శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు..
భారతదేశంలోని బిలియనీర్లు డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. దానం చేయడంలో కూడా ముందున్నారు. హురున్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. 2025లో దేశంలోని ధనవంతులు రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ విరాళాలు గత ఏడాదికంటే 85 శాతం ఎక్కువ కావడం గమనార్హం.హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ & కుటుంబం.. ఏడాదిలో రూ. 2,708 కోట్ల విరాళాలు ఇచ్చి, నాల్గవసారి భారతదేశ అత్యంత ఉదారవాది అనే బిరుదును నిలుపుకున్నారు. నాడార్ రోజుకు రూ. 7.4 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్య, కళలు, సంస్కృతి వంటిని ప్రోత్సహించే శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా డబ్బును ఖర్చు చేశారు.జాబితాలోని ఈ ఏడాది.. టాప్ 10 దాతలు సమిష్టిగా రూ. 5,834 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది గత సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ, అంటే మొత్తం విరాళాలలో 56 శాతం అన్నమాట. జాబితాలో రెండో స్థానంలో ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ ఉంది.కుటుంబం & విరాళాలు➤శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2708 కోట్లు➤ముకేశ్ అంబానీ & ఫ్యామిలీ: రూ. 626 కోట్లు➤బజాజ్ ఫ్యామిలీ: రూ. 446 కోట్లు➤కుమార్ మంగళం బిర్లా & కుటుంబం: రూ. 440 కోట్లు➤గౌతమ్ అదానీ & ఫ్యామిలీ: రూ. 386 కోట్లు➤నందన్ నీలేకని: రూ. 365 కోట్లు➤హిందుజా ఫ్యామిలీ: రూ. 298 కోట్లు➤రోహిణి నీలేకని: రూ. 204 కోట్లు➤సుధీర్ & సమీర్ మెహతా: రూ. 189 కోట్లు➤సైరస్ & ఆడారు పూనావాలా: రూ. 173 కోట్లుThe Top 10 philanthropists in the EdelGive Hurun India Philanthropy List 2025 donated INR 5,834 Cr — up 26% YoY, forming 56% of India’s total giving.Shiv Nadar & family lead with INR 2,708 Cr, followed by Mukesh Ambani & family, Bajaj family, Kumar Mangalam Birla & family. pic.twitter.com/kS2ZVxlCW4— HURUN INDIA (@HurunReportInd) November 6, 2025
అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..
ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ పోటీలు వివాదంలో చిక్కుకున్నాయి. సాక్షాత్తు ఆతిథ్య దేశ అధికారే ఈ వివాదానికి కారకుడు కావడం దురుదృష్టకరం. ఈ ఘటనతో ఒక్కసారిగా అందాల భామలు..తాము కేవలం అందానికే కాదు, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని యావత్తు ప్రపంచానికి చూపించారు. తామంతా ఒక్కటేనని..ఒక్కరికి జరిగిన అవమానాన్ని ఎదుర్కొనేందుకు సాటి అందాల పోటీదారులంతా ముందుకు వచ్చి మద్దతు పలకడం..హర్షించదగ్గ విషయం. పైగా మమ్మల్ని చులకనగా చూస్తే ఊరుకోం అని తమ చేతలతో చెప్పకనే చెప్పారు ఈ సుందరీమణులు.అసలేం జరిగిందంటే..మిస్ మెక్సికో ఫాతిమా భాష్ను మిస్ యూనివర్స్ థాయిలాండ్ డైరెక్టర్ నవత్ ఇట్సారగ్రిసిల్ (60) బహిరంగా అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందాల పోటీకి ఆతిథ్యమిస్తున్న థాయిలాండ్ దేశ అందాల పోటీల అధికానూ ఇలా అనడ సర్వత్ర చర్చనీయాంశమైంది. వారి మధ్య జరిగిన సంభాషణ మొత్తం అధికారిక ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్లో జరిగింది. ఇట్సారగ్రిసిల్ థాయిలాండ్ గురించి ప్రమోషనల్ కంటెంట్ను పోస్ట్ చేయనందుకు మిస్ మెక్సికో బాష్ను విమర్శించాడు. ఇతర పోటీదారుల ముందు ఆమెను "డమ్మీ" అని అవమానించాడు. వారి మధ్య సంభాషణ దాదాపు నాలుగు నిమిషాలు కొనసాగింది. మెక్సికో మీరు ఎక్కడ ఉన్నారు, థాయిలాంగ్కి మద్దతు ఇవ్వడం లేదు, పైగా మీరు మిస్ యూనివర్స్ టీమ్ మాట కూడా ఎందుకు వినడం లేదని గట్టిగా నిలదీశాడు ఇట్సారగ్రిసిల్. తాను అందరితో మాట్లాడుతున్నానని, మీకేంటి సమస్య అని మిస్ మెక్సికో భాష్పై ఫైర్ అయ్యాడు. అందుకామె తనని మహిళగా గౌరవించడం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. దాంతో కోపంతో ఊగిపోయిన డైరక్టర్ ఇట్సారగ్రిసిల్ ఆమెను బయటకు పంపించమని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాడు. ఈ అనూహ్య ఘటనతో మిగతా పోటీదారులంతా మిస్ మెక్సికో బాష్కు సంఘీభావం తెలుపుతూ ఆమె తోపాటు బయటకొచ్చేసారు.మరికొందరు ఇట్సారగ్రిసిల్పై అరుస్తూ..నిరసన తెలిపారు. దీంతో ఇట్సారగ్రిసిల్ మెక్సికోకు మద్దతు ఇచ్చేవారిని అనర్హులుగా ప్రకటిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పైగా ఎవరైనా పోటీని కొనసాగించాలనుకుంటే కూర్చోండి అని ఆర్డర్ జారీచేయడమే కాదు, నువ్వు బయటకు వెళ్లినంత మాత్రాన ఈ పోటీ ఆగదు, మిగిలిన అమ్మాయిలతో ఈ పోటీ నిరాటంకంగా కొనసాగుతుంది అని దురుసుగా చెప్పాడు. Amazing scenes in Bangkok as Miss Universe organiser Nawat Itsaragrisil tries to prevent a mass walkout of contestants after he had publicly berated Miss Mexico pic.twitter.com/M8GgqBc0gQ— Andrew MacGregor Marshall (@zenjournalist) November 4, 2025 ఈ వ్యాఖ్యలతో మరికొంతమంది పోటీదారులు ఈవెంట్ నుంచి నిష్క్రమించాడరు కూడా. అంతేగాదు పలువురు సుందరీమణులు..ఇది మహిళల హక్కుల గురించి అని..అందుకు అస్సలు ఇలా వ్యవహరించాల్సిన పనిలేదు అంటూ ఇట్సారగ్రిసిల్పై మండిపడ్డారు . అయినా ఒక అమ్మాయిని ఇంత దారుణంగా అనడం, ఆమె గౌరవాన్ని కించపరచడమే అని తిట్టిపోస్టూ బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్(ఎంయూఓ) సైతం స్పందించింది. ఈ అందాల పోటీ ప్రతిష్ట అతని ప్రయేయం కారణం తగ్గుతోందని ఫైర్ అయ్యింది. అయినా తాము మహిళల గౌరవం, విలువలను ఉలంఘించడాన్ని అనుమతించం. అతను హోస్ట్గా ఎలా వ్యవహరించాలో మర్చిపోవడం బాధకరం అంటూ చివాట్లుపెట్టింది. అతని ప్రవర్తనా తీరుపై చట్టపరమైన చర్యల తీసుకుంటానని వెల్లడించింది. ఇది చాలమంది మహిళల కలల పోటీ దాన్ని నిరూపయోగంగా మారనివ్వం అని స్పష్టం చేసింది. దాంతో ఇట్సారగ్రిసిల్ దెబ్బకు తను చేసినదానికి క్షమాపణలు చెప్పడమే గాక, చాలా ఒత్తికి గురయ్యి అలా మాట్లాడానంటూ వివరణ ఇచ్చుకున్నాడు. అంతేగాదు ఎవరినైనా చెడుగా, అసౌకర్యం కలిగించేలా మాట్లాడినట్లు భావిస్తే గనుక తనని క్షమించండి అని అభ్యర్థించాడు. అలాగే ప్రత్యేకంగా హాజరైనా 75 మంది అమ్మాయిలను కూడా క్షమాపణలు కోరుతున్నాను అని వేడుకున్నాడు. దీనిపై బాధిత మిస్ మెక్సికో ఫాతిమా బాష్ ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ..తన దేశానికి ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. "నా గొంతును వినిపించడానికి భయపడను. మనం 21వ శతాబ్దంలో ఉన్నామా..?. అలంకరణ చేసుకోవడానికి, స్టైలింగ్ చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి బొమ్మను కాదు. తమ లక్ష్యం కోసం పోరాడే అమ్మాయిల గొంతుకగా ఉండటానికి, నాదేశానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానను. అది చెప్పడానికే ఇక్కడకు వచ్చానంటూ భావోద్వేగానికి గురైంది బాష్. కాగా, ఆ తర్వాత పోటీ ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగింది. బుధవారం బ్యాంకాక్లో జరిగిన ఒక కార్యక్రమంలో అందాల సుందరీ మణిలు పాల్గొన్నారు. అలాగే విజేతకు నవంబర్ 21న కిరీటం అందజేయనున్నారు. Y’all heard about the whole Miss Universe drama?Apparently Nawat(one of the directors of MU) openly called out Miss Mexico in a room full of other contestants to shame her but she stood up for herself. He called security to walk her out and other contestants walked out with her pic.twitter.com/1eHLnMHooR— Tobi_lobs (@Landladyeko) November 5, 2025 (చదవండి: బాడీషేమింగ్ చేస్తే తక్షణ శిక్ష తప్పదు!)
