్పారు. అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు ‘రాష్ట్రంలో మార్పు, మార్పు అంటూ జరిగిన మోసం ఎలా ఉంటుందో రెండేళ్లలో ప్రజలకు అర్థమైంది. రైతులు, యువత, మహిళలు సహా అందరికీ 420 హామీలు ఇచ్చి మోసం చేశారు. రైతు రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల కోట్లు అవసరం ఉండగా.. రూ.12 వేల కోట్లు ఇచ్చి అయిపోయిందని ప్రచారం చేసుకున్నారు. దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్కో ఆటో డ్రైవర్కు ప్రభుత్వం రూ.24 వేలు బాకీ పడింది. మరోవైపు ఈ రెండేళ్లలో 162 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు. గల్లా పట్టి అడిగితేనే ఇస్తాడు.. అందుకే పోరాటం తప్పదు..’అని కేటీఆర్ అన్నారు. జిల్లాలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతిలోపు తాము ప్రమాద బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లు ఒక క్రెడిట్ సొసైటీ (కోఆపరేటివ్)గా ఏర్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొండూరి రవీందర్రావు, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మాజీ జెడ్పీ చైర్పర్సన్లు తులా ఉమ, అరుణ, ఆటోకార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చొరబాటుదారుల ఓట్ల కోసమే!
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ అమిత్ షా కొట్టిపారేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగితే.. తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో నెగ్గే అవకాశం పోతుందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటములకు ఆ పార్టీ నాయకత్వమే తప్ప ఈవీంఎలు లేదా ఓట్ల చోరీ కారణం కాదని తేల్చిచెప్పారు. దేశంలో ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్సభలో ప్రత్యేక చర్చను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో కొనసాగించడానికే ఎస్ఐఆర్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎంతగా వ్యతిరేకించినా, సభ నుంచి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా సరే చొరబాటుదారులను గుర్తించడం, వారి ఓట్లను తొలగించడం, వారిని బయటకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించినవారికి ఓటు హక్కు ఇవ్వాలనడం న్యా యమేనా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులను అధికారికంగా గుర్తించి, ఎన్నికల జాబితాలో చేర్చాలంటూ నిస్సిగ్గుగా వాదిస్తున్నాయంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది ‘‘దేశంలో మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఓట్ల చోరీకి పాల్పడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుతూ 28 మంది ఆయనకు మద్దతిచ్చారు. నెహ్రూకు కేవలం ఇద్దరే మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది. అయినా సరే ఆమె ప్రధానమంత్రి అయ్యారంటే కారణం ఓట్ల చోరీ. ఇక సోనియా గాంధీ ఈ దేశ పౌరురాలు కాకముందే ఎన్నికల్లో ఓటు వేశారు. అలా చేయడం ఓటు చోరీ కాదా? విపక్ష నాయకులు కేసుల్లో ఓడిపోతే న్యాయమూర్తిని నిందిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై నిందలేస్తున్నారు. ఆ నిందలను జనం పట్టించుకోకపోతే ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. బిహార్లో కాంగ్రెస్ పరాజయానికి ముమ్మాటికీ ఆ పార్టీ నాయకత్వమే కారణం. ఈవీఎంలు లేదా ఓట్ల చోరీ కారణం అనడం ఉత్తమాట. కాంగ్రెస్ పెద్దలు ఏదో ఒకరు ఆ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి మృతి చెందినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, 18 ఏళ్ల వయసున్నవారిని చేర్చడం, విదేశీయులను తొలగించడం ఎస్ఐఆర్ అసలు ఉద్దేశం. ఈ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నిజానికి మన దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఓట్ల చోరీ ఓట్ల చోరీ అంటూ కేకలు పెట్టారు. చొరబాటుదారులను కాపాడాలంటూ యాత్రలు చేశారు. చివరికి బిహార్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో మేమే గెలిచాం. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని, ఓటర్ల జాబితాను తప్పుపట్టడం, ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగితే ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీచేశాయి? దేశంలో ఇప్పటిదాకా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సందర్భాల కంటే ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ. అయినా సరే ఏనాడూ ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టలేదు. ఈవీఎంలతో ఎన్నికల చోరీని అడ్డుకోవచ్చు. తప్పుడు పనులు చేయడం సాధ్యం కాదు. అందుకే విపక్షాలు ఈవీఎంలు వద్దంటున్నాయి. వారి బండారం పూర్తిగా బయటపడింది. దేశ ప్రజలు ప్రతిపక్షాలకు ఓట్లు వేయడం లేదు. ఎస్ఐఆర్తో చొరబాటుదారుల ఓట్లు కూడా రద్దయితే ఇక పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. 2004, 2009లో ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా! 2014లో ఓడిపోయిన తర్వాతే ఈవీఎంలపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించకుండా మేము పారిపోవడం లేదు. ఎస్ఐఆర్ అంశం ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. అందుకే సభలో చర్చించలేం. ఎన్నికల సంస్కరణలపై చర్చించాలని కోరితే వెంటనే అంగీకరించాం. ఎస్ఐఆర్పై ఏకపక్షంగా అసత్య ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలి’’ అని అమిత్ షా తేల్చిచెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఐఆర్ ప్రారంభం ఎస్ఐఆర్ గురించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. చొరబాటుదారులు మన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను ఎన్నుకొనే పరిస్థితి ఉంటే దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉంటుందా? ఈ విషయం అందరూ ఆలోచించాలి. చరిత్ర గురించి మేము మాట్లాడడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. చరిత్ర తెలుసుకోకుండా సమాజం గానీ, దేశం గానీ ఎలా ముందుకెళ్తాయి. దేశంలో మొట్టమొదటి ఎస్ఐఆర్ను 1952లో నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. రెండోసారి 1957లో నెహ్రూ హయాంలో, మూడోసారి 1961లో నెహ్రూ హయాంలోనే ఎస్ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో, ఇందిరా గాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో, పీవీ నరసింహారావు హయాంలో కూడా ఎస్ఐఆర్ చేపట్టారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి పాలనలో, మన్మోహన్ సింగ్ పాలనలోనూ ఎస్ఐఆర్ జరిగింది. అప్పట్లో ఎస్ఐఆర్ను ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలంటే, ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎస్ఐఆర్ అవసరం కాబట్టి వ్యతిరేకించలేదు.
కేజీ ఉల్లిగడ్డలు రూ.25
సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం : ఓ వైపు వరుస లొంగుబాట్లతో పార్టీ బలహీనపడుతున్నా.. మావోయిస్టుల్లోని ఒక వర్గం సాయుధ పోరాట పంథానే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ బలగాల నుంచి తమ కార్యకలాపాలను రహస్యంగా ఉంచడంపై దృష్టి సారించింది. ఈ మేరకు కొత్తరకం కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిర్బంధంతో బృందాల మధ్య తెగిన సంబంధాలు శాంతిచర్చల ప్రస్తావన మొదలైనప్పటి నుంచి మావోయిస్టుల నుంచి తరచూ వినిపిస్తున్న మాట కమ్యూనికేషన్ గ్యాప్. ‘మా మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. కలిసి మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వండి. ఒకసారి మాలో మేం చర్చించుకొని సాయుధ పోరాట విరమణ, లొంగుబాట్లపై సామూహిక నిర్ణయం తీసుకుంటాం’అని మావోయిస్టులు కోరుతున్నారు. ఏప్రిల్లో రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు దగ్గర నుంచి నిన్నటి అనంత్ వరకు అందరూ ఇదే డిమాండ్ చేశారు.కానీ ప్రభుత్వం ససేమిరా అనడంతో ఎవరికి వారే లొంగిపోతున్నారు. అయితే ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో సాయుధ పోరాట పంథా కొనసాగిస్తామంటున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు పోలీసుల కన్నుగప్పి అంతర్గత సమాచారం చేరవేసుకునేందుకు తమ కమ్యూనికేషన్ విభాగంలో కొత్తకోడ్ లాంగ్వేజ్ రూపొందించుకున్నారు. ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో లభ్యమైన డాక్యుమెంట్లలో ఈ విషయం బయటపడింది.భద్రతా దళాల సమాచారం? రహస్య జీవితం, అజ్ఞాత విధానంలో పనిచేసే సంస్థలు ప్రభుత్వ / శత్రు నిఘా వర్గాలకు చిక్కకుండా కోడ్ లాంగ్వేజ్లో సమాచారం చేరవేసుకుంటాయి. అందులో భాగంగా వాడుకలో ఉండే వివిధ ప్రాంతాలు, పండ్లు, కూరగాయలు, సముద్రాలు, నదులకు సైతం కోడ్ లాంగ్వేజ్లో పేర్లు ఉన్నాయి. వివిధ నంబర్లకు కూడా ఇలాగే నిత్య జీవితంలో కనిపించే వస్తువులు, ప్రదేశాల పేర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉల్లిపాయలకు సంబంధించిన కోడ్ నేమ్ 201గా ఉంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో భాగంగా దండకారణ్యంలో సీఆర్పీఎఫ్, కోబ్రా, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ తదితర పేర్లతో భద్రతా దళాలు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. వీటికి బెటాలియన్ల వారీగా నంబర్లు కేటాయించి, అక్కడి నుంచి కంపెనీల వారీగా ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంపులను నెలకొల్పుతున్నాయి.ఈ క్రమంలో బీజాపూర్, సుక్మా జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టే ఒక బెటాలియన్ను ఉల్లిగడ్డగా పేర్కొంటూ నక్సలైట్లు కొత్త కోడ్ లాంగ్వేజ్ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా శత్రువుల (భద్రతా దళాల) కదలికలను అంచనా వేస్తూ తమ వ్యూహాలకు పదును పెట్టే పనిచేస్తున్నట్టు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో ఉన్న ప్రభుత్వ విభాగాలు అనుమానిస్తున్నాయి. ఆ ధరకైతే వెనక్కే ఈ నెల 3వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయి స్టులు, ముగ్గురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని భద్రతా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఇందులో విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, డైరీలు, నోట్ పుస్తకాలు ఉన్నాయి. అందులోని ఒక నోట్బుక్లో రాసి ఉన్న విషయాలు అసాధారణంగా కనిపించాయి. గోండు భాషలో కేజీ ఉల్లిపాయలు రూ.25 నుంచి మొదలుపెట్టి రూ.30 వరకు రాసుకుంటూ పోయారు. వేర్వేరు ధరలకు వేర్వేరు అర్థాలు రాసుకొచ్చారు. కేజీ రూ.25 అయితే తీసుకురావొచ్చని, రూ.26 అయితే అక్కడే ఉంచాలని, రూ.27 అయితే వెనక్కి ఇవ్వాలని ఇలా ఒక్కో ధరకు ఒక్కో అర్థం రాసి ఉంది. దీనిపై అనుమానం వచి్చన భద్రతాదళాలు ఇదేమైనా కోడ్ లాంగ్వేజ్ కావొచ్చేమోనని ఆరా తీశారు.
‘నిట్’లో జెన్ జెడ్ పోస్టాఫీస్
కియా నుంచి కొత్త సెల్టోస్
ఫిబ్రవరిలో మహాధర్నా
సీఎం‘కోడ్’ ఉల్లంఘన ఫిర్యాదు ఎంసీసీ కమిటీకి పంపాం
బీఆర్ఎస్ నేత దారుణహత్య
బంజారాహిల్స్లో రూ. 350కు గజమా?
జోరు కొనసాగించాలని...
యువ భారత్కు కాంస్యం
క్రికెట్ తర్వాతే ఏదైనా: స్మృతి
రోహిత్ వెనకాలే కోహ్లి
బంగారం తియ్యగా.. వెండి చేదుగా..!!
నెహ్రూ విశ్వాస ఘాతుకం
వరుణ్ సందేశ్- ప్రియాంక జైన్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
ఎస్ఐఆర్పై లోక్సభలో వాడీవేడీగా చర్చ
ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ
జస్ట్ టిప్ మనీతోనే రూ. 10 లక్షల కారు కొన్నాడు
స్టాలిన్కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్ సభ
సిల్వర్ సునామీ.. పసిడి ధరల తుపాను!!
ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్ జీడీపీ కంటే ఎక్కువ!
టికెట్ రేట్లు పెంచుతుంటే చర్యలెందుకు తీసుకోలేదు?
ఆమె కాలాన్ని బంధించింది
వారం రోజులు.. ముంబై అష్టకష్టాలు
టీనేజర్ల డిజిట్రబుల్స్!
చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్ర
స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు: బుగ్గన
అప్పులు.. దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే: పేర్ని నాని
ఇండిగో సంక్షోభం: హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో
ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. యూరప్లో ఉద్రిక్తత?
బ్రెజిల్ మహిళ ఫొటోపై సమాధానం లేదు: రాహుల్
'తెలుగు ఇండస్ట్రీకి లేని భయం మనకెందుకు'.. హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్..!
‘నిట్’లో జెన్ జెడ్ పోస్టాఫీస్
కియా నుంచి కొత్త సెల్టోస్
ఫిబ్రవరిలో మహాధర్నా
సీఎం‘కోడ్’ ఉల్లంఘన ఫిర్యాదు ఎంసీసీ కమిటీకి పంపాం
బీఆర్ఎస్ నేత దారుణహత్య
బంజారాహిల్స్లో రూ. 350కు గజమా?
జోరు కొనసాగించాలని...
యువ భారత్కు కాంస్యం
క్రికెట్ తర్వాతే ఏదైనా: స్మృతి
రోహిత్ వెనకాలే కోహ్లి
బంగారం తియ్యగా.. వెండి చేదుగా..!!
నెహ్రూ విశ్వాస ఘాతుకం
వరుణ్ సందేశ్- ప్రియాంక జైన్ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
ఎస్ఐఆర్పై లోక్సభలో వాడీవేడీగా చర్చ
ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ
జస్ట్ టిప్ మనీతోనే రూ. 10 లక్షల కారు కొన్నాడు
స్టాలిన్కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్ సభ
సిల్వర్ సునామీ.. పసిడి ధరల తుపాను!!
ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్ జీడీపీ కంటే ఎక్కువ!
టికెట్ రేట్లు పెంచుతుంటే చర్యలెందుకు తీసుకోలేదు?
ఆమె కాలాన్ని బంధించింది
వారం రోజులు.. ముంబై అష్టకష్టాలు
టీనేజర్ల డిజిట్రబుల్స్!
చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్ర
స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు: బుగ్గన
అప్పులు.. దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే: పేర్ని నాని
ఇండిగో సంక్షోభం: హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో
ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. యూరప్లో ఉద్రిక్తత?
బ్రెజిల్ మహిళ ఫొటోపై సమాధానం లేదు: రాహుల్
'తెలుగు ఇండస్ట్రీకి లేని భయం మనకెందుకు'.. హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్..!
ఫొటోలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో టాలీవుడ్ హీరో రానా (ఫొటోలు)
బాలిలో చిల్ అవుతున్న షెఫాలీ వర్మ (ఫొటోలు)
Karthika Nair : నాలో ఓ భాగం కోల్పోయా.. నటి రాధ కూతురు కార్తీక ఎమోషనల్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ (ఫొటోలు)
విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)
'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)
ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)
‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
‘నయనం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యా సూపర్ షో...తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
సినిమా
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సినిమాలు చూడం: హీరో కార్తి
‘హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్..ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సినిమాలను చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షయిల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్ గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ఆడియెన్స్ ను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్ తో ‘అన్నగారు వస్తారు’ మూవీ ఉంటుంది’ అన్నారు హీరో కార్తి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం కానీ మన కల్చర్ లోనూ ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్ ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాల్పనిక ప్రపంచంలో జరుగుతుంటుంది.⇢ నేను ఊపిరి లాంటి మూవీస్ ఈజీగా చేయగలను కానీ అన్నగారు వస్తారు ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. అయితే రైటర్స్ కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. లేకుంటే ఎప్పుడూ ఒకే తరహా మూవీస్ చేయాల్సివస్తుంది. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్ తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే అన్నగారు వస్తారు మూవీ చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది.⇢ కథల పరంగా కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం నిత్యం చేస్తుంటాను. నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇద్దరి కెరీర్స్ లో అక్కడి సినిమాలు ఇక్కడ ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్ జరిగాయి. ఈ క్రాసోవర్ వల్ల ఈ ఇద్దరు మహా నటుల కెరీర్ లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు.⇢ డైరెక్టర్ నలన్ గత సినిమాలు శాడ్ ఎండింగ్ తో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం హీరో సెంట్రిక్ గా ఉంటుంది. పారలల్ వరల్డ్ లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది.⇢ నేను గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను. అన్నగారు వస్తారులో పోలీస్ పాత్ర అయినా దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నలన్ మాతో చెప్పించే డైలాగ్స్ కూడా ఒక రిథమ్ తో ఉంటాయి. మ్యూజిక్ కూడా కొత్తగా చేయిస్తాడు. సంతోష్ నారాయణన్ ను ఇంట్రడ్యూస్ చేసింది నలన్ కుమారస్వామి. అయితే ఈ సినిమాకు నలన్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను అనుకున్నాడు. కానీ సంతోష్ వచ్చి నేనే వర్క్ చేస్తా అని అడిగి మరీ మూవీకి జాయిన్ అయ్యాడు.⇢ హీరోయిన్ కృతిశెట్టి ఆకట్టుకునేలా నటించింది. స్పిరిట్ రీడర్ లా ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేసి, ప్రిపరేషన్ తో పర్ ఫార్మ్ చేసింది. ఫస్ట్ సీన్ చూసి నేను ఎంత బాగా నటిస్తుంది అనుకున్నా. హీరోయిన్ అంటే కొన్నిసార్లు గ్లామర్ డాల్ లా ఉండాల్సివస్తుంది. కానీ కృతి నటిగా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె డ్యాన్సులు, గ్లామర్ కాకుండా మంచి యాక్టర్ లా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది.⇢ నేను టీమ్ వర్క్ ను బిలీవ్ చేస్తాను. దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేసుకుంటాం. సెట్ లో సీన్ చేసే ముందు కూడా మాట్లాడుకుంటాం. నాకు అనిపించిన సజెషన్స్ చెబుతాను. నేను క్యారెక్టర్ లో ఉండిపోతాను కాబట్టి ఆ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. నావంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా చేస్తుంటా.⇢ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మూవీకి ఏం కావాలన్నా చేశారు. అన్నగారు వస్తారులో కొత్త వరల్డ్ క్రియేట్ చేశామంటే అందుకు జ్ఞానవేల్ రాజా ఇచ్చిన సపోర్ట్ కారణం. ఒకవారం రెండు మూడు సినిమాలు వచ్చినా తప్పులేదు. ప్రేక్షకులు ఒక మూవీ తర్వాత మరొక మూవీ చూస్తారు. నేనూ ఒక ఆడియెన్ గా అలాగే చూసేవాడిని. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు ఉంటారు.⇢ ఎవరు కొత్త తరహా సినిమా చేసినా కనీసం మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. సత్యం సుందరం లాంటి సినిమాను ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకుంటే మరోసారి అలాంటి సినిమా చేసే ప్రయత్నమే ఎవరు చేయరు కదా. అఖండ 2 రిలీజ్ కన్ఫమ్ కావడం హ్యాపీగా ఉంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కె విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లోని భావోద్వేగాలు, పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమాలు ఎప్పుడు చూసినా మనల్ని ఎంగేజ్ చేస్తుంటాయి.
కాంతారపై రణ్వీర్ సింగ్ కాంట్రవర్సీ.. స్పందించిన సీనియర్ హీరో భార్య..!
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇటీవల కాంతార మూవీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో కాంతార సీన్ను ఇమిటేట్ చేశాడు. అదే కాంతార ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పించింది. తమ దైవాన్ని కించపరిచేలా మాట్లాడారని.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.ఈ వివాదం కాస్తా మరింత ముదరడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరాడు. రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశమని వివరణ ఇచ్చాడు. తాజాగా ఈ వివాదంపై సీనియర్ హీరో గోవిందా సునీతా అహుజా స్పందించారు. ఈ విషయంలో రణ్వీర్ సింగ్కు ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకపోవచ్చని అన్నారు. కానీ దక్షిణాది ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు.. అందుకే వారికి అది నచ్చలేదని సునీతా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా... రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.అసలేం జరిగిందంటే..ఈవెంట్లో స్టేజీపై రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్వీర్ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.కాంతార మూవీ..రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్బస్టర్గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.
అఖండ-2 రిలీజ్.. మరో టీజర్ వచ్చేసింది
బాలయ్య అఖండ-2 వివాదం తర్వాత ఎట్టకేలకు రిలీజవుతోంది. నాలుగైదు రోజుల చర్చల తర్వాత ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అఖండకు సీక్వెల్గా వస్తోన్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు క్లియర్ కావడంతో ఈ శుక్రవారం అఖండ-2 థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మరో టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అఖండ-2 రిలీజ్ టీజర్ పేరుతో విడుదలైంది.తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై జీవో..తెలంగాణలో అఖండ-2 మూవీకి సంబంధించి టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.50, మల్టీ ప్లెక్స్ల్లో రూ.100 వసూలు చేసుకోవచ్చని జీవోలో తెలిపింది. ఈ పెంచిన ధరలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డిసెంబర్ 11 రాత్రి 8 గంటల ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేట్ నిర్ణయించారు. పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెల్లించాలని జీవోలో వెల్లడించారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్పై అవగాహన ప్రకటనలు తప్పనిసరిగా స్క్రీన్ చేయాలని సూచించారు.
వెంకీమామ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ మూవీ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 13న వెంకీ మామ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్కు అదే రోజు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రేమంటే ఇదేరా 4కె ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా వెంకీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ మూవీని డిసెంబర్ 13న రీ రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. కొత్త రిలీడ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో బర్త్డే రోజు ఈ సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న వెంకీమామ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అఖండ-2 వాయిదా పడడం, చిన్న సినిమాలు రిలీజ్ ఉండడం వల్లే ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.కాగా.. 1998లో వచ్చిన ఈ మూవీకి జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ ప్రేమకథా చిత్రంలో వెంకటేష్, ప్రీతి జింటా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్కుమార్ సంయుక్తంగా నిర్మించారు.#PremanteIdera re-release postponed!Stay tuned for new release date! #PremanteIderaReRelease #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/qrXeoDrRAl— Telugu FilmNagar (@telugufilmnagar) December 10, 2025
క్రీడలు
‘షూటౌట్’లో భారత్దే పైచేయి
సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు 9–10 స్థానాల కోసం పోటీపడనుంది. నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైన జ్యోతి సింగ్ బృందం వర్గీకరణ మ్యాచ్ల్లో రాణిస్తోంది. వేల్స్తో జరిగిన మ్యాచ్లో 3–1 గోల్స్ తేడాతో నెగ్గిన టీమిండియా... ఉరుగ్వేతో జరిగిన మరో వర్గీకరణ మ్యాచ్లో మాత్రం ‘షూటౌట్’లో విజయాన్ని అందుకుంది. నిర్ణీత సమయంలోనే గెలవాల్సిన భారత జట్టు మ్యాచ్ చివరి నిమిషంలో గోల్ సమర్పించుకొని ఆటను ‘షూటౌట్’ వరకు తీసుకెళ్లింది. మ్యాచ్ 19వ నిమిషంలో మనీషా చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 60వ నిమిషం వరకు ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి సెకన్లలో ఉరుగ్వేకు గోల్ ఇచ్చింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. ‘షూటౌట్’లో భారత్ తరఫున పూర్ణిమ యాదవ్, ఇషిక, కనిక సివాచ్ వరుసగా మూడు గోల్స్ చేశారు. మరోవైపు ఉరుగ్వే తరఫున తొలి షాట్ను అగస్టీనా గోల్గా మలచగా... జస్టినా రెండో షాట్ను.. సోల్ మార్టినెజ్ తీసుకున్న మూడో షాట్ను... సోల్ మిస్కా కొట్టిన నాలుగో షాట్ను భారత గోల్కీపర్ నిధి అడ్డుకుంది. దాంతో భారత్ నాలుగో షాట్ను తీసుకోకుండానే విజయాన్ని ఖరారు చేసుకుంది. 9–10వ స్థానాల కోసం స్పెయిన్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరోవైపు క్వార్టర్ ఫైనల్స్లో నెదర్లాండ్స్ 8–2తో ఇంగ్లండ్పై, బెల్జియం 4–1తో అమెరికాపై, చైనా 5–3తో ఆ్రస్టేలియాపై, అర్జెంటీనా 2–1తో జర్మనీపై గెలుపొంది సెమీఫైనల్లోకి అడుగు పెట్టాయి. సెమీఫైనల్స్లో బెల్జియంతో నెదర్లాండ్స్; చైనాతో అర్జెంటీనా పోటీపడతాయి.
కోహ్లి ఒక్కడే మిస్ అయ్యాడు.. మిగతా ముగ్గురూ..!
ఐసీసీ తాజాగా (డిసెంబర్ 10) విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆసీస్, ఇంగ్లండ్ ప్లేయర్ల హవా కొనసాగింది. తాజాగా ఇరు జట్ల మధ్య యాషెస్ రెండో టెస్ట్ (పింక్ బాల్) జరగడమే ఇందుకు కారణం. ఆ టెస్ట్లో 8 వికెట్లతో చెలరేగిన ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ ఏకంగా మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. అదే మ్యాచ్లో బ్యాటింగ్లో ఇరగదీసిన ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అగ్రపీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.ఇదే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఓ మోస్తరు ప్రదర్శనలు చేసిన ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్ వికెట్కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ ఓ స్థానం మెరుగుపర్చుకొని 17వ స్థానానికి చేరాడు. టాప్-10లో ఉండిన ఆసీస్, ఇంగ్లండ్ బ్యాటర్లలో ట్రవిస్ హెడ్, హ్యారీ బ్రూక్ తలో రెండు స్థానాలు కోల్పోయి 4, 7 స్థానాలకు పడిపోయారు.తాజాగా విండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించిన కేన్ విలియమ్సన్ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లెక్కన చూస్తే.. టెస్ట్ల్లో ఫాబ్-4గా పిలువబడే వారిలో విరాట్ కోహ్లి మినహా మిగతా ముగ్గురు టాప్-3లో (రూట్, కేన్, స్టీవ్) ఉన్నారు. విరాట్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ర్యాంకింగ్స్లో అతని పేరే లేదు.ఈ వారం బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారీగా లబ్ది పొందిన వారిలో రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, జాక్ క్రాలే, షాయ్ హోప్, జస్టిన్ గ్రీవ్స్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. విండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రచిన్, లాథమ్ భారీ సెంచరీలతో కదంతొక్కి 15, 34 స్థానాలకు ఎగబాకగా.. ఆదే మ్యాచ్లో సెంచరీ, డబుల్ సెంచరీతో చెలరేగిన హోప్, గ్రీవ్స్ 48, 60 స్థానాలకు ఎగబాకారు.ఇంగ్లండ్తో రెండో యాషెస్ టెస్ట్లో బ్యాట్తోనూ రాణించిన మిచెల్ స్టార్క్ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకగా.. అదే మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించిన జాక్ క్రాలే 6 స్థానాలు మెరుగుపర్చుకొని 45వ స్థానానికి ఎగబాకాడు.బౌలింగ్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్లో స్టార్క్తో (3 స్థానాలు ఎగబాకి) పాటు కీమర్ రోచ్ (5 స్థానాలు ఎగబాకి), బ్రైడన్ కార్స్ (4 స్థానాలు ఎగబాకి), జకరీ ఫౌల్క్స్ (9 స్థానాలు ఎగబాకి) లబ్ది పొందారు. అత్యుత్తంగా న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ 76 స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరాడు. టాప్-2 బౌలర్లుగా బుమ్రా, మ్యాట్ హెన్రీ కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, జడేజా, కుల్దీప్ వరుసగా 12 నుంచి 14 స్థానాల్లో ఉన్నారు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా, జన్సెన్, స్టోక్స్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో ఇద్దరు భారత ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్య తలో స్థానం మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు.
