ఈసారి బాబు పప్పులు ఉడకలేదు!
ఎవరైనా మీతో అభ్యంతరకరంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెంటనే ఆయనకు ధీటుగా జవాబిస్తారు. అలా కాకుండా మీ పక్కనున్న వ్యక్తిని తిట్టారనుకోండి.. దానిని ఏమంటారు? ఏదో భయంతో అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే కదా! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అదే పని చేశారు. తాను కోరితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటిస్తే చంద్రబాబు జవాబు ఇవ్వకపోగా... వైఎస్సార్ కాంగ్రెస్పై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేశారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు.. మంత్రులతో మాట్లాడించారు. అంతేకాక మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుని, గోదావరి జలాల గురించి, రాష్ట్రాల మధ్య సహకారం గురించి సుద్దులు చెప్పారు. పోనీ చంద్రబాబు నిజంగానే అంత చిత్తశుద్దితో ఈ విషయాలు మాట్లాడారా అంటే అదీ కనిపించదు. ఆయన విపక్షంలో ఉంటే ఒక రకం, అధికారంలో ఉంటే మరో రకం. చంద్రబాబు గత చరిత్ర అంతా ఇలా వైరుధ్యాలతోనే సాగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో 2011లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కొన్నిచోట్ల టీడీపీ కూడా పోటీచేసింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నందున గెలిచే అవకాశాలు లేవన్న అంచనాకు వచ్చారు. అందువల్ల పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసే సానుకూల పరిస్థితులు లేవని భావించిన చంద్రబాబు వెంటనే డైవర్షన్ రాజకీయం చేశారు. మహారాష్ట్రలో కట్టిన బాబ్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, రెండు రాష్ట్రాల ఒప్పందానికి వ్యతిరేకంగా నిర్మించారని ఉమ్మడి ఏపీ రాజకీయ పార్టీలు ఆరోపించేవి. ఆ వివాదాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా తన భుజాన వేసుకుని ఆ ప్రాజెక్టుపై పోరాటం ప్రకటించారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాజెక్టును సందర్శించి హడావుడి చేయడానికి సిద్దమయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సుమారు 75 మందిని వెంటబెట్టుకుని దండయాత్ర మాదిరి మహారాష్ట్రకు బయల్దేరారు. ఆ రాష్ట్ర పోలీసులు దానిని అడ్డుకున్నారు. వారు పెట్టిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే యత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వారిని వదలిపెట్టేశారు. అయినా తమను బాబ్లి ప్రాజెక్టు వద్దకు మీడియాతో సహా అనుమతించాలని డిమాండ్ చేస్తూ అక్కడే భైఠాయించారు. ఒక దశలో లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. దీనికి ముందు రాష్ట్ర సరిహద్దులో దాదాపు గంటన్నర సేపు వీరంతా ధర్నా చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి రావాలంటే పాస్ పోర్టు కావాలా అని కూడా ఆయన ప్రశ్నించారు. తాము యుద్దం చేయడానికి రాలేదంటూనే అంటూనే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు చంద్రబాబుతో సహా ఆందోళనకారులపై కేసు పెట్టి అరెస్టు చేశారు.వారందరిని ఒక కాలేజీ ఆవరణలో ఉంచారు. .ఆ సమయంలో కొందరు నేతలు అక్కడనుంచి వచ్చేసినా, ఎక్కువమంది కేసులో ఇరుక్కున్నారు. కేసు రిజిస్టర్ కావడంతో టిడిపి నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు పరిస్థితిని టీడీపీ నేతలు వివరించడంతో ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఏపీకి తీసుకువచ్చారు. ఆ కేసు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణకు వచ్చే సమయానికి చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం కావడంతో బిజీ షెడ్యూల్స్ అంటూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అక్రమంగా నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు నీటి సంక్షోభం వస్తుందని ఆరోపించేవారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేది రెండు,మూడు టీఎంసీలే కావడం విశేషం. విపక్షంలో ఉండగా చంద్రబాబు వ్యవహరించిన తీరు అది. అప్పుడు రాష్ట్రాల మధ్య రాజకీయాలు వద్దని అనలేదు. ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని అనేవారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నట్లు ఆయన ఫీల్ కాలేదు. ఇప్పుడేమో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వల్ల వచ్చేవి 22 టీఎంసీలే అంటూ అర్ధం లేని వాదన తీసుకువచ్చారు. అది నిజమే అయితే రేవంత్ కు ఆ మాటే చెప్పి ఉండవచ్చు కదా! ఈ స్కీమ్ వల్ల రాయలసీమకు పెద్దగా కలిసి వచ్చేది లేదని, అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడనవసరం లేదని లేఖ రాసి ఒప్పించి ఉండవచ్చు కదా! రేవంత్ తో కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం ఏర్పడినా చంద్రబాబు మాత్రం దానిని ఖండించలేకపోయారు. దీంతో రేవంత్ చెప్పిందంతా నిజమేనని, ఆయన డిమాండ్కు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను చంద్రబాబు నిలిపివేశారని ఏపీ ప్రజలకు అర్థమైంది. తన శిష్యుడుగా పేరొందిన రేవంత్ ను ఒక్క మాట అనలేకపోవడంతో ఈయనలో ఏదో భయం ఉందన్న భావన రాజకీయవర్గాలలో ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కు స్టే వచ్చిందని తొలుత ప్రచారం చేశారు. అయినా జగన్ పనులు ఎక్కడా ఆపకుండా 85 శాతం పూర్తి చేశారని వీడియోలతో సహా కధనాలు రావడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే అవసరం లేదన్నట్లు మాట్లాడి మరింత తప్పు చేశారు.ఒక తప్పును కవర్ చేసుకోబోయి మరిన్ని తప్పులు చేశారన్నమాట. పోనీ అన్ని ప్రాజెక్టులు అనుమతులతోనే ఆరంభం అవుతున్నాయా అంటే ఏ రాష్ట్రంలో అలా జరగదు.చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తం పట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను అలాగే చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అనుమతులు కేంద్రం నుంచి సాధించే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే కుడి, ఎడమ కాల్వలను తవ్వించారు. కుడి కాల్వకు టిడిపి వారే అడ్డుపడడానికి యత్నించిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు తాను అడ్డు పడడం లేదని చంద్రబాబు ఏపీలో ఆయా సభలలో చెప్పడాన్ని ఎద్దేవ చేస్తూ తెలంగాణకు చెందిన 16 ప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ మీడియా వెల్లడించింది.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2015-2017 మధ్య ఐదుసార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు ఎలా రాశారని ఆ మీడియా ప్రశ్నించింది. ఇదే కాదు..ఓటుకు నోటు కేసు సమయంలో హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని, గవర్నర్ శాంతిభద్రతలు పర్యవేక్షించాలని, ఏపీ ప్రభుత్వం కూడా హైదరాబాదఃలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని చంద్రబాబు బృందం వాదించేది. మరో విశేషం ఏమిటంటే ఓటుకు నోటు కేసు గురించి చెప్పమంటే, కేసీఆర్ టెలిఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించేవారు. ఏపీలో కేసీఆర్పై కేసులు పెట్టించారు.ఆత్మరక్షణలో పడిన ప్రతిసారి ఇలా డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని చరిత్ర చెబుతోంది. అయినా ఈసారి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విషయంలో మాత్రం డైవర్షన్ రాజకీయం ఫలించలేదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
మెడికల్ కాలేజీ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
కడప: మెడికల్ కాలేజీ ఉద్యోగులపై మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. మెడికల్ కాలేజ్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బదిలీ చేసింది. .పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 సీట్లు రావడంతో పీపీపీ కింద ప్రైవేట్ పరం చేయనున్న కాలేజీల్లో ఉద్యోగుల బదిలీ చేస్తోంది ప్రభుత్వం. వారిని పొమ్మనలేక పొగబెట్టినట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కాలేజీల నుంచి 600 మంది ఉద్యోగుల బదిలీ చేసింది. తక్కువ జీతంతో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు ఈ బదిలీలు శరాఘాతంగా మారాయి. మరొకవైపు 600 మంది ఉద్యోగుల బదిలీతో ప్రశ్నార్థకంగా మారింది ఆయా మెడికల్ కాలేజీల భవితవ్యం. వైఎస్ జగన్ హయాంలో వారి నియామకం జరిగిందనే అక్కసుతోనే ఈ బదిలీలు అనే విమర్శ వినిపిస్తోంది. ఆయా మెడికల్ కాలేజీల నుంచి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలు తరలింపు ఇప్పటికే జరిగిపోగా, ఇప్పుడు ఉద్యోగుల బదిలీ కార్యక్రమం చేపట్టింది కూటమి సర్కారు. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, పలువురు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం బదిలీ చేస్తూ వస్తుంది. మరో వైపు పీపీపీ టెండర్లలో ఆయా మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు సంస్థలు ముందుకు రాకపోగా, బదిలీలతో పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
జనవరి 12న తిరువాభరణం అభరణాల ఊరేగింపు
శబరిమల అయ్యప్పస్వామి తిరువాభరణం అభరణాల ఊరేగింపుకు ఎన్నికైన ప్రతినిధుల బృంధాన్ని ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. మెుత్తం మెుత్తం 30 మందితో కూడిన సహాయకుల బృందాన్ని అయ్యప్ప అభరణాల ఊరేగింపుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. జనవరి 12న మద్యాహ్నం ఒంటిగంటకు ఈ ఊరేగింపు ప్రారంభం కానుంది. నారాయణ స్వామిరాజు ఆధ్వర్యంలో మారుతమాన శివన్కుట్టి గురుస్వామితో సహా ఇతర భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. శబరిమల అయ్యప్పస్వామికి దర్శనంలో ఎంతో తిరువాభరణం అభరణాల ఊరేగింపు ఎంతో ప్రత్యేకమైనది. అయ్యప్ప భక్తులకు మకరసంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారు. అంతకుముందు స్వామివారిని ఈ అభరణాలతో అలంకారం చేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. పంబల రాజుకిచ్చిన మాట ప్రకారం అయ్యప్పస్వామి ప్రత్యేక అభరణాల( కిరీటం, కంఠాభరణాలకు) పందల రాజవంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వారి చేతుల మీదుగా ఊరేగి్ంపు ప్రారంభమవుతుంది.రేపు (జనవరి 13) సాయంత్రానికి అభరణాలు శబరిమల సన్నిధానానికి చేరుకుంటాయి. మార్గమధ్యంలో ఉన్న గ్రామాలలో భక్తులు ఈ ఊరేగింపుకు ఘనస్వాగతం పలుకుతారు. జనవరి 14న ఉదయం అయ్యప్పకు ఈ అభరణాలతో అలంకరిస్తారు. అనంతరం సాయంత్రం లక్షలాధి భక్తులకు అయ్యప్ప జ్యోతిరూపంలో దర్శనమిస్తారు. 41రోజుల స్వామివారి దర్శనం కోసం కఠిన దీక్ష చేసిన భక్తజనులు స్వామివారి దర్శనంతో పులకించిపోతారు. ఆ సమయంలో శబరిమల క్షేత్రం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మార్మోగిపోతుంది. జ్యోతి దర్శనంతో అయ్యప్ప దీక్ష సంపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం.
వైఎస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్
సాక్షి నెల్లూరు : కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. సోమశిల డ్యామ్ పరిశీలనకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలు కాకాణి చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిలను అడ్డుకున్నారు. ఈరోజు (శనివారం) సోమశిల డ్యామ్ పరిశీలనకు వెళ్లాలని చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి కార్యక్రమం రూపొందించారు. అయితే వారి పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆనేతలను అక్రమంగా హౌస్ అరెస్టు చేశారు. అనంతరం వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఇలా జరుగుతుందనుకోలేదు, సారీ..: మారుతి
మీర్పేట తల్లీబిడ్డ కేసులో బిగ్ ట్విస్ట్!
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు.. మంత్రి కోమటిరెడ్డి ఆవేదన
T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన గిల్
మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. వరుణవి కోసం..
తెలుగు సినిమాలకు 'ప్రీమియర్ షోలు' అవసరమా?
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్
‘ఆ ప్రాంతంలో అవినీతి జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించకూడదు?’
అరియానా ఆఫ్గన్ విమాన ప్రమాదం: ఆ ఒక్క పొరపాటుతో..
పీఎఫ్ భాగ్యం మరింత మందికి దక్కుకుందా?
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్'.. వీడియో వైరల్
ట్రంప్ ఉపసంహరణ తంత్రం
పడిపోయిన బంగారం, వెండి ధరలు
హార్దిక్ పాండ్యా మహోగ్రరూపం
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
వెన్నుపోటు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. నాడు మామకు.. నేడు సీమకు
ఇప్పటికే అప్పుల్లో, ప్రజలను నమ్మించి మోసం చేయడంలో నెంబర్.1 మనమే సార్!
IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!
తారుమారైన బంగారం, వెండి ధరలు..
‘వెండి పని’ పడదాం.. ‘సిల్వర్ సెక్యూరిటీ’ అవసరం
తెలంగాణలో నాయకుల తిట్ల పురాణం
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
నన్ను ముద్దు చేస్తున్నాడనుకున్నా.. కోరికలు తీర్చుకున్నాడు!
భారత్లో ఆడబోము..! బంగ్లా డిమాండ్పై స్పందించిన బీసీసీఐ
వెనెజువెలా చమురు.. అంత వీజీ కాదు ట్రంపూ!
ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన టీసీఎస్
..దాని దారి మళ్ళించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నార్సార్ శాస్త్రవేత్తలు!
ఎంత తాగినా కిక్కే రావడం లేదు.. పెంచిన ధరలే గుర్తొస్తున్నాయి!!
ఇలా జరుగుతుందనుకోలేదు, సారీ..: మారుతి
మీర్పేట తల్లీబిడ్డ కేసులో బిగ్ ట్విస్ట్!
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు.. మంత్రి కోమటిరెడ్డి ఆవేదన
T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన గిల్
మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. వరుణవి కోసం..
తెలుగు సినిమాలకు 'ప్రీమియర్ షోలు' అవసరమా?
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్
‘ఆ ప్రాంతంలో అవినీతి జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించకూడదు?’
అరియానా ఆఫ్గన్ విమాన ప్రమాదం: ఆ ఒక్క పొరపాటుతో..
పీఎఫ్ భాగ్యం మరింత మందికి దక్కుకుందా?