రష్మిక - విజయ్ పెళ్లి.. డేట్, వేదిక ఫిక్స్ చేశారుగా!
టాలీవుడ్లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లు ఎక్కడా కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి. చాలాసార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎప్పుడు వాటిపై స్పందించలేదు కూడా. అలాంటిది ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. రష్మిక, విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్లు ఫిక్సయిపోయారు.అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటనే రాలేదు. కానీ రష్మిక- విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్గానా?..డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు. అంతే కాదండోయ్ తేదీ, ముహుర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని నెట్టింట పోస్ట్ వైరలవుతోంది. రాజస్థాన్ ఉదయ్పూర్లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్కు వేదిక కానుందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కనపెడితే రష్మిక- విజయ్ పెళ్లి విషయంలో వారికంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియులే కాదు.. దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్ఫ్రెండ్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Cine Gossips (@thecinegossips)
భవితను నాశనం చేశారు: ప్రధాని మోదీ
పట్నా: ‘బిహార్లో 15 ఏళ్ల ఆటవిక పాలనలో.. ఎన్ని ఎక్స్ప్రెస్వేలు నిర్మించారు?.. జీరో. కోసి నదిపై ఎన్ని వంతెనలు నిర్మించారు?.. జీరో. ఎన్ని పర్యాటక సర్క్యూట్లు అభివృద్ధి చేశారు?.. జీరో. యువతకు ఎన్ని క్రీడా సముదాయాలు నిర్మించారు?.. జీరో. ఎన్ని వైద్య కళాశాలలు వచ్చాయి?.. జీరో.. ఐఐటీ, ఐఐఎం కూడా జీరో’.. ఒక తరం భవిష్యత్తును ఆర్జేడీ నేతలు బుగ్గిపాలు చేశారు’.. అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారం అరారియా(బీహార్)లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు.ఇప్పుడు బిహార్లోని అన్నివైపుల నుంచి ఒకే ఒక మాట వినిపిస్తున్నదని అది ‘మరోమారు ఎన్డీఏ సర్కార్’ అని అన్నారు. మొదటి దశ పోలింగ్లో బీహార్ ఓటర్లు అభివృద్ధి కోసం ఓటు వేస్తారని, చొరబాటుదారులను గుర్తించి, వెనుకను పంపుతారన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి.. చొరబాటుదారులను అక్రమంగా భారత పౌరులుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. ఆర్జేడీ జంగిల్ రాజ్.. బిహార్పై దాడి చేసిందని, జంగిల్ రాజ్ అంటే. పిస్టల్, క్రూరత్వం, అవినీతి దుర్మార్గపు పాలన అని అన్నారు.తొలి దశ ఓటింగ్ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు మూలల నుండి సోషల్ మీడియాలో పలు ఫొటోలు వస్తున్నాయని అన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయని, మహిళలు ఓటు వేసేందుకుపెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు. బిహార్ యువతలో ఉత్సాహంతో ఉందన్నారు. ఓటర్లంతా ఓటు వేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి: పోలింగ్ వేళ ‘బుర్కా’ వివాదం
మంచు లక్ష్మీ యోగాసనాలు.. కలర్ఫుల్ డ్రెస్లో దేవర భామ!
టీ తాగుతూ.. పొగ తాగుతున్నారా?
శ్రీలీల క్రేజీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
హైదరాబాద్లో నాలుగు రోజులు వైన్ షాపులు బంద్
సీబీఐటీలో పీజీ విద్యార్థుల కోసం ఓరియెంటేషన్ ప్రోగ్రాం
టీమిండియాకు భారీ షాక్..
రోజుకు 2.5జీబీ డేటా: కొత్త రీఛార్జ్ ప్లాన్
వరల్డ్కప్ విన్నర్ దీప్తి శర్మకు భారీ షాక్..
దేవసేనపై ఆరోపణలు తగదు.. ఐఏఎస్ అసోసియేషన్ ఖండన
మహా నగరాల్లోనే ఎక్కువ.. ఎందుకంటే?
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
భవిష్యత్తు బంగారు లోహం!
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
టీవీ5 మూర్తి, గౌతమి చౌదరికి షాక్!
సాక్షి కార్టూన్ 05-11-2025
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
స్మృతి మంధనకు భారీ షాక్
ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
ఆల్రెడీ సీఎం అయ్యారుగా! ఇక నా ఓటు నీకెందుకని వెళ్లిపోతున్నాడ్నార్!
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
మంచు లక్ష్మీ యోగాసనాలు.. కలర్ఫుల్ డ్రెస్లో దేవర భామ!
టీ తాగుతూ.. పొగ తాగుతున్నారా?
శ్రీలీల క్రేజీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
హైదరాబాద్లో నాలుగు రోజులు వైన్ షాపులు బంద్
సీబీఐటీలో పీజీ విద్యార్థుల కోసం ఓరియెంటేషన్ ప్రోగ్రాం
టీమిండియాకు భారీ షాక్..
రోజుకు 2.5జీబీ డేటా: కొత్త రీఛార్జ్ ప్లాన్
వరల్డ్కప్ విన్నర్ దీప్తి శర్మకు భారీ షాక్..
దేవసేనపై ఆరోపణలు తగదు.. ఐఏఎస్ అసోసియేషన్ ఖండన
మహా నగరాల్లోనే ఎక్కువ.. ఎందుకంటే?
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
భవిష్యత్తు బంగారు లోహం!
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
టీవీ5 మూర్తి, గౌతమి చౌదరికి షాక్!
సాక్షి కార్టూన్ 05-11-2025
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
స్మృతి మంధనకు భారీ షాక్
ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
ఆల్రెడీ సీఎం అయ్యారుగా! ఇక నా ఓటు నీకెందుకని వెళ్లిపోతున్నాడ్నార్!
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
సినిమా
పిల్లల కోసం ఆ మాత్రం చేయలేరా?. సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చూశారా?
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu Trailer). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చెప్పినమాట విననివాడే కొడుకు.. చెప్పినమాట విన్నట్లు నటించేవాళ్లే కూతురు.. అంతే పెద్దా తేడా లేదు... అనే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రేమ పెళ్లి తర్వాత పిల్లల కోసం మన హీరో ఎన్ని కష్టాలు పడ్డారనేదే సంతాన ప్రాప్తిరస్తు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. ఈ చిత్రాన్ని పిల్లల దినోత్సవం కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు.
విశ్వక్ సేన్- అనుదీప్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ కా దాస్గా పేరున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). మాస్ చిత్రాలతో పాటు కామెడీ ఎంటర్టైనర్లతోనూ మెప్పించారు. ఈ ఏడాది లైలా అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ ఫంకీ(FUNKY). ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కయాద్ లోహర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. 2026 ఏప్రిల్ 3న సమ్మర్లో థియేటర్లలో ఫంకీ సందడి చేయనుందని తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వీకే నరేశ్, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. Unlimited Laughter. 😆Unlimited Entertainment. 😎Unlimited FUN! 🥳#FUNKY GRAND RELEASE WORLDWIDE on APRIL 3rd, 2026. 🎬#FunkyFromApril3rd 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @NavinNooli @Venkatupputuri… pic.twitter.com/KLdhiJrMWL— Sithara Entertainments (@SitharaEnts) November 6, 2025
రష్మిక - విజయ్ పెళ్లి.. డేట్, వేదిక ఫిక్స్ చేశారుగా!
టాలీవుడ్లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లు ఎక్కడా కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి. చాలాసార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎప్పుడు వాటిపై స్పందించలేదు కూడా. అలాంటిది ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. రష్మిక, విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్లు ఫిక్సయిపోయారు.అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటనే రాలేదు. కానీ రష్మిక- విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్గానా?..డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు. అంతే కాదండోయ్ తేదీ, ముహుర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని నెట్టింట పోస్ట్ వైరలవుతోంది. రాజస్థాన్ ఉదయ్పూర్లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్కు వేదిక కానుందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కనపెడితే రష్మిక- విజయ్ పెళ్లి విషయంలో వారికంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియులే కాదు.. దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్ఫ్రెండ్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Cine Gossips (@thecinegossips)
కల్కి సీక్వెల్లో హీరోయిన్గా ఛాన్స్! కల్యాణి ఏమందంటే?