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడిని ఔట్ చేసే అవకాశం ఉన్నా ప్రత్యర్ధి ఆటగాడు ఔట్ చేయకుండా వదిలేశాడు. దీనికి కారణం ఏంటంటే.. సదరు ఆటగాడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్కీపర్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా వదిలేశాడు.విషయాన్ని అర్దం చేసుకున్న బ్యాటర్ తరఫున టీమ్, మరో బంతి చూసి ఆ ఆటగాడిని రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పిలిపించుకుంది. క్రికెట్ చరిత్రలో అరుదుగా జరిగే ఇలాంటి ఘటన ప్రస్తుతం జరుగుతున్న ఇంట్నేషనల్ టీ20 లీగ్-2025లో జరిగింది.A RARE INCIDENT IN CRICKET 🤯- Batter was struggling in the ILT20, so Nicholas Pooran decided not to get him out when he had the opportunity for a stumping. pic.twitter.com/x2Ikca0VnL— Johns. (@CricCrazyJohns) December 10, 2025ఈ లీగ్లో భాగంగా నిన్న (డిసెంబర్ 9) డెజర్ట్ వైపర్స్-ఎంఐ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వైపర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్ హోల్డన్ పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్కీపర్ నికోలస్ పూరన్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా హోల్డన్ను ఔట్ చేయలేదు. బంతిని కనెక్ట్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న హోల్డన్ మరికొద్ది సేపు క్రీజ్లో ఉంటే బంతులు వృధా చేయించవచ్చన్నది అతని ప్లాన్.అయితే పూరన్ ప్లాన్ను పసిగట్టిన వైపర్స్ కెప్టెన్ ఫెర్గూసన్ హోల్డన్ను రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పిలిపించుకున్నాడు. ఈ తతంగం ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జరిగింది. అప్పటికి వైపర్స్ స్కోర్ (118/1) చాలా తక్కువగా ఉండింది. హోల్డన్ క్రీజ్ను వీడాక కాస్త పుంజుకున్న వైపర్స్ స్కోర్ అంతిమంగా 159 పరుగులకు చేరింది.ఈ స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఎంఐ ఎమిరేట్స్ తడబడింది. ఓ దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ఈ జట్టు ఒకే ఓవర్లో (19) మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై పరాజయంపాలైంది. ఆఖరి ఓవర్లో గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో అర్వింద్ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే అర్వింద్ డైరెక్ట్ త్రోతో ఘజన్ఫర్ను రనౌట్ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. 19వ ఓవర్లో 3 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్ పేన్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మీడియా క్రికెట్లో దూసుకుపోతున్న సాక్షి టీమ్.. ఫైనల్లో టీవీ9తో అమీతుమీ
జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ పోటీలు గత నాలుగు రోజులుగా హైదరాబాద్లో సందడిగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో సాక్షి టీమ్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తొలి రోజు బిగ్ టీవీతో జరిగిన నాకౌట్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతో విజయదుందుబి మోగించారు.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బిగ్ టీవీ టీమ్.. 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా సాక్షి టీమ్ కేవలం 12.5 ఓవర్లలో రెండే వికెట్లో కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాక్షి టీమ్కు చెందిన సతీష్ 48 పరుగులు చేయగా.. రమేష్ 47 పరుగులు చేసి సత్తా చాటారు. ఈ విజయంతో సాక్షి సెమీస్లోకి అడుగు పెట్టింది.బుధవారం జరిగిన సెమీస్లో సాక్షి టీమ్ మరోసారి సత్తా చాటింది. వీ6తో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే విజయం సాధించి విజయపరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వీ6ను సాక్షి 104 పరుగులకు కట్టడి చేసింది. సాక్షి బౌలర్లలో రామకృష్ణ, అనిల్, రమేష్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 2 వికెట్లు తీశారు.అనంతరం చేధనకు దిగిన సాక్షి టీమ్ కేవలం 12.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. రమేష్ 83 పరుగులు చేసి ఒంటిచేత్తో సాక్షిని గెలిపించాడు. బౌలింగ్లోనూ 2 వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ గెలుపుతో సాక్షి టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగే ఫైనల్లో సాక్షి టీమ్ టీవీ9తో అమీతుమీ తేల్చుకుంటుంది.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే అంకెల గారడీ. చంద్రబాబు జీఎస్డీపీ ముందస్తు అంచనాలపై వైఎస్ జగన్ ధ్వజం
తెలంగాణ రైజింగ్ విజన్ సాధిస్తాం... గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నేటి నుంచే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు... ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో సర్వం సిద్ధం
‘ఇండిగో’ నిర్వాకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల అష్టకష్టాలు... మంచినీళ్లు, ఆహారం కోసం వరద బాధితుల తరహాలో ఫుడ్ కోర్డుల ముందు నిరీక్షణ
ఉన్నత శిఖరాలకు మన బంధం. ఇండియా-రష్యా సదస్సులో సంయుక్త ప్రకటన చేసిన మోదీ, పుతిన్
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సక్రమంగా ఎక్కడ అమలు చేశారు?. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జీవో సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు... విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఆ కాలేజీలకు రాష్ట్ర ఖజానా నుంచి వంద కోట్ల రూపాయలు దోచిపెట్టే కుతంత్రం
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
బిజినెస్
అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ
దేశంలోని 31 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు కృత్రిమమేధ(ఏఐ) ప్రయోజనాలను అందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి మైక్రోసాఫ్ట్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ-శ్రమ్, నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీఎస్) పోర్టల్ల్లో అత్యాధునిక ఏఐ చాట్బాట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.భారతదేశంలో కృత్రిమ మేధ(AI) ప్రభావాన్ని ఒక ప్రజా ఉద్యమంలా విస్తరించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంలో ఈమేరకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. 2026 నుంచి 2029 వరకు 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీని ద్వారా దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల కల్పన, డేటాను బలోపేతం చేయనున్నట్లు చెప్పింది.ఈ-శ్రమ్, ఎన్సీఎస్ పోర్టల్స్లో ఏఐ చాట్బాట్లుఇండియా ‘ఏఐ-ఫస్ట్ కంట్రీ’గా మారాలంటే ప్రతి ఒక్కరికీ దీని ప్రయోజనాలను అందించాలని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ‘ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు ప్రక్రియను సులభతరం చేయడం నుంచి ఎన్సీఎస్లో మెరుగైన ఉద్యోగాల కోసం రెజ్యూమ్లు రూపొందించడం వరకు ఏఐ సాయంతో కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయనున్నాం’ అని చెప్పారు.ఈ చాట్బాట్లు కార్మికులకు తక్షణ సహాయం అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల సరిపోలికను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్లో హోస్ట్ చేయబడి ప్రభుత్వ ప్లాట్ఫామ్ ‘భాషిణి’ని ఏకీకృతం చేస్తామని కంపెనీ చెప్పింది. దీనివల్ల 22 స్థానిక భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్లేషన్ అందుతుందని తెలిపింది. ఇది ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ-శ్రమ్లో నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుందని చెప్పింది. ఈ పోర్టల్ల నుంచి సేకరించిన డేటా, భారతదేశం, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో కార్మికుల నైపుణ్యాలను సరిపోల్చడానికి కార్మిక విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పింది.ఇదీ చదవండి: 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు
నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. అందులో భాగంగా వచ్చే నాలుగేళ్లలో అంటే 2030 నాటికి దేశంలో అదనంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించేందుకు సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో కంపెనీ మొత్తం 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.14 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2010లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చేసిన సుమారు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనంగా ఉంటుంది.న్యూఢిల్లీలో జరిగిన ఆరో అమెజాన్ సంభవ్ సమ్మిట్లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కంపెనీ తన దీర్ఘకాలిక భారత వ్యూహాన్ని కొన్ని ప్రధాన విభాగాల్లో కేంద్రీకరించినట్లు చెప్పింది. ఏఐ నేతృత్వంలోని డిజిటలైజేషన్, భారతీయ ఎగుమతులను పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. ఇది భారతదేశం డిజిటల్, తయారీ ఎకోసిస్టమ్ల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అమెజాన్ పేర్కొంది.డిజిటలైజేషన్, ఉద్యోగాలుకొన్నేళ్లుగా అమెజాన్ దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తోంది. ఈ సమ్మిట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024 వరకు భారత పరిశ్రమల్లో సుమారు 28 లక్షల ప్రత్యక్ష, పరోక్ష, కాలానుగుణ ఉద్యోగాలకు అమెజాన్ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా, ఈ ప్రయత్నాలు 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజేషన్వైపు మళ్లించినట్లు చెప్పింది. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల లక్ష్యం అమెజాన్ విస్తరిస్తున్న డెలివరీ నెట్వర్క్లు, తయారీ, ప్యాకేజింగ్, రవాణా, సర్వీసులకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది.అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మిలియన్ల మంది భారతీయులకు ఏఐను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. 2030 నాటికి మా ఈ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్ డాలర్లకు అంటే నాలుగు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
‘తాజ్ బంజారా’ను కొనేసిన అరబిందో
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెద్ద సంచలనం.. ప్రసిద్ధ స్టార్ హోటల్ ‘తాజ్ బంజారా’ చేతులు మారింది. అరోబిందో గ్రూప్కి చెందిన ఆరో రియాల్టీ తాజ్ బంజారా హోటల్ను రూ.315 కోట్లకు అధికారికంగా కొనుగోలు చేసింది.గత అక్టోబర్ 31న పూర్తైన ఈ లావాదేవీ బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతంలో జరిగిన అత్యంత ముఖ్యమైన డీల్స్లో ఒకటిగా నిలిచింది. ఈ కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సుమారు 3.5 ఎకరాల్లో ఉన్న తాజ్ బంజారా మొత్తం విస్తీర్ణం 16,645 చదరపు గజాలు. ఇందులో బిల్ట్-అప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు. ఈ హోటల్లో మొత్తం 270పైగా గదులు ఉన్నాయి.ఐకానిక్ తాజ్ బంజారాఒకప్పుడు తాజ్ గ్రూప్కి చెందిన ఫ్లాగ్షిప్ లగ్జరీ హోటల్గా తాజ్ బంజారా ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన హోటల్గా నిలిచింది. అయితే గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ సమస్యలు, జీహెచ్ఎంసీ నుంచి క్లోజర్ నోటీసులు అందుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఈ కొనుగోలు తర్వాత ఆ ప్రాపర్టీ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయి.ఆరో రియాల్టీ ఏం చేస్తుందో..హైదరాబాద్లో భారీగా విస్తరిస్తున్న ఆరొ రియాల్టీ, రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్-యూజ్ సెగ్మెంట్ల్లో నిరంతరం పెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పుడు తాజ్ బంజారా కొనుగోలు ఆ విస్తరణలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. కాగా దీంతో ఆతిథ్య రంగంలోకి ప్రవేశించి తాజ్ బంజారా హోటల్ను కొనసాగిస్తుందా.. లేదా కూల్చేసి హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్కు తెరతీస్తుందా అన్నది చూడాలి.
హైదరాబాద్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం
హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్లోని టి-హబ్లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్వర్క్ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఏం చేస్తుందీ కేంద్రం?తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.తెలంగాణకు పెద్ద అడుగుగూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్లకు సహాయపడుతుంది” అన్నారు.
ఫ్యామిలీ
ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..!
భారతీయ చేనేత సంప్రదాయం వేల ఏళ్ల నాటిది. అవి విలాసవంతమైనవి, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి కూడా. కొన్నిటికి వాటి చారిత్రక నేపథ్యం కారణంగా యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ సైతం ఉంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన చేనేత వస్త్రాల్లో ఒకటి గుజరాత్కి చెందిన పటాన్ పటోలా ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అందానికి రాజీకీయ నాయకుల నుంచి బాలీవుడ్ నటుల వరకు అందరూ ఫిదా. అంతలా ఆదరణ పొందుతున్న ఈ పటాన్ పటోలా చేనేత వస్త్రం ఎలా కళాకారుల చేతులో రూపుదిద్దుకుంది..? ఎలా పుట్టుకొచ్చింది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.విభిన్న రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే ఈ పటోలా డబుల్ ఇకాట్ టెక్నిక్ ఉపయోగించి నేస్తారు. వీటిలో రేఖాగణిత మోటీప్లు కూడా ఉంటాయి. అదోక విస్తృత కథాఖండం. ఇందులో పూల నుంచి జంతువుల మోటీఫ్లు కూడా ఉంటాయి. ప్రతి డిజైన్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.900 ఏళ్ల నాటి చరిత్ర..12వ శతాబ్దంలో రాజు కుమార్పాల ఈ పటోలాను ఇష్టపడ్డాడు. చాలా క్లిష్టంగా ఉండే చేతిపని. ఆయన జైన మతాన్ని స్వీకరించాడు. అందువల్ల ఆలయాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా..అక్కడకు వచ్చే ప్రజలంతా పటోలా వస్త్రాల్లో కనిపించాలని హుకుం జారీ చేసేవాడు. ఈ వస్త్రం మహారాష్ట్రలోని జల్నా నగరం రవాణా అయ్యేది. అయితే ఒకసారి రాజు కుమార్పాల ఒక ఆయానికి వెళ్తే..అక్కడ పూజారి మీ దుస్తులు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ లోపలికి వెళ్లనివ్వలేదు. ఒక్కసారిగా అతడి మాటలకు హుతాశుడై ఇలా ఎందుకన్నాడు. అత్యంత విలాసవంతమైన పటోలా పట్టు వస్త్రాలు మాములు దుస్తుల్లా ఎలా కనిపించాయని విచారించగా, అసలు విషయం బయటపడింది. జల్నా రాజు పటోలా బట్టలను బెడ్షీట్లుగా ఉపయోగించేవాడని, వాటిని రాజకుటుంబాలకు బహుమతిగానూ లేదా విక్రయించేవాడని తెలుస్తుంది. దాంతో కుమారపాల్ రాజు అతడితో యుద్ధం చేసి గెలిచాక..దాదాపు 700 మంది సాల్వి కళాకారులను, వారి కుటుంబాలను పటాన్ తీసుకువచ్చి పటోలా వస్త్రాల్లో కల్తీ లేని నాణ్యమైనవి వచ్చేలా చూశాడు. తన పాలనలో ఆ బట్ట ఉత్పత్తి బాగుండేలా కేర్ తీసుకున్నాడు. అలా దీని గురించి తరతరాలకు తెలిసేందుకు దారితీసింది. View this post on Instagram A post shared by Salvi Nirmal (@patola_bynirmalsalvi)నేయడానికి వ్యవధి కూడా ఎక్కువే..నిజానికి ఆరు నెలల కాలానికి గానీ ఒక చీర ఉత్పత్తి అవ్వదట. అంత సంక్లిష్టమైన చేతి పనితో కూడిన చేనేత వస్త్రం ఇది. అందుకు సంబంధించిన ఆధారాలు అజంతాలోని ఫ్రెస్కోలు, పద్మనాభపురం రాజభవనాల మీద లిఖిత పూర్వకంగా చెక్కబడి ఉన్నాయట కూడా. ముఖ్యంగా కేరళ గోడ చిత్రాల్లో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుందట. అంటే ఈ పటోలా చీరలు దగ్గర దగ్గర వెయ్యి ఏళ్ల నాటివిగా పేర్కొనవచ్చు. సాల్విస్, సోనిస్ అనే రెండు వర్గాల వారికే ఈ పటోలా చేనేత నైపుణ్యం తెలుసట. గుజరాతీలోని పాత స్మారక చిహ్నాలలో ఉన్న క్లిష్టమైన గోడ డిజైన్ల ద్వారా ప్రేరణ పొందిన చతురస్రాకార నమూనాల్లో కూడా ఈ పటోలా వస్త్రాల్లో చూడొచ్చు. ఈ చేనేత వస్త్రంలోని చిహ్నాలు చాలామటుకు సంతానోత్పత్తి, శక్తి, అదృష్టం, శ్రేయస్సుతో ముడిపడి ఉండటం విశేషం. అందుకే గుజరాతీ మహిళలు శుభ సందర్భాల్లో తప్పనిసరిగా ఈ వస్త్రాలను ధరిస్తారట. డిజైన్ రూపొందించడానికే మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందట. ఇక నేయడానికి ఏకంగా 40 నుంచి 50 రోజుల పడుతుందట. కనీసం ఇద్దరు కార్మికులు ఈ చీరపై ఎనిమిది నుంచి 9 గంటలు కూర్చొంటే గనుక ఇది పూర్తవ్వుతుందట. ఇప్పటకీ ఒక సాధారణ పటోలాను పూర్తిచేయాలన్న కనీసం ఐదు నెలల వ్యవధి పడుతుందట. అందుకే అంత ఖరీదు..అందువల్లే ఈ పటోలా చీరలు అంత ఖరీదు పలుకుతాయట. మార్కెట్లో అచ్చం అలాంటి నకిలీ ఫ్యాబ్రిక్ పటాన్ పటోలా వచ్చేస్తున్నాయి. అయితే అవి రూ. 2000 నుంచి రూ. 3000లు పలుకుతాయి. నాణ్యమైన ఒరిజనల్ పటోలా పట్టు చీర మాత్రం రూ. 1,50,000 నుంచి దగ్గర దగ్గర 3,50,000 వరకు పలుకుతుందట. అంతేగాదు వీటిని మలైకా అరోరా, స్మృతి ఇరానీ, దీపికా పదుకొనే, సోహా అలీ ఖాన్, కరిష్మా తన్నా, కంగనా రనౌత్, భూమి పెడ్నేక్కర్, మాధురి దీక్షిత్లు ఎంతో ఇష్టంగా ధరిస్తారట. అలాగే మన ప్రధాని మోదీ సైతం దీన్ని ఇష్టపడతారు. ఆయన జూలై 2022 లో పటోలా స్కార్ఫ్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. View this post on Instagram A post shared by Salvi Nirmal (@patola_bynirmalsalvi) (చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!)