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్'.. వీడియో వైరల్
ట్రంప్ ఉపసంహరణ తంత్రం
పడిపోయిన బంగారం, వెండి ధరలు
హార్దిక్ పాండ్యా మహోగ్రరూపం
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
వెన్నుపోటు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. నాడు మామకు.. నేడు సీమకు
ఇప్పటికే అప్పుల్లో, ప్రజలను నమ్మించి మోసం చేయడంలో నెంబర్.1 మనమే సార్!
IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!
తారుమారైన బంగారం, వెండి ధరలు..
‘వెండి పని’ పడదాం.. ‘సిల్వర్ సెక్యూరిటీ’ అవసరం
తెలంగాణలో నాయకుల తిట్ల పురాణం
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
నన్ను ముద్దు చేస్తున్నాడనుకున్నా.. కోరికలు తీర్చుకున్నాడు!
భారత్లో ఆడబోము..! బంగ్లా డిమాండ్పై స్పందించిన బీసీసీఐ
వెనెజువెలా చమురు.. అంత వీజీ కాదు ట్రంపూ!
ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన టీసీఎస్
..దాని దారి మళ్ళించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నార్సార్ శాస్త్రవేత్తలు!
ఎంత తాగినా కిక్కే రావడం లేదు.. పెంచిన ధరలే గుర్తొస్తున్నాయి!!
ఫొటోలు
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన.. ఆషికా, డింపుల్ (ఫొటోలు)
'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)
క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు (ఫొటోలు)
తెలంగాణ : సంక్రాంతి సంబరాలలో సచివాలయం ఉద్యోగులు (ఫొటోలు)
ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్
నగరంలో హీరోయిన్ డింపుల్ హయతీ సందడి (ఫొటోలు)
విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్ (ఫొటోలు)
సినిమా
నావాడిని కలిసానోచ్.. ఫోటో షేర్ చేసిన రోహిణి!
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది నటి రోహిణి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ధారావాహికలో రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. నటిగా, కమెడియన్గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. నావాడిని కలిశా..మత్తు వదలరా, బలగం, హను-మాన్ వంటి సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్, ఎల్జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్) వెబ్సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. మధ్యలో తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఆటతో, మాటతో, కామెడీతో ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా రోహిణి ఓ అబ్బాయితో క్లోజ్గా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. నావాడిని కలిశాను అంటూనే ఓ ట్విస్ట్ ఇచ్చింది. షాకయ్యారా?ఇంతమంచి హ్యాండ్సమ్ అబ్బాయిని ఇచ్చిన చాట్జీపీటీకి థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఫస్ట్ ఈ ఫోటో చూడగానే అభిమానులే కాదు బుల్లితెర సెలబబ్రిటీలు కూడా రోహిణి ప్రియుడు అని పొరబడ్డారు. తర్వాత క్యాప్షన్ చూసి ఏఐ (కృత్రిమ మేధ) మాయాజాలమా.. అని నోరెళ్లబెడుతున్నారు.నిజమైతే బాగుండు యాంకర్ అరియానా అయితే సీరియస్గా అక్కా.. ఒక్క క్షణం నిజమే అనుకున్నా.. చాలా సంతోషంగా ఫీలయ్యా అంది. అందుకు రోహిణి స్పందిస్తూ.. నిజమైతే బాగుండు అని రిప్లై ఇచ్చింది. సింగర్ గీతామాధురి.. ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికేద్దాం అని ఫన్నీగా కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) చదవండి: అది సవాల్గా అనిపించింది: ఆషికా రంగనాథ్
హీరోగా అన్న కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేశ్
సూపర్స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రాగా ఇప్పుడు మహేశ్ చేతుల మీదుగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలానే చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)మహేశ్ కుటుంబం నుంచి త్వరలో చాలామంది వారసులు.. ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. వాళ్లలో తొలుత జయకృష్ణ లాంచ్ కాబోతున్నాడు. ఇతడు మహేశ్ అన్న రమేశ్ బాబు కొడుకు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తీస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడు. రషా తడానీ హీరోయిన్. కొన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలు కాగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బులెట్పై గన్ పట్టుకుని ఉన్న లుక్ బాగుంది.ఇందులోనే మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే రూమర్ కొన్నిరోజుల క్రితం వచ్చింది గానీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంటివి వస్తే ఆయన ఉన్నారా లేదా అనేది క్లారిటీ రానుంది. ఈ ఏడాదిలో మూవీ థియేటర్లలోకి రానుంది. ఎప్పుడు ఏంటనేది త్వరలో చెబుతారు. జయకృష్ణ కాకుండా మహేశ్ కొడుకు గౌతమ్, కూతురు సితార. అలానే రమేశ్ బాబు కూతురు భారతి. మహేశ్ సోదరి మంజుల కుమార్తె జాన్వీ కూడా త్వరలో తెరంగేట్రం చేయనున్నారు.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్')Happy to unveil the first look of #SrinivasaMangapuram… 🤗🤗🤗Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.A strong team and an interesting beginning… all the best to the entire team 👍🏻👍🏻👍🏻@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026
ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్'
'నాన్న-పులి' కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఏం చెప్పినా నిజాయితీగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే రిస్క్. వందల కోట్లతో డీల్ చేసే సినిమా ఇండస్ట్రీలోనూ ప్రేక్షకులతో పరాచకాలు ఆడకూడదు. ఎందుకంటే దక్షిణాదిలో కొందరు దర్శకులు సినిమాలతో బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ తమ క్రియేటివిటీతో థియేటర్కి వచ్చేవాళ్లని మోసం చేస్తున్నారు. తాజాగా వచ్చిన 'రాజాసాబ్'తో మరోసారి అలాంటిదే రిపీటైంది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)'రాజాసాబ్'నే తీసుకుందాం. ప్రభాస్.. ఓల్డ్ గెటప్ని ఫస్ట్ లుక్గా రిలీజ్ చేశారు. ట్రైలర్లో చూపించారు. ఈ గెటప్కి అదిరిపోయే డైలాగ్స్, ఫైట్ సీక్వెన్స్ ఉందని ఊరించి అభిమానులకు ఆశలు పెంచేశారు. కట్ చేస్తే మూడు గంటల సినిమాలో దీనికి సంబంధించిన ఒక్క సీన్ లేదు. కథకు అడ్డొస్తుందని తీసేశారా? సీక్వెల్ కోసం దాచుకున్నారా? తెలియదు. ఇప్పుడొచ్చిన ఫస్ట్ పార్ట్లో ఇది ఉండదు అని ఫిక్సయినప్పుడు.. ప్రమోషన్లలో వీటిని ఉపయోగించడం అవసరమా? అసలు సినిమాకు కాస్తోకూస్తో హైప్ ఏర్పడిందే ఈ లుక్ వల్ల. అలాంటి ఈ గెటప్ సీన్స్ తీసేస్తే.. ప్రేక్షకుల్ని మోసం చేసినట్లేగా!గతంలోనూ ఇలాంటి షాకులే స్టార్ హీరోల సినిమాలతో దర్శకులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళ దర్శకుడు శంకర్.. చాన్నాళ్ల క్రితమే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 'రోబో' తర్వాత విక్రమ్ హీరోగా 'ఐ' అనే స్ట్రెయిట్ సినిమా తీశాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్లో విక్రమ్ బీస్ట్(జంతువు గెటప్)లా కనిపించడం చూసి అంతా వావ్ అని ఆశ్చర్యపోయారు. లుక్కే ఇంత బాగుందంటే సినిమాలో ఆయా సీన్స్ ఇంకెలా ఉంటాయోనని తెగ ఊహించేసుకున్నారు. కట్ చూస్తే పాటలో ఒకటి రెండు సీన్స్లో మాత్రమే దీన్ని చూపించి మోసం చేశారు!(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)మహేశ్ బాబు 'స్పైడర్' సినిమా నుంచి తొలి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు.. మెషీన్ స్పైడర్ని చూపించి హైప్ ఇచ్చారు. కానీ దీన్ని సినిమాలో ఎక్కడా పెట్టలేదు. ప్రమోషన్ కోసమే చేసింది ఇది అని అభిమానులు, ప్రేక్షకులకు ముందే చెప్పి ఉంటే బాగుండేది. కానీ మూవీ టీమ్ అలా చేయలేదు. తీరా సినిమా రిలీజయ్యా ప్రేక్షకులు.. చాలా డిసప్పాయింట్ అయ్యారు. దర్శకుడిని గట్టిగా తిట్టుకున్నారు.రజనీకాంత్ 'కూలీ' ఫస్ట్ లుక్, గ్లింప్స్లో గోల్డెన్ వాచీలని హైలైట్ చేసి చూపించారు. దీంతో చాలామంది ఆడియెన్స్.. ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అని రకరకాల థియరీలు వేసుకున్నారు. అది వాచీల స్మగ్లింగ్ కోసమే అని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీరా రిలీజైన తర్వాత మూవీ చూస్తే ఈ వాచీల కాన్సెప్ట్కి సినిమాలో అసలు ప్రాధాన్యమే లేదు. ఇది తెలిసి చాలామంది ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఇలా పలుమార్లు పలువురు దర్శకులు.. ఫస్ట్ లుక్తో ఒకలా, మూవీలో ఆ కాన్సెప్ట్ మరోలా చూపించి మోసం చేశారు!(ఇదీ చదవండి: జనవరి 10.. టాలీవుడ్ భయపడుతోందా?)
'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?
ప్రభాస్ లేటెస్ట్ సినిమా 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం రాత్రి ప్రీమియర్లతో షోలు మొదలయ్యాయి. అయితే హారర్ ఫాంటసీ మూవీతో డార్లింగ్ హిట్ కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. అభిమానులకు అంతో ఇంతో నచ్చింది కానీ సగటు ప్రేక్షకుడి నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. మరి ఇలాంటి టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? మార్కెట్లో వినిపిస్తున్న నంబర్స్ ఏంటి?ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తీశారు. హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ అని అన్నారు గానీ ఇందులో హిప్నాటిజం, మైండ్ గేమ్, సైకాలజీ, ప్యారలల్ వరల్డ్.. ఇలా చాలా అంశాల్ని చూపించి వివరించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారు. దీని వల్లే మూవీకి నెగిటివ్ టాక్ వస్తోంది. అలా అని బుకింగ్స్ ఏం డల్లుగా లేవు. తొలిరోజు డీసెంట్ నంబర్స్ నమోదయ్యాయి.(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)ప్రీమియర్లు, తొలిరోజు కలిపి 'రాజాసాబ్' చిత్రానికి రూ.55-60 కోట్ల మధ్య నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. మూవీ టీమ్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేస్తే, దానిబట్టి వసూళ్ల విషయంలో ఓ అంచనాకు రావొచ్చు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోకి ఈ కలెక్షన్ అనేది ఊహించిన దానికన్నా తక్కువే అని చెప్పొచ్చు. అసలు నంబర్స్ వస్తే ఎంతనేది క్లారిటీ వస్తుంది.'రాజాసాబ్' స్టోరీ విషయానికొస్తే.. దేవనగర సంస్థానానికి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్). కానీ కొన్ని కారణాల వల్ల మనవడు రాజుతో(ప్రభాస్) కలిసి సాధారణంగా బతికేస్తూ ఉంటుంది. మతిమరుపు సమస్య ఈమెకు ఉన్నప్పటికీ భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని మనవడిని కోరుతుంది. దీంతో రాజాసాబా.. నర్సాపుర్ అడవిలోని రాజమహల్కి వెళ్తాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? ముగ్గురమ్మాయిలతో భైరవి(మాళవిక), బెస్సీ(నిధి అగర్వాల్), అనిత్ (రిద్ధి కుమార్) రాజాసాబ్కి సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!)