గతేడాది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD Movie) ఒకటి. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్లపైనే వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.దీపికా స్థానంలో కల్యాణి?ఇలాంటి సమయంలో కల్కి సీక్వెల్ నుంచి దీపికా(Deepika Padukone)ను తొలగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. 8 గంటల పని, తన టీమ్ మెంబర్స్కు లగ్జరీ వసతులు, లాభాల్లో వాటా.. ఇలా కొన్ని భారీ షరతుల కారణంగా ఆమెను సైడ్ చేశారు. దీంతో దీపికా పాత్రలో ఎవరు నటించనున్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీపికా స్థానంలో ఆలియా భట్, సాయిపల్లవి, అనుష్కల పేర్లు వినిపించాయి. ఇటీవల కొత్త లోక: చాప్టర్ 1తో సక్సెస్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.అంతకన్నా సంతోషం ఇంకేముంది?ఈ రూమర్పై కల్యాణి స్పందించింది. కొందరు ఇదేపనిగా యాక్టర్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనుకుంటా.. ఏదేమైనా నా పేరు పరిశీలిస్తున్నారంటే నాకు సంతోషంగానే ఉంది. నన్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? కానీ, వాళ్లు ఎవర్ని ఫైనల్ చేశారు? ఎవరిని తీసుకోబోతున్నారు? అన్నది చెప్పడం చాలా కష్టం. జనాలు నన్ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నారంటేనే ఎంతో సంబంరంగా ఉంది. ఇలాంటి అనుభూతి ఇంతకుముందెన్నడూ కలగలేదు అని చెప్పుకొచ్చింది.చదవండి: పెళ్లి సందడి షురూ.. జగద్ధాత్రి సీరియల్ నటి హల్దీ ఫంక్షన్
న్యూస్ పాడ్కాస్ట్
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా
తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మోంథా’... ఉమ్మడి వరంగల్పై తీవ్ర ప్రభావం
క్రీడలు
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిది. గురువారం క్వీన్స్ల్యాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో ఆసీస్ను టీమిండియా చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగుల స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో ఆస్ట్రేలియాను 119 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు."సిరీస్లో ముందంజ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ మాకు పవర్ ప్లేలో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ పిచ్పై 200 పైగా పరుగులు సాధించడం చాలా కష్టమని మా ఓపెనర్లు ముందే గ్రహించారు. అందుకే గిల్ ఆచితూచి ఆడాడు. బ్యాటింగ్లో దాదాపుగా ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. డగౌట్ నుంచి నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు సందేశాలు అందుతూ ఉన్నాయి. గౌతీ భాయ్(గంభీర్), నేను ఒకే అభిప్రాయంతో ఉన్నాము. మిడిల్ ఓవర్లలో శివమ్ దూబేను ఎటాక్లో తీసుకు రావాలని నిర్ణయించుకున్నాము. అందుకు తగ్గట్టే దూబే మాకు కీలక వికెట్లను అందించాడు. నిజంగా బౌలర్లు కూడా అద్భుతం చేశారు. మంచు ప్రభావం ఉన్నప్పటికి మా బౌలర్లు ఎక్కడ కూడా పట్టుకోల్పోలేదు. పిచ్ కండీషన్స్ తగ్గట్టు బౌలింగ్ చేశారు. మా జట్టులో నాలుగు ఓవర్లు కూడా బౌలింగ్ చేసే ఆల్రౌండర్లు ఉండడం గొప్ప విషయం. అయితే వారిని పరిస్థితుల బట్టి ఉపయోగిస్తాం. కొన్ని రోజులు వాషింగ్టన్ నాలుగు ఓవర్లు వేస్తే.. దూబే రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తాడు. మరి కొన్ని మ్యాచ్లలో దూబే నాలుగు ఓవర్లు వేస్తే.. వాషింగ్టన్కు రెండు ఓవర్లే వస్తాయి. కానీ జట్టుకు ఏం అవసరమో అది అందించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్
IND vs SA: కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్.. శతక్కొట్టిన జురెల్
సౌతాఫ్రికా- ‘ఎ’తో అనధికారిక రెండో టెస్టులో భారత్ -‘ఎ’ (IND A vs SA- Day 1) మెరుగైన స్కోరు సాధించింది. పర్యాటక జట్టు బౌలర్లు ఆది నుంచే చెలరేగి.. టాపార్డర్ను కుదేలు చేయగా.. ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) శతక్కొట్టి జట్టును ఆదుకున్నాడు. కాగా బెంగళూరు వేదికగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్లు రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే.టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ఇందులో భాగంగా తొలి టెస్టులో రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్సీలోని భారత జట్టు ప్రొటిస్ జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు మొదలైంది. బెంగళూరులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా- ‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది.కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్ఇక ఈ మ్యాచ్తో జట్టులోకి వచ్చిన ఓపెనింగ్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (19), అభిమన్యు ఈశ్వరన్ (0) విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ (17) నిరాశపరచగా.. దేవదత్ పడిక్కల్ (5) మరోసారి ఫెయిల్ అయ్యాడు.ఇలాంటి దశలో ఐదో నంబర్ ఆటగాడు, కెప్టెన్ రిషభ్ పంత్ జట్టును ఆదుకునే క్రమంలో వేగంగా ఆడాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసిన పంత్.. షెపో మొరేకి బౌలింగ్లో ఎంజే అకెర్మన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.సౌతాఫ్రికా ఆనందం ఆవిరి చేసిన జురెల్దీంతో సౌతాఫ్రికా శిబిరం సంతోషంలో మునిగిపోయింది. హర్ష్ దూబే (14), ఆకాశ్ దీప్ (0)లను కూడా త్వరత్వరగా అవుట్ చేసింది. అయితే, వారి ప్రొటిస్ జట్టుకు ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవకుండా చేశాడు ధ్రువ్ జురెల్.సహచర ఆటగాళ్లు విఫలమైన చోట జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. మొత్తంగా 175 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్ (88 బంతుల్లో 20), మొహమ్మద్ సిరాజ్ (31 బంతుల్లో 15) వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ జురెల్కు సహకరించారు.భారత్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఈ క్రమంలో 77.1 ఓవర్ వద్ద ప్రసిద్ కృష్ణ (0) పదో వికెట్గా వెనుదిరగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. తొలి రోజు పూర్తయ్యేసరికి77.1 ఓవర్లలో 255 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. జురెల్ అద్భుత శతకం కారణంగా భారత జట్టుకు ఈ మేర మెరుగైన స్కోరు సాధ్యమైంది. ఇక సఫారీ జట్టు బౌలర్లలో టియాన్ వాన్ వారెన్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షెపో మొరేకి, ప్రెనేలన్ సుబ్రయాన్ చెరో రెండు, ఒకులే సిలీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.భారత్- ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా -‘ఎ’ రెండో అనధికారిక టెస్టు తుదిజట్లుభారత్కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), హర్ష్ దూబే, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికాజోర్డాన్ హెర్మాన్, లిసెగో సెనొక్వనే తెంబా బవుమా, జుబేర్ హంజా, మార్వ్కెస్ అకెర్మన్ (కెప్టెన్), కొనొర్ ఎస్తర్హుజీన్ (వికెట్ కీపర్), టియాన్ వాన్ వారెన్, కైలీ సైమండ్స్, ప్రెనేలన్ సుబ్రయాన్, షెపో మొరేకి, ఒకులే సిలీ.చదవండి: క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా!
నాలుగో టీ20లో భారత్ ఘన విజయం..
క్వీన్స్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్(India) ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక కంగారులు చతకలపడ్డారు. లక్ష్య చేధనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(30), మాథ్యూ షార్ట్(25) ఘనమైన ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అక్షర్ మ్యాజిక్..భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. అక్షర్ దూకుడుగా ఆడుతున్న షార్ట్ను ఔట్ చేసి భారత్కు తొలి వికెట్ను అందించాడు. అతడితో పాటు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ రెండు, వరుణ్ చక్రవర్తి, బుమ్రా అర్ష్దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు.రాణించిన గిల్..అంతకుముందు బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్మన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ అతడు 120 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇక గిల్తో పాటు అభిషేక్ శర్మ(28), అక్షర్ పటేల్(21) రాణించారు.ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లతో సత్తాచాటారు. ఇక ఇరు జట్ల మధ్య ఐదో టీ20 బ్రిస్బేన్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే 3-1తో సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే 2-2 సిరీస్ సమంగా ముగుస్తుంది.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్Same matchup, same result! 😎Varun’s googly does the trick yet again as Maxwell’s off stump takes the hit! 🎯#AUSvIND 👉 4th T20I | LIVE NOW 👉 https://t.co/HUqC93tuuG pic.twitter.com/wrFxyTxV85— Star Sports (@StarSportsIndia) November 6, 2025
క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా!
‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కు అదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. నేను శతకం పూర్తి చేసుకున్నా. సచిన్ బ్యాటింగ్కు వచ్చాడు. వచ్చీరాగానే ‘వా’ (స్టీవ్ వా, మార్క్ వా) సోదరులు అతడిని స్లెడ్జ్ చేయడం మొదలుపెట్టారు.నీ తల పగులగొడతా చూడుఅప్పుడు మైక్ విట్నీ ఫీల్డింగ్ కోసం 12th మ్యాన్గా వచ్చాడు. అప్పటికే నేను అలెన్ బోర్డర్తో పోటీ పడుతున్నా. ఇంతలో అతడు బంతి చేతులో పట్టుకుని నన్ను చూస్తూ.. ‘నువ్వైతే క్రీజులోకి వెళ్లు.. నీ తల పగులగొడతా చూడు’ అని నాతో అన్నాడు.నేను వెంటనే వెనక్కి తిరిగి.. పిచ్ మధ్య వరకు వెళ్లి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అంతా వినిపించేలా గట్టిగా అరిచాను. ‘హే మైక్.. బంతిని విసరడం కాదు.. అద్భుతంగా బౌలింగ్ చేస్తేనే లెక్క. నువ్వెప్పటికీ ఆస్ట్రేలియా 12th మ్యాన్వి కాలేవు’ అని అరిచాను.నువ్వు నోరు మూసుకోఇంతలో సచిన్ నా దగ్గరికి వచ్చి.. తాను కూడా సెంచరీ చేసే ఆగమని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి వాళ్లకు వాళ్ల మాటల్ని తిరిగి ఇచ్చేద్దాం అన్నాడు. కానీ నేను మాత్రం.. ‘నువ్వు నోరు మూసుకో.. ఇప్పటికే చాలా అయింది. నీ బ్యాట్తో నువ్వు మాట్లాడు (పరుగులు రాబట్టు).. వాళ్ల సంగతి నేను చూసుకుంటా’ అని చెప్పాను’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.దశాబ్దకాలానికి పైగా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రవిశాస్త్రి (Ravi Shastri).. ఆ తర్వాత హెడ్కోచ్గానూ సేవలు అందించాడు. ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్న రవిశాస్త్రి.. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్తో ముచ్చటిస్తూ.. 1992 నాటి ఆస్ట్రేలియా టూర్ జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకున్నాడు.పరుగుల మీదే దృష్టి పెట్టు నాడు సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ దిగ్గజం అలెన్ బోర్డర్ తమను స్లెడ్జ్ చేశాడని.. ఆ సమయంలో సచిన్కు కేవలం పరుగుల మీదే దృష్టి పెట్టాలని తాను సూచించినట్లు రవిశాస్త్రి తెలిపాడు. కాగా 1981- 1992 వరకు టీమిండియాకు ఆడిన రవిశాస్త్రి.. 80 టెస్టుల్లో 3830, 150 వన్డేల్లో 3108 పరుగులు సాధించాడు.ఇక అత్యధిక పరుగుల వీరుడిగా ప్రపంచ రికార్డు సాధించిన సచిన్ టెండుల్కర్.. 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో 10 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో వంద సెంచరీలు ఉన్నాయి. తద్వారా ప్రపంచంలో ఏకైక శతక శతకాల ధీరుడిగా సచిన్ కొనసాగుతున్నాడు.చదవండి: హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడింది?.. ప్రధాని మోదీ ప్రశ్నకు దీప్తి శర్మ జవాబు ఇదే
బిజినెస్
39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్!
భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. నేడు (నవంబర్ 06) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.21 లక్షల వద్ద ఉంది. రేటు పెరగడానికి ప్రధాన కారణం.. పండుగ సీజన్ మాత్రమే కాదు. వివిధ దేశాల బ్యాంకులు ఎక్కువ మొత్తంలో పసిడి కొనుగోలు చేయడం కూడా.. అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది.2025 సెప్టెంబర్ నెలలో కేంద్ర బ్యాంకులు గరిష్టంగా 39 టన్నుల (39,000 కేజీలు) బంగారం కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఈ ఏడాది మొత్తంలో గోల్డ్ కొనుగోళ్లు సెప్టెంబర్లో జరిగినట్లు సమాచారం. కాగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం 634 టన్నులు కావడం గమనార్హం.సెప్టెంబర్ 2025లో.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ 15 టన్నుల గోల్డ్ కొనుగోలు చేయగా.. బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6 టన్నులు కొనుగోలు చేసింది. రష్యా బ్యాంక్ 3 టన్నులు, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజికిస్థాన్ 8 టన్నుల బంగారం కొనేసింది. టర్కీ బ్యాంక్ మాత్రం 2 టన్నుల పసిడి కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడంతో.. పసిడికి డిమాండ్ అమాంతం పెరిగిందని గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.ఇదీ చదవండి: ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!తగ్గుతున్న గోల్డ్ రేటు - కారణాలుసెంట్రల్ బ్యాంకుల విషయాన్ని పక్కనపెడితే.. పెట్టుబడిదారులు కూడా బంగారం సురక్షితమైన పెట్టుబడి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ ధరలను పెంచేసింది. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు కొంత తగ్గుముఖం పట్టింది. దీనికి కారణం.. అమెరికా డాలర్ బలపడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, రాజకీయ పరిస్థితులు అని తెలుస్తోంది.
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 90.33 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 83,368.82 వద్ద, నిఫ్టీ 78.30 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో.. 25,519.35 వద్ద నిలిచాయి.ఎక్స్క్సారో టైల్స్, రెడింగ్టన్, ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్లింక్ హోల్డింగ్స్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫైనోటెక్స్ కెమికల్, అప్డేటర్ సర్వీసెస్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్, జ్యోతి స్ట్రక్చర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
అమెరికా టెక్ కంపెనీలపై నిషేధం విధిస్తే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో సర్వీసులు అందిస్తున్న యూఎస్ టెక్నాలజీ కంపెనీలపై నిషేధం విధించే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో వ్యాపార వర్గాలు, టెక్ నిపుణుల్లో ఆందోళన మొదలైంది. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన సాంకేతిక స్వావలంబన (టెక్ రెసిలెన్స్)ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు నొక్కి చెప్పారు.ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చేసిన పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘అమెరికా టెక్ ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా ట్రంప్ ఇండియాలో ఎక్స్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చాట్జీపీటీ వంటి వాటిని నిషేధిస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. దీనికన్నా భయంకరమైంది లేదు! ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు ప్లాన్ బీ ఏమిటో ఆలోచించండి’ అని తెలిపారు. గోయెంకా అభిప్రాయాన్ని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సమర్థిస్తూ ‘నేను అంగీకరిస్తున్నాను. మనం అప్లికేషన్ స్థాయికి మించి అధికంగా టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్స్, చిప్స్, ఫ్యాబ్స్.. అన్ని విభాగాల్లో యూఎస్ టెక్నాలజీపై ఆధారపడడం పెరుగుతోంది. దీని పరిష్కరించాలంటే 10 సంవత్సరాల నేషనల్ మిషన్ ఫర్ టెక్ రెసిలెన్స్ అవసరం’ అని చెప్పారు.గోయెంకా పోస్ట్పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. భారత్ నుంచి అమెరికా టెక్ కంపెనీలు అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సమస్యను కేవలం యాప్లపై ఆధారపడటంలా కాకుండా టాలెంట్ సప్లై చైన్గా చూడాలని ఒక యూజర్ అన్నారు. మరో యూజర్.. ట్రంప్ భారతదేశం వంటి పెద్ద టెక్ మార్కెట్పై ఆంక్షలు విధించేంత మూర్ఖుడు కాదని, ఇది జరిగే అవకాశం లేదన్నాడు.ఇదీ చదవండి: మస్క్లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు!
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు..
న్యూఢిల్లీ: బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)రుణ మోసం కేసులో విచారణ కోసం నవంబర్ 14న విచారణకు రావాలని అనిల్ అంబానీని ఆదేశించింది. అనిల్ అంబానీని ఇదివరకే గత ఆగస్టులో ఈడీ ఓసారి విచారణకు పిలిచి ప్రశ్నించింది.అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలపై ఇప్పటికే ఈడీ, సీబీఐ, సెబీ విచారిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే రిలయన్స్ గ్రూప్ సంస్థలకు చెందిన దాదాపు రూ .7,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన 30 ఆస్తులు, అధార్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, మోహన్ బీర్ హైటెక్ బిల్డ్, గమేసా ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, విహాన్ 43 రియల్టీ, కాంపియన్ ప్రాపర్టీస్ తో ముడిపడి ఉన్న ఆస్తులు ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు.రూ.17,000 కోట్ల బ్యాంక్ రుణాలు దారి మళ్లించినట్లు అనిల్ అంబానీ సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, సెబీతోపాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా రంగంలోకి దిగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్ తో సహా పలు గ్రూప్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తును ప్రారంభించింది.