ఆమె కాలాన్ని బంధించింది
చేతిలో కెమెరా...దాని వెనక వేగంగా కదిలే కన్ను...ప్రతి సందర్భానికీ స్పందించే మనసు... ఇవి ఉంటే చాలు...కదిలే కాలాన్ని బంధించి... చాయాచిత్రంగా చరిత్ర పుటల్లో భద్రపరచవచ్చు. ముందు తరాలకు చెదరని తరగని జ్ఞాపకాలు అందించవచ్చు. దృశ్యాన్ని ఫొటోగా మార్చే సాంకేతిక శక్తి కెమెరాకు ఉండొచ్చు. కానీ దాని వెనక ఉన్న కెమెరామన్ కన్ను అంతకన్నా ముఖ్యం. సకాలంలో స్పందించే హృదయం లేని చేతిలో కెమెరా ఒక బొమ్మ మాత్రమే...అని మాటల ద్వారా కాకుండా తను తీసిన చిత్రాల ద్వారా చెప్పిన అద్భుత ఫొటోగ్రాఫర్ పద్మవిభూషణ్ హొమయ్ వ్యారవాలా. హొమయ్ వ్యారవాలా ఇండియా మొట్టమొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్. భారత దేశం తెల్లదొరల వలసపాలన నుంచి స్వంతంత్ర దేశంగా ఎదిగిన ప్రయాణాన్ని తన చిత్రాల ద్వారా చెప్పిన తొలి ఫొటోగ్రాఫర్ హొమయ్. పురుషాధిపత్యం అధికంగా ఉన్న ఈ ఫొటోగ్రఫీ రంగంలో హోమయ్ హద్దుల్ని, సరిహద్దుల్ని చెరిపేసి స్వేచ్చా విహంగం. ఆకాశమే హద్దుగా తన వృత్తిలో అనుక్షణం జీవించారు. దేశ చరిత్రలో అపురూప ఘట్టాలను చాయాచిత్రాలుగా మలచి ఆ అద్భుత దృశ్య సంపదను మనకు అందించారు. హొమయ్ ని కేవలం ఓ ఫొటోగ్రాఫర్ గా మాత్రమే కాదు.... గత చరిత్ర ప్రత్యక్ష సాక్షిగా చూడాలి. ఈ దేశం పరపాలన నుంచి స్వపరిపాలన దాకా చేసిన ప్రయాణాన్ని ఈ దేశ గత చరిత్రను కెమెరా లో బంధించిన వ్యక్తిగా హొమయ్ కు ప్రత్యేక స్థానం దక్కుతుంది.హొమయ్ 1913 డిసెబర్ 9న గుజరాత్ రాష్ట్రం నవ్సారిలో ఓ పర్సి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఓ టూరింగ్ డ్రమా కంపెనీలో నటుడు. తర్వాతి కాలంలో కుటుంబం బోంబేలో స్థిరపడింది. తల్లి ప్రోత్సాహంతో హుమయ్ బోంబే యూనివర్సిటీ, సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుకున్నారు. ఆసమయంలోనే ఆమెకు ఫొటోగ్రఫీపై దృష్టి మళ్ళింది. 1941 లో హొమయ్ కు మనీక్షా వ్యారవాలాతో వివాహమయ్యింది. అతను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫొటోగ్రాఫర్, అకౌంటెంట్ గా పనిచేసేవారు. హొమయ్ 1938లో బొంబే క్రానికల్ పత్రికలో ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించారు. ప్రింట్ మీడియా ప్రధాన స్రవంతిలో , ఇల్యుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పనిచేసిన మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ హుమయ్ . డాల్డా 13 అనే మారుపేరుతో ఆమె చిత్రాలు ప్రచురితం అయ్యేవి. ప్రతిరోజూ నగర జీవనంలో అరుదైన దృశ్యాలను ఫొటోలుగా బంధించి పత్రికకు అందించే వారు. ఆ తర్వాత 1940 నుంచి 1970 దాకా ఢిల్లీలో బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కు పనిచేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వాంతంత్ర్య దినోత్సవ ప్రసంగం, గాంధీ అంతిమయాత్ర లాంటి చారిత్రాత్మక ఘట్టాలను చిత్రించారు. అలాగే క్వీన్ ఎలిజెబిత్ 2 లాంటి విశిష్ట విదేశీ అతిథులు వచ్చినపుడు వారి చిత్రాలను కెమెరాలో బంధించారు. బ్రిటీస్ పాలన అంతిమదశతో పాటు బారత్ స్వాంతంత్ర్య సంబరాలను చిత్రీకరించారు. స్వాంతంత్ర్య సమర ఘట్టాల చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరని జ్ఞాపకాలుగా మనకు మగిల్చిన హొమయ్ కు రోలిఫ్లెక్స్ కెమెరా అంటే ఇష్టం. ఆమె చిత్రాలు మానవీయ కోణంలో, సహజ చిత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ నేతల చారిత్రక సందర్భాలతో పాటు వారు నడుస్తున్నప్పుడో, నవ్వుతున్నప్పుడో సహజ (క్యాండిడ్) చిత్రాలను తీయడంలో హొమయ్ ది అందెవేసిన చేయి. 1970 లో ఫొటోగ్రఫర్ వృత్తినుంచి హొమయ్ రిటైర్ అయ్యారు. 2011 లో ఆమెకు ప్రతిష్టాత్మక పద్మవిభూషన్ గౌరవం దక్కింది. ఎప్పుడూ దుమికే జలపాతంలా చురుగ్గా జీవించిన హుమయ్ తమ రిటైర్ జీవితాన్ని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చాలా ప్రశాంతంగా గడిపారు. హుమయ్ 2012 జనవరి 15న తమ 98వ ఏట ఈ లోకానికి వీడ్కోలు పలికారు. దేశంలోనే తొలి మహిళా ఫోటోజర్నలిస్ట్ గా.... 1940 లోనే అప్పటి సమాజంలోని పురుషాధిక్యతను నిలదీసిన ధీర మహిళగా హుమయ్ ను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి.
మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!
బిడ్డ పుట్టగానే చుట్టాలూ పక్కాలూ అందరి ముఖాల్లో సంతోషమే. బిడ్డ కాళ్లూ వేళ్లూ... ఇలా అవయవాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసి అంతా బాగుంటే పండంటి బిడ్డ అంటూ ఆనందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎదుగుతున్నకొద్దీ ఆ చిన్నారి కనబరుస్తున్న తెలివితేటలను చూసి ఇంకాస్త మురిసిపోతుంటారు. కానీ ఇలా ఎదిగే సమయంలో ఏవైనా మానసిక సమస్యలు కనిపిస్తే మాత్రం ఆ తల్లిదండ్రుల వేదన చెప్పనలవి కాదు. ఆ బాధను మాటల్లో వర్ణించడానికి వీలు కాదు. సాధారణంగా ఇలాంటి శారీరక వైకల్యాలూ, లేదా మానసికమైన ఎదుగుదల లోపాలూ కనిపించే పిల్లలు మేనరికపు వివాహాల్లోని జంటలకే పుట్టడం ఎక్కువ. అందుకే డాక్టర్లు కూడా దగ్గరి సంబంధాలు వద్దనే సూచిస్తుంటారు. ఎందుకు? మేనరికపు వివాహాల్లో ఇలా ఎందుకిలా జరుగుతుంది, ఒకవేళ మేనరికపు పెళ్లిళ్లు తప్పనప్పుడు బిడ్డ పుట్టకముందూ, కడుపున పడ్డ తర్వాత చేయించుకోవాల్సిన పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటనే పలు అంశాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే కథనమిది.ఓ బిడ్డలో లోపం వచ్చిందంటే ... తల్లిదండ్రులిద్దరిలోంచి వచ్చిన జన్యువులే (జీన్స్) సాధారణంగా ఇందుకు కారణం. తల్లిదండ్రులకు చెందిన ఆ జన్యువుల్లో ఏ లోపాలూ లేకపోతే ఆరోగ్యకరమైన అవయవాలే బిడ్డలకు వస్తాయి. సాధారణంగా ఒక లోపం వచ్చిదంటే... తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరి జీన్ లోపభూయిష్టంగా ఉండవచ్చు. అయితే ఆ లోపం తల్లిదండ్రుల్లో ఎవరినుంచి వచ్చిందో చెప్పడం కష్టం. ఇది ఎలా జరుగుతుందంటే... ఓ అవయవానికి సంబంధించి తల్లిదండ్రులిద్దరి నుంచీ జీన్స్ బిడ్డకు వస్తాయి. ఈ రెండింటిలో ఒకదాంట్లో లోపం ఉందనుకోండి. అప్పుడు అదే అవయవానికి సంబంధించిన మంచి జీన్... లోపమున్న జీన్ను డామినేట్ చేసి... ఆ లోపం రాకుండా నివారిస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ లోపం ఉంటే...? అప్పుడు ఆ బిడ్డకు ఆ అవయవానికి సంబంధించిన లోపం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి దగ్గరి సంబంధాలూ లేని వేర్వేరు కుటుంబాలకు చెందిన వారనుకుందాం. అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరిలో జన్యులోపం ఉంటే లోపం లేని మరో జన్యువు దాన్ని డామినేట్ చేసి లోపాన్ని నివారిస్తుంది. అయితే ఒకే కుటుంబాల వారిలో (మేనరికాల్లో అదే కుటుంబాల వారి మధ్య పెళ్లి అవుతుంది కాబట్టి) ఇద్దరి జన్యువులూ లోపంతోనే ఉండే అవకాశముంటుంది కాబట్టి ఆ లోపం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దగ్గరి సంతతికి చెందిన... దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య పెళ్లిళ్లను ఆధునిక వైద్యశాస్త్రం అంతగా ప్రోత్సహించదు. మరి ఎలాంటి దగ్గరి సంబంధాలు లేనప్పుడు ఇలాంటి అవకరాలకు అవకాశం లేదా? ఉంటుంది. కానీ... దూరపు సంబంధాల్లో ప్రతి 400 జంటల్లో ఒకరికి లోపమున్న బిడ్డ పుట్టే అవకాశం ఉంటే... దగ్గరి సంబంధాల విషయంలో కేవలం 200 జంటల్లోనే లోపమున్న బిడ్డ పుట్టేందుకు ఛాన్సులెక్కువ. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దూరపు సంబంధాలనూ, వీలైతే అసలు రక్తసంబంధాలే లేని ఇతర కుటుంబాల వారితో వివాహాలను ఆధునిక వైద్యశాస్త్రం ప్రోత్సహిస్తోంది. కానీ... దగ్గరి సంబంధాల వివాహాలతో పుట్టబోయే బిడ్డలకు ముప్పు పొంచి ఉంటుందిలా... దగ్గరి వివాహాలను వైద్య పరిభాషలో కన్సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. అంటే ఉదాహరణకు అక్కకూతుర్ని... అంటే కోడలు వరసయ్యే అమ్మాయి తన మామను చేసుకోవడం, లేదా మేనమామ, మేనత్త పిల్లలను పెళ్లి చేసుకోవడం. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్ల పుట్టబోయే బిడ్డల్లో అనేక రకాల అవయవలోపాల నుంచి బుద్ధిమాంద్యం వరకు ఎన్నో రకాల రుగ్మతలు, సిండ్రోమ్స్ వచ్చే అవకాశం పొంచి ఉంటుంది.పేరెంట్స్ నుంచి బిడ్డలకు పోలికలూ, గుణాలూ లక్షణాలెలా వస్తాయంటే... బిడ్డ పుట్టగానే బంధువులందరూ చుట్టూ చేరి మురిపెంగా చూసుకుంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ‘‘అరె... వీడి ముక్కు చూడండి. అచ్చం వాళ్ల నాన్నదే. వాడి కళ్లు చూడండి. అచ్చం వాళ్ల అమ్మవే’’ అంటూ మురిపెంగా పోలికలు చూస్తూ మురిసిపోతుంటారు. బిడ్డలో ఎలా వస్తాయి ఈ పోలికలు? ఎలాగంటే... మనిషి దేహం కోటానుకోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలన్నీ మొదట ఒకే ఒక తొలికణంతో మొదలైన జైగోట్ నుంచి అనేకానేక కణవిభజనల తర్వాత ఏర్పడతాయి. ఇక మానవుని ప్రతి కణంలో 46 క్రోమోజోములుంటాయి. అంటే 23 జతలు. వీటిలో ఈ జతలో... 23 మహిళ నుంచి, మరో 23 పురుషుడి నుంచి వచ్చి కలిసి... తొలి కణం ఏర్పడుతుంది. దీన్నే మనం పిండం అంటాం. ఈ పిండంలోని 23 జతల క్రోమోజోములపై అనేక జన్యువులు ఉంటాయి. జన్యువు అంటే ఏమిటంటే... దేహంలోని ప్రతి అంశానికీ, ప్రతి అవయవానికీ, ఎదుగుదలకూ, బిడ్డ అవయవాల షేపుకూ, సైజ్కూ, పెరిగే ఒడ్డూ పొడవునకు సంబంధించిన ప్రతి సమాచారమూ ఈ జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యువులన్నీ క్రోమోజోములపై ఉంటాయి. ఈ క్రోమోజోముల 23 జతలు ఒకదానితో మరొకటి కలిసి ఒక కణంగా రూపొందే సమయంలో తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు ΄ోలికలు, తల్లిదండ్రుల లక్షణాలూ, శరీరాకృతి, రంగు వంటి అనేక అంశాలు సంక్రమిస్తాయి. ఇలా ఈ లక్షణాలన్నీ ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి.దగ్గరివాళ్లలో పెళ్లిళ్లతో లోపాలు ఎందుకంటే... క్రోమోజోములపై లక్షణాలను సంక్రమింపజేసే జన్యువులు తండ్రి నుంచి ఒకటీ, తల్లి నుంచి మరొకటి కలిసి సంపూర్ణమవుతాయన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు... ఒక మహిళలో (కాబోయే తల్లిలోని) ఒక జన్యువు కాస్త చెడి΄ోయి... బిడ్డలో అది ఆస్తమా వ్యాధిని కలగజేసే అవకాశం ఉందనుకుందాం. ఆ మహిళ తన కుటుంబంలోని దగ్గరి వారిని కాకుండా అసలు ఏ సంబంధమూ లేనివారిని పెళ్లి చేసుకుందని అనుకుందాం. ఆ పురుషుడిలోని అదే రకమైన జన్యువు ఆరోగ్యంగా ఉందనుకుందాం. ఈ ఆరోగ్యకరమైన పురుషుడి జన్యువు, అనారోగ్యకరమైన ఆ స్త్రీ జన్యువును అధిగమిస్తుంది. అంటే ఇంగ్లిష్లో చెప్పాలంటే డామినేట్ చేస్తుంది. ఇలా లొంగి ఉండే అనారోగ్యకరమైన జన్యువును ‘రెసెసివ్’ జీన్ అంటారు. అలాగే డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్’ జీన్ అంటారు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లోని దగ్గరి సంబంధంలోనే పెళ్లి జరిగిందనుకోండి. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చినవారు కాబట్టి వారిద్దరిలోనూ ఆ జన్యువులు ఒకేలా ఉంటాయి. దాంతో ఇద్దరి జన్యువుల్లోనూ ఏదీ మరొకదాన్ని డామినేట్ చేయక΄ోవడం, రెండూ లోపంతోనే ఉండటంతో పుట్టబోయే బిడ్డలో ఆస్తమా బయటపడుతుంది. ఇది ఒక జన్యువు ఉదాహరణ మాత్రమే. ఇలా తల్లిదండ్రుల లక్షణాలను మోసుకెళ్లే జన్యువులు ఒక్క క్రోమోజోమ్పై దాదాపు 20,000 వరకూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఆ పుట్టబోయే బిడ్డ ప్రతి లక్షణమూ ముందే ప్రోగ్రామ్ అయి΄ోయి జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే దంపతులిద్దరూ అపరిచిత కుటుంబాల నుంచి పెళ్లిళ్లు చేసుకుంటే ఒకరిలో అనారోగ్యకరమైన జన్యువు (ఫాల్టీ జీన్) ఉన్నా... దాన్ని దంపతుల్లోని మరో ఆరోగ్యకరమైన జన్యువు డామినేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పేర్కొన్న ఆస్తమా ఉదాహరణలా ఇది అన్నివేళలా ఇలాగే బిడ్డలో వ్యక్తమవ్వాలనే నిబంధన ఏదీ ఉండదు. కొన్ని ఫాల్టీ జీన్స్... ఇలా ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే క్రమంలో మరింతగా చెడిపోతూ.... చెడిపోతూ... అకస్మాత్తుగా ఒక పెద్ద లోపంగా బిడ్డలో వ్యక్తం (ఎగ్జిబిట్) కావచ్చు. అందువల్లనే మేనరికాల్లో దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతోఫాల్టీ జీన్స్ అనేవి దంపతులిద్దరిలోనూ ఒకేలా ఉండి అవయవ లోపాలూ లేదా జబ్బులూ వ్యక్తమవుతాయి. ఎలాంటి జబ్బులకు ఆస్కారం ఉంది? మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో అవయవలోపాలూ, పుట్టుకతో వచ్చే జబ్బులు (కంజెనిటల్ డిసీజెస్), రక్తసంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, థలసీమియా వంటివి, సిస్టిక్ ఫైబ్రోసిస్, మూత్రపిండాల వ్యాధులు (కంజెనిటల్ యురెట్రో పెల్విక్ అబ్స్ట్రక్షన్), కండరాల, నరాలకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల సిండ్రోములు (అనే జబ్బుల లక్షణాల మిశ్రమంతో ప్రయుక్తమయ్యే జబ్బులన్నింటినీ కలుపుకుని ఒకే ఒక మాటరూపంలో ‘సిండ్రోమ్’ అని పిలుస్తారు), బుద్ధిమాంద్యత, వికినిడి సమస్యలు, కళ్లసమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు (గుండెలో రంధ్రాలు, వాటి ధమనుల్లో లోపాలు), చిన్నప్పుడే వచ్చే డయాబెటిస్, జన్యుపరమైన సమస్యలు రావచ్చు. ఇక కాబోయే తల్లిలో మాటిమాటికీ జరిగే గర్భస్రావాలు, బిడ్డ పుట్టగానే చనిపోవడం, బిడ్డకు శ్వాససంబంధిత సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్) సమస్యలు ఇలా అనేక వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన సమస్యలూ – రకాలు సాధారణంగా జన్యుపరమైన సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... 1) ఆటోజోమల్ డామినెంట్ : ఇలాంటి జీన్స్ వచ్చిన పిల్లల్లో సమస్య బయటకు కనిపిస్తూ ఉంటుంది. పైగా లోపంతో ఉన్న జీన్ డామినెంట్గా ఉంటుంది. దాంతో ఒక్క జీన్ సంక్రమించినా పిల్లల్లో సమస్య బయటపడుతుంది. 2) ఆటోజోమల్ రెసెసివ్ : వీటిలో సమస్య బయటపడదుగానీ... సమస్యను / వ్యాధిని కలగజేసే జన్యువులు తల్లిదండ్రులిద్దరిలోనూ నిశ్శబ్దంగా లోపలే ఉంటాయి. వీళ్లు తర్వాత తరానికి సమస్యను మోసుకెళ్తారు. కాబట్టి వీరిని ‘క్యారియర్స్’ అంటారు. ఇద్దరు ‘క్యారియర్స్’ పెళ్లాడితే... రెండు రెసెసివ్ జీన్స్ కలిసి... పుట్టబోయే బిడ్డలో సమస్య తప్పక బయటపడుతుంది. 3) ఎక్స్ లింక్డ్ సమస్యలు : ఇలాంటి సమస్యలు ‘ఎక్స్’ క్రోమోజోమ్పై నిక్షిప్తమై ఉంటాయి. దాంతో ఈ జీన్ కలిగిన ఆడపిల్లలు సమస్యకు ‘క్యారియర్స్’గా ఉంటారు. సమస్య మగపిల్లల్లో బయటపడుతుంది.పెళ్లి తప్పదనుకుంటే... ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేనరికపు వివాహాలకు దూరంగా ఉండటమే చాలావరకు మంచిది. ఒకవేళ ఈ అంశాలన్నీ తెలియక నిశ్చితార్థమో, వివాహమో చేసుకుంటే... అప్పుడు ఆ జంట చేయాల్సిన పనులివి... వివాహానికంటే ముందుగా : పెళ్లికి ముందే అమ్మాయీ, అబ్బాయి... ఈ ఇద్దరినీ ప్రీ–మేరిటల్ అండ్ జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం నిపుణులను కలవాలి. అప్పుడా నిపుణులు కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిగణనలో తీసుకుంటారు. అంటే వీరి తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ, తాతలు, ముత్తాతల్లో ఏవైనా దగ్గరి సంబంధం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఉంటే... వీరికి పుట్టే పిల్లలకు ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో విశ్లేషణాత్మకంగా అంచనావేస్తారు. వాటి ఆధారంగా రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది ఆ జంట నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే ఆ జంటకు కొన్ని రక్తపరీక్షలూ చేయించే అవకాశమూ ఉంటుంది. సాధారణంగా వచ్చే జన్యుపరమైన సమస్యలను తెచ్చే జీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోడానికి ఇద్దరికీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. అయితే ఎన్ని పరీక్షలు చేసినా వారికి ఏ సమస్యా రాదనో, వస్తుందనో నిర్ధారణగా చెప్పడం కష్టం. ఒకవేళ ఆటోజోమల్ డామినెంట్ సమస్యలు వస్తాయని తెలిస్తే వీలైనంతవరకు ఆ పెళ్లి వద్దనుకోవడమే మంచిది. పెళ్లి తర్వాత : పెళ్లి తర్వాత కూడా జెనెటిక్ కౌన్సెలింగ్కు వెళ్లి పైన పేర్కొన్నవన్నీ పాటించవచ్చు. గర్భం దాల్చడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్యాసిడ్ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున తీసుకోవాలి. గర్భం వచ్చాక : ఇక్కడ పేర్కొంటున్న సమస్యలన్నీ జన్యుపరమైనవి కావడంతో పుట్టబోయే పిల్లల్లో ఏ సమస్యా రాకుండా చేయడమన్నది ఏ నిపుణులకూ సాధ్యం కాదు. కాక΄ోతే కొన్ని గుర్తించదగిన సమస్యలను ముందుగానే పసిగట్టడం వల్ల, పుట్టిన తర్వాత వెంటనే చెయ్యగలిగిన చికిత్సలేవైనా ఉంటే వాటికోసం తక్షణమే సన్నద్ధమయ్యేలా జాగ్రత్త తీసుకోవడం చేయవచ్చు. లేదా లోపల ఉన్న సమస్యను తెలుసుకోవడం... ఒకవేళ అది మెదడుకు సంబంధించినదీ లేదా ఎప్పటికీ సరిచేయలేనిదని తెలిస్తే గర్భస్రావం (ఐదు నెలల లోపల) అవకాశాల గురించి ఆలోచించడం లేదా బిడ్డను కనడం... ఈ రెండింటిలో వారికి అనువైన / తగిన నిర్ణయం తీసుకోవచ్చు. చివరగా... మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలకు వచ్చే అవయవ లోపాలను రాకుండా చేసేందుకు గర్భంతో ఉన్నప్పుడే ఇచ్చే మందులు, చేసే ఇంజెక్షన్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అలాంటి ఇంజెక్షన్లుగానీ మందులు గానీ ఉండవు. ఇక మేనరికపు వివాహాల వల్ల పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆస్తి కోసమో లేదా ఇతరత్రా కుటుంబ భద్రతల దృష్ట్యా అలాంటి వాటిని చేసుకుని... ఆర్థికంగా, మానసికంగాబాధపడటం కంటే... ఆరోగ్యకరమైన బిడ్డల కోసం కాస్తంత మంచి సంబంధాలు వెదికి బయటి సంబంధాలు చేసుకోవడమే మేలు అని గుర్తుంచుకోవాలి. అయితే ఇది వారి వారి వ్యక్తిగతమైన కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రక్తసంబంధాల్లోనే వివాహాలకు కారణాలివి... ఆర్థిక కారణాలూ, తెలిసినవారి కుటుంబంలో అయితే బిడ్డ బాగోగులు తెలుస్తాయనే ఈ రెండు అంశాలే దగ్గరి బంధుత్వాల్లో పెళ్లిళ్లకు కారణం. అందునా... ప్రధానంగా ఆర్థిక అంశాలే బాగా దగ్గరి సంబంధాలు చేసుకునేలా చాలావరకు ఆ కుటంబాలవారిని ప్రభావితం చేస్తుంటాయి. మేనత్త / మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తి బయటివారికి చెందకుండా... ఆస్తిలో ఆస్తి కలుస్తుందనే అంశమే చాలా సందర్భాల్లో ఇలాంటి పెళ్లిళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇక రెండో ప్రధాన అంశం... ఉద్వేగపూరిత బంధం. అంటే ఎమోషనల్ రిలేషన్షిప్. మనం ప్రాణప్రదంగా పెంచుకున్న మన బిడ్డను ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే... వారెలా చూసుకుంటారో, బాగా చూసుకుంటాఓ లేక ఆరళ్లు పెడుతూ బాధలకు గురిచేస్తారో? అదే... బిడ్డ మన కళ్లెదురుగా ఉంటే మనమూ కూతురి బాగోగులు కళ్లారా చూస్తూ ఉండవచ్చు. ఈ రెండు అంశాల కారణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా దగ్గరి బంధువుల్లోనే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. దాంతో తమ జీవనశైలుల్లోనూ, తమ సాంస్కృతిక విధానంలో దంపతులిద్దరూ తేలిగ్గా ఇమిడిపోతారు... దాంతో దంపతులకు ఇబ్బందులు రావనే భావన ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తుంది.మేనరికపు పెళ్లిళ్లు... దంపతులు చేయించుకోవాల్సిన పరీక్షలు :గర్భందాల్చిన మూడో నెలలో (12 వారాల్లో) డబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించుకుంటే బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ట్రైజోమ్ 18, 13 వంటి కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేక తక్కువగా ఉన్నాయా అని తెలుస్తుంది. ఈ పరీక్షల ఫలితాలను బట్టి వేరే పరీక్షలు అవసరమా కాదా అని తెలుస్తుంది. మూడో నెలలో (12వారాలప్పుడు) న్యూకల్ ట్రాన్స్లుయెన్సీ స్కాన్ (ఎన్టీ స్కాన్) చేయించుకుంటే, ఆ సమయానికి బయటపడే సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. పై పరీక్షల్లో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం కలిగినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడానికి బిడ్డ చుట్టూ ఉండే మాయ నుంచి కొంత ముక్క సేకరించి ‘కోరియా విల్లస్ బయాప్సీ’ అనే పరీక్ష చేస్తారు. ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ మార్కర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల ముప్పు ఎక్కువా లేదా తక్కువా అన్నది తెలుస్తుంది. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఫలితాలు వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేయించాలి. ఇందులో గర్భంలోని బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు లోంచి 10 – 20 ఎమ్ఎల్ తీసి జన్యువుల పరీక్షకు (క్యారియోటైపింగ్కు) పంపించి సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష వల్ల ఒక శాతం మందిలో గర్భస్రావమయ్యే అవకాశం ఉంటుంది. ఐదో నెల చివరిలో 18–22 వారాలప్పుడు ‘టిఫ్ఫా’ అనే స్కానింగ్ చేయడం వల్ల బిడ్డలో వచ్చే అవయవలోపాలను ముందుగానే గుర్తించవచ్చు. దీనితో ΄ాటు జెనెటిక్ సోనోగ్రామ్ చేయించుకుంటే కొన్ని జన్యుసంబంధిత వ్యాధులను సూచించే సాఫ్ట్ మార్కర్లను గుర్తించి, దానికి తగినట్లుగా తర్వాతి నిర్ణయం తీసుకోవచ్చు. ఆరో నెలలో 22–24 వారాల్లో 2డీ ఫీటల్ ఎకో కూడా చేయించుకుంటే గుండెకు సంబంధించిన లోపాలను తెలుసుకోవచ్చు. స్కానింగ్లో నూటికి నూరు శాతం లోపాలను కనుక్కోలేకపోవచ్చు. కొందరిలో బిడ్డ పొజిషన్, ఉమ్మనీటి శాతం, తల్లి పొట్ట మీద అధికకొవ్వు వంటి అంశాలను బట్టి కూడా కొన్ని లోపాలను కనుగొనడం మిస్సయ్యే అవకాశం ఉంది. బిడ్డ పుట్టాక : బిడ్డపుట్టిన తర్వాత మొదటి వారంలోనే నియోనేటల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల త్వరగా చికిత్స చేయదగిన వ్యాధులు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అంటే ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజమ్ వంటివి గుర్తించవచ్చు. బిడ్డ మూడో నెలలో వినికిడి లోపాలను గుర్తించే పరీక్షలు చేయించి, ఒకవేళ ఉంటే వాటిని చాలావరకు సరిదిద్దవచ్చు.డాక్టర్ శ్రీజ గుర్రాల, సీనియర్ కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్ (చదవండి: హార్న్బిల్ ఫెస్టివల్ ..! ఫుడ్ మెనూ చూస్తే..మతిపోవడం ఖాయం..!)