క్రీడలు
ఇక్కడ కూడా వదలరా?.. స్మృతి రియాక్షన్ వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026ను విజయంతో ఆరంభించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన WPL ఓపెనర్లో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.సౌతాఫ్రికాకు చెందిన నదినె డి క్లెర్క్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీకి సంచలన విజయం అందించింది. దీంతో ఆర్సీబీ ఖాతాలో తొలి గెలుపు నమోదైంది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా స్మృతి మంధాన (13 బంతుల్లో 18) విఫలమైనా.. కెప్టెన్గా మాత్రం హిట్టయ్యింది.ఇక ఆటకు తోడు అందంతో మెరిసే స్మృతి మంధానకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లి మాదిరే స్మృతి పట్ల కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ వీరాభిమానం చూపిస్తారు. అందుకే కెమెరామెన్ సైతం మైదానంలోపలా, వెలుపలా ఆమెపైనే ఎక్కువగా దృష్టి పెడతాడు.ఇక్కడ కూడా వదలరా?ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మైదానంలో బ్యాట్తో స్మృతి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ కెమెరామెన్ ఆమెకు దగ్గరగా వచ్చి ఫొటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో కాస్త చిరాకుపడిన స్మృతి.. ‘‘ఇక్కడ కూడా వదలరా? ఏంటి భయ్యా ఇది?’’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది.మాకు అలవాటేఇక తొలి మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించడం పట్ల స్మృతి హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠ పోరులో గెలవడం తమకు అలవాటేనని.. నదినె వల్లే ఈ గెలుపు సాధ్యమైందని ప్రశంసించింది. జట్టులోని ప్రతి ఒక్కరు సానుకూల దృక్పథంతో ముందుకు సాగారని కొనియాడింది.కాగా స్మృతి వ్యక్తిగత జీవితంలో ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ ముచ్చల్తో పెళ్లి పీటలు ఎక్కే కొన్ని గంటలకు ముందు.. హఠాత్తుగా వివాహం ఆగిపోయింది. పలాష్ ఆమెను మోసం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.డబ్ల్యూపీఎల్-2026: ముంబై వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉ముంబై: 154/6(20)👉ఆర్సీబీ: 157/7(20)👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నదినె డి క్లెర్క్ (4/26, 44 బంతుల్లో 63 నాటౌట్).చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలుCameraman not leaving Smrithi alone to practice and see Smrithi’s reaction 😂 pic.twitter.com/QVF8q4WTzw— RCB (@RCBtweetzz) January 9, 2026
మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బంగ్లాదేశ్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడుతుందా?.. బంగ్లా డిమాండ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?.. ఈ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యమిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైఖరి ఎలా ఉండబోతోంది?.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశాల గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది.బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడుల నేపథ్యంలో భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ను బీసీసీఐ తొలగించింది. ఈ క్రమంలో భద్రతా కారణాలు చూపుతూ వరల్డ్కప్ ఆడేందుకు తాము భారత్కు రాలేమని.. శ్రీలంకలో తమ మ్యాచ్లు నిర్వహించాలని బంగ్లా బోర్డు.. ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.గందరగోళంలో ఆటగాళ్లుఅయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయం కూడా లేనందున ఈ మార్పు కుదరకపోవచ్చని ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డు(BCB)కు సంకేతాలు ఇచ్చింది. అయినప్పటికీ బీసీబీ తమ పట్టువీడటం లేదు. దీంతో బంగ్లాదేశ్ లేకుండానే టోర్నీ నిర్వహించే పరిస్థితులు రావొచ్చనే ఆందోళనలు ఆ దేశ ఆటగాళ్లలో నెలకొన్నాయి.ఐసీసీతో పంచాయతీ వద్దని, తెగేదాక లాగవద్దంటూ బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ హితవు పలికితే.. బీసీబీ అధికారి అతడిని ‘ఇండియన్ ఏజెంట్’ అంటూ ఆరోపణలు చేశాడు. మరోవైపు.. బంగ్లా కీలక ఆటగాళ్ల బ్యాట్ స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు తప్పుకొనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో నష్టపోతారు.అంగారక గ్రహంపైకి పంపించినాఅయినా సరే బీసీబీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్కప్ జట్టులో భాగమైన మెహదీ హసన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచకప్ ఆడే విషయంలో యాజమాన్యం తరఫు నుంచి సందిగ్దం నెలకొంది. అధికారులే ఈ సమస్యను పరిష్కరించాలి.ప్లేయర్లుగా కేవలం ఆడటం మాత్రమే మా బాధ్యత. ఒకవేళ బోర్డు మమ్మల్ని అంగారక గ్రహంపైకి పంపించినా మేము ఆడి తీరాల్సిందే. ఈ విషయంలో ఆటగాళ్లు ఎక్కడా వెనక్కి తగ్గరు’’ అని పేర్కొన్నాడు.మేము నటిస్తున్నామని మాకూ తెలుసుఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్, గత టీ20 వరల్డ్కప్లో సారథిగా వ్యవహరించిన నజ్ముల్ హుసేన్ షాంటో సైతం బంగ్లా బోర్డు తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. ‘‘ప్రతి ప్రపంచకప్ టోర్నీకి ముందు మాకు ఇలాంటి సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.వరల్డ్కప్ ఈవెంట్లలో ఆడిన ఆటగాడిగా నా అనుభవం గురించి చెబుతున్నా. ఇలాంటి పరిణామాలు కచ్చితంగా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎలాంటి ప్రభావం లేదన్నట్లు పైకి చెబుతూ ఉంటాము.నిజానికి ఆ సమయంలో మేమంతా నటిస్తున్నామన్న మాట. ఆ విషయం మాకూ తెలుసు. అయితే, ఇదేమీ తేలికైన విషయం కాదు. ఇలాంటి పరిస్థితులు రానేకూడదు. ఒకవేళ వచ్చినా ఆటగాళ్లుగా మేము చేసేదేమీ లేదు’’ అంటూ బీసీబీ వ్యవహారశైలిని విమర్శించాడు.చదవండి: T20 WC 2026: భారత్లో ఆడబోము..! బంగ్లా డిమాండ్పై స్పందించిన బీసీసీఐ
శ్రీలంక, పాక్ మ్యాచ్ రద్దు
శ్రీలంక- పాకిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాల్లో భాగంగా పాకిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య లంకపై పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో దంబుల్లా వేదికగా రెండో పోరులోనైనా గెలిచి సిరీస్ సమం చేయాలనుకున్న లంకకు చుక్కెదురైంది. మైదానం చిత్తడిగా ఉన్న కారణంగా సమయానికి మ్యాచ్ ప్రారంభం కాకపోగా... ఆ తర్వాత వర్షం దంచికొట్టడంతో ఆట సాధ్యపడలేదు. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు అయింది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే మూడో మ్యాచ్ జరగనుంది. శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, జనిత్ లియానగే, వనిందు హసరంగ, దసున్ షనక(కెప్టెన్), దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, నువాన్ తుషార, ఇషాన్ మలింగ, త్రవీన్ మాథ్యూ, మతీశ పతిరణ, దునిత్ వెల్లలగే, కమిందు మెండిస్, కుశాల్ పెరీరా.పాకిస్తాన్ జట్టుసాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా జూనియర్, అబ్రార్ అహ్మద్, నసీమ్ షా, ఖవాజా నఫే, ఉస్మాన్ తారిఖ్, అబ్దుల్ సమద్చదవండి: T20 WC 2026: భారత్లో ఆడబోము..! బంగ్లా డిమాండ్పై స్పందించిన బీసీసీఐ
ఆటుపోట్లను దాటుకుంటూ... అడ్డంకులు ఎదురైనా..
గ్రేటర్ నోయిడా: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో సత్తా చాటుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో చాంపియన్గా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2024 పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి నిరాశ పరిచిన నిఖత్... ఈసారి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పకడ్బందీగా సిద్ధమవుతోంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత కాస్త విరామం తీసుకున్న ఈ బాక్సర్... గాయం నుంచి కోలుకొని రింగ్లో మళ్లీ మెరిపిస్తోంది. తాజాగా జరుగుతున్న జాతీయ చాంపియన్షిప్లో నిఖత్ తన పంచ్ పవర్తో ఫైనల్కు చేరింది. ఈ ఏడాదిని టైటిల్తో ప్రారంభించేందుకు సిద్ధమైన ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్... సీజన్ మొత్తం ఇదే జోరు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. అడ్డంకులు ఎదురైనా..‘క్రీడల్లో ఎత్తుపల్లాలు సహజం. ఒక అథ్లెట్ అన్నివేళలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోవచ్చు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. కొన్నికొన్ని సార్లు అడ్డంకులు ఎదురవుతాయి. అప్పుడే మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకునేందుకు అవకాశం చిక్కుతుంది. దాన్ని గుర్తించి అధిగమించగలిగితే ఎదురుండదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయత్నించడం ముఖ్యం’ అని నిఖత్ వెల్లడించింది. ఆటుపోట్లను దాటుకుంటూ... 2024 పారిస్ ఒలింపిక్స్కు ముందు రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలవడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలతో నిఖత్ దుమ్మురేపింది. దీంతో విశ్వక్రీడల్లో ఆమెపై భారీ అంచనాలు ఏర్పడగా... పారిస్ ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్లో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి చేరింది. నిరాశ చెందానుఆ తర్వాత నిఖత్కు మోకాలి గాయం అయింది. దాని నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె గతేడాది జూలైలో ప్రపంచ చాంపియన్షిప్లో బరిలోకి దిగి ఒలింపిక్ పతక విజేత చేతిలో ఓడింది. ‘ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన బాక్సర్ చేతిలో ఓడాను. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉత్తచేతులతో వచ్చినందుకు నిరాశ చెందాను’ అని ఆమె వెల్లడించింది. తనకు ఎదురుదెబ్బలు సహజమే అని... జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే ఈ స్థాయికి చేరినట్లు 29 ఏళ్ల నిఖత్ చెప్పింది. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న సమయంలో ఇదే బరువు కేటగిరీలో ఉన్న నిఖత్... ఎన్నో ఏళ్ల పాటు ఓపికగా ఎదురుచూసింది. ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఒలింపిక్ చాంపియన్ కావాలని‘నా జీవితం అంత సులువైందేమీ కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డాను. అన్నీ సజావుగా సాగితే అది జీవితం ఎలా అవుతుంది. ప్రపంచ చాంపియన్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. దాని కోసం నా యావత్ శక్తిని ధారపోశాను. దాని వల్లే వరల్డ్ చాంపియన్గా ఎదగగలిగాను. ఇప్పుడు ఒలింపిక్ చాంపియన్ కావాలని అంతే తపనతో కోరుకుంటున్నా. ముందు మనపై మనకు నమ్మకం లేకుంటే... అది వాస్తవ రూపం దాల్చదు. దాని కోసం కోచ్ సన్నీ గెహ్లావత్తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నా’ అని నిఖత్ వివరించింది. తప్పులను సరిదిద్దుకుంటూ... లాస్ ఏంజెలిస్ క్రీడల్లో నిఖత్ను చాంపియన్గా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నామని సన్నీ పేర్కొన్నాడు. ‘ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాం. చిన్న చిన్న తప్పులను గుర్తించి వాటిని అధిగమించేందకు ప్రయత్నిస్తున్నాం. కౌంటర్ అటాక్ విషయంలో మరింత మెరుగయ్యే ప్రయత్నాలు సాగుతున్నాయి. రింగ్లో నిఖత్ ఎక్కువగా బ్యాక్ఫుట్ను వినియోగిస్తుంది. దాంట్లో కొన్ని మెళకువలు నేర్చుకుంటోంది. టెక్నిక్తో పాటు వ్యూహాలపై దృష్టి పెట్టాం’ అని సన్నీ గెహ్లావత్ చెప్పాడు. 2028 ఒలింపిక్స్ సమయానికి నిఖత్ వయసు 32 ఉండనుంది కాబట్టి అందకు తగ్గట్లు శిక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. 2026 తనకెంతో ముఖ్యమని... ఆరంభంలోనే జాతీయ చాంపియన్గా నిలిస్తే... ఏడాదంతా అదే జోరు కొనసాగించవచ్చని నిఖత్ వెల్లడించింది. అదంత సులువు కాకపోయినా... దేశానికి పతకాలు సాధించి పెట్టాలనే తపనే తనను ముందుకు తీసుకెళ్తుందని తెలంగాణ బాక్సర్ పేర్కొంది. చదవండి: WPL 2026: డిక్లెర్క్ ధమాకా
న్యూస్ పాడ్కాస్ట్
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పన్నాగం...
ప్రజలకు సంజీవని లాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు శాపనార్థాలు... సరైన అనుమతులు లేకుండా లిఫ్ట్ ప్రారంభించారంటూ పోలవరం సాక్షిగా అక్కసు వెళ్లగక్కిన ఏపీ సీఎం
సీమ జల ద్రోహి చంద్రబాబు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలి. రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
సీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్దేశించిన సమాచారాన్ని ఇవ్వని చంద్రబాబు సర్కార్
రాయలసీమకు సైంధవుడు చంద్రబాబే... ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపివేసి మరణ శాసనం
వెనెజువెలాపై అమెరికా భీకర దాడులు... దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకొని న్యూయార్క్కు తరలించిన అమెరికా సేనలు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సూపర్ సిక్స్ మోసాల ఖరీదు ఒక లక్ష 42 వేల కోట్ల రూపాయల పైమాటే...కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ ప్రజల డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో అత్యంత అధ్వానంగా మారిన ‘108’ నెట్వర్క్ నిర్వహణ... అంబులెన్స్ సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
2026కు ఘన స్వాగతం పలికిన విశ్వమానవాళి... ఆనందోత్సాహాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు
బిజినెస్
సిప్ సూపర్ హిట్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి డిసెంబర్లో నికరంగా రూ.28,054 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్లో రూ.29,911 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గాయి. ఈ ఏడాది అక్టోబర్లో వచి్చన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. ఈక్విటీ, గోల్డ్ ఈటీఎఫ్లు నికరంగా పెట్టుబడులను ఆకర్షించగా, డెట్ ఫండ్స్లో అమ్మకాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్లో రూ.66,591 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. డివిడెండ్ ఈల్డ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) తప్ప మిగిలిన అన్ని ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. నవంబర్ చివరికి ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) రూ.80.80 లక్షల కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి రూ.80.23 లక్షల కోట్లకు తగ్గాయి. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. సిప్ ద్వారా రికార్డు స్థాయి పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు డిసెంబర్లో సరికొత్త గరిష్టానికి చేరాయి. రూ.31,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్లో సిప్ పెట్టుబడులు రూ.29,445 కోట్లుగా ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.3.34 లక్షల కోట్లకు చేరాయి. విభాగాల వారీ పెట్టుబడులు.. → అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి రూ.10,019 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్లో ఈ విభాగంలోకి వచి్చన పెట్టుబడులు రూ.8,135 కోట్లుగానే ఉన్నాయి. → మిడ్క్యాప్ ఫండ్స్ రూ.4,176 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.4,094 కోట్లు వచ్చాయి. → స్మాల్క్యాప్ ఫండ్స్ రూ.3,824 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. లార్జ్క్యాప్ ఫండ్స్లోకి రూ.1,567 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → వ్యాల్యూ ఫండ్స్ రూ.1,088 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.2,255 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.1,057 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు)లోకి పెద్ద మొత్తంలో రూ.11,647 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఇంద్రజాల్కి రూ. 100 కోట్ల డిఫెన్స్ ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కౌంటర్–డ్రోన్ డిఫెన్స్ సంస్థ ఇంద్రజాల్కి కేంద్ర రక్షణ శాఖ నుంచి పలు ఆర్డర్లు లభించాయి. వీటి విలువ రూ. 100 కోట్లుగా ఉంటుంది. దీని కింద కీలక ఆర్మీ, నేవీ స్థావరాలను పరిరక్షించేలా మలీ్ట–లేయర్డ్ అటానామస్ యాంటీ–డ్రోన్ సిస్టంలను అందించాల్సి ఉంటుంది. ఏఐ ఆధారిత అటానామస్ ఎయిర్స్పేస్ డిఫెన్స్కి సంబంధించి పరివర్తన దిశగా ఇదొక కీలక మైలురాయని సంస్థ తెలిపింది.