ఫ్యామిలీ
పనస కాయ చిప్స్తో ఏడాదికి రూ. 12 లక్షలు
పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకనప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఆయా పంటలను రోడ్డుమీద కుప్పలు కుప్పలుగా పారబోయడం, తగల బెట్టడం లాంటి బాధాకరమైన దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటపుడు ‘అయ్యో.. రేటు వచ్చేదాకా వీటిని భద్రపరిస్తే ఎంత బాగుండు’ అని అనుకుంటాం. అలా పుట్టిన ఆలోచనే ఆధునిక పద్దతులకు బాటలు వేస్తుంది. అదే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. పదండి వారి విజయ గాథ ఏంటో తెలుసుకుందాం.మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని గగన్బావ్డా తహసీల్లో, తేజస్-రాజేష్ పొవార్ అనే ఇద్దరు అన్నదమ్ముల సక్సెస్ స్టోరీ ఇది. అది జాక్ఫ్రూట్ (పనస) చిప్స్ బిజినెస్తో. సాధారణంగా పనసకాయలు ఒకసారి కాతకొచ్చాయంటే విపరీతమైన దిగుబడి వస్తుంది. కొల్హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని దాదాపు ప్రతి రైతు తమ పూర్వీకుల నుండి పనస చెట్లు వారసత్వంగా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే వాటి ద్వారా మంచి జీవనోపాధిని కూడా పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఉత్తిత్తి కూడా చాలా అధికంగా ఉండేది. దీంతో రైతులు వాటిని కోయలేక, మార్కెట్ చేసుకోలేక, మండీకి రవాణా ఖర్చులు కూడా భరించలేక వాటిని అలాగే పారవేసేవారు.తేజస్, రాజేష్ తల్లిదండ్రులకు జాక్ఫ్రూట్ చెట్లు బాగానే ఉండేవి. ఒక ఏడాది పనసకాయలుబాగా రావడంతో కొల్హాపూర్లో నివసించే బంధువులైన సంగీత, విలాస్ పొవార్ ఇంటికి తీసుకెళ్లారు.మా దగ్గర చాలా కాయలున్నాయి. వృధాగా పార వేస్తున్నామనే విషయాన్ని వారితో షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా వాటిని పారవేయడానికి బదులు చిప్స్గా తయారు చేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉందని వారు సూచించారట. అంతే అక్కడినుంచి వారి జీవితం మరో మలుపు తిరిగింది.15 కిలోల చిప్స్తో మొదలుదీంతో కుమారులతో కలిసి వారు రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలో దాదాపు 15 కిలోల చిప్స్ను తయారు చేసి కొల్హాపూర్లో ఇంటింటికీ వెళ్లి విక్రయించారు. డిమాండ్ పెరిగినప్పటికీ, ఇంటింటికీ డెలివరీ అందించడం సాధ్యం కాలేదు. దీంతో ఐటీఐ చదువు అయిన వెంటనే తేజస్ పనస చిప్స్ తయారీపై మరింత దృష్టి సారించాడు. ప్యాకేజింగ్ చేయడానికి కొన్ని ప్రాథమిక యంత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నేరుగా హోల్సేల్ వ్యాపారులు రిటైలర్లకు విక్రయించే పద్దతులను ప్రారంభించారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో పది పన్నెండు మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జాక్ఫ్రూట్ కోత జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభమైజూలై-ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఏటా 4,000 కిలోల జాక్ఫ్రూట్ను ప్రాసెస్ చేసి 1,000 కిలోల వేఫర్లను ఉత్పత్తి చేస్తారు.మార్కెట్ డిమాండ్ బట్టి కేజీ చిప్స్ను రూ. 900 నుంచి రూ. 10 వేల వరకు విక్రయిస్తారు. ఇక జాక్ఫ్రూట్ పోలీలు కేజీకి రూ. 700 చొప్పున అమ్ముడవుతాయి. అలా ఏడాది కాలంలో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు తమ పని పనసపంట వృధాను అడ్డుకోవడంతోపాటు, రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని, ఉద్యోగ అవకాశాలను సృష్టించింది అంటూరు తేజస్ సంతోషంగా.పనస చెట్లు 30 అడుగుల నుండి 70 అడుగుల వరకు పెరుగుతాయి. పెద్ద పెద్దకాయలతో దిగుబడి కూడా భారీగా వస్తుంది. దీనికి తోడు భారీ బరువు, కాయలనుంచి వచ్చే జిగట రబ్బరు పాలు కారణంగా వాటిని కోయడం చాలా ఛాలెంజ్ అంటారు తేజస్. అందుకే రైతు లనుంచి కిలోకు రూ. 30 నుంచి రూ. 70 వరకు చెల్లించి కొనుగోలు చేస్తారట. అలాగే పనసకాయలను ప్రత్యేక పద్ధతిలో కోసేలా నిపుణులను ఏర్పాటు చేసుకుంటారు. అనంతరం వాటిని చిప్స్, ఇంకా పండిన పండ్లను ఫనాస్ పో (భక్ష్యాలు) జాక్ఫ్రూట్ గుజ్జు, బెల్లం, గోధుమ పిండితో కలిపి తీపి ఫ్లాట్బ్రెడ్ తయారు చేస్తారు. చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందన పనసకాయలో పోషక విలువలు, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు ఇపుడు ఏ పెళ్లిళ్లు, పంక్షన్లలో చూసినా పనస కాయ బిర్యానీ చాలా ఫ్యామస్. జాక్ఫ్రూట్ కబాబ్లు, బిర్యానీలు, ఇతర రెడీ-టు-కుక్ ఉత్పత్తులకు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉంది.భారతదేశ జాక్ఫ్రూట్ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 1252 కోట్లు. రానున్న ఐదేళ్లలో దాదాపు రూ. 1580 కోట్లకు పెరుగుతుందని చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (CCSNIAM) నివేదిక పేర్కొంది.
‘షట్డౌన్’ తెచ్చిన ఆహార సంక్షోభం
ప్రస్తుతం అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ మాట వినడానికే వింతగా ఉన్నా... వాస్తవం! అక్కడ ప్రస్తుతం ‘షట్డౌన్’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షట్డౌన్ ప్రభావం అనేక రంగాలపై పడింది. తాజాగా వివిధ రాష్ట్రాలలో ఆహార సంక్షోభా నికి దారి తీసింది. ప్రధానంగా వాణిజ్య రాజధాని అయిన న్యూయా ర్క్పై పడింది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రాష్ట్రం ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. ఫెడరల్ ప్రభుత్వ షట్డౌన్ అమెరికాలోని కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లి మెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్ స్టాంప్స్’ ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేద వారే! ఇదిలా ఉంటే, నిధుల కొరత కారణంగా నవంబరు నెల ప్రయోజనా లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఇటీవల రాష్ట్ర ఏజెన్సీ లను అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాగా ఆహార సంక్షో భాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు లేదని గవర్నర్ కేథీ హోచుల్ ఆరోపించారు. చట్టబద్ధంగా ఆమోదించిన ఎమర్జెన్సీ ఫండ్ను విడుదల చేయడానికి ట్రంప్ సర్కార్ నిరాకరిస్తోందని కేథీ ఘాటు ఆరోపణలు చేశారు. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికాలోని అనేక రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో లూసియానా, వెర్మంట్, న్యూ మెక్సికో ముందు వరుసలో ఉన్నాయి.ఇదీ చదవండి : మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనఅమెరికా ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతి ఏడాది తప్పనిసరిగా ఒక బడ్జెట్ను లేదా తాత్కాలిక ఖర్చులను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబరు ఒకటో తేదీలోగా కాంగ్రెస్ ఈ బడ్జెట్ను ఆమోదించాల్సిఉంటుంది. అలా జరగకపోతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని సేవలు తాత్కా లికంగా నిలిచిపోతాయి. దీనినే ‘ప్రభుత్వ షట్డౌన్’ అంటారు. వాస్తవానికి ప్రభుత్వ సొమ్ము వృ«థా కాకుండా చూడాలనే సదుద్దేశంతో షట్డౌన్ చట్టాన్ని తొలి రోజుల్లో తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలనే నియమాన్ని అన్ని రాజకీయ పార్టీలూ పక్కన పెట్టి... తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే సామాన్య అమెరికన్లు మధ్యలో నలిగి పోవడం గమనార్హం.– ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్
మేయర్గా మమ్దానీ: తల్లి తొలి స్పందన
ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ (Mira Nair) తన కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన నేపథ్యంలో తొలిసారి స్పందించారు. తన కుమారుడి సంచలనాత్మక విజయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమె సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది.కుమారుడు జోహ్రాన్ మమ్దానీ విజయంపై మీరా నాయర్, బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ ఇన్స్టా పోస్ట్ను షేర్ చేశారు. హార్ట్, బాణసంచా ఎమోజీలతో "జోహ్రాన్ యు బ్యూటీ" అనే శీర్షికతో ఆమె స్టోరీని రీ పోస్ట్ చేశారు. అమెరికాలో, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి కీలకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ విజయంపై జోయా అక్తర్ ప్రశంసలు కురిపించారు."జోహ్రాన్ మమ్దానీ 34 ఏళ్ల వయసులో అధికారికంగా NYC మేయర్ రేసులో గెలిచారు" అంటూ కొనియాడారు. కాగా ఉగాండాలో జన్మించిన మమ్దానీ, ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ , మీరా నాయర్ దంపతుల కుమారుడు.జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టించాడు.
దేవ దీపావళి దేవతలకూ పర్వదినమే!