హార్న్బిల్ ఫెస్టివల్..! ఫుడ్ మెనూ చూస్తే..మతిపోవడం ఖాయం..!
నాగాలాండ్ రాష్ట్రంలో డిసెంబర్ రాగానే తొలివారం హార్న్బిల్ ఫెస్టివల్ మొదలైపోతుంటుంది. ఈ వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు, విదేశీయలు తండోపతండాలు వస్తుంటారు. ముఖ్యంగా ఈ పండుగలలో ఉండే ఫుడ్ మెనూ చూస్తే నోరెళ్లబెడతారు. ఆ వంటకాలు చూసి..ఇవేం రెసిపీల్రా బాబు అని అనుకోకుండా ఉండలేదు. పాపం అలానే ఫీలయ్యాడు ఈ విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు. నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ వివిధ రంగు రంగుల సంస్కృతుల సమాజాలు, సాంప్రదాయంతో శక్తిమంతంగా ఉంటాయి. నాగాలాండ్ కోహిమా నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిసామా హెరిటేజ్ విలేజ్లో జరిగే పది రోజుల కార్యక్రమం. ఈ పండుగ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమై డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ పండుగలో కనిపించే ప్రత్యేకమైన ఆహార వంటకాలు అత్యంత హైలెట్ అని చెప్పొచ్చు. యూకేకి చెందిన వ్లాగర్ అలెక్స్ వాండర్స్ ఈ వేడుకలో పాల్గొని అక్కడి రెస్టారెంట్లోని అసాధారణ ఫుడ్ మెనూ గురించి నెట్టింట వీడియో రూపంలో షేర్ చేశాడు. ఆ వీడియోలో తాను భారతదేశంలోని హార్న్బిల్ ఫెస్టివల్లో ఉన్నానని పేర్కొన్నాడు. నా మొత్తం లైఫ్లో చూసి అత్యంత క్రేజీ మోనూలో ఇది ఒకటి. నాకు ఆ మెనూలో కనిపించిన 22 వంటకాలను చూసి నోటమాట రాలేదని అంటున్నాడు. బార్బెక్యూ పోర్క్, పోర్క్ ఇన్నార్డ్స్, అనిషితో పంది మాంసం, ఆక్సోన్తో పంది మాంసం, బియ్యం లేదా పరాఠాతో బటర్ చికెన్, బియ్యం లేదా పరాఠాతో దాల్ మఖానీ, చికెన్ లివర్ గిజార్డ్, డ్రై రోస్ట్డ్ ఫిష్, ఫిష్ పాంగ్సెన్, రొయ్యల టెంపురా మరియు మరిన్ని ఉన్నాయి. వ్లాగర్ దృష్టిని ఆకర్షించినవి నత్త, పట్టు పురుగు, మిడత, సాలీడు, వెనిసన్ (జింక మాంసం), పంది మాంసం, గేమ్ బర్డ్(మాంసం), పామ్ సివెట్ పిల్లి మాంసం వంటి వంటకాలు ఉన్నాయి. ఇలాంటివి తింటారా ఈ పండుగలో అని విస్తుపోయానంటున్నాడు యూకే వ్లాగర్. నెటిజన్లు మాత్రం మాదేశంలో విభిన్న సంస్కృతులకు నెలవు. భిన్నత్వంలో ఏకత్వం ప్రతిదానిలో స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.హార్న్బిల్ ఫెస్టివల్:హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్లో డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుపుకునే వార్షిక పండుగ. ఈ పండుగ నాగాలాండ్లోని అన్ని జాతుల సమూహాలను సూచిస్తుంది. దీన్ని పండుగల పండుగ అని కూడా పిలుస్తారు. రంగురంగులుగా పెద్దగా ఉండే అటవీ పక్షిపేరు మీదుగా ఈ పండుగకు పేరు పెట్టారు. నాగాలాండ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, అంతర్-జాతి పరస్పర చర్యను ప్రోత్సహించడానికి, అక్కడి ప్రభుత్వం డిసెంబర్ తొలివారంలో హార్న్బిల్ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by Alex Wanders (@alexwandersyt) (చదవండి: ఆర్డర్లు కాదు ఇన్స్పిరేషన్ డెలివరీ చేస్తోంది!)
అంతర్జాతీయం
100కోట్ల మంది మైనర్లపై లైంగిక వేధింపులు..!
మహిళల రక్షణకై ప్రపంచవ్యాప్తంగా ఎన్నిచట్టాలు తెచ్చినా పెద్దగా ఫలితాలు ఉండడం లేదు. అబలలపై ఆగడాలు నానాటికీ పెరుగుతూ పోతున్నాయి. మైనర్లపై జరుగుతున్న లైంగిక వేదింపులపై న్యూ లాన్సెంట్ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా మైనర్లు లైంగిక వేదింపులు ఎదుర్కొన్నట్లు సర్వేలో వెల్లడైంది.అభం శుభం తెలియని వయసులో బాలికలు లైంగిక వేధింపులకు గురవడం తీవ్రంగా కలిచివేస్తుంది. మైనర్లపై లైంగిక వేధింపుల కట్టడికీ ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. మైనర్లపై దాడికి పాల్పడేవారిలో అధికశాతం వారికి తెలిసిన వారో లేదా బంధువులే కావడం చాలా బాధాకర విషయం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది కలిగిన దిలాన్సెంట్ జర్నల్ నివేదికలో ఈవిషయాలే వెల్లడయ్యాయి. మైనర్లపై లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతున్నట్లు ది లాన్సెంట్ జర్నల్ నివేదికలో వెల్లడైంది.2023 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా మహిళలపై వేధింపులు అనే అంశంలో దిలాన్సెంట్ సర్వే నిర్వహించింది. అందులో (బిలియన్) 100 కోట్లకు పైగా మహిళలు 15 లేదా అంతకంటే అధిక వయస్సులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తేలింది.వారిలో 68 లక్షలుపై పైగా వారి సన్నిహితుల నుండి వేధింపులు ఎదుర్కొన్నట్లు ప్రచురించింది. ఇండియాలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారిలో 15 సంవత్సరాల లోపు వారు 23 శాతం ఉండగా ఆ పైబడిన వారు దాదాపు 30 శాతంగా ఉన్నట్లు తెలిపింది. అంతే కాకుండా 15 సంవత్సరాల లోపు బాలురలో జరిగే లైంగిక వేధింపులలో భారత్ నుంచి 13 శాతం జరుగుతున్నట్లు పేర్కొంది.ఈ లైంగిక వేధింపుల్లో అధికశాతం సబా- సహార ఆఫ్రికన్, సౌత్ ఆసియా ప్రాంతం నుంచే ఎదురవుతున్నట్లు నివేదిక తెలిపింది. ఈ వేధింపుల వల్ల హైచ్ఐవీ లాంటి ప్రమాదకర వైరస్ సోకడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. గ్లోబన్ బర్డన్ డీసిజెస్లో ప్రచురించిన డేటా ఆదారంగా ది లాన్సెంట్ ఈ స్టడీ నివేదిక ప్రచురించింది.2023 సంవత్సరంలో మహిళలపై జరిగిన హింసపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జరిపిన స్టడీలో భారత్లో 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళలు అధికంగా లైంగిక వేధింపులు లేదా గృహహింస ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై గృహహింసపై జరుపుతున్న స్టడీలో భారత్ నుంచి 20శాతం ఉన్నట్లు ప్రచురించింది. వారిలో 30 శాతం మంది జీవిత కాలం గృహహింస ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది.
బిడ్డ పుడితే... ఏడాదిన్నర సెలవు!
ఏ దేశానికి చెందిన ప్రజలైనా ఆ దేశం అందించే హక్కులపైన ఆధారపడే స్వేచ్ఛగా జీవించగలుగుతారు. ఇటువంటి స్వేచ్ఛ దేశప్రజల సమగ్రాభివృద్ధికి దోహపడుతుంది. నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం(డిసెంబర్ 10). నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్,ఐస్లాండ్లు మానవ హక్కుల పరిరక్షణ విషయంలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ దేశాలను నార్దిక్ దేశాలు అని అంటారు. వీటిలోని స్వీడన్ అయితే.. బిడ్డ పుట్టిన సందర్భంలో ఆ తల్లిదండ్రులకు ఏకంగా ఏడాదన్నర సెలవు తీసుకునే అవకాశం కల్పించింది. నార్దిక్ దేశాలు పౌర, రాజకీయ, సామాజిక హక్కుల సార్వత్రిక రక్షణను ప్రతిబింబిస్తూ అంతర్జాతీయ సూచికలలో స్థిరంగా అగ్రస్థానంలో నిలిచాయి.నార్వే: లింగ సమానత్వంలో ముందు చూపుపౌర స్వేచ్ఛకు, లింగ సమానత్వానికి నార్వే ప్రాధాన్యతనిస్తుంది. బలమైన పౌర హక్కులతో పాటు, నార్వే ఒక ముఖ్యమైన చట్టాన్ని అమలు చేసింది. కార్పొరేట్ బోర్డు సీట్లలో మహిళలకు కనీసం 40 శాతం కేటాయించేలా కోటాను అమలు చేస్తోంది. ఇది ఉద్యోగ రంగంలో సమానత్వాన్ని పెంచడమే కాకుండా, నిర్ణయాధికార స్థానాలలో సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది.స్వీడన్: కుటుంబ సంక్షేమం- సమానత్వంమానవ హక్కుల కల్పనలో స్వీడన్ ముందుంటుంది. పేరెంట్ లీవ్ విధానమే దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. బ్రిటన్ దంపతులు ఎవరైనా తమ ఇంట బిడ్డ పుట్టినప్పుడు ఏకంగా 480 రోజులు (సుమారు ఏడాదిన్నర) జీతం చెల్లింపుతో కూడిన సెలవు తీసుకోవచ్చు. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులిద్దరూ తప్పనిసరిగా సెలవులను పంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం కుటుంబంలో బాధ్యతను సమానంగా పంచుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా స్త్రీలు తమ వృత్తి జీవితాన్ని కొనసాగించడానికి వీలు కలుగుతుంది.డెన్మార్క్: పాలనలో పారదర్శకతపాలనలో అత్యున్నత స్థాయి పారదర్శకతకు డెన్మార్క్ ప్రశంసలు అందుకుంటోంది. దేశంలోని ఓపెన్ బడ్జెట్ వ్యవస్థ పౌరులు ప్రభుత్వ ఖర్చులను ఆన్లైన్లో ట్రాక్ చేయడానికి అనుమతి కల్పిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలపై పూర్తి పారదర్శకతను అందించడం ద్వారా, అవినీతి స్థాయిలను తగ్గించడంలో డెన్మార్క్ ముందుంది. ఫిన్లాండ్: విద్య- సామాజిక సంక్షేమంమానవ హక్కుల విధానంలో విద్య , సామాజిక సంక్షేమంపై ఫిన్లాండ్ దృష్టి పెట్టింది. విద్యలో ఆర్థిక అసమానతలకు తావు లేకుండా, చిన్నారులకు పాఠశాల్లో ఉచిత భోజనాన్ని అందిస్తుంది. ఈ విధానం పిల్లలందరికీ వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా కొనసాగుతుంది. ఇది పోషణ , సమాన విద్యా అవకాశాలను అందించి, సామాజిక సమగ్రతను, బాలల హక్కులను బలోపేతం చేస్తుంది.ఐస్లాండ్: వేతన అసమానతపై పోరాటంసమాన వేతనం విషయంలో ప్రపంచానికే ఐస్లాండ్ ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలో సమాన వేతన చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పురుషులు, మహిళలు సమానంగా వేతనం పొందుతున్నారని కంపెనీలు చట్టబద్ధంగా నిరూపించాల్సి ఉంటుంది. ఈ చట్టం లింగ వేతన వ్యత్యాసాన్ని అంతం చేయడానికి రూపొందింది. ఆర్థిక హక్కులలో లింగ సమానత్వం పోరాడుతున్న వారికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. నార్డిక్ దేశాలు ఈ మానవ హక్కుల దినోత్సవం నాడు పలు దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: Israel: యుద్ధ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న గణాంకాలు
ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. యూరప్లో ఉద్రిక్తత?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరోపియన్ అనుసరిస్తున్న విధానాలు విపత్తులను సృష్టించేవిగా ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. ‘పొలిటికో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన ఈ విమర్శలు ఇప్పుడు అమెరికా, దాని కీలక మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.నాటో కూటమిపై కూడా ట్రంప్ దృష్టి సారించారు. ఈ కూటమి తనను డాడీ అని పిలుస్తుందని పేర్కొంటూనే, రక్షణ వ్యయంపై యూరోపియన్ దేశాలు ఏవోవో మాట్లాడతాయి తప్ప, యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అవసరమైన సహాయాన్ని అందించవని ట్రంప్ ఆరోపించారు. రష్యాకు కైవ్ భూభాగాన్ని అప్పగించాల్సి వస్తుందని, యూరప్లోని చాలా మంది భయపడుతున్న నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించాలనే యూఎస్ ప్రణాళికపై పెరుగుతున్న విభేదాల సమయంలో ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్కు అమెరికా మద్దతుపై యూరోపియన్ నేతలు ట్రంప్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ విమర్శలు వెలువడ్డాయి.ఈ సందర్భంలోనే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మార్షల్ లా కారణంగా ఎన్నికలు వాయిదా పడటం వల్ల దేశం ‘ఇకపై ప్రజాస్వామ్యం కాదు’ అనే స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు. అందుకే రష్యా పైచేయి సాధిస్తోందని ఆయన వాదించారు. యుద్ధాన్ని ముగించడానికి తాను రూపొందించిన ప్రణాళికను గ్రహించి, యుద్ధంలో మరణాలను ఆపడానికి చర్యలు తీసుకోవాలని ఆయన జెలెన్స్కీకి ట్రంప్ సలహా ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, జెలెన్స్కీ మాట్లాడుతూ భద్రతను నిర్ధారించగలిగితే తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వలసల అంశంపై ట్రంప్ చేసిన విమర్శలు ఇటీవల విడుదల చేసిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలోని అంశాలను బలపరుస్తున్నాయి. వలసల కారణంగా బ్రిటన్, ఫ్రాన్స్ , జర్మనీ తదితర దేశాలు నాశనం అవుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. యూరప్లోని నేతలు వలసల ప్రభావాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు.ఇది కూడా చదవండి: Israel: యుద్ధ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న గణాంకాలు
ఇండోనేసియాలో అగ్ని ప్రమాదం
జకార్తా: ఇండోనేసియా రాజధాని నగరం జకార్తాలో ఏడంతస్తుల భవంతిలో ఉవ్వెత్తున ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నిండు గర్భిణి సైతం అగ్నికి ఆహుతయ్యారు. జకార్తా సిటీలోని కెమయోరన్ ప్రాంతంలోని ఒక భవంతిలోని మొదటి అంతస్తులో నిల్వచేసిన డ్రోన్ బ్యాటరీల్లో ఒకటి పేలడంతో అంటుకున్న నిప్పు రవ్వలు మెరుపువేగంతో పై అంతస్తులకు ఎగబాకి పెద్దస్థాయిలో మంటల్ని రాజేశాయి. దీంతో భవంతిలోని వాళ్లు వెంటనే తప్పించుకునే అవకాశం లేకుండాపోయిందని సెంట్రల్ జకార్తా పోలీస్ చీఫ్ సుసత్యో పూర్ణోమో కాండ్రో వెల్లడించారు. బుధవారం సిబ్బంది మధ్యాహ్న భోజనాలు చేసే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.భవనానికి నిప్పు అంటుకుందని తెల్సిన వెంటనే వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, 28 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఒక డ్రోన్ల తయారీ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఈ బహుళ అంతస్తుల భవంతిలో ఉంది. మొదటి అంతస్తులో బ్యాటరీలను నిల్వచేయడంతోపాటు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశా రు. ఇక్కడి బ్యాటరీ పేలడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బ్యాటరీలకు చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మెరుపులు వచ్చి చివరకు అగ్గిరాజుకుందని మరో ప్రత్యక్ష సాక్షి ఇన్టాన్ పుష్పిత చెప్పారు.మంటలు పై అంతస్తులకు ఎగబాకుతుండటంతో పొడవాటి నిచ్చెనల సాయంతో ఆరో అంతస్తులో చిక్కుకున్న కొందరు కార్మికులకు ఎలాగోలా బయటకు తీసుకురాగలిగారు. బ్యాట రీలు పేలడంతో వెలువడిన పొగ భవంతిని కమ్మేసిన దృశ్యాలు సోషల్మీడియాలో చక్కర్లు కొట్టాయి. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చాలా మంది చనిపోయారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఘటనకు వాస్తవిక కారణా లను ఆధా రసహి తంగా కనిపెట్టాల్సి ఉందని పోలీసులు తెలిపారు. భవంతిలో అత్యయిక పరిస్థి తుల్లో తప్పించుకునే ఏర్పాట్లు లేవని ఘటనాస్థలిని పరిశీలించిన జకార్తా గవర్నర్ ప్రమోనో అనున్గ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన భవంతిలో పీటీ రెట్రా డ్రోన్ ఇండోనేసియా అనే కంపెనీ కార్యాలయం నడుస్తోంది. ఇది నిర్మాణం, గనులు, ముడిచమురు, సహజవాయువు, ఇంధన, వ్యవ సాయం, పట్టణ ప్రణాళిక రంగ కంపెనీలకు డ్రోన్ల ను సమకూరుస్తోంది.
జాతీయం
శభాష్.. గోలూ భాయ్!
భిక్షాటన చేసే యాచకులను చూసి అయ్యో పాపం అనుకుంటాం. కుదిరితే సాయం కూడా చేస్తాం. చీదరించుకునే వారు కూడా ఉంటారు. కానీ ఆ యువకుడు అలా కాదు. ఎవరూ ఊహించని విధంగా స్పందించి అందరి దృష్టిలో హీరోగా నిలిచాడు. అతడు చేసిన పని ఎంతో మందిని ఆకట్టుకుంది. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఇంతకీ ఎవరతడు, ఏం చేశాడు?బిహార్లోని బక్సర్ జిల్లాకు (Buxar district) చెందిన గోలు యాదవ్ అనే యువకుడు ఒక రోజు రైలు ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో తన బోగిలో ఓ అనాథ బాలిక భిక్షాటన చేస్తూ కనిపించింది. ప్రయాణికుల అసౌకర్యకరమైన చూపులు, అనుచిత వ్యక్తీకరణల నడుమ ఆమెను అలా చూడటం గోలు యాదవ్కు బాధనిపించింది. ఆమె కోసం ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందడుగు వేశాడు. తనతో పాటు ఇంటికి వస్తే బాగా చూసుకుంటానని ఆమెను అడిగాడు. ఆ బాలిక ఒప్పుకోవడంతో తన ఇంటికి తీసుకెళ్లాడు.ఇంటికి చేరుకున్న తర్వాత.. గోలు ఆ అమ్మాయి దుస్థితిని తన తల్లిదండ్రులకు వివరించాడు. వారు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఆమెకు భద్రమైన జీవితంతో పాటు ప్రేమను పంచాలని గోలు భావించాడు. కొద్దిరోజుల తర్వాత తల్లిదండ్రుల అనుమతితో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా (Viral) మారడంతో గోలు గొప్పదనం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. సంస్కార్ కుమార్ అనే యూజర్ వీరి గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. సమాజంలో మంచి మనుషులు ఉన్నారని చెప్పడానికే సోషల్ మీడియాలో కనిపించిన వీరి స్టోరీని తాను పంచుకున్నానని, మెయిన్ స్ట్రీమ్ మీడియా ధ్రువీకరించాల్సి ఉందని పేర్కొన్నారు.చదవండి: మా వాళ్లు వద్దంటున్నారు.. నేను రాజీనామా చేయనునెటిజన్ల స్పందనరియల్ లైఫ్ హీరో అంటూ గోలు యాదవ్పై నెటిజనులు (Netizens) ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెకు ఇల్లు మాత్రమే కాకుండా గౌరవప్రదమైన జీవితాన్ని కూడా ఇచ్చాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా నిస్సహాయురాలికి ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు రావడం అనేది అత్యంత ప్రశంసార్హమని వ్యాఖ్యానిస్తున్నారు. గోలు యాదవ్ చేసింది తప్పా, ఒప్పా అనేది పక్కపెట్టి.. అతడు స్పందించిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు. View this post on Instagram A post shared by Sinu Mohanta (@_sanskarr_kumarc_)
పెళ్లి చేసుకోమని వేధిస్తోంది
ఛత్తీస్గఢ్లో ఒక మహిళా డీఎస్పీపై కేసు నమోదయ్యింది. కల్పనాఅనే మహిళా డీఎస్పీ తన వద్ద నుంచి రూ.రెండు కోట్ల రుపాయలు కాజేసిందని దీపక్ థండన్ అనే వ్యాపార వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాలకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు.ఛత్తీస్గఢ్ రాయిపూర్కు చెందిన దీపక్ థండన్ అనే వ్యాపారవేత్త, కల్పనా అనే మహిళా డీఎస్పీపై సంచలన ఆరోపణలు చేశారు. కల్పనా తనను తీవ్రంగా వేధిస్తుందని తెలిపారు. 2021లో తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని కొద్దిరోజులకే ఇద్దరం సన్నిహితంగా మెదిలామన్నారు. ఆ తర్వాత నుంచి కల్పనా తన వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బు గుంజసాగిందన్నారు. తనకు రూ.12 లక్షల విలువ గల డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చానని, రాయ్పూర్లో ఉన్న ఒక హోటల్ తన సోదరుడి పేరు మీదకు మార్చేలా ఒత్తిడి తెచ్చిందని తెలిపారు.ఆ తర్వాత కొంతకాలానికే కల్పనా రూ.30 లక్షలు విలువజేసే మరో ప్రాపర్టీ తన పేరు మీదకు మార్చాలనడంతో ఆ విధంగా చేశానన్నారు. అంతేకాకుండా తనకు రూ. 22లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చానని ఆ వాహనం తన భార్య పేరు మీద తీసుకున్నానని తెలిపారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. తమ సంబంధం విషయం తన భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయని దీపక్ అన్నారు.ఈ నేపథ్యంలో డీఎస్పీ వేధింపులు తట్టుకోలేక తన భార్యతో కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను డీఎస్పీ కల్పనా కొట్టిపడేసింది. ఆ వ్యాఖ్యలన్ని నిరాధారమైనవని తెలిపింది.
టికెట్ రేట్లు పెంచుతుంటే చర్యలెందుకు తీసుకోలేదు?
సాక్షి, ఢిల్లీ: ఇండిగో సంక్షోభం వేళ.. విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచి ప్రయాణికులను దోచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ను బుధవారం కోర్టు విచారణ జరిపింది.ఒకవైపు సంక్షోభం కొనసాగుతుంటే.. దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు అనుమతి ఎలా లభించింది?. టికెట్ ధరలు kp.35,000 నుంచి 39,000 వరకు ఎలా పెరిగాయి? ఇతర ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి అధిక ధరలు వసూలు చేయడం ఎలా సాధ్యమైంది? ఇది ఎలా జరుగుతుంది? అని జస్టిస్ గెడెలా కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే.. కేంద్రం చర్యలు తీసుకుందని అదనపు సాలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇండిగో సంక్షోభాన్ని (Indigo) పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే.. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనికి ఎవరు కారణం..? అని న్యాయస్థానం ప్రశ్నించింది. దాంతో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. ఆ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు.ఇండిగో వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయింది. పరిస్థితి ముందుగా అంచనా వేయలేకపోయారు. ఇటు ఇతర ఎయిర్లైన్సులు ధరలు పెంచుతున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు?.. ఎయిర్లైన్స్ అధిక ధరలు వసూలు చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారు? అని పౌరవిమానయాన శాఖను ఢిల్లీ హైకోర్టు సమగ్ర వివరణ కోరింది. "మీరు సంక్షోభం ఏర్పడిన తర్వాతే అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రశ్న అది కాదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు?" అని న్యాయస్థానం ప్రశ్నించింది. పైలట్లపై అధిక పనిభారం ఎందుకు ఉందో, దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కూడా కోర్టు కేంద్రాన్ని కోరింది. అదే సమయంలో.. ఇండిగో తగినంతమంది పైలట్లను నియమించుకోవాలని, ఎఫ్డీటీఎల్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది.‘ఇండిగో వందల సంఖ్యలో సర్వీసుల్ని రద్దు చేయడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఆ ఎఫెక్ట్తో ఇతర విమానయాన సంస్థల్లో టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ వ్యవహారంపై చాలా ఆలస్యంగా స్పందించిన కేంద్రం.. ఎయిర్లైన్స్లకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ మధ్యలోనే.. ఎయిర్లైన్స్లు అసాధారణంగా అధిక ధరలు వసూలు చేస్తున్నాయని, ప్రయాణికులకు సమయానికి సమాచారం ఇవ్వడం లేదని.. ఇది ప్రయాణికుల హక్కుల ఉల్లంఘన అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇండిగో సంక్షోభం: హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో
భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంతో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులు ఇపుడిపుడే ఒక కొలిక్కి వస్తున్నాయి. అయితే విమానాల రద్దు, ప్రయాణీకుల అగచాట్ల నేపథ్యంలో ఇండిగో పై సోషల్మీడియాలో అనేక మీమ్స్, కామెడీ పంచ్లు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఇండిగోను విమర్శిస్తూ వచ్చిన ఒక AI-వ్యంగ్య వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.‘‘ఇండిగో కొత్త విమానాలు: ఆలస్యం లేదు, మళ్లింపులు లేవు... చాలా రీజనబుల్’’ అనే శీర్షికతో పోస్ట్ అయిన ఈ వీడియోలో ఇండిగో విమానం మాదిరిగా గానే ఒక ఆటో రిక్షాను మనం చూడవచ్చు. పైలట్ల కొరత, ఒక్క డిసెంబర్లోనే 2,000 కంటే ఎక్కువ విమానాల రద్దు, తీవ్రమైన కార్యాచరణ వైఫల్యం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ విడియో రావడం గమనార్హం. IndiGo’s new fleet: no delays, no diversions…. and very reasonable 😃 pic.twitter.com/llHqkloH6T— Harsh Goenka (@hvgoenka) December 9, 2025కాగా భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్లో దాదాపు 65 శాతం వాటా ఉన్న ఇండిగో, పైలట్ల కోసం కొత్త పనిగంటలు, నైట్ డ్యూటీలు వారపు విశ్రాంతి పరిమితులను (FDTL) తీర్చడానికి కార్యాచరణ వనరులను సర్దుబాటు చేయకుండా ఇండిగో తన శీతాకాలపు షెడ్యూల్లో రోజువారీ విమానాలను 6శాతం పెంచడంతో సమస్యలు తలెత్తాయి.దీంతో ఊహించనరీతిలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోయి అనేక ఇబ్బందులు పడ్డాడు. దీనిపై కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు చేపట్టింది. దీనిపై దర్యాప్తునకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, ఇండిగో దేశీయ షెడ్యూల్లో 10శాతం కోత విధించాలని మంగళవారం ఆదేశించింది. గతంలో జారీ చేసిన 5శాతం తగ్గింపుతో పోలిస్తే ఇది రెట్టింపు.
ఎన్ఆర్ఐ
వచ్చేనెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆటా వేడుకలు
గత ఇరవై సంవత్సరాలుగా ఆటా వేడుకలు పేరుతో అమెరికా తెలుగు సంఘం ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదిలిపెట్టి నిర్విరామంగా నిర్వహిస్తుంది. తెలుగు భాష, సాహిత్యాలను ప్రేమిస్తూ విశేష కృషి చేస్తూ వస్తున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆటా వేడుకలు ఘనంగా జరగటం విశేషం.ఆటా సేవల్లో భాగమైన సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాల్లాంటి మరెన్నో రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, ఆటా తెలుగు తేజాన్ని నాలుగు దిశల విస్తరింప చేస్తూ ఉన్నది. విశ్వఖ్యాతిగా మన తెలుగును బహుళ ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలను ప్రభావితపరుస్తూ ఉన్నది. తేనెలొలుకు తెలుగు తియ్యదనాన్ని ప్రచారం చేస్తూ తెలుగు మాతృభాష గల ప్రజలను, భాషాభిమానులను ఆకర్షిస్తూ ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో ఈ ఆటా వేడుకలు ఉపయోగపడుతున్నాయి.ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లసహాయ సహకారాలతో, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ & ఆటా వేడుకల కమిటీ చైర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటా వేడుకలు జరగబోతున్నాయి.డిసెంబర్ 12 - రంగా రెడ్డి జిల్లాలో స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు డిసెంబర్ 13: – సంగారెడ్డి - ఐఐటీలో స్టార్ట్ అప్ పిచ్ డిసెంబర్ 14: – హైదరాబాద్ లో సాహిత్య కార్యక్రమండిసెంబర్ 16–17: బిజినెస్ సెమినార్స్ - హైదరాబాద్, విశాఖపట్నండిసెంబర్ 20–23: స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు , స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి , ,వాటర్ ప్లాంట్ మరియు ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్.డిసెంబర్ 24–25: పిల్లల కొరకు హెల్త్ క్యాంప్స్ మరియు చారిటబుల్ ప్రోగ్రామ్స్డిసెంబర్ 27: గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతి లో - సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటా అవార్డ్స్ ప్రధానంరెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే అన్ని కార్యక్రమాలని ముగించుకుని హైద్రాబాద్లోని రవీంద్రభారతిలో జరిగే గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ఎందరో కళాకారులు. చివరగా రుచికరమైన విందు భోజనంతో ముగియబోయే ఈ వేడుకలు అమెరికాలో బాల్టిమోర్ నగరంలో జులై 31 - ఆగష్టు 2 జరగబోయే ఆటా మహాసభల సన్నాహాల కోసం అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆటా ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు రెండూ రాష్ట్రాలలో నిర్వహిచటం గమనార్హం. డిసెంబర్ మాసంలో నిర్వహించే ఆటా వేడుకలలో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గోవాలిసిందిగా ఆటా బోర్డ్ విజ్ఞప్తి చేసింది. తమ గ్రామాలూ, పట్టణాలలో సేవ కార్యక్రమాలు చేయాలనుకునే వారు www.ataworld.org సంప్రదించవలిసిందిగా కోరారు.
అమెరికాలో ఆంధ్రా తల్లి,కొడుకుల హత్య కేసులో ట్విస్ట్
అనూహ్య పరిస్థితుల్లో భార్య బిడ్డలు చనిపోయి కనిపించారు. తీరని దుఃఖంలో ఉండగానే నువ్వే నిందితుడని బంధువులు ఆరోపించారు. అనుమానాలున్నాయంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల తరువాత అసలు నిజం తెలిసింది. సంచలనంగా మారిన ఈ స్టోరీ వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.2017, మార్చి 23, ఆంధ్రప్రదేశ్కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్మెంట్లోశవాలై కనిపించారు. మహిళ భర్త నర్రా హనుమంతరావునే ప్రాథమికంగా నిందితుడిగా భావించారు. కానీ అనూహ్యం ఎనిమిదేళ్ల తరువాత నజీర్ హమీద్ అనే వ్యక్తిపై అభియోగాలు మోసారు. న్యూజెర్సీలోని ఒక కంపెనీలో శశికళ నర్రా భర్త సహోద్యోగే ఈ హత్యలకు పాల్పడినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు.శశికళ, అనిష్ హత్యఏపీకి చెందిన నర్రా హనుమంతరావు న్యూజెర్సీలోని మాపుల్ షేడ్లోని ఫాక్స్ మేడో అపార్ట్మెంట్స్లో భార్య శశికళ నర్రా(38), 6 ఏళ్ల కుమారుడు అనిష్తో కలిసి ఉండేవారు. ఒక రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు ఒళ్లంతా రక్తమోడుతూ తీవ్రమైన కత్తిపోట్లతో చనిపోయి కనిపించారు. వెంటనే హనుమంత రావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు హనుమంతరావును అరెస్ట్ చేశారు. ఈ సమయంలో దర్యాప్తు అధికారులు తమ విచారణలో భాగంగా సంఘటనా స్థలంనుంచి రక్తపు మరకల నమూనాలను సేకరించి, డీఎన్ఏ పరీక్షలు చేయించారు. అయితే అది హనుమంతరావు డీఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో ఇది మరో మలుపు తిరిగింది.ఎలా ఛేదించారంటే..బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పాట్రిక్ థోర్న్టన్ అందించిన వివరాల ప్రకారం హనుమంతరావు ఇంటికి సమీపంలోనే ఉండే హమీద్ మధ్య గొడవలు ఉన్నట్టు గురించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో పనిచేస్తున్న సమయంలో హను నర్రాను వేధించినట్లు గతంలో నజీర్ హమీద్ పై ఆరోపణలు రావడంతో ఆ వైపుగా దర్యాప్తు మెుదలుపెట్టారు. డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్ కంపెనీ,హమీద్కు జారీ చేసిన ల్యాప్టాప్ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలడంతో గుట్టు రట్టయింది.మరోవైపు జంట హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ ఇండియాకు చెక్కేశాడు. అయినా కాగ్నిజెంట్ ఉద్యోగిగా కొనసాగాడు. అంతేకాదు అమెరికా పోలీసులు హమీద్ డీఎన్ఏ కోసం చాలాసార్లు ప్రయత్నించారు. భారతీయ అధికారుల ద్వారా సంప్రదించినా స్పందించలేదు. చివరికి అతడి ల్యాప్ట్యాప్ మీద నమూనాల ఆధారంగా కేసును ఛేదించారు. మరోవైపు హమీద్ను అమెరికాకు రప్పించేందుకు భారత విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరుఈ దారుణమైన హత్యల వెనుక హమీద్ ఉద్దేశం ఏమిటనేది దర్యాప్తు అధికారులకు స్పష్టత లేదు కానీ హనుమంతరావుపై కోపంతోనే అతడి భార్య శశికళ, కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది!
గ్రామాలను దత్తత తీసుకున్న శంకర నేత్రాలయ USA మిల్వాకీ దాతలు
శంకర నేత్రాలయ USA నిర్వహించిన మిల్వాకీలో ఒక చిరస్మరణీయ రాత్రి, అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు మద్దతుగా $50,000(రూ. 43 లక్షలు) దాక సేకరించారు. భారతదేశంలోని పేద వర్గాలకు కంటి శస్త్రచికిత్సలు చేయడానికి రూపొందించబడిన అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ USA లైట్ మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించడంతో పెవాకీలోని విస్కాన్సిన్ హిందూ దేవాలయం సంస్కృతి, కరుణల శక్తిమంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఈ కార్యక్రమం దాదాపు ౩50 మంది ప్రేక్షకులతో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంలో సమాజం, కళ, సేవ, శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్-మిల్వాకీ సత్య జగదీష్ బాదం ఇలా పంచుకున్నారు. “మిల్వాకీ సేవా స్ఫూర్తితో పసిగడుతుంది. ఈ రాత్రి, మేము కలిసి వచ్చాం. కేవలం సేకరించడానికికాదు, ఉమ్మడి ఉద్దేశ్యం ద్వారా జీవితాలను ప్రకాశవంతం చేయడానికి.” "శంకర నేత్రాలయ USA టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లోకి తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. దృష్టి లోపాలతో బాధపడుతున్న నిరుపేద వ్యక్తులకు సేవ చేయాలనే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మిల్వాకీ నుంచి ఉత్సాహభరితమైన మద్దతు మాకు ప్రోత్సాహాన్నిచ్చింది" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందూర్తి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో..పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ సత్య జగదీష్ బాదం, కమిటీ సభ్యులు డాక్టర్ హరి బండ్ల, పోలిరెడ్డి గంటా, చాప్టర్ లీడ్స్ మహేష్ బేలా మరియు అర్జున్ సత్యవరపు, వాలంటీర్లు ఆనంద్ అడవి, సాయి యార్లగడ్డ, రవి నాదెళ్ల, శ్రీని కిలిచేటి, చండీ ప్రసాద్, క్రాంతి మల్రెడ్డి, గుప్తా కళ్లేపల్లి, పవన్ శ్రీభాష్యం, విజయ్ వల్లూరి, చంద్రశేఖర్ గుడిసె, కరుణాకర్ రెడ్డి దాసరి, రత్నాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, కొండారెడ్డి, వెంకట్ శశి కొద్దంరెడ్డి, వౌనద్ శవధరి, వెంకట్ జాలరి రెడ్డి రెడ్డి, గోపాల్ గారు, రాజా బాబు నేతి, విక్రాంత్ రెడ్డి, గోపాల్ సింగ్, శ్రీనివాస్ నిమ్మ, రంజిత్, శ్రావణి మీసరగండ, వాసవి బాదం, ప్రీతి, కీర్తి, లావణ్య, సునీత, పావని గంట, చంద్రిక, సంతోషి, భాను, సరోజిని, కావ్య వి, రాధిక పెబ్బేటి, శరణ్య రాఘవ, శరణ్య జాలరి, కిరణ్య జ్ఙాపక ముత్తూరు, డీఎస్ రెడ్డి, రవి కుమార్ గుంత, రమేష్ పుసునూరు, శ్రీనివాస్ యూర్కేరి, ప్రమోద్ అల్లాణి, పవన్ జంపాని, ప్రీతి శర్మ, అనిల్ పబ్బిశెట్టి. రాజ్ వధేరాజ్, యాజులు దువ్వూరు, ఫణి చప్పిడి, దుర్గ, ధనలక్ష్మి, కార్తీక్ పాసెం, భారతి కొల్లి, ఉమాదేవి పువ్వాడి, దుర్గా బండారుపల్లి, వెంకట కుందూరి, డా. రెడ్డి ఊరిమిండి, మూర్తీ రేకపల్లి,శ్యాంఅప్పాలి, వంశీ ఏరువారం, రత్నకుమార్కవుటూరు, త్యాగరాజన్, దీన్ దయాళన్, సురేశ్ కుమార్లు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన బృందం శంకర నేత్రాలయ సేవా లక్ష్యం పట్ల అంకితభావం, సహకారం, భాగస్వామ్య నిబద్ధతను ఉదహరించారు. చంద్ర మౌళి తమ వందన సమర్పణలో కార్యక్రమ వ్యాఖ్యాతలు మాలతి కర్రి, శ్రీ వల్లిల సహకారాన్ని గుర్తించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు .
సింగపూర్లో కార్తీకమాస స్వరారాధన
సింగపూర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సాంస్కృతిక సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారథి", ఈ పవిత్ర కార్తీకమాస సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో శనివారం "కార్తీకమాస స్వరారాధన" అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach)బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే సింగపూర్ గాయని గాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కానీ ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడడం చాలా అభినందనీయం" అని తెలియజేశారు.డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ ప్రసంగంలో మాట్లాడుతూ కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరిస్తూ, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.సంస్థ ప్రధాన నిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభా సమన్వయం చేయగా, సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సభలో, సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు. వానిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండడం విశేషం.కల్చరల్ టీవీ సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం ఎప్పటివలే అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది. (చదవండి: జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు)
క్రైమ్
లెంగిక వేధింపుల కేసులో ఇద్దరు అధ్యాపకుల అరెస్ట్
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో ఇటీవల సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. బాధితురాలు స్వరాష్ట్రం ఒడిశాకు తిరుపతి పోలీసుల బృందం మంగళవారం చేరుకుంది. ఒడిశా జార్హ్పూర్లో బాధితురాలిని మహిళా ఎస్ఐ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి వివరాలను సేకరించారు. యువతి స్టేట్మెంట్ను వీడియో రికార్డ్ చేసి భద్రపరిచారు. ఇప్పటికే ఈ కేసు విషయంపై తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ వేదికగా ప్రస్తావించడంతో ఇటు పోలీసులు, అటు వర్సిటీ అధికారులలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. అధ్యాపకుడు లక్ష్మణ్ కుమార్ తనను పలు మార్లు లైంగికంగా వేధించారని, మరో అధ్యాపకుడు శేఖర్రెడ్డితో ఏకాంతంగా గడిపిన వీడియోలు ఉన్నాయంటూ లక్ష్మణ్ కుమార్ పలుమార్లు బెదిరింపులకు దిగారని బాధితురాలు తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ స్టేట్మెంట్లను ఆధారం చేసుకొని, పోలీసులు ఆ ఇద్దరి అధ్యాపకులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈస్ట్ పోలీసులు స్థానిక డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం అధ్యాపకులకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది.
మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి
హైదరాబాద్: పుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి భార్యతో గొడవ పడి విచక్షణా రహితంగా ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాంనగర్కు చెందిన చాకలి గోపాల్, శైలజ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్ ఎయిర్పోర్టు బస్సు డ్రైవర్గా పనిచేస్తుండగా శైలజ వారు నివాసం ఉండే అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తుంది. గోపాల్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి శైలజను వేధిస్తున్నాడు. దీనిపై ఇటీవలే ఆమె సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సలహా ఇవ్వడంతో తిరిగి ఇంటికి వచి్చంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి పుల్లుగా మద్యం తాగి వచి్చన గోపాల్ భార్యతో గొడవకు దిగి..వంటింట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా పొడిచాడు. దాదాపు 20 నుంచి 25 కత్తిపోట్లు పొడవడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. పిల్లలు చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడిన గోపాల్ అనంతరం పారిపోయాడు. శైలజ అరుపులకు బయటకు వచి్చన చుట్టుపక్కల వారు ఆమెను అంబర్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ రాంచంద్రారెడ్డి కేసు నమోదు చేసి..మంగళవారం నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
వీరబల్లి : సోమవరం పంచాయతీలోని సోమవరం వడ్డిపల్లిలో దీపిక (16) అనే మైనర్ బాలిక అనుమానాసపద స్థితిలో మంగళవారం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. దీపిక తల్లిదండ్రులు రెండు నెలల నుంచి సోమవరం వడ్డిపల్లిలో నాగేంద్ర అనే యజమాని దగ్గర ఎనుములు మేపుతూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వారు నివాసం ఉంటున్న రేకుల గదిలో అనుమానాస్పద స్థితిలో దీపిక మృతి చెందింది. బాలిక తల్లి లక్ష్మీదేవిది కోడూరు నియోజకవర్గంలోని సిద్దారెడ్డిగారిపల్లి కాగా ఈమె మొదట వివాహం చేసుకున్న భర్తను వదిలేసి వీరబల్లి మండలం, సోమవరం వడ్డిపల్లికి చెందిన నాగరాజును రెండో వివాహం చేసుకుంది. వీరు ఎనుములు మేపుకుంటూ ఉండేవారు. నెల క్రితం సొంత ఊరికి వెళ్లి మొదటి భర్త దగ్గర ఉన్న దీపికను తీసుకు లక్ష్మిదేవి వడ్డిపల్లికి వచ్చింది. ఇంతలోనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక..
నల్లగొండ, మర్రిగూడ: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్లో జరిగింది. టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, రమణమ్మ దంపతుల కుమార్తె శ్రుతి (20) నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ.. స్థానికంగా రవీంద్రనగర్లోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటోంది. శ్రుతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంటికి వెళ్తానని హాస్టల్ వార్డెన్కు లీవ్ లెటర్ రాసి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. బాత్రూమ్లో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రుతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వీడియోలు
లోక్ సభలో అమిత్ షా స్పీచ్
Priyanka: 'కల్కి 2' నుంచి షాకింగ్ అప్డేట్.. కామెంట్స్ వైరల్
Nivetha: ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్
మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
ప్రైవేటీకరణ ఆపండి నిర్మలా సీతారామన్కు YSRCP ఎంపీల ఫిర్యాదు
మీ ఓటమి ఖాయం...TDP MLA భాష్యం ప్రవీణ్ మొహం మీదే చెప్పేసిన మహిళ
కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్న కూటమి కార్యకర్తలు
Surat: భారీ అగ్నిప్రమాదం కాలిబూడిదైన టెక్స్టైల్ మార్కెట్
Buggana: ప్రతి నెల 9వేల కోట్లు చంద్రబాబు అప్పులు చేస్తున్నారు
లక్ష్యానికి మించి YSRCP కోటి సంతకాల సేకరణ