వొడాఫోన్ ఐడియాకి ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పాత ఏజీఆర్ బాకీలను వచ్చే ఆరేళ్ల పాటు ఏటా రూ. 124 కోట్లు చెల్లించేలా వెసులుబాటునిచి్చంది. 2032 మార్చి–2035 మార్చి వరకు ఏటా రూ. 100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పదేళ్లలో రూ. 1,144 కోట్లు కట్టాల్సి ఉంటుంది. మరోవైపు, 2031–32 నుంచి 2040–41 మధ్య కాలంలో మిగతా బాకీలను కట్టాల్సి ఉంటుంది. ఈ పాత బకాయిని రూ. 87,695 కోట్లకు ఫ్రీజ్ చేసి, చెల్లింపులపై పాక్షికంగా మారటోరియం ఇస్తూ డిసెంబర్ 31న కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
వెంచర్ క్యాపిటల్కు బై ఐపీఓకు.. హాయ్
ఇటీవల కొద్ది రోజులుగా చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు తదుపరి దశ నిధుల సమీకరణలో పబ్లిక్ రూట్కే ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే ఐపీవోకు వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండింగ్, టాలెంట్, టెక్నాలజీ వృద్ధికి వీలుంటుందని భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ప్రైమరీ మార్కెట్లు రెండేళ్లుగా రికార్డు నిధుల సమీకరణ ద్వారా కదం తొక్కుతుండటంతో చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు లిస్టింగ్వైపు చూస్తున్నాయి. ఇందుకు దేశీయంగా కనిపిస్తున్న ఇన్వెస్టర్ల ఆసక్తి, అత్యధిక లిక్విడిటీ తోడ్పాటునిస్తున్నాయి. ఫలితంగా తొలి, మలిదశలలో వృద్ధి నిలుపుకునేందుకు.. తద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం పబ్లిక్ మార్కెట్కు ప్రాధాన్యమిస్తున్నాయి. వెరసి ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే స్టాక్ ఎక్సే్ఛంజీలలో నమోదయ్యేందుకే చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు ఆసక్తిని చూపుతున్నాయి.. కాగా.. ఇంతక్రితం చాలా స్టార్టప్లు బిలియన్ డాలర్ల కంపెనీలు(యూనికార్న్)గా ఎదిగిన తదుపరి మాత్రమే లిస్టింగ్వైపు చూసేవి. అంతకుముందు పెట్టుబడుల కోసం పీఈ, తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తుండేవి. అయితే ఇటీవల ఈ ట్రెండ్కు విరుద్ధంగా చాలా ముందుగానే ఐపీవో బాట పడుతుండటం గమనార్హం! బ్రాండ్ బిల్డింగ్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండ్ బిల్డింగ్తోపాటు.. టాలెంట్ను ఆకట్టుకోవడం, కొత్త టెక్నాలజీలపై గురి పెట్టడం తదితరాలకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కంపెనీకి సరైన విలువ లభించడం, పారదర్శక పాలన, తగినంత లిక్విడిటీకి వీలుండటం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశాయి. వెరసి రూ. 300–400 కోట్ల ఆదాయ స్థితికి చేరిన స్టార్టప్లు ఐపీవోకు సిద్ధపడుతున్నట్లు తెలియజేశాయి. రెండేళ్లుగా అటు ఎస్ఎంఈ, ఇటు మెయిన్ బోర్డులో రికార్డ్స్థాయిలో కంపెనీలు లిస్టవుతుండటం స్టార్టప్లకు జోష్నిస్తున్నట్లు వివరించాయి.జాబితా ఇలా.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్పట్ల ఆసక్తిగా ఉన్న మధ్యస్థాయి స్టార్టప్ల జాబితాలో స్క్రిప్బాక్స్, మైగేట్, ఫ్యాబ్హోటల్స్, క్లాస్ప్లస్ ముందువరుసలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గత నెల(2025 డిసెంబర్)లో ఫ్యాబ్హోటల్స్ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. రానున్న 6 నెలల్లో లిస్టయ్యేందుకు స్క్రిప్బాక్స్ సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రూ. 300–600 కోట్ల సమీకరణ ప్రణాళికలున్న స్టార్టప్లు అధికంగా ఐపీవో బాటవైపు చూస్తున్నట్లు ఇన్క్రెడ్ క్యాపిటల్ ఎండీ ప్రతీక్ ఇండ్వార్ పేర్కొన్నారు. రూ. 600–700 కోట్ల పరిమాణంలో నిధుల సమీకరణపై కన్నేసిన స్టార్టప్లు సైతం అధికంగా లిస్టింగ్కు సిద్ధపడుతున్నట్లు ప్రోజస్ గ్రూప్ గ్లోబల్ హెడ్ గజానన్ శుక్లా తెలియజేశారు. ఇదీ తీరు తొలి, మలి దశ స్టార్టప్లు ప్రధానంగా ఏంజెల్ ఫండింగ్, వెంచర్ క్యాపిటల్ సంస్థల ద్వారా నిధు లు సమీకరిస్తుంటాయి. ఈ జాబితాలో సీక్వోయా, యాక్సెల్, బ్లూమ్ వెంచర్స్, కళారి, వై కాంబినేటర్, లెట్స్వెంచర్, ఫండ్ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఆపై ప్రయివేట్ ఈక్విటీ సంస్థలను సైతం సంప్రదిస్తుంటాయి. నిజానికి 2019లో మధ్యస్థాయి స్టార్టప్లు ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 145 రౌండ్ల ద్వారా మైనారిటీ వాటాలు విక్రయించాయి. తద్వారా 5.7 బిలియన్ డాలర్లు సమకూర్చుకు న్నాయి. తదుపరి 2020, 2022లలో నిధుల సమీకరణ మరింత పుంజుకున్నప్పటికీ 2025లో నీరసించింది. 2019 స్థాయిలోనే 152 రౌండ్ల ద్వారా 5.4 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. ఇందుకు సంస్థలు పెరిగినప్పటికీ ఐపీవో బాట పట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఫ్యామిలీ
ఇదేం విడ్డూరం..! డైరీ రాస్తూ..86 కిలోలు బరువు తగ్గిందా!?
బరువు తగ్గించే చిట్కాలు..సింపుల్ రెమిడీస్ వంటివి ఎన్నో చూశాం. పలానా వ్యాయామం, డైట్ అంటూ ఏవేవో కొంగొత్త విధానాలతో బరువు తగ్గిన ఉదంతాలు చూశాం. కొందరు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ..కార్డియాక్ వర్కౌట్లు, వాకింగ్లు, స్కిప్పింగ్లు అంటూ ఎంతో శ్రమ పడి తగ్గగా.. మరికొందరు సైక్లింగ్తో కుస్తీలు పడ్డారు. ఒక్కోక్కరూ ఒక్కోదారిలో వెళ్లి బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఈ మహిళ ఇంతలా కష్టపడకుండా అందరు సులభంగా చేసే, చాలా తేలికైన అలవాటుతో ఇట్టే బరువు తగ్గింది. అది కూడా ఏకంగా 86 కిలోలు బరువు తగ్గడం అంటే మాటలు కాదు కదా..!. అలా అని షార్ట్కట్లు, ఏవేవో మందులు, ఇంజెక్షన్లు తీసుకోలేదు సుమీ..!. మరి ఆమె ఎలా అంతలా బరువు తగ్గింది..?, ఏంటా హాబీ..? అంటే..బరువు తగ్గించే జర్నీలో అందరికీ అతిపెద్ద టాస్క్ వ్యాయామం, వర్కౌట్లు. కానీ ఈ అమెరికా మహిళ కామ్ ఆ పాట్లు ఏం పడకుండా చాలా స్మార్ట్గా చిన్న చిన్న అలవాట్లతో మైండ్ని సెట్ చేసుకుంటూ సులభంగా బరువు తగ్గి అద్భుతం చేసింది. తాను ఎలాంటి ఫిట్నెస్ ట్రైనర్, స్నేహితులు, బంధువుల సహాయం తీసుకోకుండా కేవలం ఆ చిన్న అలవాటుతో బరువు తగ్గించుకున్నానంటోంది. తాను చెప్పబోయే అలవాటు వినడానికి హాస్యస్పదంగా, నమ్మశక్యంగా అనిపించకపోయినా..అద్భుతం చేసిందనేది నమ్మక తప్పని వాస్తవం అని అంటోందామె. కామ్ తనకు ఉన్న డైరీ రాసే అలవాటే అద్భుతంగా బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యిందట. అలా ఏకంగా 86 కిలోలు పైనే బరువు తగ్గానని చెబుతోంది. ఆ డైరీలో తన వెయిట్లాస్ జర్నీని ఎందుకు ప్రారంభించింది.. ఆ టైంలో తాను ఎలా ఉండేది వంటి పోటోలతో సహా పొందుపరిచింది. వాటిని చూసుకుంటూ..తన శరీర పరివర్తనలో మార్పులకు శ్రీకారం చుట్టిందట. ఎందుకంటే ఆ డైరీ ఓపెన్ చేయగానే తన దినచర్య సరిగా ఉందా, ఆహారం మితంగా తిన్నానా లేదా అని తరచి.. తరచి.. చూసుకోవడమే కాకుండా జవాబుదారీగా ఉండాలే చేస్తుందట. ఆ క్రమంలో తనకు స్ఫూర్తిని కలిగించే సూక్తులు, మార్గదర్శకులు తదితరాలన్నింటి గురించి రాసేదట. అంతేగాదు ఒకరకంగా ఏం తిన్నాను, ఏం వ్యాయామాలు చేశాను అన్నది రాస్తున్నప్పుడూ..అబ్బా ఇది చేయలేకపోయాను..ఇంకా బాగా చేయాలి అనే ఫీడ్ బ్యాక్ ఇస్తుంటుందట ఆ అలవాటు. దాంతో బరువు తగ్గాలనే ఆలోచన బలంగా మదిలో నాటుకుని..అన్నింటిపై సరైన ఫోకస్ పెడతామట. ఫలితంగా బరువు తగ్గడం సులభం అవుతుందని అంటోందామె. నిజంగా హెల్ప్ అవుతుందా అంటే..?బరువు తగ్గించే జర్నీలో డైరీ రాసే అలవాటు పెద్ద పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సైతం చెబుతుండటం విశేషం. హార్వర్డ్ నివేదిక ప్రకారం, దాదాపు 1,700 మంది రోజువారి ఆహార రికార్డులను తమ డైరీలో ట్రాక్ చేయగా..వారంతా రెండు రెట్లు బరువు తగ్గారట. అలాగే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన 2012 జర్నల్ సైతం ఇలా డైరీ రాసే వ్యక్తులు అధిక మొత్తంలో బరువు తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది. ఇలా మనం తినేవాటిని వ్రాయడం, ప్రాముఖ్యతను హైలెట్ చేయడం వల్ల తమ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయనేది తరచి చూసుకునే అవకాశం వస్తుందట..దాంతో బరువు తగ్గుతారట. ఇలా ఎంత ఎక్కువగా తాము తినే ప్రతి ఆహారం గురించి నమోదు చేసే అలవాటు ఉంటే అంత అధిక మొత్తం లో బరువు తగ్గుతారని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరి వెయిట్లాస్ జర్నీలో మంచి ఫలితాలు అందుకునేందుకు డైరీ రాసే అలవాటుని సత్వరమే ప్రారంభిద్దామా మరి..(చదవండి: Beauty Tips: శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్లు..!)
శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్లు..!
శీతాకాలంలో చాలామంది చర్మం పొడిబారి నిగారింపు లేకుండా ఉంటుంది. ఎంత తెల్లటి ముఖమైన చలిగాలికి పెళుసుగా జీవం లేనట్టుగా అయిపోతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ల ముఖం సైతం కళాహీనంగా ఉంటుంది. అందుకోసం ముఖానికి పూసే మాయిశ్చర్లు, క్రీమ్ వంటింటి చిట్కాలే ఉయోగిస్తే సరిపోదు. ఈ వణికించే చలిలో చర్మం ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఈ ఆరు సూప్లను మన డైట్లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. వీటితో అందం, ఆరోగ్యం రెండిటిని సొంతం చేసుకోవచ్చు. చర్మం మెరిసేలా పోషకాలందించే ఆరోగ్యకరమైన ఆ సూప్లు ఏంటో సవివరంగా చూద్ధామా..!.హైడ్రేషన్ని తోడ్పడేలా చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేసే ఈ సూప్లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చట. మాయిశ్చరైజర్లు, సీరమ్లు వంటివి బాహ్యంగా చర్మానికి మద్దతు ఇవ్వగా అంతరంగంగా హెల్ప్ అయ్యే ఆ సూప్లు ఏంటంటే..క్యారెట్, అల్లం సూప్లు: క్యారెట్లో బీటా కెరోటిన్ తోపాటు, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మం మరమత్తుకు, హైడ్రేషన్కీ కీలకమైనది. అల్లం యాంటిబయోటిక్ల పనిచేసి..ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తంఉది. ఈ వింటర్ సీజన్లో ఆరోగ్యానికి శక్తిమంతమైన సూప్గా చెప్పుకోవచ్చు.టమోటా తులసి సూప్: టమోటాలలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మం పాడవ్వకుండా కాపాడుతుంది, మృదువుగా ఉంచుతుంది. తులసిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రిఫ్రెషింగ్ ట్విస్ట్ను అందిస్తుంది. ఇది రుచిగా ఉండటమే గాక చర్మానికి సహజ మెరుపుని అందిస్తుంది కూడా.పాలకూర, కాయధాన్యాల సూప్: పాలకూరలో ఉండే ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఇక కాయధాన్యాలలోని ప్రోటీన్ చర్మ మరమత్తుకు హెల్ఫ అవుతుంది. పైగా చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది.గుమ్మడికాయ సూప్: గుమ్మడికాయలో విటమిన్లు ఏ,సీలు ఉంటాయి. ఇవి తేమను పునురుద్ధరించి చర్మం పొడిబారకుండా చూస్తుంది.దీని క్రీమీ టెక్స్చర్ చర్మ ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. దీనిలోని గుమ్మడి గింజలను కూడా డైట్లో చేర్చుకుంటే..చర్మానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి.చికెన్ అండ్ వెజిటబుల్ సూప్: చర్మాన్ని ఆరోగ్యవంతంగా, తాజాగా ఉండేలా చేస్తుంది. అంతర్లీనంగా మంఇచ ఓదార్పుని, మృదుత్వాన్ని అందిస్తుంది.చిలగడదుంప, కొబ్బరి సూప్: చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి పాలు తేమను నిలుపుకునే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా ఉంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది. ఈ సూప్లు అంతర్లీనంగా చర్మ ఆరోగ్యాన్ని రిపేర్ చేసి అందంగా ఉండేలా చేయడమే కాకుండా ఆరోగ్యపరంగాను ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు డెర్మటాలజిస్ట్లు.