చంద్రమా మనసో జాతః – చంద్రుడు (సృష్టికారకుడైన) విరాట్ పురుషుడి మనసు నుండి పుట్టాడు – అని ఋగ్వేద వాక్యం. అందుకే, సముద్రపు ఆటుపోట్లకూ, అమా వాస్య – పూర్ణిమలకూ ఉన్న సంబంధం లాగే, భూమి మీద మనుషుల మనసుల పని తీరు తీవ్రతకూ, ఆకాశంలో చంద్రబింబం వృద్ధి క్షయాలకూ కాదనలేని సంబంధం కనిపిస్తుంది. మానసిక రోగ చికిత్సా నిపుణులు కూడా మద్దతునిచ్చే మాట ఇది.నిండు పున్నమి దినాలలో మనిషి మనసుకు చురుకు ఎక్కువ. పున్నమి నాళ్ళలో, అటు రసభావాల వైపుగానీ ఇటు ఆధ్యాత్మికత వైపుగానీ మనసు ఎప్పటికంటే ఎక్కువ తీవ్రతతో స్పందిస్తుంది. అందుకే సాధకులకూ, భక్తులకూ, యోగులకూ పౌర్ణమి ప్రత్యేక విశిష్టత గల తిథి. అది మంత్రోపదేశాలకూ, ఉపాసనలకూ, తీవ్రమైన ధ్యానాలకూ మహత్తరమైన ముహూర్తం. పున్నమి అంటేనే పొంగిపోయే మనసు, శరత్కాల పూర్ణిమ అంటే మరీ ఉరకలెత్తు తుంది. శివకేశవులిరువురి అర్చనకూ సమానంగా ప్రశస్తమైనది కార్తిక పౌర్ణమి. ఆ పర్వ దినాన, మనసు పరుగునూ, చురుకునూ మంత్ర జపాల వైపు, ఇష్టదేవతారాధన వైపు మళ్ళిస్తే మరింత ఫలప్రాప్తి పొందవచ్చునని పెద్దల మాట.కార్తిక పూర్ణిమ మనుషులకే కాదు, దేవతలకు కూడా పవిత్రమైన పర్వదినమని పురాణాలు చెబున్నాయి. ఆస్తికావళికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీ క్షేత్రంలో, కార్తిక పూర్ణిమను ‘దేవ దీపావళి’గా పరిగణిస్తారు. వారణాసిలో గంగా తీరాన అన్ని ఘాట్లనూ దీపాలతో అలంకరించటంతో, గంగ ఒడ్డు లోకాతీతంగా ప్రకాశిస్తుంది. దేవతలు వారణాసికి వచ్చి గంగామాతను ఘనంగా అర్చించి వెళతారని ఆస్తికుల విశ్వాసం. కార్తిక దీపాలూ, జ్వాలాతోరణాలు, దేవ దీపావళుల లాంటి నైమిత్తిక సంప్రదాయాలతోనూ; అర్చనలూ, జపతపాలూ, అభిషేకాలూ, ధానధర్మాలతోనూ, ఆస్తికులు తమ మనసుకు నచ్చిన మార్గంలో, తమతమ ఇష్ట దేవతలను కొలుచుకొని, విశేషమైన అనుగ్రహం పొందటానికి అనుకూలమైన రోజు కార్తిక పూర్ణిమ. అలాగే, సాధకులు తమలో అనవరతం ప్రకాశించే ఆత్మజ్యోతి వైపు దృష్టి కేంద్రీకరించేందుకూ అది అనువైన రోజు. – ఎం. మారుతి శాస్త్రి
ఫొటోలు
ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)
#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)
విష్ణు విశాల్ ’ఆర్యన్‘ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)
తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్ (ఫోటోలు)
వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)
జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్ ఎమోషనల్ (ఫోటోలు)
అంతర్జాతీయం
నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య న్యూయార్క్ వాసులకు జోహ్రాన్ మమ్దానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో న్యూయార్క్ నగరానికి ఎన్నికైన అని పిన్నవయస్కుడైన మేయర్గా మమ్దానీ గుర్తింపు పొందారు. అలాగే తొలి ఇండియన్-అమెరికన్ ముస్లిం మేయర్గానూ పేరొందారు.ఈ సందర్భంగా మమ్దానీ మాట్లాడుతూ ‘న్యూయార్క్ కొత్త తరానికి ధన్యవాదాలు. మేము మీ కోసం పోరాడుతాం. ఎందుకంటే మేము మీలాంటివాళ్లమే.. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. స్నేహితులారా.. మేము ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసాం’ అని పేర్కొన్నారు. 30 నిమిషాల కన్నా తక్కువగా సాగిన ఈ ప్రసంగంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నేరుగా ఉద్దేశించి, ‘డోనాల్డ్ ట్రంప్.. మీరు దీనిని చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పేందుకు నా దగ్గర నాలుగు మాటలు ఉన్నాయి.. వాల్యూమ్ పెంచండి’ అని అన్నారు. మాలో ఎవరినైనా సంప్రదించాలంటే, మీరు మా అందరినీ దాటాలి. మీకు జన్మనిచ్చిన నగరంలో మీరు ఓటమి పాలయ్యారు’ అని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఉత్తమంగా ఉండాలని సూచించారు.న్యూయార్కర్లకు మమ్దానీ కృతజ్ఞతలు చెబుతూ వారు మార్పు కోసం, కొత్త రాజకీయాల కోసం ఆదేశించారని అన్నారు. 2025, జనవరి ఒకటిన తాను న్యూయార్క్ నగర మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తానని మమ్దానీ ప్రకటించారు. న్యూయార్క్ ..వలసదారుల నగరంగానే ఉంటుంది. ఇది వలసదారులచే నిర్మితమైన నగరం.ఈ రాత్రి నుండి ఇది వలసదారుడి నేతృత్వంలో ఉంటుందని మమ్దానీ అన్నారు.భారత సంతతికి చెందిన మమ్దానీ తన విజయ ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మనం పాత నుండి కొత్త వైపు అడుగు పెట్టే క్షణం చాలా అరుదుగా వస్తుంది. ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేతకు గురైన ఒక దేశ ఆత్మ ఉవ్వెత్తున ఎగసిపడే క్షణం వస్తుంది’ అని ఆయన అన్నారు. తన విజయం న్యూయార్క్ వాసులందరికీ అంకితం అని ఆయన అన్నారు. వలసదారుల నేతగా పేరొందిన మమ్దానీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్నికల ప్రచారంలో మమ్దానీ పలు హామీలు ఇస్తూ, ఓటర్లను ఆకట్టుకున్నాడు. వీటిని ప్రముఖ హిందీ సినిమాల క్లిప్లతో అన్వయిస్తూ, పొందుపరిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 🚨Breaking News — Zoharan Mamdani creates History, the son of Immigrants, becomes the first Indian Muslim American to win NY Mayor Race. Here’s one video how he captured the imagination of a diverse New York. pic.twitter.com/a00nzdLVEI— Rohit Sharma 🇺🇸🇮🇳 (@DcWalaDesi) November 5, 2025ఇది కూడా చదవండి: Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ!
రిపబ్లికన్ల ఓటమి.. ట్రంప్ వింత సమాధానం
వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని షాకిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓటర్లు ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తాజాగా ట్రంప్ స్పందించారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల బ్యాలెట్ పేపర్లో ట్రంప్ ఫొటో లేదు. అమెరికాలో షట్డౌన్ ఉంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ఇవే రెండు ముఖ్య కారణాలు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Nov 04, 2025, 10:05 PM ET )“TRUMP WASN’T ON THE BALLOT, AND SHUTDOWN, WERE THE TWO REASONS THAT REPUBLICANS LOST ELECTIONS TONIGHT,” according to Pollsters. pic.twitter.com/l3sMRCplPk— Fan Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) November 5, 2025 గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమివర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమివర్జీనియా గవర్నర్గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్వర్జీనియా తొలి మహిళా గవర్నర్గా అబిగైల్ స్నాన్బర్గర్ రికార్డుసిన్సినాటి మేయర్గా డెమోక్రాట్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ గెలుపుఅట్లాంటా మేయర్గా డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రీ డికెన్స్ తిరిగి ఎన్నికపిట్స్బర్గ్ మేయర్ రేసులో డెమోక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ..వర్జీనియాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీ సీయర్స్ ఓటమి పాలవ్వగా.. డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్నాన్బర్గర్ గవర్నర్గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్ కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. అబిగైల్ 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో మొదటి మహిళా గవర్నర్ గా అబిగైల్ చరిత్ర సృష్టించారు.జేడీవాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి..మరోవైపు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమొక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ గెలుపొందారు. పురేవాల్ రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. తొలిసారి 2021లో మేయర్గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80% కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.
Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ!
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) రేసులో విజయం సాధించారు. ఆమె రిపబ్లికన్ జాన్ రీడ్ను ఓడించారు. హష్మీ.. వర్జీనియా సెనేట్లో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ. అలాగే మొదటి దక్షిణాసియా అమెరికన్గా గుర్తింపు పొందారు. గజాలా హష్మీ 15వ సెనేటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనేట్ స్థానంపై ఆధిపత్యం సంపాదించి, వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.హష్మీ సొంత వెబ్సైట్లో.. ‘ఇతరుల జీవితాలను మెరుగు పరిచే దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని’ పేర్కొన్నారు. ఆమె గృహనిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ న్యాయం తదితర సమస్యలపై దృష్టి సారించారు. 1964లో హైదరాబాద్లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించిన గజాలా తన బాల్యాన్ని మలక్పేటలోని తన తాత ఇంట్లో గడిపారు. హష్మీ తన నాలుగేళ్ల వయస్సులో తన తల్లి, అన్నయ్యతో కలిసి భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ వారంతా జార్జియాలో తండ్రితో పాటు ఉన్నారు.గజాలా తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. అక్కడ అతను ఎంఏ, ఎల్ఎల్బీ చేశారు. తరువాత సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సంబంధాలలో పీహెచ్డీ పూర్తి చేశారు. అనంతరం బోధనా వృత్తిని స్వీకరించారు. అతను స్వయంగా స్థాపించిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్గా పదవీ విరమణ చేశాడు. హష్మి తల్లి తన్వీర్ హష్మి హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ, బీఈడీ చేశారు.హష్మి తన విద్యాభ్యాసం సమయంలో పలు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను అందుకున్నారు. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుండి బీఏ, అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి అమెరికన్ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. 1991లో హష్మి, ఆమె భర్త అజార్ రఫీక్తో పాటు రిచ్మండ్ ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ చెస్టర్ఫీల్డ్ వర్జీనియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. హష్మీ దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. మొదట రిచ్మండ్ విశ్వవిద్యాలయంలో, తరువాత రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో పనిచేశారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్ గానూ హష్మీ పనిచేశారు.