షీ టీమ్ చెప్తున్న రక్షణ పాఠాలు
గత డిసెంబర్ నెలలో షీ టీమ్ పోలీసులు జంట నగరాల్లో 90 కేసులు బుక్ చేశారు. స్త్రీలను పోకిరీలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, వారి భరతం ఎలా పట్టారో తెలుసుకుంటే మరింత జాగ్రత్తగా, ధైర్యంగా ఉండొచ్చు... నగరంలోగానీ, మరెక్కడైనా కానీ.ఒక ఇంజినీరింగ్ విద్యార్థిని ‘రాపిడో’ బుక్ చేసుకుంది. ఆ రాపిడో డ్రైవర్ ఆ విద్యార్థిని నంబర్ నోట్ చేసుకొని పదే పదే ఆమెకు ఫోన్ చేయసాగాడు. ఆ తర్వాత అశ్లీలమైన మెసేజ్లు చేస్తున్నాడు. అమ్మాయి ముందు ఆందోళన పడింది. ఆ తర్వాత ధైర్యం చేసి షీ టీమ్కు ఫోన్ చేసింది. ఇంకేముంది? కుర్రాడికి తగిన ‘మర్యాద’ జరిగింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 292 ప్రకాశం కేసు బుక్ అయ్యి నాంపల్లి కోర్టు ద్వారా ఆ పోకిరీకి 7 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది.మరో అమ్మాయిని పక్కింటి ‘అంకుల్’ గారు ఫాలో అవుతున్నారు. రోజూ అమ్మాయి కాలేజీకి వెళుతుంటే వెనుక నడుస్తూ కాలేజీ దాకా వస్తున్నారు. అమ్మాయి ఈ విషయాన్ని షీ టీమ్కు చెప్పింది. షీ టీమ్ అంకుల్ గారి మీద కేసుగట్టి నాంపల్లి కోర్టులో ప్రవేశ పెడితే 7 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది.ఇంకొక పెద్దమనిషి ఏం చేశాడంటే ఒక మహిళ ఇన్స్టా అకౌంట్ నుంచి ఆమె ఫొటోలు, వీడియోలు డౌన్లోడ్ చేసి వాటితో ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి పని చాలా ఆందోళన కలిగించేదే. కాని ఆ మహిళ వెంటనే షీ టీమ్కు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ పెద్దమనిషిని అరెస్ట్ చేశారు. కోర్టు జైలు శిక్ష విధించింది.ఇవన్నీ డిసెంబర్ 2025 నెలలో హైదరాబాద్లో చోటు చేసుకున్న ఘటనలు. డిసెంబర్లో జంట నగరాల నుంచి మొత్తం 98 ఫిర్యాదులు షీ టీమ్కు వస్తే వాటిలో 14 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 13 మందిని ఘటనా స్థలంలోనే పట్టుకున్నారు. అంటే ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే షీ టీమ్కు కాల్ చేయగానే వచ్చి పట్టుకున్నారన్న మాట. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. 2025లో స్త్రీలకు సురక్షిత నగరాల సూచీలో హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. స్త్రీల రక్షణ కోసం యాప్స్ ఉన్నాయి. షీ టీమ్స్ ఉన్నాయి. కావలసిందల్లా ... ‘‘వాళ్లు ఉన్నారు, వెంటనే స్పందిస్తారు’’– అనే చైతన్యం కలిగి ఉండటమే. విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యక్తిగత పనులు... వీటి కోసం నగరంలో బయట తిరిగేటప్పుడు, నివాసం ఉన్న చోటు ఇతరుల నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా చట్టం చురుగ్గా పని చేస్తుందనే ఎరుక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అదే సమయంలో ఇతరుల నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురు కావచ్చో తెలుసుకొని అలాంటివి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.అపరిచిత వ్యక్తులతో కాల్స్ మాట్లాడటం, వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వడం, సోషల్ మీడియాలో అవసరం లేని విషయాలు షేర్ చేసుకోవడం మంచిది కాదు. అలాగే ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మౌనంగా భరించడమూ మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వ రక్షణ వ్యవస్థల నుంచి వెంటనే సహాయం పొందే సంసిద్ధతను కలిగి ఉండాలి.
అమ్మ పాలకు ఇంకా అడ్డంకులా?
పట్నాల్లో, నగరాల్లో బిడ్డలకు పాలివ్వడానికి తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాజా నివేదిక తెలియచేస్తోంది. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో, నగరాల్లో పాలిచ్చే తల్లులను ఇతరులు చూసే విధానం వారిని తీవ్రంగా అసౌకర్యం పాలు చేస్తోంది. దాంతో తల్లులు బయటకు రావడమే లేదని ఇప్పుడు కావాల్సింది ప్రతిచోటా బ్రెస్ట్ఫీడ్ రూమ్ల కంటే ‘పాలివ్వడాన్ని’ మామూలుగా చూసేలా సమాజంలో మార్పు రావాలని ఈ నివేదిక చెబుతోంది.తల్లిపాలే బిడ్డకు తొలి ఆహారం. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టిస్తే వారి ఆరోగ్యానికీ తల్లుల ఆరోగ్యానికీ ఎంతో మేలు. పాలు ఇవ్వలేని సమస్యలున్న తల్లులను మినహాయిస్తే మిగిలిన తల్లులందరికీ బిడ్డకు పాలివ్వడం అనిర్వచనీయమైన అనుభూతి. అయితే పల్లెలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఈ పని అత్యంత అసౌకర్యంగా మారుతోందని ‘ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్ అండ్ రివ్యూస్’ అకడమిక్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడి చేసింది. ప్రభుత్వం ఒకవైపు తల్లి పాలు ఇమ్మని ప్రచారం చేస్తున్నా అనేక అడ్డంకుల వల్ల బాలింతలు పసిబిడ్డలతో బహిరంగ ప్రదేశాలకు రావడాన్ని పరిమితం చేసుకుంటున్నారని ఈ అధ్యయనం చెప్పింది.కారణాలు→ పాలిచ్చే అవయవాన్ని లైంగిక దృష్టితో చూసే ధోరణి→ పురుషులతో పాటు స్త్రీలకూ ఉన్న అభ్యంతర దృష్టి→ వస్త్రధారణలో పరిమితులు→ కూడని పని చేస్తున్నట్టుగామాటిమాటికి సర్దుకోవాల్సి రావడం మన దేశంలో 88.6 శాతం ప్రసవాలు వ్యవస్థాగతంగా అంటే వైద్యకేంద్రాల్లో జరుగుతుంటే వీరిలో 63.7 శాతం మంది తల్లులు మాత్రమే ఏడాది వరకూ తమ పిల్లలకు తల్లిపాలు ఇస్తున్నారు. ఆ ఇచ్చే తల్లులకు కూడా బయట సౌకర్యమైన స్థితి లేదని అధ్యయనం చెబుతోంది.భయంతో తల్లిపాలకు దూరం‘బిడ్డకు తల్లి పాలివ్వడం అత్యంత సహజమైన, అవసరమైన ప్రకియ. కానీ ఆమె చుట్టూ అటువంటి వాతావరణం ఏర్పాటు చేయడంలో సమాజం విఫలమైంది’ అంటున్నారు బ్రెస్ట్ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (బీపీఎన్ఐ) సంస్థ కేంద్ర సమన్వయకర్త డాక్టర్ బిడ్లా. ‘ఇతరులు చూస్తారనో, ఎవరైనా తప్పుగా అనుకుంటారనో భయంతో చాలామంది బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు బిడ్డకు పాలివ్వడం మానేస్తున్నారు. మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతోపాటు సమాజంలో నెలకొన్న దురభి్రపాయాలను దూరం చేయాలి’ అని ఆమె అంటున్నారు.దుస్తులది కీలకపాత్రబహిరంగ ప్రదేశాలలో చంటి పిల్లలకు పాలివ్వడంలో మన దేశంలో దుస్తులది కీలకపాత్ర అని అధ్యయనం తెలిపింది. చీర కొంగు, దుపట్టా లేదా ప్రత్యేకంగా కుట్టించుకున్న దుస్తులు ఉన్నప్పుడు చాటుచేసి తల్లులు సౌకర్యంగా పాలు ఇవ్వగలుగుతున్నారని, ఇతర దుస్తుల్లో ఉంటే పాలివ్వడం సమస్యగా మారుతుందని ఈ అధ్యయనం చెప్పింది. బ్రెస్ట్ఫీడింగ్ రూమ్ల ఏర్పాటు కంటే కూడా నిస్సంకోచంగా పాలు ఇచ్చే విధంగా సమాజ భావజాలం మారాలని అధ్యయనం చెప్పింది. స్పష్టంగా చె΄్పాలంటే బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు తల్లి ఏదైనా తినిపిస్తుంటే కలగని అసౌకర్యం పాలు ఇస్తుంటే ఎందుకు వస్తుందనేది సమాజం ఆలోచించాలని తెలిపింది.పరిమితం... అనవసరంబహిరంగ ప్రదేశాల్లో పాలు ఇచ్చే స్థితి లేకపోవడం వల్ల పాలిచ్చే తల్లులు తమ కదలికలను పరిమితం చేసుకుంటున్నారు. లేదా బయటకు వచ్చే ముందు అవసరం లేకున్నా చంటిబిడ్డకు పాలు తాగించి వస్తున్నారు. తల్లులు తమ ఉపాధి, పనుల కోసం బయటకు రాకుండా ఉండటం ఎంత సరికాదో అవసరం లేకపోయినా వేళగాని వేళలో పాలు తాగించడమూ సరికాదు. ఈ ఆటంకాలన్నింటి గురించి ఆలోచించే నగరాల్లో, పట్టణాల్లోని తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే పోత పాలు పట్టించక తప్పని నిర్ణయానికి వస్తున్నారనేది ఒక పరిశీలన.బ్రెస్ట్ ఫీడింగ్ రూంలు ఏవీ?గతంలో మహిళలు వాష్రూంలు లేక చాలా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం చాలాచోట్ల మహిళల కోసం వాష్రూంలు ఏర్పాటు చేశారు. అయితే బ్రెస్ట్ ఫీడింగ్ రూంల ఏర్పాటు మాత్రం ఆ స్థాయిలో జరగలేదు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసినా తగ్గ ప్రచారం లేదు. కొన్నిచోట్ల నిర్వహణ సరిగా లేక వాటిని ఇతరులు వినియోగిస్తున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య బిడ్డలకు పాలివ్వడం తల్లులకు సంకటంగా మారింది.మారాల్సింది సమాజమే!బిడ్డలకు పాలిచ్చేందుకు తల్లులను సంసిద్ధం చేయాల్సిన అవసరం సమాజంలోని అందరిపైనా ఉందని నిపుణులు అంటున్నారు. వారికి తగిన స్థలం చూపించడం, సౌకర్యంగా భావించేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, గోప్యత భంగం రాకుండా చూసుకోవడం అవసరం అంటున్నారు. ఇటీవల కాలంలో బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెరగడం కూడా తల్లుల్లో భయాన్ని పెంచుతోంది. ఈ భయాన్ని పోగొట్టేలా వారి కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉందని అంటున్నారు.
అంతర్జాతీయం
ఇరాన్లో ఉద్రిక్తతలు.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్కు విజ్ఞప్తి
ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలలో మరణాల సంఖ్య 62కి పెరిగింది.ఈ నేపథ్యంలోనే ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రంప్కు రెజా పహ్లవి విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్లో నిరసనలు చెలరేగుతున్న ఇరాన్ దివంగత రాజు బహిష్కృత కుమారుడు రెజా పహ్లవి కోరడం హాట్ టాపిక్గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిస్టర్ అమెరికా ప్రెసిడెంట్.. దయచేసి ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కోరాడు.మరోవైపు నిరసనకారులను కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ హెచ్చరించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ ఘోలాంహోస్సేన్ మొహ్సేని-ఎజెయ్ శిక్షను అమలు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన నిరసనకారులపై మరింత కఠినమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించనుంది. ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్, విదేశీ దేశాలతో కమ్యూనికేషన్ను నిషేధించింది.నిరసనల మధ్య ఖమేనీ ప్రసంగంటెహ్రాన్లో అశాంతి మధ్య.. సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా సమస్యలపై దృష్టి పెట్టాలని ట్రంప్కు సూచించారు. నిరసనకారులు మరొక దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖమేనీ అన్నారు. దేశం విదేశీ కిరాయి సైనికులను సహించదని ఖమేనీ స్పష్టంగా పేర్కొన్నారు. నిరసనలపై ఇరాన్ రాష్ట్ర టీవీ ఒక నివేదికలో ఇజ్రాయెల్ మరియు అమెరికన్ "ఉగ్రవాద ఏజెంట్లు" హింసను ప్రేరేపించారని నిందించిన తర్వాత సుప్రీం లీడర్ ప్రకటన వచ్చింది.Mr. President, this is an urgent and immediate call for your attention, support, and action. Last night you saw the millions of brave Iranians in the streets facing down live bullets. Today, they are facing not just bullets but a total communications blackout. No Internet. No…— Reza Pahlavi (@PahlaviReza) January 9, 2026
పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!
పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కిడ్నాప్ చేయాలని కోరారు. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన తరహాలోనే నెతన్యాహును కూడా అపహరించాలని ట్రంప్కు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు టర్కీ కూడా ఈ పని చేయగలదని ఇజ్రాయెల్ను రెచ్చగొట్టేలా ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మానవత్వానికి పెద్ద నేరస్తుడిగా నెతన్యాహూను అభివర్ణించాడు.తాజా ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన దారుణాలకు చరిత్రలో ఏ దురాగతాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. గత 4-5 వేల సంవత్సరాల్లో పాలస్తీనియన్లకు నెతన్యాహు చేసినంత నష్టం ఎవరూ చేయలేదని.. మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని అన్నారు. ప్రపంచంలో ఇంతకుమించిన పెద్ద నేరస్తుడిని ఎక్కడా చూడలేదన్నారు.అయితే మరోవైపు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయెల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరేతోయిబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ వీధుల్లో మిడ్డీలు, స్కర్టులు!
మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీ..వ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. మిడ్డీలు, స్కర్టులు వేసుకున్న అమ్మాయిలు.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు కూడా. 👉ఇరాన్ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పరిశ్రమీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. ఇదే సమయంలో, గతంలో పహ్లవి రాజవంశం కాలంలో ఇరాన్ స్వేచ్ఛ, ఆధునికతతో ప్రసిద్ధి చెందిందని, కానీ కఠిన పాలన, అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉పహ్లవి వంశం రాజవంశ రక్తంలో కాకుండా యుద్ధరంగంలో పుట్టింది. రేజా ఖాన్ అనే సాధారణ నేపథ్యం కలిగిన సైనిక అధికారి.. 1921లో బ్రిటిష్ అధికారుల సహకారంతో కుట్ర చేసి అధికారంలోకి వచ్చాడు. 1925లో క్వాజర్ వంశాన్ని గద్దె దించి.. మజ్లిస్ ఆయనను షాగా ఎన్నుకుంది. ఆ సమయంలో పహ్లవి అనే బిరుదు స్వీకరించి.. ఆధునికీకరణ, సెక్యులర్ జాతీయత లక్ష్యాలతో కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు.👉పహ్లవి రాజవంశ పాలనలో.. వెస్ట్రన్ కల్చర్ మేఘాలు ఇరాన్ను ఆవరించాయి. హిజాబ్ నిషేధంతో.. మహిళలు పాశ్చాత్య శైలి దుస్తులకు అలవాటు పడ్డారు. సంస్కరణల పేరిట ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు, రైల్వే వ్యవస్థ, కేంద్ర పాలన బలపరచడం వంటి సంస్కరణలు చేశారు. అయితే.. రాజకీయ అణచివేత, పత్రికా స్వేచ్ఛను కాలరాయడం విమర్శలకు తావిచ్చింది. 👉రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో ఆయన సాన్నిహిత్యం కారణంగా.. 1941లో బ్రిటిష్-సోవియట్ దళాలు ఇరాన్పై దాడి చేసి ఆయనను రాజీనామా చేయించాయి. ఆయన స్థానంలో కుమారుడు మొహమ్మద్ రేజా పహ్లవి షాగా అయ్యాడు. బలహీన సింహాసనం, విభజిత దేశం, పెరుగుతున్న జాతీయవాదం 22 ఏళ్ల రేజాకు వారసత్వంగా లభించాయి. అదే సమయంలో.. ఇరాన్ చమురు బ్రిటిష్ AIOC కంపెనీ ఆధీనంలో ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో.. 1951లో పార్లమెంట్ మొహమ్మద్ మోసాదేఘ్ను ప్రధానిగా ఎన్నుకుంది. ఆయన చమురు పరిశ్రమను జాతీయికరణ చేయడంతో బ్రిటన్, అమెరికా ఆగ్రహించాయి. 1953లో CIA “ఆపరేషన్ అజాక్స్” ద్వారా మోసాదేఘ్ను గద్దె దించి, పహ్లవిని తిరిగి సంపూర్ణ అధికారంతో షాగా తిరిగి కూర్చోబెట్టింది. ఇది పహ్లవి సంపూర్ణ రాజ్యాధికారానికి, అమెరికా ప్రభావానికి ఆరంభంగా నిలిచింది. 👉1960లో.. మొహమ్మద్ రేజా షా వైట్ రివల్యూషన్ పేరుతో సంస్కరణలు చేపట్టాడు, భూసంస్కరణలు (జమీందారుల శక్తి తగ్గించడం), మహిళలకు ఓటు హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య కార్యక్రమాలు, పారిశ్రామికరణ, సైన్యం బలోపేతం చేయడంలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా ఇరాన్లో ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మధ్యతరగతి పెరుగుదల చోటు చేసుకున్నాయి.👉పాశ్చాత్య సంస్కృతి (ఫ్యాషన్, సినిమాలు) వేగంగా వ్యాపించినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితుల ఏర్పడడాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చినవారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. సావక్ SAVAK అనే షా రహస్య పోలీస్.. విపక్షాన్ని అణచివేసింది.ఆ సమయంలో మతాధికారి అయతొల్లా రుహొల్లా ఖోమేనీ 1964లో షా పాశ్చాత్యీకరణను విమర్శించి ప్రవాసంలోకి వెళ్లాడు.👉ఈలోపు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అసమానతలు, అధికారవాద పాలన, అన్ని కలగలిపి 1978లో భారీ నిరసనలకు దారితీశాయి. శక్తివంతమైన సైన్యం ఉన్నప్పటికీ, షా పూర్తి బలప్రయోగం చేయడానికి వెనుకాడాడు. 1979 జనవరిలో షా దేశం విడిచి పారిపోయాడు. ఇదే అదనుగా ఫిబ్రవరి 1న ఖోమేనీ ప్రవాసం వీడాడు. ఇరాన్ ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కొన్ని వారాల్లోనే పహ్లవి రాజవంశం కూలిపోయి, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. మొహమ్మద్ రేజా షా 1980లో ఈజిప్టులో ప్రవాసంలో ఉండగానే మరణించాడు. రేజా పహ్లవి ఈ విప్లవం తర్వాత అమెరికాలో స్థిరపడి.. ఇరాన్లో ప్రజాస్వామ్య మార్పు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాడు.👉షా యొక్క అధికారవాద పాలనను మరిచిపోయిన ఇరానీయులు, ముఖ్యంగా ఆ పరిస్థితుల రుచేంటో చూడని యువత.. పహ్లవి కాలాన్ని స్వేచ్ఛలు, ఆర్థిక సౌభాగ్యం, అంతర్జాతీయ ప్రతిష్ఠ కారణంగా గర్వంగా పీలవుతోంది. అదే సమయంలో ప్రవాసంలో ఉన్న షా కుమారుడు రేజా పహ్లవి మళ్లీ ఖమేనీ ఆధ్వర్యంలోని ధార్మిక పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగాడు.👉1979 విప్లవం సమయంలో రేజా పహ్లవి వయసు కేవలం 18. పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న ఆయన.. ఇరాన్లో సెక్యులర్ ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పిలుపు తర్వాత ఇరాన్లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో.. ఇరాన్ ప్రజలు మళ్లీ క్రౌన్ ప్రిన్స్ వైపు మొగ్గుచూపుతారనే సంకేతాలు అందుతున్నాయి. 👉ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి వచ్చే వారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మార్-ఎ-లాగోలో జరగనున్న Jerusalem Prayer Breakfast కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12న జరగనుంది. లాత్వియా పార్లమెంట్ ప్రతినిధులు, బ్రెజిల్ ఎంపీ ఎడ్వార్డో బోల్సోనారో కూడా పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ దశలో పహ్లవిని కలవడం సరైనది కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే పహ్లవి తనను రాజ్యాధికారంలో కాకుండా రాజ్యాంగ పరిరక్షణలో ఉండే రాజవంశానికి మద్దతుదారుడిగా పేర్కొన్నారు. “మిలియన్ల ఇరానీయులు స్వేచ్ఛ కోరుతున్నారు, కానీ ప్రభుత్వం అన్ని కమ్యూనికేషన్ లైన్లను కట్ చేసింది”.. :::ఖమేనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పహ్లవి ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ రేజా పహ్లవి ప్రొఫైల్- రేజా పహ్లవి (జననం అక్టోబర్ 1960) ఇరాన్ చివరి షా మొహమ్మద్ రేజా పహ్లవి పెద్ద కొడుకు- 1979 ఇరాన్ విప్లవంలో రాజ్యాన్ని గద్దె దింపిన తర్వాత ఆయన కుటుంబం ప్రవాసంలోకి వెళ్లింది.- రేజా పహ్లవి అమెరికాలో పైలట్ శిక్షణ పొందారు, తరువాత USCలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.- ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఫైటర్ పైలట్గా సేవ చేయాలని ప్రయత్నించినా, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించింది.అధికారం వద్దంటూనే,. - ఆయన తనను “ప్రజాస్వామ్యానికి మార్పు కోసం జాతీయ మార్గదర్శి”గా పేర్కొంటున్నారు.- ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో ప్రజలు “పహ్లవి తిరిగి వస్తాడు”, “ఖమేనీ గద్దె దింపబడతాడు” అంటూ నినాదాలు చేస్తున్నారు.- ఆయన నాలుగు దశాబ్దాలుగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.- ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, విద్యార్థి సంఘాలతో సమావేశమై ఇరాన్ ప్రజల పరిస్థితిని వివరించారు.- ఆయన Washington Postలో రాసిన వ్యాసంలో, ఇస్లామిక్ రిపబ్లిక్ “1979 తర్వాత ఎప్పుడూ లేనంత బలహీనంగా, విభజితంగా ఉంది” అని పేర్కొన్నారు.- “నేను అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను, కానీ ప్రజాస్వామ్య మార్పు కోసం మార్గదర్శకుడిగా బాధ్యత వహిస్తాను” అని ఆయన అన్నారు.- ఆయన US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతూ, “ప్రపంచ స్వేచ్ఛా నాయకుడు”గా అభివర్ణించారు.- అయితే ట్రంప్, “ఇప్పుడే ఆయనను కలవడం సరైనది కాదు” అని వ్యాఖ్యానించారు.- 2023లో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును కలవడం వివాదాస్పదమైంది.
స్వీపర్గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ
ఇండియాలో ఐటీ ఉద్యోగులకు కష్టాలు. రష్యాలో కార్మికులకు కొరత. ముఖ్యంగామునిసిపల్ మరియు ప్రజా నిర్వహణ సేవల రంగంలో రష్యా తీవ్ర కార్మిక కొరతను ఎదుర్కొంటోంది. అందుకే భారతదేశానికి చెందిన కొంతమంది పొట్టచేత పట్టుకొని అక్కడికి వాలిపోయారు. ఏం చేశామన్నది కాదు ముఖ్యం, గౌరవంగా ఎలా బతుకున్నామనేదే ముఖ్యం అని చాటి చెప్పారు. వీరిలో రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులుతోపాటుఒక టెకీ కూడా ఉండటం విశేషం. వీరంతా రష్యాలో వీధులను శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. నెలకు జీతం ఎంతో తెలుసా?రష్యన్ మీడియా సంస్థ ఫోంటాంకా ప్రకారం భారతదేశానికి చెందిన 26 ఏళ్ల ముఖేష్ మండల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వృత్తిరీత్యా నిపుణుడే. కానీ ఇక్కడ ఉద్యోగం లేదు. అందుకే సెయింట్ పీటర్స్బర్గ్లో వీధులను శుభ్రం చేసే పని కోసం కొన్ని నెలల క్రితం రష్యాకు వెళ్లిన 17 మంది భారతీయుల బృందంలో అతనూ ఒకడిగా మారిపోయాడు. ఇలా వెళ్లిన వారి వయస్సు 19 నుండి 43 సంవత్సరాల మధ్య .గత కొన్ని వారాలుగా, ముఖేష్ మండల్, ఇతర భారతీయ కార్మికులు నగరంలో పారిశుధ్య పనులకు బాధ్యత వహించే కొలోమ్యాజ్స్కోయ్అనే రహదారి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నగర రహదారులను శుభ్రం చేస్తున్నారు. వీరికి ఆహారం, దుస్తులు వసతి, రవాణాను ఖర్చులు భరిస్తుంది. ప్రతీ కార్మికుడికి నెలకు సుమారు 100,000 రూబుళ్లు సుమారుగా రూ. 1.1 లక్షల వేతనం. ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్వీరంతా భారతదేశంలో విభిన్న వృత్తిపరమైన నేపథ్యాల నుండి వచ్చారు. కొందరు రైతులు కాగా, మరికొందరు తమ సొంత చిన్న వ్యాపారాలను నడిపినవారు. ఈ బృందంలో మాజీ వెడ్డింగ్ ప్లానర్లు, డ్రైవర్లు , ఆర్కిటెక్ట్లు కూడా ఉన్నట్లు సమాచారం. తన ప్రస్తుత పాత్ర గురించి ఫోంటాంకాతో మాట్లాడుతూ, మండల్ తనకు టెక్నాలజీ రంగంలో పనిచేసిన అనుభవం ఉందని ముఖేష్ చెప్పాడు.మండల్ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేశారా లేదా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలను ఉపయోగించే సంస్థలలో పనిచేశాడా చేస్తే ఎంతకాలం పనిచేశాడు అనేదానిపై క్లారిటీ లేదు. స్థానిక మీడియాతో తన నిర్ణయం దీర్ఘకాలిక కెరీర్ ప్లాన్స్కంటే ఆర్థిక అవసరాల వల్లే తీసుకున్నానని మండల్ వెల్లడించారు వీధులను శుభ్రపరిచే పనిని చేపట్టడం గురించి అడిగినప్పుడు, “నేను భారతీయుడిని, ఒక భారతీయుడికి ఉద్యోగం ముఖ్యం కాదు. పనే దైవం. మీరు ఎక్కడైనా పని చేయవచ్చు, మరుగుదొడ్డిలో, వీధిలో, ఎక్కడైనా. ఇది నా ఉద్యోగం, నా కర్తవ్యం ,బాధ్యత, దీనిని సాధ్యమైనంత గొప్పగా చేయడమే’’ అని చెప్పాడు. అంతేకాదు తనకు తా రష్యాలో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశ్యం లేదని కూడా చెప్పాడు. ఏడాది కాలం రష్యాలో ఉండి, కొంత డబ్బు సంపాదించి, ఆపై స్వదేశానికి తిరిగి వెడతాను అని వివరించారు. ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా? టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి
జాతీయం
28 నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయన్నారు. లోక్సభ ఛాంబర్లో జరిగే ఉభయ సభల సభ్యుల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించడం సెషన్ మొదలవుతుందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేతోపాటు సాధారణ బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారని చెప్పారు. ఈ సెషన్ మొదటి దశ సమావేశాలు జనవరి 28– ఫిబ్రవరి 13వ తేదీ వరకు, రెండో దశలో మార్చి 9–ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉంటాయన్నారు. మధ్యలో ఫిబ్రవరి 13 నుంచి మార్చి 9 వరకు విరామం ఉంటుందన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం నాడు ప్రవేశపెట్టే బడ్జెట్ను గురించిన విషయాలను ఆయన వెల్లడించలేదు.
ఢిల్లీనే మించిన బర్నీహాట్!
న్యూఢిల్లీ: కాలుష్యం విషయంలో మన దేశంలో నంబర్వన్ నగరం ఏదంటే అందరికీ గుర్తొచ్చేది దేశ రాజధానే. కానీ అసోంలోని బర్నీహాట్ పట్టణం ఢిల్లీని కూడా తలదన్నింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచి రికార్డు సృష్టించింది. ఢిల్లీ, గాజియాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఏకంగా 190 నగరాలు, పట్టణాలు పీఎం10 కాలుష్య సూచీ వార్షిక సురక్షిత పరిమితిని దాటేయడం ఆందోళన కలిగించే అంశం. ఇక పీఎం2.5 వార్షిక పరిమితిని మించిన నగరాల సంఖ్య అయితే ఏకంగా 1,747గా నమోదైంది! పీఎం10 వాయు నాణ్యత సూచీలో మాత్రం ఢిల్లీయే దేశంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది! సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) తాజా విశ్లేషణ ఈ మేరకు తేల్చింది. తర్వాతి స్థానంలో గాజియాబాద్, గ్రేటర్ నోయిడా ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఏకంగా 44 శాతం నగరాలు దీర్ఘకాలంగా వాయు కాలుష్యంతో సతమతం అవుతున్నట్టు అది వివరించింది. కొవిడ్తో సర్వం పడకేసిన 2020ని మినహాయిస్తే గత ఐదేళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతూ వస్తున్నట్టు వెల్లడించింది.ఎన్సీఏపీ ప్రభావం అంతంతే...కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద కవరైన నగరాలు దేశవ్యాప్తంగా కేవలం 4 శాతం మాత్రమే కావడం నెలకొన్న అవ్యవస్థకు అద్దం పడుతోందని సీఆర్ఈఏ వివరించింది. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని కనీస స్థాయికి తగ్గించే లక్ష్యంతో 2019లో కేంద్రం ఎన్సీఏపీని తెరపైకి తెచ్చింది. దీనికి రూ.13,415 కోట్లు కేటాయించింది. అందులో మూడొంతులకు పైగా నిధులను వ్యయం చేసింది కూడా. అయినా ఇప్పటివరకైతే ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. పైగా, ప్రస్తుతం ఎన్సీఏపీ కింద కవరవుతున్న నగరాలు, పట్టణాల సంఖ్య కేవలం 130 మాత్రమే. వాటిలో కూడా 28 నగరాల్లో ఇప్పటికీ కనీసం సరైన సంఖ్యలో వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు. పీఎం10 స్థాయిలను కనీసం 40 శాతం తగ్గించాలన్న లక్ష్యాన్ని కేవలం 23 నగరాలే చేరుకున్నాయి. మరో 23 నగరాల్లోనైతే పీఎం10 స్థాయిలు 2019తో పోలిస్తే ఇప్పుడు బాగా పెరగడం గమనార్హం. ‘‘28 నగరాల్లో కాలుష్యం 21–40 శాతం తగ్గింది. 26 నగరాల్లో ఇది 20 శాతం కంటే తక్కువే’’అని నివేదిక వెల్లడించింది.వామ్మో యూపీ!దేశవ్యాప్తంగా 4,041 నగరాలు, పట్టణాల్లో పీఎం10, పీఎం2.5 స్థాయిలను ఉపగ్రహ డేటా ఆధారంగా సీఆర్ఈఏ మదింపు వేసింది. వాటిలో చాలా నగరాలు కాలుష్యాన్ని అభిలషణీయ స్థాయికి తగ్గించడంలో ఘోరంగా విఫలమైనట్టు గుర్తించింది. పీఎం2.5 సూచీపరంగా 416 కలుషిత నగరాలతో ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. అవి కాలుష్యానికి చిరునామాగా మారినట్టు సీఆర్ఈఏ తేల్చింది. తర్వాతి స్థానాల్లో రాజస్తాన్ (158), గుజరాత్ (152), మధ్యప్రదేశ్ (143), పంజాబ్, బిహార్ (136), పశ్చిమబెంగాల్ (124) నిలిచాయి. ఇక పీఎం10 సూచీపరంగా చూస్తే 18 అత్యంత కలుషిత నగరాలతో రాజస్తాన్ తొలి స్థానంలో నిలిచింది. తర్వాత యూపీ (10), మధ్యప్రదేశ్ (5), బిహార్(4), ఒడిశా (4) ఉన్నాయి.గతేడాది ప్రపంచంలోనే టాప్బర్నీహాట్. అసోం, మేఘాలయ సరిహద్దుల్లో ఉండే ఓ పారిశ్రామిక పట్టణం. మితిమీరిన కాలుష్యంతో గతేడాది నుంచీ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. 2024లోనైతే ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత పట్టణంగా రికార్డుకెక్కింది. ఈ ఏడాది కూడా ఢిల్లీని తోసిరాజని దేశంలో అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. ఇక్కడ వార్షిక సగటు పీఎం2.5 స్థాయి 100 ఎంజీగా తేలింది. గతేడాది ఇది 128.2 ఎంజీగా నమోదవడం విశేషం. అడ్డూ అదుపూ లేని విచ్చలవిడి పారిశ్రామికీకరణే బర్నీహాట్ కాలుష్యానికి ప్రధాన కారణం. ఇక్కడ ఇనుము ఉక్కు, సిమెంట్ ఫ్యాక్టరీలు, డిస్టిలరీల వంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. భారీ స్థాయిలో ఇవి విడుదల చేసే విష వాయువుల వల్ల బర్నీహాట్లో పీఎం10, పీఎం2.5 స్థాయిలు ఆకాశాన్నంటుతుంటాయి. పైగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రధాన రవాణా కేంద్రం కూడా కావడంతో ఇక్కడ వాహన కాలుష్యమూ విపరీతంగా ఉంటుంది.
అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఆ మార్గాల్లో నో ఎంట్రీ
మకర విలక్కు పండుగ సందర్భంగా శబరిమలలో ఆంక్షలు విధించారు. తాజా నిబంధనల ప్రకారం జనవరి 12 నుంచి పంబాలో ఎలాంటి వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని కేరళ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు ఎలాంటి వాహనాలు ప్రయాణించడానికి వీల్లేదని పోలీసులు ఆదేశించారు. అదే రోజు ఉదయం 10 గంటల తర్వాత పంబ నుంచి సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించేది లేదన తేల్చి చెప్పారు.కాగా.. మకర సంక్రాంతికి అయ్యప్ప మాల భక్తులు పెద్దఎత్తున శబరిమల చేరుకుంటారు. మకరజ్యోతి దర్శనం కోసం వేలాది మంది అయ్యప్పస్వాములతో ఆలయం కిటకిటలాడుతుంది. అత్యంత రద్దీ ఉండే రోజులు కావడంతో భక్తులు వెళ్లే మార్గాల్లో వాహనాలకు అనుమతులు నిలిపేశారు. ఈ విషయాన్ని శబరిమల అయ్యప్ప భక్తులు గమనించాలని కేరళ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
500 అడుగుల లోయలో పడిన బస్సు.. 14 మంది మృతి
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హిమాచల్లోని సిర్మౌర్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడి దాదాపు 14 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.వివరాల ప్రకారం.. హిమాచల్లోని సిమ్లా నుంచి కుప్వికి వెళ్తున్న బస్సు హరిపుర్ధర్ దగ్గర అదుపుతప్పి 500 అడుగుల లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బస్సు లోపల నుంచి బయటకు తీశారు. అనంతరం అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.STORY | Eight killed, five injured as private bus rolls down hill in Himachal's SirmaurEight people died while five others were injured after a private bus rolled down from the road in Himachal Pradesh's Sirmaur district on Friday, police said.READ: https://t.co/DrE5EEk11w… pic.twitter.com/3XA4HwgvR3— Press Trust of India (@PTI_News) January 9, 2026మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించి సంగ్రా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) సునీల్ కాయత్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయిందని తెలిపారు. జిల్లా కేంద్రం నాహన్ నుంచి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిపుర్ధార్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనగుతున్నాయని చెప్పారు. గాయపడిన వారందరినీ సమీపంలోని సంగ్రా, దదాహు ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు.Himachal: Bus accident in Sirmaur district, a dozen people injured.Himachal Pradesh: SP Sirmaur, Nishchint Singh Negi, says, "We have received information that a private bus traveling from Kupwi to Shimla slipped off the road near Haripur Dhar in Sirmaur district, resulting in… pic.twitter.com/iG6SqAUlt8— Manmeen Walia (@ManmeenWalia) January 9, 2026
ఎన్ఆర్ఐ
ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025'
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో 'GTA మెగా కన్వెన్షన్ 2025' వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్లో శని, ఆదివారం పలు కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కాన్వెన్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జిటీఎ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, యూఎస్ఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, యూఎస్ఎ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి, తదితరులు GTA లో కీలక పాత్ర పోషిస్తూ ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తోడ్పాడ్డారు.తెలంగాణలో జిల్లాల వారిగా GTA చాప్టర్లు ప్రారంభించారు. జిల్లాల కార్యవర్గాన్ని ఈ వేదికపై పరిచయం చేశారు. కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ షో నిర్వహించారు.రియల్ ఎస్టేట్, స్టార్టప్లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం విశేషం. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద - రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, జిటీఎ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్తో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రపంచ తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
మహబూబాబాద్: ఉన్నత చదువులు.. ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. అమెరికాలో ఘోర ప్రమాదంలో భారతీయ విద్యార్థినిలు మృతి చెందారు. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్కి బయల్దేరారు. ఈ క్రమంలో.. అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు.. ఇటు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఇద్దరి మృతితో గార్ల మండలంలోని వాళ్ల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల మీసేవా సెంటర్ నిర్వహకుడు కాగా.. భావన ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వర్రావు కుమార్తె అని తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, యువతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల మృతదేహాలను రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.అమెరికాలో రోడ్డు ప్రమాదం మహబూబాబాద్ యువతులు మృతిఅమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతిఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి… pic.twitter.com/rnCljzTWtP— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో ఓరుగల్లు ఆడబిడ్డ
సాక్షి ప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత సౌత్ ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె 2011 నుంచి సౌత్ ఆస్ట్రేలియా లిబరల్ పార్టీకి బలమైన మద్దతురాలిగా ఉన్నారు. 2023లో టోరెన్స్ ఎస్ఈసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అక్కడి తెలుగు వారందరినీ ఐక్యపరచి తెలుగు సంప్రదాయాన్ని చాటుతున్నారు. మార్చి 18న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తెలుగు వారి సత్తా చాటుతామంటున్నారు. 2022లో క్లెమ్ జిగ్ వార్డు కౌన్సిలర్గా ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు.
క్వీన్స్ కామన్ వెల్త్ వ్యాసరచన పోటీలో విజేతగా తెలుగమ్మాయి..!
వసుధైవకుటుంబకమ్ అనే సార్వజనీన సార్వకాలిక దృక్పథం.. ప్రపంచ సాహిత్యంలో వలసవాద ధోరణుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ అల్లాడిన ప్రపంచవ్యాప్తంగా ఉండే దీనప్రజానీకానికి మద్దతు తెలిపే కవిత్వ ధోరణి.. ఇలాటి పెద్దపెద్ద విషయాలు ఒక చిన్నారి కవితలలో కనపడటం మామూలు విషయం కానేకాదు. సింగపూర్లో క్రెసెంట్ గర్ల్స్ స్కూల్ నుంచి సెకండరీ 2 విద్యార్థిని అయిన ఆచంట లక్ష్మీ మనోజ్ఞ ఇలాటి గొప్ప అద్భుతాన్నే చేసి చూపించింది. పూవు పుట్టగానే పరిమళిస్తున్న చందంగా చదువుతో పాటు సంగీత సాహిత్యాలు పియానో వాదన, నృత్యం ఇలా బహువిధాలుగా తన ప్రజ్ఞను వికసింపజేసుకుంటున్న మనోజ్ఞ ఈ సంవత్సరం రాయల్ కామన్వెల్త్ సొసైటీ (RCS), పాఠశాలల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ రచనల పోటీ అయిన 'ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC) 2025' విజేతలలో ఒకరిగా ఎంపిక అవడం విశేషం. ఈమె తన కవిత్వం ద్వారా, విశ్వమానవాళికి సంబంధించిన సంవేదనలతో తాదాత్మ్యాన్ని పొందుతుంది. వారి జీవితాలలో నిండిన దైనందిన భావావేశాల లయలను తన కవితలద్వారా స్పృశిస్తుంది. పియానో పట్టుకోని వేళలను ప్రపంచ పౌరుల సుఖదుఃఖాలను ప్రతిబింబించే కవితలను అల్లడానికి సమయాన్ని వినియోగిస్తుంది. పిన్న వయస్కురాలైనప్పటికీ ఈమె కవితా ధోరణులలో ఎలిజబెత్ లిమ్ మరియు ఆన్ లియాంగ్ వంటి రచయితలచే పొందిన ప్రభావాలున్నాయి.మనోజ్ఞ రాసిన, బహుమతి గెలుచుకున్న 'ఇండియా టు మారిషస్' అనే కవిత, తన తల్లి నుంచి వేరు చేయబడి, భారతదేశంలోని తన ఇంటి నుండి మారిషస్లోని ఒక ఎన్క్లోజర్కు తరలించబడిన ఒక చిన్న కోతి కథను చెబుతుంది. భారతదేశంలో జన్మించినా ఆరు నెలల వయస్సులో సింగపూర్కు వెళ్లి అక్కడ శాశ్వత నివాసం చేసే కుటుంబానికి చెందిన మనోజ్ఞ, ఈ పోటీకోసం ఎన్నుకునే ఇతివృత్తంగా - 'అవర్ కామన్వెల్త్ జర్నీ'కి సంబంధించి భారతదేశం గురించి రాయాలనుకుంది.ఆమెకు భారతదేశం, మారిషస్లను కలిపే బానిస కార్మిక వ్యాపారం గురించి అవగాహన ఉంది. దానితో ఆ దేశాల మధ్య మార్గం గురించి, అలాగే మన భారతదేశం నుండి మారిషస్కు వచ్చిన వారి అనుభవాల గురించి పరిశోధించడం ప్రారంభించింది. కార్మికులతో పాటు అన్యదేశ వన్యజీవులతో కూడా వలస వ్యాపారం చేస్తున్నారని తెలుసుకొని వేదనపడ్డది. ఆ విషయమే కోతికి సంబంధించిన ప్రతీకాత్మక దృష్టికోణం నుండి రాయడానికి ఆమెకు ప్రేరణగా మారింది. ఆమె బహుమతి పొందిన కవితలో భారతదేశం నుంచి మారిషస్కు దాని దయనీయమైన ప్రయాణాన్ని వర్ణిస్తూ, మరియు తల్లిచెంత, స్వంత భూమిలో లభించే ఆత్మీయమైన వాతావరణం హఠాత్తుగా కోల్పోయి, పరాయి చోటున బందీయై పలుబాధలు పడుతూ తిరిగి తల్లి ప్రేమను ఆశిస్తూ అది లభించక పడే తపన...జాలికొలిపే తీరులో దాని ఆర్ద్రమైన కోరికను తన తల్లికి స్వగతంగా విన్నవించుకునే -పసికోతి ద్వారా చెప్పబడిన హృదయవిదారకమైన ఒక ఘటనకు చెందిన కవిత ఇది.. బందిఖానాలో ఉన్నప్పుడు , స్వానుభవాలపట్ల గమనిక..తను పొందిన తీపి అనుభవాలకూ.. ప్రస్తుతం అనుభవించే మనోవేదనకూ మధ్య జరిగే సంఘర్షణను ప్రతి ఒక్కరి హృదయాలను తాకేటట్టు వర్ణించే మనోహరమైన కవిత ఇది. ఈ కవితను రాయడానికి భూమికగా - ఇండియానుండి సింగపూర్కు వచ్చి, ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని, తన మరియు తన సోదరి కోసం వారిదైన నూతన జీవితాన్ని ఏర్పరచుకున్న తీరుతెన్నులను గురించి తన తల్లిదండ్రులు చెప్పిన సంగతులు తనకు స్ఫూర్తినిచ్చాయని మనోజ్ఞ చెప్తుంది. ఇలాటి గంభీరమైన, ప్రభావశీలమైన కవితా రచనతోనే ప్రతిష్టాత్మకమైన క్వీన్స్ కామన్వెల్త్ వ్యాసరచన పోటీలో తను రన్నరప్గా ఎంపికైంది. ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరిగింది. తన కుటుంబ సభ్యులు ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్న, సోదరి శ్రీ మేఘనల సమక్షంలో చిరంజీవి మనోజ్ఞ ఈ అవార్డును హర్ మెజెస్టీ క్వీన్ కెమిల్లా నుంచి అందుకుంది.(చదవండి: మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు)
క్రైమ్
కొడుకును చంపి.. తానూ ఉరేసుకుని!
హైదరాబాద్: మరో నెల రోజుల్లో కుమారుడి తొలి పుట్టిన రోజు వేడుకలు....ఇందుకోసం భార్యా భర్తలిద్దరూ అవసరమైన షాపింగ్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి...వీటిని తట్టుకోలేక ఓ తల్లి తన 11 నెలల బాబుకు విషమిచ్చి తానూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇదే తరుణంలో కన్న కూతురు, మనవడు తన కళ్లముందే చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మృతురాలి తల్లి విషం తాగింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జయకృష్ణ ఎన్క్లేవ్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మల్లేపల్లి మండలం పాల్వయికి చెందిన యశ్వంత్ రెడ్డి, సుష్మిత (27)లకు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 నెలల బాబు అశ్వంత్ నందన్ రెడ్డి ఉన్నాడు. కొంత కాలంగా వీరు హస్తినాపురం జయకృష్ణ ఎన్క్లేవ్లోని కుందనిక అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. యశ్వంత్ రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. కాగా, తండ్రి గతంలోనే చనిపోవడంతో సుషి్మత తల్లి లలిత (50) కూడా కూతురు, అల్లుడి వద్దే ఉంటోంది. మరో నెల రోజుల్లో కుమారుడు అశ్వంత్ నందన్ రెడ్డి తొలి జన్మదినం ఉండడంతో ఈనెల 7న భార్యాభర్తలిద్దరూ షాపింగ్ చేశారు. అనంతరం వీరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. రోజూ మాదిరిగానే ఈనెల 8న ఉదయం విధులకు వెళ్లిన యశ్వంత్ రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి రాగా, లోపల గడియ పెట్టి ఉంది. ఎంత కొట్టినా తీయకపోవడంతో అపార్ట్మెంట్ వాసుల సాయంతో కిటికీ తొలగించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్కు ఉరివేసుకుని భార్య, మంచంపై కొడుకు మృతి చెందగా, అత్త కొనఊపిరితో ఉండగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మీర్పేట పోలీసులు తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించారు. మృతురాలి బంధువులు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ తెలిపారు. యశ్వంత్ రెడ్డి వేధింపుల వల్లే సుష్మిత తన కుమారుడికి విషమిచ్చి బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి పెద్దనాన్న సంజీవరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
498 ఏ, పొరుగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
గృహహింస, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలకు చట్టం కల్పించిన రక్షణ సెక్షన్ 498A. వివాహిత స్త్రీ పట్ల భర్త లేదా అతని బంధువుల హింస, వేధింపులను ఈ చట్టం ద్వారా ఎదుర్కోవచ్చు. వివాహంబంధంలో అత్తింటి వారినుంచి తనకెదురైన ఇబ్బందులు, బాధలనుంచి విముక్తి పొందేందుకు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అయితే ఈ కేసులో పొరుగింటివారి మీద కూడా కేసు నమోదు చేయవచ్చా? వారిని కూడా నిందితులుగా పేర్కొనవచ్చా? చట్టం ఏ చెబుతోంది? దీనిపై కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది?సెక్షన్ భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498A ప్రత్యేకంగా భర్త లేదా అతని బంధువులపై కేసు నమోదు చేయవచ్చు. ఎవరైనా, ఒక స్త్రీ భర్త లేదా భర్త బంధువు అయి ఉండి, ఆ వివాహితను క్రూరంగా హించినట్టు రుజువైతే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాకు కూడా విధించే అవకాశం ఉంది.అయితే ఒక కేసులో తన పొరిగింటి మహిళను విచారించాలని ఒక ఫిర్యాదు దారు కోరింది. ఈ కేసులో ఫిర్యాదు దారైన మహిళకు 2006లో జరిగిన వివాహం అయింది. వైవాహిక కలహాలు తలెత్తడంతో భర్తపై కేసు నమోదు చేసింది. హింసకు పాల్పడుతున్నాడంటూ భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలు, పొరుగింటి మహళ తన భర్తను రెచ్చగొట్టిందని ఆరోపించింది. దీంతో పోలీసులు భర్తపైనే కాకుండా, పొరుగువారిపై కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జ్షీట్లో ఐపీసీలోని సెక్షన్లు 498A, 504, 506 మరియు 323 కింద కేసులు నమోదు చేయడంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది చందన్ కె వాదిస్తూ, ఆమెకు ఇతర నిందితుల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా ఈ వివాదంలోకి లాగారన్నారు. భర్తను రెచ్చగొట్టిందనేది మాత్రమే ఆమెపై మోపిన ఏకైక ఆరోపణ అని, వ్యక్తిగత కక్షతో, ఆమెను నిందితురాలిగా చేర్చారని, ఈ కేసునుంచి ఆమెను తొలగించాలని వాదించారు.ప్రాసిక్యూషన్ ఈ పిటిషన్ను వ్యతిరేకించింది. న్యాయవాది కె నాగేశ్వరప్ప వాదిస్తూ, పొరుగున ఉన్న మహిళ భర్త ప్రవర్తనను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించిందని , "భర్త అన్ని ప్రవర్తనలకు ఆమెనే కారణం" అని పేర్కొన్నారు. కాబట్టి ఆమె విచారణను ఎదుర్కొని, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన వాదించారు.ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్అయితే రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత, సెక్షన్ 498A కింద ఆమెను నిందితురాలిగా చేర్చడానికి తగిన కారణాలేవీ లేవని కోర్టు గుర్తించింది. దీనిపై జస్టిస్ నాగప్రసన్న తీర్పునిస్తూ పిటిషనర్ పేరు కేవలం ప్రేరేపణ ఆరోపణల సందర్భంలో మాత్రమే వెలుగులోకి వచ్చిందని, కానీ ఆమె చట్టంలోని నిబంధన ప్రకారం కుటుంబం అనే నిర్వచనంలోకి రారని పేర్కొన్నారు. ఈ కేవలం ఆరోపణ తప్ప, చట్టం ప్రకారం క్రూరత్వానికి పాల్పడిన చర్యలలో ఆమె ప్రమేయం రాదని చెప్పారు. భర్త ,భార్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఐపిసి సెక్షన్ 498A కింద నేరాలకు సంబంధించిన విచారణలో ఒక అపరిచితురాలిని చేర్చలేరని ఆ ఉత్తర్వు నొక్కి చెప్పింది. అంతేకాదు ఈ కేసులో పొరుగింటి మహిళపై కేసును అనుమతించడం, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. భర్త కుటుంబంలో భాగం కాని వ్యక్తి ఈ నిబంధన పరిధిలోకి రాదని, అందువల్ల, ఆమె విచారణను ఎదుర్కోవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!అలాగే రమేష్ కన్నోజియా మరియు మరొకరు వర్సెస్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ,మరొకరి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి
కాలేజీ లెక్చరర్ల వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని బలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. క్రమశిక్షణ పేరుతో ఓ విద్యార్థిని పట్ల లెక్చరర్ అనుచితంగా ప్రవర్తించింది. తోటి విద్యార్థుల ముందే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీంతో, తీవ్ర మనస్థాపానికి, మానసిక వేదనకు గురైన విద్యార్థిని అనూహ్యంగా అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెస్ట్ మారేడుపల్లికి చెందిన విద్యార్థిని వర్షిణి (17) ఇంటర్ చదువుతోంది. అయితే, వర్షిణి (Varshini) ఒక రోజు కాలేజీకి కొంచెం ఆలస్యంగా వచ్చింది. అదే సాకుగా తీసుకున్న లెక్చరర్లు శ్రీలక్ష్మి (Sri Lakshmi), మధురిమ (Madhurima)లు ఆమెను తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి దూషించారు. కాగా, వర్షిణి తనకు నెలసరి రావడం వల్ల ఆలస్యం అయిందని చెప్పింది. పీరియడ్స్ వచ్చాయా? నాటకాలు ఆడుతున్నావా.. ఏది చూపించు? అంటూ అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడారు. దీంతో, తోటి విద్యార్థులు ముందు ఇలా చేయడం పట్ల వర్షిణి తట్టులేకపోయింది. దీంతో, వర్షిణి మానసికంగా కుంగిపోయింది. ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పి ఏడ్చింది. అయితే తల్లి ఓదార్చి తర్వాత వెళ్లి మాట్లాడదామని తల్లి కుమార్తెను సముదాయించింది.పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించుహైదరాబాద్ కాలేజిలో దారుణ ఘటనఅవమానం తట్టుకోలేక దళిత విద్యార్థిని మృతిసికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి కలకలంమల్కాజిగిరికి చెందిన విద్యార్థిని (17) కాలేజీకి… pic.twitter.com/TDpnYTq5KK— Telugu Scribe (@TeluguScribe) January 9, 2026ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. దీంతో, వర్షిణిని వెంటనే మల్కాజ్గిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడ సిటీ స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయడం మానేశాయి. స్కానింగ్ చేసిన వైద్యులు.. తీవ్ర మనస్తాపానికి గురికావడంతో బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. అనంతరం అదే రాత్రి బాలిక మృతి చెందింది. వర్షిణి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. లెక్కరర్లు చేసిన ఓవరాక్షన్ వల్లే తమ కూతురు ఇలా చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రూ. 63.01 కోట్ల కొకైన్ : ఇద్దరు భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్
భారత్కు చెందిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లను డ్రగ్స్ కేసులో అమెరికాలోని ఇండియానా పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 63.01 కోట్ల విలువైన 309 పౌండ్ల కొకైన్ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఇది లక్షకు పైగా (1,13,000)అమెరికన్లను చంపేంత ప్రమాదకరమని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ట్రిసియా మెక్లాఫ్లిన్ తెలిపారు.గురుప్రీత్ సింగ్ (25) జస్వీర్ సింగ్ (30) అమెరికాలోని ఇండియానాలో అదుపులోకి తీసుకున్నారు. వీకెండ్ హైవే తనిఖీల్లో అనుమానాస్పందగా ప్రయాణిస్తున్న వీరి వాహనాంలో కొకైన్ తరలిస్తున్నట్టు గమనించి స్నిఫర్ డాగ్ యూనిట్ అధికారులను అప్రమత్తం చేశారు. కోర్టు రికార్డుల ప్రకారం, "ట్రక్కు సెమీ-ట్రక్కు స్లీపర్ బెర్త్లో దుప్పటితో కప్పిన అట్టపెట్టెల్లో 140 కిలోల కొకైన్ను పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేసి పుట్నం కౌంటీ జైలుకు తరలించారు. నిందితులు మాదకద్రవ్యాలను విక్రయించారన్ననేరారోపణలు ఎదుర్కొంటున్నారని, బహిష్కరణ చర్యలు తీసుకుంటామని ఇండియానా రాష్ట్ర పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!అయితే నిందితులు దీన్ని ఖండించారు. ట్రక్కు లోపల ఏముందో తమకు తెలియదని, తమ ట్రక్కింగ్ కంపెనీ ట్రక్కును రిచ్మండ్లోని ఒక భారతీయ రెస్టారెంట్కు తీసుకెళ్లి లోడ్ కోసం వేచి ఉండమని ఆదేశించిందని చెప్పారు. గురుప్రీత్ సింగ్ 2023, మార్చి 11న అరిజోనా నుండి అక్రమంగా యుఎస్లోకి ప్రవేశించగా, జస్వీర్ సింగ్ 2017 ,మార్చి 21న కాలిఫోర్నియా నుండి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడని అధికారులు పేర్కొంటున్నారు. వీరిద్దరికీ కాలిఫోర్నియా వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్లను మంజూరు చేసింది. మరోవైపు కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో చోరీ కేసులో జస్వీర్ను గత నెలలో అరెస్టు చేశారు.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్
వీడియోలు
ట్రాఫిక్ దెబ్బకు కారు వదిలేసి నడుచుకుంటూ..
సనాతన వేషగాళ్ళ పాలనలో మహిళపై టీడీపీ నేత కుల బహిష్కరణ
మరో బిగ్ సీక్వెల్ కన్ఫర్మ్.. రెబల్ ఫ్యాన్కు పండగే..
కోనసీమ బ్లోఅవుట్.. ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు అదుపులోకి మంటలు
బోర్డర్ 2 రిలీజ్... దురంధర్ రికార్డులు బ్రేక్ అవుతాయా?
కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్..
రేవంత్ తో కుమ్మక్కై.. సీమకు సమాధి.. చివరకు కథ అడ్డం తిరిగింది
Pothina Mahesh : దుర్గమ్మ సన్నిధిలో మహా అపచారం.. చంద్రబాబు నిర్లక్ష్య పాలన
భూ సర్వే రాయి పై జగన్ ఫోటో..! బాబుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన పేర్ని నాని
Manohar Reddy: కేక్ కట్ చేసినా కేసా..? ఇదెక్కడి న్యాయం..?