Indonesia: 6.2 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు?
జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో బుధవారం (నవంబర్ 5) శక్తివంతమైన భూకంపం సంభవించింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేశ జియోఫిజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపం తర్వాత సునామీ ప్రమాదం పొంచి ఉందని తొలుత భయపడినప్పటికీ, అటువంటిదేమీ లేదని ఏజెన్సీ నిర్ధారించింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది.సులవేసిలోని కొన్ని ప్రాంతాలను భూకంపం కుదిపేసింది. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు తీవ్రంగా ఉండి, కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఉపక్రమించాయి. ఆసియా, ఆస్ట్రేలియన్ ఖండాల మధ్య, పసిఫిక్ మహాసముద్రం అంచున ఇండోనేషియా ఉంది. ఇది ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలలో 75 శాతం సంభవించే ప్రాంతంగా నిలిచింది. దేశ ప్రజలు తరచూ భూకంపాలు, సునామీల ప్రభావాలకు గురవుతుంటారు.
జాతీయం
పోలింగ్ వేళ ‘బుర్కా’ వివాదం
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ నేడు(గురువారం) ప్రశాంతంగా జరుగుతోంది. అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ, పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేస్తున్నారు. అయితే మోసపూరిత ఓటింగ్ను నిరోధించేందుకు బుర్ఖా ధరించిన ఓటర్ల విషయంలో కఠినమైన తనిఖీలు చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.గిరిరాజ్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో షరియా చట్టం అమలులో లేదని, ఇది పాకిస్తాన్.. బంగ్లాదేశ్ కాదని.. భారత్ అని అన్నారు. దేశంలో లౌకికవాదం ఉందని, దేశంలో గుర్తింపు తనిఖీలు తప్పనిసరిగా జరగాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలని గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆధార్ నమోదు, విమానాశ్రయాల్లో తనిఖీల విషయంలో ఇప్పటికే ఈ తరహా ధృవీకరణ జరిగిందని అన్నారు.తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల కమిషన్ నియమాలు వర్తిస్తాయని అన్నారు. బుర్ఖా ధరించిన మహిళలు ఆధార్ కార్డు తీసుకునేందుకు వెళ్లినప్పుడు, విమానాశ్రయానికి వెళ్లినప్పుడు, రిజర్వేషన్ పొందేందుకు వెళ్లినప్పుడు కూడా ఎందుకు ముసుగు తీయరని ప్రశ్నించారు. ఇది పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ కాదని.. ఇది ఇస్లామిక్ దేశమా లేక లౌకిక దేశమా? అని ప్రశ్నించారు. ఇది లౌకిక దేశమని, సందేహమొస్తే మేము వారి ముఖాన్ని చూపించేలా చేస్తామన్నారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యకు కేంద్ర మంత్రి, ల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ, ఆయన అనవసరంగా హిందూ-ముస్లింల మధ్య వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
స్కిన్ కేర్పై క్రికెటర్ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. భారత్కు ఘన విజయాన్ని అందించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. అలాగే టోర్నమెంట్ ఆరంభంలో ఎదురైన ఎదురుదెబ్బలు, ఆన్లైన్ ట్రోలింగ్ల గురించి ప్రస్తావిస్తూ, వాటన్నింటినీ తట్టుకుని నిలబడి అద్భుతమైన విజయాన్ని అందించారంటూ వారిని మోదీ ప్రశంసించారు.అయితే ఈ ఉత్సాహభరితమైన సంభాషణల మధ్యలో క్రికెటర్ హర్లీన్ కౌర్ డియోల్ మోదీని అడిగిన ప్రశ్న నెట్టింట ఆసక్తికరంగా మారింది. తన రహస్య చర్మ సంరక్షణ దినచర్య గురించి ప్రధాని మోదీని ఆమె ప్రశ్నించింది. దీనికి ప్రధాని ఏమి సమాధానం ఇచ్చారో తెలుసా? (ఇన్ఫ్లూయెన్సర్ హఠాన్మరణం : షాక్లో ఫ్యాన్స్)#WATCH | Delhi: Cricketer and member of the Champion Indian Cricket team, Harleen Kaur Deol, asks Prime Minister Narendra Modi about his skin care routine. Prime Minister Narendra Modi says, "I did not pay a lot of attention to this... I've been in government for 25 years now.… pic.twitter.com/deqCTZcCAE— ANI (@ANI) November 6, 2025 ఇంత షైనీగా, యవ్వనంగా కనిపించే ఆయన చర్మ సౌందర్య వెనుక సీక్రెట్ ఏంటి అంటూ స్టార్ బ్యాటర్ ప్రధాని మోదీని అడిగింది. దానికి ప్రధాని చిరునవ్వుతో స్పందిస్తూ, చర్మ సంరక్షణ లేదా వస్త్రధారణపై తాను ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ చూపలేదన్నారు. ప్రత్యేకంగా ఏమీ చేయను. దాదాపు పాతికేళ్లుగా ప్రభుత్వ పాలనలో మునిగి ఉన్నా, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతానని చెప్పారు. దీంతో అక్కడంతా అభిమానంతో చప్పట్లు మారుమోగాయి. నవ్వులు విరబూశాయి. (మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’)అలాగే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 2017లో రన్నరప్గా నిలిచిన తర్వాత ప్రధాని మోదీని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్రోఫీతో వచ్చినందున ప్రత్యేకంగా అనిపించిందన్నారు. "భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలతో మిమ్మల్ని కలుస్తూనే ఉండాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేవారు. ప్రధాన మంత్రి మోదీ ప్రోత్సాహం తమకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చిందని, ఆయన స్థిరమైన మద్దతు, సాధికారత చొరవ కారణంగా దేశవ్యాప్తంగా మహిళలు వివిధ రంగాలలో రాణిస్తున్నారని వైస్-కెప్టెన్ స్మృతి మంధాన ప్రశంసించారు. మహిళా క్రికెట్ టీం గురువారం దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కలవనున్నారు.ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడి
ఇన్ఫ్లూయెన్సర్ హఠాన్మరణం : షాక్లో ఫ్యాన్స్
అతనికి ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఇష్టం. అంతేకాదు తాను చూసిన అద్బుతాలను విశేషాలను తన అభిమానులతో పంచుకోవడం అంటే మరీ మరీ ఇష్టం. అలా పాపులర్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్గా సోషల్ మీడియాలో మంచి పేరుతెచ్చుకున్నాడు. 10 లక్షలకుపైగా ఫాలోయవర్లతో ఇన్స్టాలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకడిగా మారాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, దురదృష్టవశాత్తు, 32 ఏళ్లకే ఆయన ప్రయాణం ఆగిపోయింది. కానీ తుదిశ్వాస వరకు ఆసక్తిగల ప్రయాణికుడిగానే ఉన్నాడు. ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, దుబాయ్కు చెందిన, అనునయ్ సూద్ (Anunay Sood) ఇక లేరన్న వార్త నెటిజనులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.32 ఏళ్ల అనునయ్ సూద్ ఆకస్మికంగా మరణించారన్న వార్తను ఆయన కుటుంబం గురువారం తెల్లవారుజామున అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. అయితే, ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చనిపోయే సమయానికా అనునయ్ లాస్ వెగాస్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడిఎవరీ అనునయ్ సూద్ అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్, ఇన్స్టాగ్రామ్లో1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్లో 3.8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఆయన సొంతం. ప్రపంచవ్యాప్తంగా పలుసందర్శనా స్థలాలకు సంబంధించి ఎంతో మంచి ట్రావెల్ కంటెంట్, అద్భుతమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ రీల్స్, వ్లాగ్స్తో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. 2022 -2024 వరకు వరుసగా మూడేళ్లు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న అనునయ్ సూద్ది. లాస్ వెగాస్లో స్పోర్ట్స్ కారు నడుపుతూ పెట్టిన పోస్ట్ ఆయన చివరి పోస్ట్.
జూనియర్ ఇంజినీర్ను బురదలో నడిపించిన రైతు నాయకుడు!
మహా నగరాలు, పట్టణాలు.. గ్రామాలు ఎక్కడైనా కానివ్వండి. తవ్వేసిన రహదారులు, నెలలకొద్దీ పూర్తికాని పారిశుద్ధ్యం పనులు సర్వసాధారణం. ఇక వీధుల్లోని సిమెంటు రహదారుల విషయమైతే చెప్పాల్సిన అవసరమే లేదు. గంటల్లో తవ్వి తీస్తారు కానీ.. అవశేషాలు మాత్రం అలాగే పడి ఉంటాయి. కొత్త రోడ్డు వేసేందుకూ వారాలకు వారాలు సమయం పడుతుంది. ఇలా చేస్తే ప్రజలకు ఎంత ఇబ్బందన్నది అస్సలు పట్టింపు ఉండదు. కాంట్రాక్టర్ ఎవరో తెలియదు.. తెలిసినా సామాన్యులు ఎవరూ ఎందుకిలా అని అడగలేరు. అడిగినా.. పట్టించుకుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఉత్తర ప్రదేశ్లోని ముజఫూర్పూర్లోనూ ఇలాంటి తంతే ఒకటి నడిచింది కానీ.. ఓ రైతు నాయకుడు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. ప్రభుత్వ అధికారికి ప్రజాగ్రహం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. అసలు విషయం ఏమిటంటే..అది చెప్పే ముందు ఈ ట్వీట్ చూడండి... https://x.com/ggganeshh/status/1986069720668537230 ఎర్ర టీషర్ట్ వేసుకున్న వ్యక్తి రైతు సంఘం నాయకుడు అంకుశ్ చౌదరి. పక్కనున్న వ్యక్తి సాగునీటి విభాగం జూనియర్ ఇంజినీర్ సచిన్ పాల్. పంట కాలువల పూడికను కాస్తా రహదారిపై వదిలేశారట సాగునీటి విభాగం వారు. ఎంతకీ తీయకపోవడంతో వీధి వీధంతా కంపు కొడుతోంది. పైగా ఆ బురదలో ప్రజలు నడవడమే కష్టమైపోయింది. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదేమో ఇంజినీరు సారు.. అంకుశ్ చౌదరి ఆగ్రహం నశాళానికి ఎక్కింది. జూనియర్ ఇంజినీర్ సచిన్ పాల్ చొక్కా పట్టేసుకున్నాడు. ఆ నల్లటి, దుర్గంధభరితమైన బురదలో నడిపించాడు. రోడ్లు ఇలా ఉంటే మేము మా ఇళ్లకెలా వెళ్లాలి పటేలా? పొలాలకు దారేది పటేలా? అంటూ అతడిని బురదలో నడిపించాడు. చుట్టూ ఉన్న వారు ఇంజినీర్కు తగిన శాస్తి జరిగిందని సంబరపడ్డారు కానీ.. ఈ ఘటన కాస్తా వాడి వేడి చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తప్పని, అంకుశ్ చౌదరి చేసింది సరైన పనేనని కొందరు సమర్థిస్తే... మరికొందరు వ్యతిరేకించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని వారు అంటున్నారు.ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. కర్ణాటక రాజధాని బెంగళూరులో రహదారుల దుస్థితిపై చాలాకాలంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. కొంతమంది అకడక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కూడా. రోడ్లు వేయకపోతే ట్యాక్సులు కట్టమని కొందరు... రోడ్లు, ఫుట్పాత్లలో పేరుకుపోయిన చెత్తను హైలైట్ చేస్తూ ప్రభుత్వం దృష్టిని ఆకర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు వాసుల ప్రజాస్వామ్యయుతమైన నిరసనతో కొంచెం ఆలస్యంగానైనా ప్రయోజనం ఉంటుందేమోకానీ.. క్షణికావేశంలో అంకుశ్ చౌదరిలా ప్రవర్తిస్తే మాత్రం ఏమవుతుందో చెప్పలేము.
ఎన్ఆర్ఐ
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు.
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది.
క్రైమ్
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
విశాఖపట్నం: వీఐపీ రోడ్డు సమీపంలోని ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ పైడయ్య తమ సిబ్బందితో కలిసి బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాలు(వ్యభిచారం) నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో ఒక గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో తొమ్మిది మంది మహిళలు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తేలింది. వీరందరినీ వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సెంటర్లో పనిచేస్తున్న కల్లూరు పవన్ కుమార్, జానా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్కు కాసిరెడ్డి అరుణ్ కుమార్ పేరు మీద అనుమతులు ఉండగా, థాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు వెల్లడైంది. స్పా సెంటర్పై కేసు నమోదు చేసి, యజమానులు ఏ1గా కాసిరెడ్డి అరుణ్ కుమార్ (పరారీలో), ఏ2గా రాహుల్ (పరారీలో), సిబ్బంది ఏ3గా కల్లూరు పవన్ కుమార్, ఏ4గా జానా శ్రీనివాస, విటుడు ఏ5గా చీలి రామచంద్ర ప్రసాద్లను పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 7 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా: అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం గజ్వేల్లో చోటు చేసుకుంది. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ (ఎర్రవల్లి)కి చెందిన వనం సుగుణ–నర్సింలు దంపతుల పెద్ద కూతురు వసంతకు గజ్వేల్కు చెందిన సమీప బంధువుతో ఆగస్టు 10న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 18 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు, ఇతర సామగ్రి ఇచ్చారు. వసంత ఉన్నత చదువులకు ఇరువర్గాలు అంగీకరించాయి. అయితే పెళ్లయిన నెల రోజుల తర్వాత నుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో పాటు వివాహేతర సంబంధం అంటగట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత.. ఈనెల 1న పురుగుల మందు తాగింది. కడుపులో నొప్పి వస్తోందంటూ తన తల్లి సుగుణకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు వసంతను మెరుగైన చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వా స్పత్రికి, అక్కడి నుంచి పలు ప్రైవేటు ఆస్పత్రు ల్లో చికిత్స చేయించినప్పటికీ తగ్గకపోవడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి వసంత మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వసంత మృతికి కారణమైన భర్త రోహిత్, అత్త దుర్గమ్మ, మామ గంగయ్యలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు
పటాన్చెరు టౌన్ (హైదరాబాద్): చీమల ఫోబియాతో ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్కు చెందిన శ్రీకాంత్ భార్య మనీషా (25) చీమల ఫోబియాతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చూపించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం భర్త డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేసరికి పడక గది తలుపు మూసి ఉంది. స్థానికుల సహకారంతో లోపలికి వెళ్లి చూడగా.. మనీషా చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని శవమై కనిపించింది. ‘ఈ చీమల ఫోబియాతో బతకడం నా వల్ల కావట్లేదు.. కూతురు అని్వ(4) జాగ్రత్త‘అని ఆమె రాసి ఉంచిన లేఖ ఉంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సీక్రెట్ కెమెరా.. మహిళలు స్నానం చేసే వీడియోలు ప్రియుడికి..
తమిళనాడు రాష్ట్రం: ఆమె బుద్ధి తప్పుదోవ పట్టింది, ఇతర మహిళల వీడియోలను తీసుకుని ప్రియునికి పంపింది. ఫలితంగా రచ్చ చెలరేగింది. బెంగళూరు సమీపంలోని పారిశ్రామిక నగరం హోసూరు వద్ద అకృత్యం బయటపడింది. కంపెనీ మహిళా సిబ్బంది బస చేసే హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాను ఏర్పాటు చేసి ఆ చిత్రాలను ఇంటర్నెట్లో వైరల్ చేశారు. ఇది తెలిసి మహిళా సిబ్బంది ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. హోసూరు సమీపంలోని నాగమంగలం వద్ద టాటా ఎల్రక్టానిక్స్ కంపెనీ నడుస్తోంది, ఇందులో వేలాది మంది మహిళా ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వారి కోసం ఉద్దనపల్లి వద్ద ప్రత్యేక హాస్టల్ వసతిని కల్పించింది. నీలాకుమారి నిర్వాకం ఒడిశాకు చెందిన నీలా కుమారి గుప్తా (23) కూడా కంపెనీలో పనిచేస్తూ హాస్టల్లో ఉంటోంది. ఆమెకు ఏం దుర్బుద్ధి పుట్టిందో మరి ఓ బాత్రూంలో రహస్య కెమెరా ఉంచి తోటి మహహిళలు స్నానం చేసే దృశ్యాలను మొబైల్ఫోన్లో రికార్డు చేసుకుంది. వాటిని బెంగళూరులో ఉండే తన ఒడిశా ప్రియునికి పంపుతోంది. అతడు వాటిని ఇంటర్నెట్ వెబ్సైట్లు, సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు. తమ చిత్రాలు నెట్లో వ్యాపించాయని తెలిసి మహిళలు కంగుతిన్నారు. మంగళవారం రాత్రి సుమారు రెండువేల మంది మహిళలు, యువతులు హాస్టల్ ముందు ధర్నాకు దిగారు. దుండగులను శిక్షించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, ఎస్పీ ఎస్పీ తంగదురై వచ్చి వారితో మాట్లాడినా శాంతించలేదు. నీలాకుమారిని అరెస్ట్ చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. ప్రియుని కోసం గాలిస్తున్నారు.
వీడియోలు
Karumuri Venkat: మొగుడు పెళ్ళాం మధ్యలో నీకేంటి పని.. TV5 బ్రోకర్ మూర్తి నోరు జాగ్రత్త..
Gudivada: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
యువతకు జగన్ మెసేజ్.. మీరంతా జెన్-Z తరంలో ఉన్నారు
OPEN CHALLENGE: జూబ్లీహిల్స్ ప్రచారంలో కేసీఆర్ ఎంట్రీ ఉంటుందా ?
కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి: YS జగన్
YS Jagan: వ్యవసాయం దండగ అన్నావ్.. మరి నువ్వు ఏం తింటున్నావ్
YS Jagan: పిల్లలను చదివించడం భారం కాదు అందుకే ప్రతి తల్లిదండ్రులకు మాటిస్తున్న..
SRM University : 300 మందికి అస్వస్థత
చంద్రబాబు ఇంతమంది ప్రాణాలు పోతే మీకు బాధ్యత లేదా?: పేర్నినాని
Punuru Gowtham: నన్ను చంపడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు

