క్రికెటర్ టు ఐఏఎస్ జర్నీ..! బస్సు డ్రైవర్ కొడుకు విజయగాథ..
ఒక్కోసారి మనం కోరుకున్న కలకి, అందనంత దూరంలో మన ఆర్థిక పరిస్థితి ఉంటుంది. దాంతో మన డ్రీమ్ని చంపేసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి విపత్కర పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ బస్సు డ్రైవర్ కొడుకు. పోనీ నచ్చిన యూనివర్సిటీలో చదువుదామన్న చేతిలో చిల్లిగవ్వ లేదు. అలాంటి నేపథ్యంలో ఐఏఎస్ చదవాలనుకోవడమే సాహసం అనుకుంటే..సివిల్స్ ఎగ్జామ్లో విజయ సాధించడమే కాదు తాను కోరుకున్నట్లుగా ఐఏఎస్ అయ్యాడు. విధి నీ వల్ల కాదని వెక్కిరిస్తూ ఉన్నా..వెనకడుగు వేయకుండా తలరాతనే మార్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు.అతడే ఉత్తరప్రదేశ్కి చెందిన బస్సు డ్రైవర్ కొడుకు మొయిన్ అహ్మద్. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావలన్నిది అతడి కల. అతని తండ్రి వలీ హసన్ ఏకైక సంపాదనపైనే కుటుంబం అంతా ఆధారపడి ఉంది. అదీగాక తండ్రి తన క్రికెట్కు అవసరమైన కిట్కొనడమే కష్టంగా ఉండేది. దాంతో ఇది ధనవంతు పిల్లలు ఆడే ఆట అని మనసుకు నచ్చజెప్పుకుని..చదువుపై దృష్టి సారించాడు. అలా ఇంటర్మీడియెట్లో మంచి మార్కులు తెచ్చుకుని చాలామంది విద్యార్థుల డ్రీమ్ అయిన ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. కానీ అక్కడి కాలేజీ చదువుల ఖర్చులు తట్టుకునే సామర్థ్యం లేక ఆ కలను కూడా చంపేసుకున్నాడు. ఎందుకంటే అతడికి విద్యా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకులు ముందుకు రాలేదు. చివరికి తను ఉండే గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ కాలేజ్లో జాయిన్ అయిపోయాడు. అలాగే తన భవిష్యత్తు కోసం అలాగే కుటుంబ అవసరాల నిమిత్తం సైబర్కేఫ్లో పనిచేస్తూ.. చదువు పూర్తిచేశాడు. ఆ తర్వాత నెలకు రూ. 40 వేలు వచ్చే మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. అప్పుడే అతనికి ఐఏఎస్ అవ్వాలనే కోరిక పుట్టింది. చిన్నప్పటి నుంచి ప్రతి డ్రీమ్పై నీళ్లు జల్లేసిన తన ఆర్థిక పరిస్థితి మారేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే దీన్ని కుటుంబసభ్యులంతా వ్యతిరేకించారు. ఇలాంటి ప్రతిష్టాత్మకైన సివిల్స్ఎగ్జామ్ వైపుకి వెళ్లడం అంటే కెరీర్ని నాశనం చేసుకోవడంతో సమానమని హితవు పలికారు. అతడి అమ్మ తస్లీమ్ జహాన్ మాత్రమే ఇందుకు మద్దతిచ్చింది. దాంతో మోయిన్ ఆత్మవిశ్వాసంతో కథన రంగంలోకి దిగాడు. అలా 2019లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఢిల్లీకి మకాం మార్చాడు. తన ప్రిపరేషన్కు నిధులు సమకూర్చుకోవడానికి రూ. 2.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఢిల్లీలో అతడి జర్నీ చాలా భయనకంగా ఉండేది. ఓ పక్కన తెచ్చుకున్న డబ్బులన్నీ నీళ్లలా ఖర్చు అయిపోతుండేవి, మరోవైపు ఒత్తిడి పెరిగపోతుండేది. ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో తెలియని టైంలో తన గురువు IRS అధికారి ఆసిఫ్ యూసుఫ్ అతియా ఫౌండేషన్ సాహిల్ ఖాన్ మార్గనిర్దశంలో ముందుగకు సాగాడు. ఖర్చుల నిమిత్తం అతడికి సాయం చేసేందుకు సాహిల్ ముందుకొచ్చేవాడు. ఈ చర్య ఇతరులు తనకు సహాయం చేయగలరన్న నమ్మకం అతడిని కార్యోన్ముఖుడిని చేసింది. అలా తన మొదటి మూడు ప్రయాత్నాలలో సివిల్స్లో ఓటమిని ఎదుర్కొన్నా..నాల్గో ప్రయత్నంలో ఆలిండియా 296వ ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ అధికారి అయ్యాడు. తను ఉన్న స్థితికి మించిన లక్ష్యం పెట్టుకోవడం తప్పుకాదని..తగిలే ఎదురుదెబ్బలే ఆయుధాలు అవుతాయి అనేందుకు మొయిన్ అహ్మద్నే ఉదాహరణ. తలచుకుంటే ఎంత కఠినమైన సవాళ్లును కష్టాలై పరారైపోయేలా తలరాతను మార్చుకోవచ్చని అహ్మద్ కథ వింటే స్పష్టమవుతుంది కదూ..!. (చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు)
ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలిస్తాయి, పనులు చకచకా సాగుతాయి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: శు.సప్తమి రా.7.14 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ధనిష్ఠ రా.10.27 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: తె.5.39 నుండి 7.15 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు, అమృత ఘడియలు: ప.11.46 నుండి 1.23 వరకు.సూర్యోదయం : 6.15సూర్యాస్తమయం : 5.20రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం: కుటుంబంలో చికాకులు. కార్యక్రమాలలో ఆటంకాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.మిథునం: ఆదాయానికి మించి ఖర్చులు. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆలయాలు దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు.కర్కాటకం: ఉద్యోగయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.సింహం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.కన్య: చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.తుల: ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.వృశ్చికం: కుటుంబంలో ఉత్సాహం. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది.ధనుస్సు: ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. కార్యక్రమాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులుమకరం: కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. ఆస్తిలాభం.కుంభం: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరం.మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
‘పాదరసం’తో భార్య ప్రాణం తీశాడు
దొడ్డబళ్లాపురం: ఓ భర్త అత్యంత క్రూరంగా భార్యను హత్య చేశాడు. పాదరసం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. ఒక్కో అవయవం పాడయ్యేలా చేసి.. 9 నెలల పాటు నరకం చూపించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. విద్య(37), బసవరాజు దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు బెంగళూరులోని అత్తిబెలెలో నివసిస్తున్నారు. కొన్నాళ్లుగా భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో భార్యను ఎవరికీ అనుమానం రాకుండా అంతమొందించాలనుకున్న బసవరాజు.. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పని చేసే శ్వేత, ఆమె భర్త సాయంతో క్లోరోఫాం, పాదరసం, సిరంజిలు తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాత్రి బసవరాజు విద్యతో ప్రేమ గా మాట్లాడుతూ.. క్లోరోఫాం ఇచ్చాడు. కొంచెం మత్తులోకి జారుకున్నాక పాదరసం ఇంజెక్షన్ చేశాడు.మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన విద్యకు కుడి తొడ భాగంపై వాపు, విపరీతమైన నొప్పి వచ్చింది. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మార్చి 7న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వారు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆమె శరీరాన్ని పాదరసం విషమయం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్క అవయవం పాడవుతుండగా.. 9 నెలల పాటు నరకం చూసిన విద్య సోమవారం మరణించింది. తన భర్త, మామ కలిసి తనను హత్య చేసేందుకు పాదరసం ఇంజెక్షన్ ఇచ్చారని ముందుగా ఇచ్చిన వీడియో వాంగ్మూలంలో తెలిపింది.
పరాజయం పరిపూర్ణం
మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంటే చాలు అదే మాకు రెండో టెస్టులో విజయంతో సమానం... నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత భారత ఆటగాడు రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్య ఇది. ‘డ్రా’ చేసుకోవడం కాదు కదా... మన ఆటగాళ్లు కనీస స్థాయి పోరాటం కూడా చేయలేకపోయారు... చివరి రోజు సఫారీ స్పిన్నర్లు పదునైన బంతులతో మన పని పట్టి అలవోకగా మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టారు. రికార్డు విజయంతో సిరీస్ను గెలుచుకొని వరల్డ్ చాంపియన్గా తమ స్థాయిని ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికా సింహనాదం చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ను శాసించిన యాన్సెన్ చివరి క్యాచ్ను అద్భుతంగా అందుకోవడం సరైన ముగింపు కాగా... ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై రెండు సిరీస్లలో వైట్వాష్ కు గురైన భారత బృందం అవమాన భారాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గువాహటి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో లాంఛనం ముగిసింది. అనూహ్యమేమీ జరగకుండా భారత్ సులువుగా తలవంచింది. ఊహించిన విధంగానే రెండు సెషన్ల లోపే మ్యాచ్ చేజారింది. టీమిండియా మిగిలిన 8 వికెట్లు తీసేందుకు సఫారీ బౌలర్లకు 48 ఓవర్లు సరిపోయాయి. బుధవారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో భారత్ను చిత్తుగా ఓడించింది. ఓవర్నైట్ స్కోరు 27/2తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (87 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించడం మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (6/37) ఆరు వికెట్లతో భారత్ పని పట్టాడు. కోల్కతాలో జరిగిన తొలి టెస్టును కూడా గెలిచిన దక్షిణాఫ్రికా తాజా ఫలితంతో 2–0తో సిరీస్ను సొంతం చేసుకుంది. 25 ఏళ్ల తర్వాత ఆ జట్టు భారత్లో సిరీస్ గెలవడం విశేషం. 93 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీసిన మార్కో యాన్సెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... మొత్తం 17 వికెట్లు తీసిన సైమన్ హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. జడేజా మినహా... ఓటమి నుంచి తప్పించుకునేందుకు చివరి రోజు బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలో కాస్త అదృష్టం కలిసొచ్చింది. యాన్సెన్ బౌలింగ్లో 4 పరుగుల వద్ద సాయి సుదర్శన్ క్యాచ్ ఇవ్వగా అది నోబాల్గా తేలింది. ఆ తర్వాత 4 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ (5) ఇచ్చిన సునాయాస క్యాచ్ను మార్క్రమ్ వదిలేశాడు. అయితే ఇది ఎంతోసేపు సాగలేదు. ఒకే ఓవర్లో కుల్దీప్, జురేల్ (2)లను అవుట్ చేసి దెబ్బ కొట్టిన హార్మర్... కొద్ది సేపటికే కెపె్టన్ రిషభ్ పంత్ (13)ను కూడా వెనక్కి పంపాడు. టీ విరామానికి భారత్ స్కోరు 90/5కు చేరింది. అయితే ప్రతీ బంతిని డిఫెన్స్ ఆడుతూ పట్టుదల ప్రదర్శించిన సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14; 1 ఫోర్)) ఎట్టకేలకు ముత్తుసామి వేసిన ఒక చక్కటి బంతికి అవుటయ్యాడు. ఆ తర్వాత జడేజా, సుందర్ (16) కొద్దిసేపు పోరాడారు. అయితే కొత్త స్పెల్లో మళ్లీ బౌలింగ్కు దిగిన హార్మర్ 8 పరుగుల వ్యవధిలో సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేయగా... మహరాజ్ ఒకే ఓవర్లో జడేజా, సిరాజ్ (0)లను వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో వేడుకలు మొదలయ్యాయి. ఐదో స్థానానికి భారత్.. భారీ ఓటమి తర్వాత ఇప్పటికిప్పుడు భారత టెస్టు జట్టు ప్రదర్శనపై ఎలాంటి చర్చా జరిగే అవకాశం లేదు. దక్షిణాఫ్రికాతో వన్డేలు, టి20ల తర్వాత న్యూజిలాండ్తో భారత్ స్వదేశంలోనే వన్డే, టి20 సిరీస్లు ఆడనుంది. ఆపై టి20 వరల్డ్ కప్, ఐపీఎల్ ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ పరాజయంపై విశ్లేషణలు, ప్రశ్నలు ఇక్కడితోనే ముగిసిపోవచ్చు! మరోవైపు తాజా ఓటమితో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లాలంటే భారత్ చాలా శ్రమించాల్సి ఉంటుంది. భారత తమ తర్వాతి టెస్టు మ్యాచ్ 2026 ఆగస్టులోనే ఆడనుంది. శ్రీలంకకు వెళ్లి 2 టెస్టులు, ఆపై న్యూజిలాండ్లో 2 టెస్టులతో పాటు స్వదేశంలో ఆ్రస్టేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఉన్న ఈ 9 టెస్టుల్లో ప్రదర్శన మన ఫైనల్ ప్రస్థానాన్ని నిర్దేశించనుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489; భారత్ తొలి ఇన్నింగ్స్: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260/5 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 13; రాహుల్ (బి) హార్మర్ 6; సుదర్శన్ (సి) మార్క్రమ్ (బి) ముత్తుసామి 14; కుల్దీప్ (బి) హార్మర్ 5; జురేల్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 2; పంత్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 13; జడేజా (స్టంప్డ్) వెరీన్ (బి) మహరాజ్ 54; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 16; నితీశ్ రెడ్డి (సి) వెరీన్ (బి) హార్మర్ 0; బుమ్రా (నాటౌట్) 1; సిరాజ్ (సి) యాన్సెన్ (బి) మహరాజ్ 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (63.5 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–17, 2–21, 3–40, 4–42, 5–58, 6–95, 7–130, 8–138, 9–140, 10–140. బౌలింగ్: యాన్సెన్ 15–7–23–1, ముల్డర్ 4–1–6–0, హార్మర్ 23–6–37–6, మహరాజ్ 12.5–1–37–2, మార్క్రమ్ 2–0–2–0, ముత్తుసామి 7–1–21–1. 408 టెస్టుల్లో పరుగులపరంగా భారత్కు ఇదే అతి పెద్ద ఓటమి. 2004లో ఆ్రస్టేలియా చేతిలో (నాగ్పూర్లో) భారత్ 342 పరుగుల తేడాతో ఓడింది.3స్వదేశంలో భారత్ వైట్వాష్ కు గురి కావడం ఇది మూడోసారి. 2000లో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో, 2024లో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడింది.9 ఈ మ్యాచ్లో మార్క్రమ్ పట్టిన క్యాచ్ల సంఖ్య. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా రహానే (8) రికార్డును అతను సవరించాడు. 11 కెప్టెన్గా బవుమాకిది 11వ టెస్టు విజయం. ఆడిన 12 టెస్టుల్లో ఒకటి డ్రా కాగా, అతని నాయకత్వంలో జట్టు ఒక్క టెస్టూ ఓడలేదు.టెస్టు జట్టుకు కోచ్గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం నా చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. చాలా మంది న్యూజిలాండ్ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్లో టెస్టు సిరీస్లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్లోనే జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలిచింది. కివీస్తో సిరీస్తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది. ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి. –గౌతమ్ గంభీర్, భారత హెడ్ కోచ్చాలా గొప్ప విజయం. అసాధారణ ఘనత ఇది. భారత్లో టెస్టు సిరీస్ గెలవడం సాధారణంగా ఊహకు కూడా అందనిది. మా ఆటపై సందేహాలు వ్యక్తం చేసిన వారందరికీ సమాధానమిది. మంచి సన్నద్ధతతో పాటు పరిస్థితులకు తగినట్లుగా మా ఆటను మార్చుకున్నాం. తమ బాధ్యతపై ప్రతీ ఒక్కరికి స్పష్టత ఉండటం మేలు చేసింది. –తెంబా బవుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్
ప్రకృతి విపత్తుల 'భారత్'!
చంద్రబాబు తీరుతోనే మెడికల్ సీటు కోల్పోయా
గిగ్ వర్కర్లకు భారీ డిమాండ్
యాంటీ డ్రోన్ నిఘా వాహనం..ఇంద్రజాల్ రేంజర్
మూడు సూత్రాల ‘విజన్’!
హైవే టూరిజం
సాయిలు సవాల్ విని భయమేసింది
బీసీ రిజర్వేషన్లపై మీ వైఖరి తెలియజేయండి
ఆన్లైన్ హింసను అరికట్టాలి
హిస్టారికల్ యాక్షన్ షురూ
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్ తప్పదా?
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
మనకు అమరావతి కంటే వైజాగ్ బాగా గిట్టుబాటు అయ్యేలా ఉంది!
ఈ రాశివారు ఊహలు నిజం చేసుకుంటారు, ఆస్తిలాభం
రైతన్న కోసం ఎంతో చేశానని అలా శూన్యంలోకి చూపిస్తున్నాడేంటీ!!
...మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేదు!!
మరీ ఇంత అజ్ఞాత విరాళాలు ఇస్తుంటే అనుమానాలెందుకు రావ్ సర్!
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ దిగ్గజాలు
ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు
పసిడి ధరల తుపాను.. తులం రేటు ఎంతంటే..
టాప్ 5లో ఉండేది వీళ్లే.. ఆ కంటెస్టెంట్స్కు ఛాన్సే లేదు!
ఈషా రెబ్బా..ఇంతందం ఎలాగబ్బా.. (ఫొటోలు)
వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు
టాటా సియెర్రా వచ్చేసింది.. ఇదిగో ఇదే ధర..
స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి...
AP: 30 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు
మరింత గ్లామరస్గా అనసూయ లేటేస్ట్ లుక్ (ఫొటోలు)
ప్రకృతి విపత్తుల 'భారత్'!
చంద్రబాబు తీరుతోనే మెడికల్ సీటు కోల్పోయా
గిగ్ వర్కర్లకు భారీ డిమాండ్
యాంటీ డ్రోన్ నిఘా వాహనం..ఇంద్రజాల్ రేంజర్
మూడు సూత్రాల ‘విజన్’!
హైవే టూరిజం
సాయిలు సవాల్ విని భయమేసింది
బీసీ రిజర్వేషన్లపై మీ వైఖరి తెలియజేయండి
ఆన్లైన్ హింసను అరికట్టాలి
హిస్టారికల్ యాక్షన్ షురూ
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్ తప్పదా?
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
మనకు అమరావతి కంటే వైజాగ్ బాగా గిట్టుబాటు అయ్యేలా ఉంది!
ఈ రాశివారు ఊహలు నిజం చేసుకుంటారు, ఆస్తిలాభం
రైతన్న కోసం ఎంతో చేశానని అలా శూన్యంలోకి చూపిస్తున్నాడేంటీ!!
...మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేదు!!
మరీ ఇంత అజ్ఞాత విరాళాలు ఇస్తుంటే అనుమానాలెందుకు రావ్ సర్!
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ దిగ్గజాలు
ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు
పసిడి ధరల తుపాను.. తులం రేటు ఎంతంటే..
టాప్ 5లో ఉండేది వీళ్లే.. ఆ కంటెస్టెంట్స్కు ఛాన్సే లేదు!
వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు
టాటా సియెర్రా వచ్చేసింది.. ఇదిగో ఇదే ధర..
స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి...
AP: 30 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు
ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి
బోరబండ కార్పొరేటర్ బాబా సంచలన వ్యాఖ్యలు
ఫొటోలు
కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసిన గీతా బస్రా, హర్భజన్ దంపతులు (ఫొటోలు)
హీరోయిన్ జెనీలియా ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
దుబాయి మ్యూజియంలో అల్లు స్నేహ (ఫొటోలు)
రుక్మిణి వసంత్ ఆలోచన ఎప్పుడూ వీటి గురించే (ఫొటోలు)
పెద్ద ముక్కెరతో 'బలగం' బ్యూటీ కావ్య (ఫొటోలు)
బ్రాహ్మణపల్లి అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
పులివెందులలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన (ఫొటోలు)
‘16 రోజుల పండుగ’ సినిమా ఓపెనింగ్.. కీలక పాత్రలో రేణు దేశాయ్ (ఫొటోలు)
హీరోయిన్ రాశి సింగ్ అందాలు... శారీ ఫోటోషూట్ చూశారా? (ఫొటోలు)
సినిమా
బోల్డ్ సీన్.. ఆ విషయం డైరెక్టర్ ముందే చెప్పారు.. కానీ..: ఆండ్రియా జెరెమా
సింగర్గా మాత్రమే కాదు.. నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ ఆండ్రియా జెరెమా. విభిన్నమైన పాత్రలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది. కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్లోనూ ఆమె దాదాపు సుపరిచితమే. ఈ ఏడాది మాస్క్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కవిన్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే ఆండ్రియా పిశాచి-2 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రకటించి మూడేళ్లయినా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆండ్రియా న్యూడ్ సీన్లో కనిపించే పోస్టర్పై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆండ్రియా.. ఆ వివాదస్పద సీన్ గురించి మాట్లాడింది. స్క్రిప్ట్ ప్రారంభంలోనే ఆ బోల్డ్ సీన్ చేర్చారని పంచుకుంది. అయితే షూటింగ్ సమయంలో ఆ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారని తెలిపింది. ఈ చిత్రంలో ఎవరూ కూడా నగ్నంగా కనిపించరని పేర్కొంది. తనకు డైరెక్టర్ మిస్కిన్పై పూర్తి నమ్మకముందని.. ఆయన కథకు అవసరమైతేనే అలాంటి సీన్స్ పెడతారని వివరించింది. ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయని.. కానీ అవన్నీ నగ్నంగా మాత్రం ఉండవని చెప్పింది. ఆయన ఇప్పటికే పలువురు స్టార్ నటులతో సినిమాలు చేశారని గుర్తు చేసింది. ఒకవేళ డైరెక్టర్ ఆ సీన్ అవసరమని భావిస్తే అతని దృష్టి కోణం అది కాదని.. ఆ సీన్ వెనకాల కచ్చితంగా అర్థముంటుందని ఆండ్రియా చెబుతోంది.
విజయ్ దేవరకొండ 'వీడీ14'.. విలన్ పాత్రలో హాలీవుడ్ యాక్టర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది కింగ్డమ్తో ప్రేక్షకులను ముందుకొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా జూలైలో థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ నిరాశపరిచింది. భారీ హైప్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది.ఈ మూవీ తర్వాత విజయ్ మరోసారి రాహుల్ సాంకృత్యాన్తో జతకట్టారు. టాక్సీవాలా కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వీడీ14 అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే వీడీ14 మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్, మమ్మీ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ వీడీ14లో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మూవీ సెట్స్లో వినోద్ సాగర్తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. హాలీవుడ్ యాక్టర్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెంచేసింది. ఈ పీరియాడికల్ డ్రామాలో ది మమ్మీ స్టార్ రోల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.ఈ స్టోరీ 1854 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో వోస్లూ ఆంగ్ల అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆర్నాల్డ్ విలన్ పాత్ర చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఆర్నాల్డ్ పాత్ర ఏంటనేది ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా.. గతంలో లైగర్ మూవీలో మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్రలో ఆర్నాల్డ్ కనిపించారు. ఈ మూవీతో రెండోసారి విజయ్ దేవరకొండ సినిమాలో మమ్మీ విలన్ కనిపించనున్నారు.
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025
మరో సినిమాకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ నటి రేణు దేశాయ్.. రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరే సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల కొద్దికాలంగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ టచ్లో ఉంటోంది. అయితే తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేణు దేశాయ్. పదహారు రోజుల పండుగ పేరుతో వస్తోన్న టాలీవుడ్ మూవీలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫన్ బిగిన్స్ అంటూ అనసూయతో ఉన్న ఫోటోను ఇన్స్టాలో పంచుకుంది .ఈ మూవీతో నంది అవార్డ్ విన్నర్ సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. 2008లో నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాలో నటనకు గానూ సాయికృష్ణ ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్ అందుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత డీఎస్ రావు తనయుడిగా సినిమాల్లో అడుగుపెడుతున్నారు. ఈ మూవీలో గోపికా ఉద్యన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ గతంలో కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లాంటి చిత్రాలను తెరకెక్కించాడు. సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందించనున్నారు. ఇందులో కృష్ణుడు, వెన్నెల కిషోర్, విష్ణు, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
క్రీడలు
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!
జాతి గర్వించదగ్గ క్రికెటర్లలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఒకరు. భారత జట్టు ఓపెనర్గా, వైస్ కెప్టెన్గా మహిళా క్రికెట్పై ఆమె ముద్ర ప్రత్యేకం. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న పట్టణంలో 1996, జూలై 18న జన్మించింది స్మృతి.ఆమె తల్లిదండ్రులు స్మిత మంధాన, శ్రీనివాస్ మంధాన. తండ్రి, అన్నని చూసి క్రికెటర్ కావాలన్న కోరిక చిన్న వయసులోనే స్మృతి మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే తండ్రి ప్రోత్సాహంతో ఆశయం దిశగా అడుగులు వేసింది.తొమ్మిదేళ్ల వయసులోఈ క్రమంలో తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మంధాన మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికైంది. పదకొండేళ్లకు అండర్-19 టీమ్ స్థాయికి చేరుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంటే.. పదహారేళ్లకే 2013లో స్మృతి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో ఓపెనర్గా రికార్డులు కొల్లగొడుతూ స్మృతి అగ్ర పథంలో దూసుకుపోతోంది. అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్గా అవార్డు అందుకుంది.వరల్డ్కప్ చాంపియన్గాభారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి చేరుకున్న 29 ఏళ్ల స్మృతి.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 గెలవడంలో తన వంతు పాత్ర పోసించి.. వరల్డ్కప్ చాంపియన్గా నిలిచింది. అయితే, క్రికెటర్గా ఎదిగే క్రమంలో స్మృతికి, ఆమె తల్లిదండ్రులకు అవహేళనలే ఎదురయ్యాయి.సగటు భారతీయ తండ్రిఈ విషయం గురించి స్మృతి మంధాన 2023లో కౌన్ బనేగా కరోడ్పతి 15 షోలో స్పందించింది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అవును సర్.. నాకు, మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాన్న కూడా క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన కుటుంబం అందుకు అవకాశం ఇవ్వలేదు. క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన పక్కనపెట్టమని చెప్పారు.అందుకే నాన్న తన కల మా ద్వారా నెరవేరితే బాగుండని కోరుకున్నారు. సగటు భారతీయ తండ్రిగా ఆయన కోరిక అది. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ కల కన్నారు. మా అన్నతో కలిసి నేను క్రికెట్ ఆడేదాన్ని.అన్న నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు అతడి బ్యాటింగ్ శైలిని పరిశీలించేదాన్ని. నిజానికి నేను రైటీని (కుడిచేతి వాటం). మా అన్న లెఫ్టీ. అన్నను చూసే బ్యాటింగ్ చేస్తూ లెఫ్టాండర్గా మారిపోయా.అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లాగే మా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్ పర్సన్ జీవితం అంత సాఫీగా ఉండదని మా వాళ్లను చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక రకంగా మా వాళ్లను వేధించారు కూడా!తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు?ఎండలో ఆడితే ఆమె ముఖం కందిపోతుంది. నల్లబడుతుంది. అలాంటపుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ భయపెట్టారు. అయినా సరే నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి లాగలేదు. క్రికెట్ ఆడేలా ప్రోత్సహించారు’’ అని స్మృతి మంధాన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.తన, తండ్రి ఆశయానికి తగ్గట్టుగా క్రికెటర్గా ఎదిగిన స్మృతి.. అత్యుత్తమ వన్డే మహిళా క్రికెటర్గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 629, 117 వన్డేల్లో 5322, 153 టీ20లలో 3982 పరుగులు సాధించింది. అండర్-19 స్థాయిలో లిస్ట్-ఎ మ్యాచ్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్ స్మృతి.ఉన్నత శిఖరాలకుఇక మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్మృతి.. వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.మనసిచ్చిన ప్రియుడు పలాష్ ముచ్చల్తో ఏడడుగులు వేసే క్రమంలో హల్దీ, సంగీత్ వేడుకల్లో ఆడిపాడింది. కానీ ఆఖరి నిమిషంలో తండ్రి అస్వస్థతకు గురికావడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పలాష్పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చంచల మనసు గల అతడు స్మృతిని మోసం చేశాడని.. అది తెలిసే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వదంతులు వస్తున్నాయి.ఊహించని విధంగా.. ఇప్పుడిలాఏదేమైనా క్రికెటర్ అయితే.. పెళ్లి కాదంటూ స్మృతిని వెక్కిరించిన వాళ్లకు ఆటతోనే ఆమె సమాధానం ఇచ్చింది. దేశాన్ని గర్వపడేలా చేసి ప్రపంచకప్ను ముద్దాడింది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇలా ఊహించని చేదు అనుభవాన్ని చవిచూసింది. అంతా సజావుగా సాగి స్మృతి వివాహ బంధంలో అడుగుపెడితే చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్వర్త్ ఎంత?
సీఎస్కే బ్యాటర్ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (Syed Mushtaq Ali Trophy 2025)లో గుజరాత్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్-సి గ్రూపులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్లో సర్వీసెస్పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం కారణంగా గుజరాత్ విజయం నల్లేరు మీద నడకలా మారింది.182 పరుగులుహైదరాబాద్లోని జింఖాన స్టేడియం వేదికగా టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సర్వీసెస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ గౌరవ్ కొచ్చర్ (37 బంతుల్లో 60) మెరుపు అర్ధ శతకం బాదగా.. అరుణ్ కుమార్ (29), జయంత్ గోయత్ (7 బంతుల్లో 29) రాణించారు.గుజరాత్ బౌలర్లలో హేమాంగ్ పటేల్, అర్జాన్ నాగ్వాస్వల్లా చెరో రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, రవి బిష్షోయి, విశాల్ జేస్వాల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆది నుంచే దూసుకుపోయింది.చెలరేగిన ఓపెనర్లుఓపెనర్లలో ఆర్య దేశాయ్ ధనాధన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 60)తో హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. మొత్తంగా 37 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు.321కి పైగా స్ట్రైక్రేటుతోఉర్విల్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి. 321కి పైగా స్ట్రైక్రేటుతో అతడు పరుగులు రాబట్టడం గమనార్హం. మిగతావారిలో రిపాల్ పటేల్ డకౌట్ అయినా పెద్దగా ప్రభావం పడలేదు. 12.3 ఓవర్లలోనే కేవం రెండు వికెట్లు నష్టపోయి గుజరాత్ 183 పరుగులు చేసి జయభేరి మోగించింది. శతక వీరుడు ఉర్విల్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.నమ్మకం నిలబెట్టుకున్నాడుకాగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఉర్విల్ పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు చెన్నై అతడిని రిటైన్ చేసుకుంది. ఇక ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెడుతూ సొంత జట్టు గుజరాత్ తరఫున ఉర్విల్ తొలి మ్యాచ్లోనే ఇరగదీయడం గమనార్హం. కాగా ఏడాది ఐపీఎల్లో ఉర్విల్ మూడు మ్యాచ్లు ఆడి 68 పరుగులు చేశాడు.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం
గంభీర్ కోచింగ్ అద్భుతం.. ఇదంతా ఆయన ఘనతే!
''కేవలం సంవత్సరం కాలంలో టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించిన గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్లకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జాతీయ కోఆర్డినేటర్ వినయ్ కుమార్ డోకానియా (Vinay Kumar Dokania) సెటైర్ వేశారు. సొంతగడ్డపై టెస్టుల్లో రెండో విజయవంతమైన వైట్వాష్కు అభినందనలు అంటూ చురక అంటించారు.దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో టీమిండియా చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లపై ఎక్స్ వేదికగా ఆయన వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు గుప్పించారు. వీరిద్దరినీ తొలగించకపోతే భారత క్రికెట్కు భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. 80, 90లలో కూడా భారత టెస్ట్ జట్టు ఇంత బలహీనంగా లేదని.. అగార్కర్, గంభీర్ వల్లే ఇప్పుడు అది సాధ్యమైందని దుయ్యబట్టారు. కోచ్ పదవికి గంభీర్ తనంత తానుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.వారిద్దరినీ తొలగించాలిపటిష్టమైన భారత టెస్ట్ జట్టును గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భ్రష్టు పట్టించాడని, టి20 ఆల్ రౌండర్ల టీమ్గా మార్చేశాడని వినయ్ కుమార్ ధ్వజమెత్తారు. టి20 క్రికెటర్లతో నిండిన ఈ భారత జట్టు కంటే ఇంట్లోని చిన్న పిల్లలు బాగా క్రికెట్ ఆడతారని వ్యంగ్యంగా అన్నారు. అసంబద్ధ నిర్ణయాలతో ఇండియన్ క్రికెట్ జట్టును గంభీర్ ఎగతాళి చేశాడని మండిపడ్డారు. టీమిండియా 2027లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతుందని.. గంభీర్, అగార్కర్లను తొలగించకపోతే మన జట్టు 5-0 తేడాతో ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.భారత టెస్ట్ క్రికెట్ హంతకుడుఅశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. టెస్ట్ క్రికెట్ నుంచి అవమానకరంగా రిటైర్ కావడానికి గంభీర్ కారణమయ్యాడని వినయ్ కుమార్ ఆరోపించారు. అసమర్థ టి20 క్రికెటర్లతో టెస్ట్ జట్టును నింపేశారని అన్నారు. తెలివితక్కువ, ప్రమాదకరమైన ప్రయోగాలతో ఆటగాళ్ల ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని విమర్శించారు. గౌతమ్ గంభీర్ను భారత టెస్ట్ క్రికెట్ హంతకుడిగా అభివర్ణించారు. క్రికెట్ కోచింగ్ ఆయనకు సరిపడదని, రాజకీయాల్లోకి తిరిగి వెళ్లాలని గంభీర్కు సలహాయిచ్చారు. గంభీర్ తన అద్భుతమైన కోచింగ్, జట్టు కూర్పుతో 2027 సీజన్లో ఇండియాను WTC ఫైనల్స్కు వెళ్లకుండా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.సక్సెస్ రేటు డౌన్2016 నుంచి 2019 వరకు సొంతగడ్డపై టీమిండియా విజయాల శాతం 79 కాగా, 2020 నుంచి 2024 వరకు 73 శాతం సక్సెస్ రేటు సాధించిందని వినయ్ కుమార్ గుర్తు చేశారు. 2024 అక్టోబర్ నుంచి ఇది 29 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. ఇంతటి ఘనత సాధించిన గౌతమ్ గంభీర్కు ధన్యవాదాలు అంటూ సెటైర్ వేశారు.చదవండి: భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది13 నెలల్లో ఆరుగురు..టీమిండియా టెస్ట్ టీమ్లో కీలకమైన మూడో స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయలేకపోయారని విమర్శించారు. రాహుల్ ద్రవిడ్ 15 ఏళ్లు, ఛతేశ్వర్ పుజారా పదేళ్ల పాటు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశారని గుర్తు చేశారు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 13 నెలల కాలంలోనే ఆరుగురిని మార్చారని తెలిపారు. శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, పడిక్కల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్లను మూడో స్థానంలో ఆడించిన విషయాన్ని వెల్లడించారు.I demand Bharat Ratna from Indian govt for Gautam Gambhir and Ajit Agarkar for these herculean achievements for Team India in just 1 year #IndvsSA pic.twitter.com/z5JpekDHFm— Vinay Kumar Dokania (@VinayDokania) November 26, 2025
స్మృతి వర్సెస్ పలాష్: ఎవరి నెట్వర్త్ ఎంత?
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన తరుణంలో అకస్మాత్తుగా స్మృతి తండ్రి ఆరోగ్యం చెడిపోయింది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి తన మేనేజర్తో మీడియాకు చెప్పించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక సందేహాలకు తావిచ్చాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రిలో చేరిన తర్వాత పలాష్ కూడా ఆస్పత్రి పాలు కావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత పలాష్ పేరిట ఓ అకౌంట్ నుంచి మేరీ డికోస్టా అనే అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్లు వెళ్లాయనేలా స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి.మోసం చేశాడా?అందులో స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా మాట్లాడిన పలాష్.. డికోస్టాతో డేటింగ్ చేయడానికి ఉవ్విళ్లూరినట్లుగా అనిపించింది. అంతేకాదు.. స్మృతితో తనకు ‘లాంగ్ డిస్టేన్స్’ ఉందంటూ పలాష్.. సదరు అమ్మాయిని తనతో ఎంజాయ్ చేయాలని కోరినట్లుగా ఉన్న మెసేజ్లు వైరల్గా మారాయి.ఈ నేపథ్యంలో పలాష్ తన మాజీ ప్రేయసి బిర్వా షాకు ప్రపోజ్ చేసిన పాత రొమాంటిక్ వీడియోలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్.. స్మృతిని మోసం చేశాడని.. ఇది గుర్తించిన ఆమె తండ్రి అతడితో గొడవ పడే క్రమంలోనే అస్వస్థతకు గురయ్యాడనే వదంతులు వ్యాపించాయి. అయితే, సోషల్ మీడియాలో స్మృతి- పలాష్ గురించి ఇంత రచ్చ జరుగుతున్నా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందనా లేదు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. అయినాఅంతేకాదు.. తాజా సమాచారం ప్రకారం స్మృతి తండ్రి సాంగ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయినప్పటికీ పెళ్లి గురించి మంధాన కుటుంబం గురించి ఎటువంటి స్పందన రాకపోవడం అనుమానాలు బలపడేలా చేసింది. ఇద్దరిలో ఎవరు ధనవంతులు?ఈ నేపథ్యంలో పలాష్.. అందం, కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఉన్న స్మృతిని ప్రేమ అనే మత్తులో ఉంచి ద్రోహానికి పాల్పడ్డాడంటూ అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి నెట్వర్త్ ఎంత?.. ఇద్దరిలో ఎవరు ధనవంతులు? అన్న చర్చ నడుస్తోంది.టాప్ క్రికెట్ స్టార్ స్మృతిభారత మహిళా జట్టు వైస్ కెప్టెన్గా, మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తొలి టైటిల్ అందించిన సారథిగా మంధానకు పేరుంది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 గెలవడంలోనూ ఆమెది కీలక పాత్ర. వెరసి స్మృతి బ్రాండ్ వాల్యూ మునుపటి కంటే భారీ స్థాయిలో పెరిగింది.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాంట్రాక్టులో ద్వారా ఆమెకు ఏటా రూ. 50 లక్షల వేతనం వస్తుంది. అదే విధంగా ఒక్కో టెస్టు మ్యాచ్కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, అంతర్జాతీయ టీ20 మ్యాచ్కు రూ. 3 లక్షలు అదనంగా లభిస్తాయి.ఆమె నికర ఆస్తుల విలువ ఎంతంటే?ఇందుకు తోడు ఆర్సీబీ ప్రధాన ప్లేయర్గా, కెప్టెన్గా స్మృతికి రూ. 3.4 కోట్లు దక్కుతాయి. మహిళా క్రికెటర్లలో ఈ మేరకు అత్యధిక ధరకు ఒప్పందం కుదుర్చుకున్న అమ్మాయి మంధాననే. వీటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్, ప్రచారం ద్వారా కూడా స్మృతి రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి స్మృతి మంధాన నికర ఆస్తుల విలువ రూ. 32- 34 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా అంచనా. పలాష్ నెట్వర్త్ ఎంత?ఇక పలాష్ విషయానికొస్తే.. మ్యూజిక్ కంపోజర్గా, ఆల్బమ్స్ రూపకర్తగా అతడికి ఆదాయం వస్తోంది. అంతేకాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలాష్ అదనపు ఆదాయం గడిస్తున్నాడు. వీటితో పాటు లైవ్ షోలు, రాయల్టీల ద్వారా పలాష్కు భారీ మొత్తమే అందుతోంది. వెరసి 2025 నాటికి అతడి నెట్వర్త్ రూ. 20- 41 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా 2019 నుంచి స్మృతి- పలాష్ రిలేషన్లో ఉండగా.. గతేడాది తమ ప్రేమను ధ్రువీకరించారు. ఈ జంట నవంబరు 23న పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా అంతా గందరగోళంగా మారిపోయింది.చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఆంధ్రప్రదేశ్లో ఐటీ ముసుగులో రియల్ దందా...
ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచిందెక్కడ?... ఏపీ సీఎం చంద్రబాబుపై ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు విడుదల, జీవో జారీ చేసిన ప్రభుత్వం
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?... సీఎం చంద్రబాబు
ఉప్పొంగిన అభిమానం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం
మనమంతా సాయి మార్గంలో నడుద్దాం... శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
బిజినెస్
అమెరికాపై తగ్గని మోజు!
అమెరికాలో ఏటా రికార్డు స్థాయిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులు అధికమవుతుండడం కారణంగా నిలిచింది. తాజాగా ఓపెన్ డోర్స్ 2025 నివేదికలోని వివరాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూఎస్లో దాదాపు ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉండడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల నమోదు 3,63,019కు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. ప్రాడిజీ ఫైనాన్స్ డేటా ప్రకారం ఇండోర్, భువనేశ్వర్, పంజాబ్, సూరత్, కోయంబత్తూర్, మైసూరు, నాగ్పుర్.. వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ విద్యార్థులు తరచుగా ఉపాధ్యాయులు, చిన్న వ్యాపార యజమానులు, మిడ్ కెరియర్ నిపుణుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఉన్నారు.STEM కోర్సులు2024-25లో యూఎస్ మొత్తంగా 11,77,766 అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 4.5 శాతం ఎక్కువ. యూఎస్లోని ప్రతి 10 మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు 7 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లో చేరుతున్నారు.43.4% మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ లో చేరారు.22.8% మంది ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు.ఓపీటీ..అమెరికా అందిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కు ఆదరణ పెరుగుతోంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు దేశీయ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి ఓపీటీ ఎంతో తోడ్పడుతుంది. భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా STEMలో H-1B వీసాలు లేదా ఇతర వర్గాలకు మారడానికి ముందు వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే..
బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే..
కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అనేక మందికి బంగారం కేవలం ఆభరణంగా కాకుండా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనంగా మారింది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ బంగారాన్ని అమ్మివేయడం లేదా తాకట్టు పెట్టడం సర్వసాధారణం. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారాన్ని సాధారణ పద్ధతిలో తాకట్టు పెట్టకుండా, అమ్ముకోకుండానే దాన్ని ఉపయోగించుకునే అద్భుతమైన మార్గం ఉంటే? అవును, అదే బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ (Overdraft on Gold Jewellery) సదుపాయం. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో అనేక ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వారి ఆర్థిక అవసరాలకు భరోసా కల్పిస్తున్నాయి.గోల్డ్ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే?బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక రకమైన సురక్షితమైన రుణం (Secured Loan). ఇది వ్యక్తిగత రుణం లాంటిది కాకుండా, ఒక క్రెడిట్ లైన్లాగా పనిచేస్తుంది. సాధారణంగా గోల్డ్ లోన్లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకుని దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓవర్డ్రాఫ్ట్ సదుపాయంలో మీ బంగారు ఆభరణాల విలువను బట్టి బ్యాంక్ నిర్దిష్ట పరిమితి(Limit)తో రుణాన్ని మంజూరు చేస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి నుంచి అతనికి అవసరమైన మేరకు ఎప్పుడైనా, ఎంతైనా డబ్బును డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.మీరు డ్రా చేసుకున్న అసలు మొత్తంపై (Utilised Amount) మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన మొత్తం పరిమితిపై కాదు. ఈ సౌకర్యం సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు అవుతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి క్రమానుగతంగా రుణం తిరిగి చెల్లించవచ్చు.వినియోగదారులకు ఉపయోగాలుబంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా వినియోగదారులకు కీలక ప్రయోజనాలు ఉన్నాయి. యూజర్లు డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు, మీకు రూ.5 లక్షల పరిమితి మంజూరైతే అందులో రూ.2 లక్షలు మాత్రమే వాడుకుంటే ఆ రూ.2 లక్షలపై మాత్రమే వడ్డీ చెల్లించాలి.ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలో నిధులు జమ చేయడం ద్వారా తీసుకున్న రుణాన్ని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. నెలవారీ ఈఎంఐ (EMI) లాంటి కఠిన నిబంధనలు ఉండవు.వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం తక్షణమే నిధులు పొందవచ్చు.గోల్డ్ లోన్ లేదా గోల్డ్ ఓవర్డ్రాఫ్ట్లకు వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి.బంగారు ఆభరణాలు సురక్షితంగా బ్యాంకు వాల్ట్లో ఉంటాయి. వాటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు.బంగారం విలువను ఎలా లెక్కిస్తారు..బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి వినియోగదారులు సాధారణంగా కొన్ని అర్హతలు కలిగి ఉండి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా 18 క్యారెట్ల (Carat) నుంచి 24 క్యారెట్ల మధ్య స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఓడీ ఇస్తాయి. వినియోగదారుడికి కావలసిన పరిమితిని బట్టి తగినంత బరువున్న బంగారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును నిర్ధారించి వాటి ప్రస్తుత మార్కెట్ విలువను లెక్కిస్తారు. ఈ విలువలో 70% నుంచి 75% వరకు ఓవర్డ్రాఫ్ట్ పరిమితిని మంజూరు చేస్తారు.ఛార్జీలుబంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ (OD) సౌకర్యాన్ని వినియోగించుకునేటప్పుడు వినియోగదారులు చెల్లించాల్సిన ప్రధాన ఛార్జీల్లో వడ్డీ రేటు ముఖ్యమైనది. ఓడీ పరిమితి నుంచి తీసుకున్న అసలు మొత్తానికి మాత్రమే లెక్కిస్తారు. ఈ వడ్డీ సాధారణంగా రోజువారీగా లెక్కిస్తారు. బ్యాంకును అనుసరించి సంవత్సరానికి 8% నుంచి 15% మధ్య మారుతూ ఉంటుంది.కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి, అకౌంట్ను సెటప్ చేయడానికి వసూలు చేసే ఏకమొత్తం ఛార్జీ. ఈ ఫీజు సాధారణంగా మంజూరైన మొత్తం ఓవర్డ్రాఫ్ట్ పరిమితిలో 0.5% నుంచి 1.5% వరకు ఉంటుంది.వాల్యుయేషన్ ఛార్జీలు.. బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును తనిఖీ చేసి దాని ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. ఈ సర్వీసు కోసం వసూలు చేసే ఫీజునే వాల్యుయేషన్ ఛార్జీలు అంటారు. అలాగే రుణ ఒప్పందాలను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఛార్జీని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్న బ్యాంకులు1. ఫెడరల్ బ్యాంక్: డిజి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ పథకం2. సీఎస్బీ బ్యాంక్: ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ స్కీమ్3. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB): టీఎంబీ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India): బంగారు ఆభరణాలపై ఎస్ఓడీ (Secured Overdraft on Gold Ornaments - SOD).ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్
రైలు పట్టాలపై సవారీ చేసే బస్సు
సాధారణంగా మనం ఊహించని పనులను చేసే కొన్ని వాహనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఒక వినూత్న వాహనాన్ని జపాన్లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV)గా రికార్డు సృష్టించింది. ఇది బస్సు మాదిరిగా సాధారణ రోడ్లపై, రైలులాగా రైల్వే ట్రాక్పై పరుగులు పెడుతుంది.చిన్న బస్సు రూపంలో కనిపించే ఈ డ్యూయల్ మోడ్ వాహనం దాని డిజైన్, ప్రత్యేకతలతో వాహనదారులను ఆకర్షిస్తోంది. దీనికి ప్రత్యేకమైన పేరు లేనప్పటికీ దీని పనితీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వాహనం జపాన్లోని షికోకు ద్వీపంలోని కొచ్చిని టోకుషిమా మధ్య నడుస్తోంది. ఈ డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఆసా కోస్ట్ రైల్వే అనే ఒక ప్రైవేట్ పబ్లిక్ రైల్వే సంస్థ నిర్వహిస్తోంది.15 సెకన్లలో మోడ్ ఛేంజ్..ఈ వాహనం రోడ్డు మోడ్ (బస్సు) నుంచి రైలు మోడ్కు లేదా రైలు మోడ్ నుంచి రోడ్డు మోడ్కు చాలా త్వరగా మారగలదు. మోడ్ల మధ్య సెటప్ను మార్చుకోవడానికి డీఎంవీకి కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది.ఈ వాహనం 21 మందిని మోసుకెళ్లగలదు.రోడ్డుపై వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకు చేరుకోగలదు.రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. View this post on Instagram A post shared by Japan Journeys: Culture, Cuisine, and Adventure 🎌 (@vibeinjapan)ఈ డీఎంవీ జపాన్లో అవాకైనాన్, కైఫు, షిషికుయి, కన్నోరా, ఉమినోకి టోయో టౌన్, మిచినోకి షిషికుయి ఒన్సెన్ను కలుపుతూ నడుస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జీలు 200 యెన్ల నుంచి 800 యెన్ల వరకు (సుమారు రూ.100 నుంచి రూ.450) ఉంటాయి.ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్
ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్
ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన, వ్యక్తిగత కమ్యూనికేషన్కు కీలకంగా ఉన్న ఆన్లైన్ వీడియో కాలింగ్, మీటింగ్ ప్లాట్ఫామ్ గూగుల్ మీట్ (Google Meet) సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. బుధవారం భారతదేశంలో చాలా మంది వినియోగదారులు గూగుల్ మీట్ సేవలు సరిగా పని చేయడంలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా రిమోట్ వర్క్, ఆన్లైన్ సమావేశాల్లో పాల్గొనే వినియోగదారులు ఈ అంతరాయం వల్ల సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు.ఆన్లైస్ సేవల అవుటేజ్ మానిటరింగ్ ప్లాట్ఫామ్ డౌన్ డిటెక్టర్ (Downdetector) ప్రకారం, మధ్యాహ్నం 12:29 గంటల వరకు భారతదేశంలో కనీసం 1,760 మంది వినియోగదారులు గూగుల్ మీట్తో సమస్యల ఎదుర్కొన్నట్లు చెప్పారు. చాలా మంది వినియోగదారులు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన సమావేశాల్లో జాయిన్ అవ్వలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు.ఎర్రర్ ఇదే..ఆన్లైన్ కాల్స్లో చేరడానికి ప్రయత్నించిన వినియోగదారులకు స్క్రీన్పై ఒక ఎర్రర్ మెసేజ్ దర్శనమిచ్చింది. ‘502. దిస్ ఈస్ యాన్ ఎర్రర్. మీ రెక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయడానికి దయచేసి 30 సెకన్లలో మళ్లీ ప్రయత్నించండి. మాకు తెలిసింది అంతే’ అనే మెసేజ్ చూపించింది.నెటిజన్ల స్పందనగూగుల్ మీట్ అంతరాయంపై నెజినట్లు ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా స్పందించారు. ‘పని చేయడానికి ఎంతో ఆశగా ఉన్న నాకు గూగుల్ మీట్ చుక్కలు చూపించింది’ అని ఒక నెటిజన్ రాశారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. ‘మా సంస్థలో గూగుల్ మీట్ అందరికీ డౌన్ అయింది’ అని రాశారు. కొంతమంది యూజర్లు మాత్రం టీమ్ సభ్యుల మధ్య సమస్యలు వేర్వేరుగా ఉన్నాయని తెలిపారు. ‘గూగుల్ మీట్? నాకు సరిగానే ఉంది. కానీ మా బృందంలో ఇతర సభ్యులు సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: 1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!
ఫ్యామిలీ
స్లిమ్గా మిచెల్ ఒబామా..! ఆమె కూడా ఒజెంపిక్ తీసుకున్నారా..?
అధిక బరువు అనేది సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు వరకు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఓ పట్టాన బరువు తగ్గలేక చాలామంది ఇటీవల కాలంలో ఒజెంపిక్ ఇంజెక్షన్ల బాట పడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి అగ్రరాజ్యం మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా చేరిపోయారా, ఆమె కూడా దీన్ని వినియోగిస్తున్నారా అనే ఊహగానాలు వెల్లువెత్తాయి. అందుకు కారణం ఇటీవల ఆమె నెట్టింట పోస్ట్ చేసిన ఫోటోలే. అందులో మిచెల్ ఎంత నాజుకుగా అయిపోయారంటే..చూపుతిప్పుకోనివ్వనంత అందంగా మారిపోయారామె.గత వారాంతంలో 61 ఏళ్ల మిచెల్ ఒబామా ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్ ప్రచార ఫోటో షూట్కి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారామె. అందులో ఆమె లైట్కలర్ జీన్స్, ప్లెయిన్ గ్రే టీ-షర్టు విత్ గోధుమ రంగు సూడ్ బూట్లతో చాలా ఫిట్గా కనిపించారు. దాంతో అందరూ ఆమె అంతలా సన్నగా ఎలా మారిపోయిందనే సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు వ్యాయమం కంటే ఈజీగా బరువు తగ్గించే ఒజెంపిక్ ఔషధాన్ని ఉపయోగించినట్లు అంగీకరించారు. బహుశా ఆమె కూడా వారి బాటలోనే నడిచారా అని నెటిజన్లలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా మిచెల్ తన పుస్తకం "ఉమెన్" మాదిరిగా చేశారామె. మనం స్త్రీలను ఎలా చూస్తామో..అంతకుమించి అన్నట్లు సాగిపోవడమే కాదు తన దృక్పథంతో లైఫ్ని లీడ్ చేయగలదు కూడా. ఈ రోజు మహిళలు చాలా రకాలుగా తనను తాను నిరూపించుకుంటున్నారు. మీరు కూడా నాలాగే ఈ డెవలప్మెంట్ని స్ఫూర్తిదాయకంగా భావిస్తారని ఆశిస్తునన్నా అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్లో రాసుకొచ్చింది. కాగా, ఓజెంపిక్ అనేది టైప్ 2 డయాబెటిస్ను నిర్వహించడానికి ఆమోదించబడిన మందు. ఇది వారానికొకసారి ఇచ్చే మందు. బరువు నిర్వహణ ప్రయోజనాల నిమిత్తం ప్రజాధరణ పొందిన ఔషదం. గత సెప్టెంబర్లో ఆ ఔషధం తయారీదారు డానిష్ నోవో నార్డిస్క్, భారతదేశంలో కూడా దీన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Michelle Obama (@michelleobama) (చదవండి: ప్రకృతి వైద్యమే మంచిదా..! నటి సోనాలి బింద్రే సైతం..)
ప్రకృతి వైద్యమే మంచిదా..! నటి సోనాలి బింద్రే సైతం..
ఆధునిక వైద్యం కొంత పుంతలు తొక్కుతున్న వేళ..చాలామంది ప్రకృతి వైద్యం వైపుకే మగ్గు చూపుతున్నారు. ఆఖరికి సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా వాటినే ప్రమోట్ చేస్తుండటం విశేషం. అయితే పూర్తిగా ప్రకృతి వైద్య మీద ఆధారపడితే కష్టం అని..ఆధునిక చికిత్సల తోపాటు దీన్ని తీసుకుంటే బెటర్ అనేది కొందరి నిపుణులు వాదన. అయితే తాజాగా టాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఈ ప్రకృతి వైద్యంపై ఆమె పెట్టిన పోస్ట్ హాట్టాపికగ్ మారింది. పైగా ఆమెకు పిచ్చి పట్టిందా అంటూ తిట్టిపోస్తున్నారు కూడా. కానీ సోనాలి మాత్రం తన వాదనను సమర్థించడమే కాదు అది తన అనుభవం అని నొక్కి చెబుతూ మరోసారి పోస్ట్ పెట్టారామె. అసలు ఇంతకీ ఆమె ఏం అన్నారు? అన్నింట్లకంటే ప్రకృతి వైద్యమే మంచిదా అంటే..గతవారం సోషల్ మీడియ ఎక్స్లో ఆటోఫాగి గురించి రాసుకొచ్చింది. తనకు 2018లో కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, అప్పుడే తన ప్రకృతి వైద్యుడు ఈ సహజ చికిత్సను పరిచయం చేసినట్లు తెలిపింది. దానిగురించి పరిశోధించి మరీ అనుసరించినట్లు పేర్కొంది. ఆ ఆటోఫాగిని ఇప్పటికీ అనుసరిస్తున్నట్లు తెలిపింది. ఆటోఫాగి అంటే..ఒక కణం తనను తాను శుభ్రం చేసుకునే సహజ ప్రక్రియ, దీని ద్వారా అది పాత, దెబ్బతిన్న కణ భాగాలను విచ్ఛిన్నం చేసి, వాటిని తిరిగి ఉపయోగించుకుంటుంది. ఇది కణ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, కణాలలో శక్తిని పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా ఉపవాసం లేదా ఒత్తిడి వంటి పరిస్థితులలో ఇది చాలా కీలకం. అందుకు ది లివర్ డాక్ ఆన్గా ప్రసిద్ధి చెందిన హెపాటాలజిస్ట్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ స్పందించి పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. సోనాలి తన కేన్సర్ చికిత్స కోసం ఆధునిక వైద్యం వైపు మొగ్గు చూపారని గుర్తు చేశారు. "కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సతో సహా తీవ్రమైన కేన్సర్ చికిత్సల కోసం న్యూయార్క్కు వెళ్లారని చెప్పుకొచ్చాడు. 2019లో ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొంది అధికారికంగా కేన్సర్ రహితంగా భారతదేశానికి తిరిగి వచ్చారని గుర్తు చేశాడు. అంతేగాదు అధునాతన క్యాన్సర్ చికిత్స ఆసుపత్రిలో కీమోథెరపీ, రేడియేషన్,శస్త్రచికిత్స వల్లే మీకు ఉపశమనం లభించిందని పేర్కొన్నాడు. ముమ్మాటికి ఇది ప్రకృతి వైద్యం కాదని, శాస్త్రీయ చికిత్సే మీకు హెల్ప్ అయ్యిందంటూ పోస్ట్లో రాసుకొచ్చారు.దాంతో సోనాలి తాజాగా తన ఎక్స్ పోస్ట్లో అతడు పెట్టిన ఫోటోని స్క్రీన్షాట్ తీసి మరీ పోస్ట్లో ఇలా స్పష్టం చేసింది. ఆ కేన్సర్ వ్యాధి తెచ్చే భయం అంతా ఇంత కాదు. నొప్పి, అనిశ్చతి వంటి వాటిని తట్టుకోవాలి. అందుకు అభ్యాసం, అనుభవం అత్యంత ముఖ్యం. ఇప్పటివరకు తాను చెప్పిన వన్ని తన అనుభవం ఆధారంగా చెప్పాను.తాను పదే పదే చెప్పినట్లుగా.. ఏ రెండు కేన్సర్లు ఒకేలా ఉండవు. అలాగే చికిత్సా విధానాలు కూడా వేరుగా ఉంటుంది. చాలా సమగ్రంగా పరిశోధన, వైద్య మార్గదర్శకత్వం తర్వాత వ్యక్తగతంలో తెలుసకున్నది ఈ ఆటోఫాగి. అప్పట్లో దీని ప్రభావం, తేడాను గమనించానని, పైగా అది నేటికి కొనసాగుతుందని పేర్కొంది. అయినా అందరూ నాతో ఏకభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..వేర్వేరు విధానాల వైపు మొగ్గు చూపుతున్నందున..తన మాటలను తోసిపుచ్చాల్సిన పనిలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సోనాలి. తన అనుభవాన్ని చాలా నిజాయితీగా పంచుకున్నానే తప్ప తప్పుదోవ పట్టేంచే ఉద్దేశ్యమే లేదని,ప్రకృతి వైద్యాన్ని సమర్థిస్తు పోస్టు ట్టారు.అందుకుగాను ది లివర్ డాక్ ఇలా పోస్ట్ పెట్టింది.సోనాలి బింద్రే ఒక పిచ్చిది కాదు. ఆమె సలహా తీసుకుంటున్న ప్రకృతి వైద్యుడు ఒక పిచ్చివాడు. సోనాలి బింద్రే, ఆమెకు ముందు తర్వాత చాలా మంది ఇలాగే అనుసరించి, బాధతులుగా మారారని ఫైర్ అయ్యింది. అయినా విద్య తెలివి తేటలకు, హేతుబద్ధతకు సమానం కాదు అనే విషయంపై దృష్టి పెట్టండి అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం నెట్టింట ఈ అంశం హాట్టాపిక్గా మారి, చర్చనీయాంశం గామారింది. ప్రకృతి వైద్యం అంటే..ప్రకృతి వైద్యం అనేది ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఇది ఆహారం, నీరు, ఉపవాసం, వ్యాయామం, యోగా వంటి సహజ పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. ఇది శరీరానికి సహజంగా ఉండే స్వస్థత శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ విధానంలో హోమియోపతి, ఆక్యుపంక్చర్, హెర్బల్ మెడిసిన్ వంటి సంప్రదాయ పద్ధతులతో పాటు, కొన్ని ఆధునిక పద్ధతులను కూడా మిళితం చేసి అందిస్తుంటారు ప్రకృతి వైద్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగహనం కోసం మాత్రమే ఇచ్చింది. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు !)
ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు !
యాంటీబయాటిక్ మందులు వేసినా కూడా సూక్ష్మజీవులు చనిపోవడానికి బదులు ఇంకా పెరుగుతూనే ఉండే పరిస్థితిని యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. దీని గురించి ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణురాలు, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరల్డ్ ఏఎంఆర్ అవగాహన వారోత్సవాన్ని (వావ్) ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా నవంబర్ 18 నుంచి 24 వరకు జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ “ఇప్పుడే స్పందించండి: మన వర్తమానాన్ని రక్షించి, భవిష్యత్తును కాపాడుకోండి’’. ఈ థీమ్ ఏఎంఆర్ను ఎదుర్కొనేందుకు ధైర్యవంతమైన, సమన్వయపూర్వక, విభాగాల వ్యాప్తంగా చర్యల అవసరాన్ని చెబుతోంది. ఏఎంఆర్ అనేది ఇప్పటికే మన ఆరోగ్యం, ఆహార వ్యవస్థలు, పరిసరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న ఒక ప్రపంచవ్యాప్త ముప్పు.యాంటీబయాటిక్స్ అనేవి ప్రాణాధార మందులు. కానీ, అవి ఇన్ఫెక్షన్ కలగజేసే సూక్ష్మజీవుల మీద పనిచేస్తేనే ప్రాణాలను కాపాడతాయి. యాంటీబయాటిక్స్ మందులు సమర్థంగా ఇన్ఫెక్షన్లను నియంత్రించలేకపోతే ప్రాణాధార చికిత్సలైన కేన్సర్ చికిత్స, అవయవ మార్పిడి లాంటి వాటిపై ఏఎంఆర్ ప్రభావం చూపుతుంది. యాంటీబయాటిక్స్ మందులను చెప్పిన డోస్ కంటే తక్కువ కాలం వాడడం, లేదా తగిన డోసేజిలో వాడకపోవడం, ఒక వ్యాధికి సరిపడని మందు వాడడం లాంటివే వాటిని సరిగా వాడకపోవడం అవుతుంది. వైద్యులు చెప్పినట్లే వీటిని వాడాలి. మన సమస్యకు వైద్యులు యాంటీబయాటిక్స్ రాయకపోతే, అవి కావాలని వారిపై ఒత్తిడి చేయకూడదు . వేరేవారికి రాసిన మందులు వాడితే నయమైపోతుందని అనుకోకూడదు. ఆయా వ్యక్తులు ఆరోగ్యరీత్యా తగిన మందులను సరైన డోసులోనే తీసుకోవాలి. మన దేశంలో నేరుగా దుకాణాలకు వెళ్లి ఏదిపడితే ఆ యాంటీబయాటిక్ కొనుక్కునే అవకాశం ఉండడం కూడా వీటి దుర్వినియోగానికి కారణం అవుతోంది. కొత్త యాంటీబయాటిక్స్ తయారీ చాలా సమస్యాత్మకం, ఖర్చుతో కూడుకున్నది. మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల కొత్త యాంటీబయాటిక్స్ తగ్గుతున్నాయి. అందుకని ఉన్నవాటినే జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలావరకు టీకాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి కాబట్టి ఏఎంఆర్ సమస్య పరిష్కారానికి పిల్లలు, పెద్దలు, వృద్ధులందరూ టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా ఇన్ఫెక్షన్ రాకపోతే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరమే ఉండదు. ఏఎంఆర్ నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషిచేయగలరు. ఈ కింది పద్ధతుల ద్వారా మీ వంతు ప్రయత్నించండి.వైద్యులు సూచించకపోతే యాంటీబయాటిక్స్ కావాలని ఒత్తిడిచేయకండి.మందుల దుకాణం నుంచి యాంటీబయాటిక్స్ కొనాలంటే వైద్యుల ప్రిస్క్రిప్షన్తోనే వెళ్లండి. నేరుగా వెళ్లి కొనొద్దు. యాంటీబయాటిక్స్ వాడడానికి ఎప్పుడూ వైద్యుల సలహా పాటించండి. వాడాల్సినంత కాలం వాడాలి తప్ప మధ్యలో ఆపకూడదు.మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ వాడద్దు, ఎవరికీ ఇవ్వద్దు.రోజూ చేతులు కడుక్కోవడం, ఆహారాన్ని శుభ్రంగా వండడం, అనారోగ్య బాధితులకు దగ్గరగా ఉండకపోవడం, దగ్గువచ్చినప్పుడు నోరు చేత్తో మూసుకోవడం, ఎప్పటికప్పుడు టీకాలు వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను నియంత్రించండి. చదవండి: లోపం ఐరన్.. అదే సైరన్..వైద్యులు సరైన యాంటీబయాటిక్, సరైన డోసులో, సరైన కాలం పాటు, సరైన సమయంలో ఇవ్వాలి. వీలైనంత తక్కువకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడడమే సరైన వ్యూహం. ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స చేయడం వల్ల యాంటీబయాటిక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రాదు.- డాక్టర్ ఆర్సీ బిలోరియా
లక్షల్లో వేతనం.. రోబోటిక్ లైఫ్ వద్దనుకున్నాడు..! కట్చేస్తే..
బిందాస్ లైఫ్.. మంచి కంపెనీలో లక్షల్లో జీతం, గుర్తింపు ఉన్నాయి. అయినా ఏదో తెలియని వెలితి..తన చుట్టూ ఉన్న వాళ్లు 30 ఏళ్లకే వైస్ప్రెసిడెంట్ హోదాను అనుభవిస్తుంటే..తాను 26 ఏళ్లు వచ్చినా..ఇదే 9 టు 5 జాబ్..రొటీన్ లైఫ్. రోబోటిక్గా పనిచేస్తూ..ప్రమోషన్లు,గుర్తిపుతోనే బతికేయాలా అనే ఆలోచన నిద్రపట్టనివ్వలేదు. అలాగని ఈ ఉద్యోగం వదులుకునే సాహసం కూడా లేద అతనికి. చివరికి ఏదోలా ఉద్యోగం వదిలేస్తే..ఊహించని విధంగా ఆ జాబ్ కాస్త ఊడిపోయింది. తలకిందులైన తన పరిస్థితికి కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓటమికి అవకాశం ఇవ్వనంటూ పడిలేచిన కెరటంలా సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి గొప్ప సక్సెస్ అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. అతడే ముంబైకి సెమ్లానీ. కామర్స్ అండ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తాత్కలిక వర్క్ వీసాపై యూఎస్ వెళ్లాడు. అలా 2015లో జేపీ మోర్గాన్ యూఎస్ వీసాపై ఇంటర్న్గా పనిచేశాడు. తర్వాత భారత్కు తిరిగి వచ్చి..అదే కంపెనీకి సంబంధించి.. ఆస్తినిర్వహణ విభాగంలో అసోసియేట్గా విధులు నిర్వర్తించేవాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆనందం లేదనే ఫీలింగ్ వెంటాడేది సెమ్లానికి. తన చుట్టూ ఉన్నవాళ్లు చకచక వైస్ ప్రెసిడెంట్ హోదా పొందేస్తుంటే..నేను మాత్రం ఇలా మెకానికల్గా 9 టు 5 జాబ్ చేస్తున్నాననే బాధ వెంటాడేది. ఈ ఉద్యోగంలో లక్షల్లో వేతనం, మంచి గుర్తింపు ఉన్నాజజ ఏదో అసలైన సక్సెస్ని అందుకోలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉండేది. పోనీ జాబ్ని వదిలేద్దామంటే..అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునే ధైర్యం రావడం లేదు.ఎందుకంటే అద్దె కూడా చెల్లించని విధంగా మంచి సౌకర్యాలు, ప్రతి ఏడాది మంచి వేతనంతో కూడిన ప్రమోషన్లు, చక్కటి గుర్తింపు ఉన్నాయి. ఇవన్నీ వదులుకుని వెళ్లడం అంటే గుండెల్లో ఏదో తెలియని గుబులు వెంటాడింది. ఏం చేయాలో తెలియక ధ్యానం, డిజటల్డిటాక్స్ వంటి మానసిక థెరపీలు తీసుకుని..తనకేం కావలి అనేదానిపై స్పష్టత తెచుకున్నాడు. అలా ఈ జాబ్ వద్దనే నిశ్చయానికి రావడమేగాక మంచి జాబ్లో తక్కువ వేతనానికి చేరిపోయాడు. తాను కోరుకున్న మానసికి ఆనందం దొరికింది చాలు..ఇక ఖర్చులు విషయమైతే..తన జీవినశైలిని సర్దుబాటు చేసుకుంటే సరి అనుకున్నాడు. అలా సాగిపోతున్న తరుణంలో కరోనా మహమ్మారి లాక్డౌన్ రావడం..సంపాదించిన ఆ ఉద్యోగం కాస్తా పోవడం అన్ని చకచక జరిగిపోయాయి.తీవ్ర నిరాశ, నిస్పృహ..తప్పు చేసిన ఫీలింగ్..అనవసరంగా జేపీ మోర్గాన్లో ఉద్యోగాన్ని వదులుకున్నానా..తప్పు నిర్ణయం తీసుకున్నానా అంటూ..నిద్రలేని రాత్రుల గడిపేవాడు. తన మీద తనకే జాలేసిది. అలా..పూర్తిగా డిప్రెషన్లోకి కూరుకుపోయాడు. కానీ తను చేసే మెడిటేషన్, మానసిక థెరపీల సాయంతో మళ్లీ రీచార్జ్ అయ్యి..స్టార్టప్ దిశగా అడుగులు కదిపాడు. ఆ విధంగా రూ. 53 కోట్లు టర్నోవర్ చేసే టార్టన్ స్టార్టప్ని నెలకొల్పి గొప్ప సక్సెస్ని అందుకున్నాడు. తాను కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా..పరిస్థితులు తలికిందులైనప్పుడూ ఎలా సంయమనంగా ఉండాలో నేర్చుకున్నాడు. అంతేగాదు విజయం అంటే పెద్దమొత్తంలో జీతం కాదు..అంతకుమించిన ఆనందం., సంతృప్తి అని చెబుతున్నాడు సెమ్లానీ.(చదవండి: Inspiring Story: సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..)
అంతర్జాతీయం
శవపేటికలో శబ్దాలు.. అసలేం జరిగిందంటే..
బ్యాంకాక్: అది బ్యాంకాక్ శివార్లలో నిశ్శబ్దం తాండవించే వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయం. అంత్యక్రియల కోసం వచ్చేవారితో రద్దీగా ఉండే ప్రదేశం. ఆ రోజు, ఆలయ జనరల్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే ఫిత్సనులోక్ ప్రావిన్స్ నుండి 500 కిలోమీటర్లు ప్రయాణించి ఒక వ్యక్తి 65 ఏళ్ల తన సోదరి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకొచ్చాడు.ఇంతలో శవపేటికలో శబ్దాలు వినిపించడంతో.. ఆలయ సిబ్బంది నిశ్చేషు్టలయ్యారు. లోపల కదులుతున్న వృద్ధురాలిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. బ్యాంకాక్ శివార్లలోని నాన్థాబురి ప్రావిన్స్లోని వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. అసలేం జరిగిందంటే.. ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం ఒక వృద్ధురాలు ఊపిరి ఆగిపోయి, చనిపోయినట్లు కనిపించడంతో ఆమె సోదరుడు శవపేటికలో భద్రపరిచి తీసుకొచ్చాడు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతుండగా, శవపేటిక నుండి సన్నని శబ్దం వినిపించింది. నాకు కాస్త ఆశ్చర్యం వేసింది, అందుకే శవపేటిక తెరవమని కోరాను. ఆమె మెల్లగా కళ్లు తెరుస్తూ, శవపేటిక పక్కకు తడుతూ కనిపించింది. ఆమె చాలా సేపటి నుండి తడుతూ ఉందేమో’.. అని ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.మరణ ధ్రువపత్రం లేక.. వాస్తవానికి, ఆ మహిళ గతంలోనే తన అవయవదానానికి సమ్మతించడంతో.. ఆమె సోదరుడు మొదట బ్యాంకాక్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ, అధికారిక మరణ ధ్రువపత్రం లేకపోవడంతో ఆసుపత్రి తిరస్కరించింది. అనంతరం వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో ఉచిత దహన సంస్కారాలు చేస్తారని తెలిసి ఆదివారం శవపేటికను తీసుకురాగా, అక్కడ కూడా అదే ధ్రువపత్రం అడిగారు. ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్.. ఆ పత్రం గురించి వృద్ధురాలి సోదరునికి వివరిస్తున్నప్పుడే.. శవపేటికలో శబ్దం వినిపించింది.వెంటనే ఆలయ సిబ్బంది ఆమెను పరీక్షించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఖర్చులను తామే భరిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రకటించారు. చనిపోయిందనుకున్న మహిళ తిరిగి ప్రాణాలతో రావడం, ఆలయ సిబ్బందికి, ఆమె సోదరుడికి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చింది.
షాంఘై ఎయిర్పోర్ట్లో మహిళకు వేధింపులు : చైనా రియాక్షన్ ఇదే
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన ఘటనలో చైనా స్పందించింది. షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళను వేధించారనే ఆరోపణలను చైనా ఖండించింది. థాంగ్డోక్కు ఎదురైన అనుభవంపై స్పందన కోరగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆ మహిళ ఆరోపించినట్లుగా ఎటువంటి తప్పనిసరి చర్యలు, నిర్బంధం లేదా వేధింపులకు లేవని పేర్కొన్నారు.లండన్ నుంచి జపాన్కు ప్రయాణిస్తున్నకి షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారతీయ మహిళలను అడ్డుకున్న దుమారం రేగిన ఒక రోజు తరువాత డ్రాగన్ కంట్రీ దీనిపై వివరణ ఇచ్చింది. నవంబర్ 21న లండన్ నుండి జపాన్కు ప్రయాణిస్తున్న యూకేకి చెందిన భారతీయ పౌరురాలు పెమా వాంగ్జోమ్ థాంగ్డాక్, పాస్పోర్ట్లో జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని పేర్కొనడంపై ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తనను ఆపారని తెలిపింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకున్న చర్యలు చట్టాలు , నిబంధనల ప్రకారం ఉన్నాయని పేర్కొంటూ ఈ సందర్భంగా వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. కాగా అరుణాచల్ చైనా భూభాగం అంటూ షాంఘైలో విమానంలో దిగిన థాంగ్లో పాస్పోర్ట్ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం, కనుక ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదని వాదించి అవమానించి వేధింపులకు గురిచేశారు. తదుపరి విమానం ఎక్కకుండా, కనీసం ఆహారం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె థాంగ్డోక్ తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారతీయ కాన్సులేట్కు సమాచారం అందించింది. భారతీయ అధికారుల జోక్యం తర్వాత ఆమెను రాత్రి ఆలస్యంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇండియాకు బూడిద మేఘాలు : డీజీసీఏ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: Ethiopia volcano eruption: ఇథియోపియాలో అకస్మాత్తుగా పేలిన బాంబుల అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతిని రేపింది.దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉన్నహేలీ గుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తర్వాత పేలింది. దీంతో దాదాపు 14 కి.మీ (45,000 అడుగులు) ఎత్తులో పెద్ద బూడిద మేఘాన్ని ఉత్పత్తి చేసి ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వ్యాపించింది. ఫలితంగా సమీపంలోని పర్యాటక ఆకర్షణ అయిన అఫ్దేరా గ్రామం బూడిదలో కూరకుపోయింది. అగ్నిపర్వతం పేలిన తర్వాత తనకు పెద్ద శబ్దం వినిపించిందని, దానిని షాక్ వేవ్ అని అభివర్ణించానని అఫర్ ప్రాంత నివాసి అహ్మద్ అబ్దేలా అన్నారు.ఇది ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యెమెన్, ఒమన్, పాకిస్తాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపైకి కదులుతోంది. అసలే కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరం ఢిల్లీని కూడా తాకవచ్చని వాతావరణ (IMD) నిపుణులు అంచనా. బూడిద మేఘాలు ఇండియా మీదుగా చైనా వైపు పయనిస్తాయని, మంగళవారం రాత్రి 7.30 గంటలకు భారతదేశ గగనతలం నుండి నిష్క్రమిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవి గుజరాత్, ఢిల్లీ-ఎన్సిఆర్, రాజస్థాన్, పంజాబ్ మరియు హర్యానాపై తాకవచ్చని, దీంతో అక్కడి కాలుష్య నాణ్యత మరింత దిగజారిపోవచ్చని IMD తెలిపింది.DGCA కీలక ఆదేశాలువిమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింంది. అగ్నిపర్వత బూడిద ప్రభావిత ప్రాంతాలు , విమాన ఎత్తులను ఖచ్చితంగా నివారించాలని అత్యవసర కార్యాచరణ హెచ్చరికను జారీ చేసింది. విమాన ప్రణాళిక, రూటింగ్ , ఇంధన పరిగణనలను తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలని సంస్థలను కోరింది. "ఇంజిన్ పనితీరు క్రమరాహిత్యాలు లేదా క్యాబిన్ పొగ/వాసనతో సహా" ఏదైనా అనుమానిత బూడిద సంఘటనను వెంటనే నివేదించాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!ముందు జాగ్రత్తగా ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ తమ విమానాలను రద్దు చేశాయి. కొన్ని ప్రదేశాలకు ఎయిరిండియా సోమ, మంగళవారం 11 విమానాలను రద్దు చేసింది. అలాగే జెడ్డా, కువైట్ ,అబుదాబి వంటి మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రదేశాలకు షెడ్యూల్ చేసిన విమానాలను అకాసా రద్దు చేసింది.
ఘోరం: బాంబుదాడిలో 9మంది చిన్నారుల మృతి
అఫ్గానిస్థాన్ లో నిన్న అర్థరాత్రి జరిగిన బాంబుదాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఒక మహిళ మృతి చెందారు. ఈ దాడులకు పాకిస్థానే కారణమని అఫ్గాన్ తాలిబన్లు ప్రకటించారు. పాకిస్థాన్ తమ దేశంలోని పౌరుల ఇళ్లే టార్గెట్గా దాడి చేసిందని పేర్కొన్నారు. కాగా ఈ దాడిపై పాక్ ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.పాక్- అఫ్గాన్ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పాకిస్థాన్ సేనలు తమ దేశంలోని కోస్ట్ ప్రావిన్స్ గుర్బుజ్ జిల్లాలోని ఓ పౌరుడి ఇంటిపై దాడి చేశాయని మంగళవారం తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో 9 మంది చిన్నారులతో పాటు ఒక మహిళ మృతి చెందిందని తెలిపారు. అంతేకాకుండా కూనార్ తో పాటు మరో ప్రాంతంలో వైమానిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. కాగా నిన్న పాకిస్థాన్ పెషావర్లో పాక్ పారామిలటరీ కేంద్రం టార్గెట్గా దాడులు జరుగగా అందులో ఆరుగురు మృతిచెందారు. ఆ మరునాడే ఆప్గానిస్థాన్లో దాడులు జరుగడంతో ఈ ఘటన పాకిస్థాన్ చర్యేనని ఆప్గాన్ ఆరోపిస్తు్ంది.అయితే ఈ దాడిపై పాకిస్థాన్ ఇప్పటివరకూ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12మంది పౌరులు మృతి చెందారు. ఆ ఘటనకు టీటీపీ కారణమని ప్రకటించారు. కాగా అఫ్గాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పింస్తుందని పాక్ నిందిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో ప్రత్యక్ష యుద్ధానికి వెనుకాడబోమని ఆ దేశ మంత్రి ఖవాజా ప్రకటించారు. ఈ బాంబుదాడులతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి.
జాతీయం
బిజినెస్ టైకూన్ కోడలి అనుమానాస్పద మరణం
ఢిల్లీ: Pan Masala Baron Daughter In Law Dies ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కమల పాసంద్ పాన్ మసాలా బ్రాండ్తో పాపులర్ అయిన కమల్ కోడలు దీప్తి చౌరాసియా (Deepti Chaurasia) (40) దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని వసంత విహార్లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారని తెలుస్తోంది.Delhi | Kamla Pasand company owner Kamal Kishore's daughter-in-law, Deepti Chaurasia (40), died allegedly by suicide last evening. Her body was found hanging. Police have recovered a diary in which she mentions a dispute with her husband, Harpreet Chaurasia. Deepti married…— ANI (@ANI) November 26, 2025 దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో దీప్తి చనిపోయి కనిపించారు. చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆమె గదిలో సూసైడ్ నోట్ లభించింది. తన మరణానికి ఎవరికీ సంబంధం లేదంటూనే, రిలేషన్లో ప్రేమ, నమ్మకం లేకపోతే, ఇక జీవితానికి అర్థం ఏముంది? అని తన నోట్లో పేర్కొనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు భర్త హర్ప్రీత్ చౌరాసియాతో విభేదాలున్నట్టు పేర్కొన్నా డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై పోలీసులు ఇంకా బహిరంగ ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: H-1B వీసా స్కాం సంచలనం : ఏకంగా 220000 వీసాలా?కాగా దీప్తి, కమల్ కిషోర్ కుమారుడు హర్ప్రీత్ చౌరాసియాను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కమల్ కిషోర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, కమల్ కిషోర్ చౌరాసియా. ఇది కమలా పసంద్, రాజ్శ్రీ బ్రాండ్ పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తుల రంగంలో పనిచేస్తుంది. ఫ్యామిలీ స్పందనకమలా పసంద్ కుటుంబ న్యాయవాది రాజేందర్ సింగ్ దీనిపై వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమననారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. ఆమెకు పూర్తి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు కుటుంబాలు ఈరోజు కలిసి దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది రెండు కుటుంబాలకు తీరని లోటు. సూసైడ్ నోట్లో ఎటువంటి ఆరోపణ లేదు. దీనికి బాధ్యులుగా ఆమె ఎవరినీ ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆత్మహత్యకు కారణమేమిటో మాకు తెలియదు. పోలీసులకు సహకరిస్తున్నామని రాజేందర్ తెలిపారు.
S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను నిలిపివేయాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతున్నందున నిలుపుదల చేయలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశాశారు. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆయన ఆదేశించారు.పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా.. ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయి ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో.. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను వివరణ కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎస్ఐఆర్ విషయంలో కేరళ ప్రభుత్వం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ వేరుగా పిటిషన్లో ఇప్పటికే(నవంబర్ 21వ తేదీన) సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వేసిన మరో పిటిషన్పైనే ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 9-11 తేదీల మధ్యలో కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది.తమిళనాడు నుంచి ఎస్ఐఆర్కు అన్నాడీఎంకే మద్దతుగా అప్లికేషన్ను సమర్పించింది. అధికార డీఎంకే సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. పుదుచ్చేరి నుంచి ప్రతిపక్ష నేత ఆర్ శివ వేరుగా పిటిషన్ వేశారు. అలాగే.. పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కమిటీ పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్పై విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. అదే తేదీన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉందని విషయం ధర్మాసనం దృష్టికి వెళ్లగా.. అవసరమైతే ఆ గడువును(డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ) పొడిగించవచ్చని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.‘‘అవసరమని తేలితే ఎన్నికల సంఘాన్ని తేదీ పొడిగించమని ఆదేశించవచ్చు. ఆ తేదీ(డిసెంబర్ 9) కారణంగా కోర్టుకు అధికారమే లేదని చెప్పలేం. కోర్టు ఎప్పుడైనా తేదీ పొడిగించమని చెప్పగలదు’’ అని అన్నారాయన. ఎస్ఐఆర్ ఉద్దేశ్యంఎస్ఐఆర్ అనేది ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక సవరణ ప్రక్రియ. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇది వివాదాస్పదమై, సుప్రీం కోర్టుకు చేరింది. దీని ఉద్దేశం.. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడంకొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడంమరణించిన లేదా అర్హత కోల్పోయిన వారిని తొలగించడంస్థానిక ఎన్నికలు లేదా ముఖ్యమైన ఎన్నికల ముందు జాబితా ఖచ్చితత్వం పెంచడం ఎస్ఐఆర్ ప్రక్రియలో.. డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ.. ప్రస్తుత ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం.అభ్యంతరాలు/సవరణలు స్వీకరణ.. ప్రజలు తమ పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం వంటి అంశాలను తెలియజేయవచ్చు.ఫీల్డ్ వెరిఫికేషన్.. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారు.ఫైనల్ రోల్స్ ప్రచురణ – సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు
ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్': అమిత్ షా
న్యూఢిల్లీ: ముంబైలో 26/11 దాడుల ఘటనకు 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ, భారత్ అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్ పాలసీ’ని మరోమారు స్పష్టం చేశారు. 2008 నవంబర్ 26 రాత్రి 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా, ముంబై నగరంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత 60 గంటల పాటు వరుస దాడులకు పాల్పడ్డారు. ఈ అమానుష ఘటనలో మొత్తం 166 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నారిమన్ హౌస్లోని యూదు కేంద్రం, కామా హాస్పిటల్, మెట్రో సినిమా, లియోపోల్డ్ కేఫ్లను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. హోంమంత్రి అమిత్ షా తన ‘ఎక్స్’ పోస్ట్లో ‘2008లో ఇదే రోజున, ఉగ్రవాదులు ముంబైపై దాడి చేసి, దారుణమైన, అమానుషమైన చర్యలకు పాల్పడ్డారు’ అని పేర్కొన్నారు. ఈ దాడులను ధైర్యంగా ఎదుర్కొంటూ, తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అమిత్ షా నివాళులు అర్పించారు. वर्ष 2008 में आज ही के दिन आतंकियों ने मुंबई पर कायराना हमला कर वीभत्स और अमानवीय कृत्य किया। मुंबई आतंकी हमलों का डटकर सामना करते हुए अपना बलिदान देने वाले वीर जवानों को नमन करता हूँ और इस कायराना हमले में अपनी जान गँवाने वाले सभी लोगों को श्रद्धांजलि अर्पित करता हूँ।आतंकवाद…— Amit Shah (@AmitShah) November 26, 2025ఉగ్రవాదంపై భారతదేశ స్పష్టమైన వైఖరిని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం ఒక దేశానికే కాదు, మొత్తం మానవాళికే శాపం అని అమిత్షా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానం స్పష్టంగా ఉందని, దీనిని ప్రపంచమంతా అభినందిస్తోందని, భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాలకు విస్తృత మద్దతు అందుతోందని హోంమంత్రి పేర్కొన్నారు. కాగా ఈ దాడుల తర్వాత, ఒకరు తప్ప మిగిలిన ఉగ్రవాదులందరూ భద్రతా దళాల ఎన్కౌంటర్లో హతమయ్యారు. సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్కు 2010లో మరణశిక్ష విధించారు. రెండేళ్ల తర్వాత పూణే జైలులో కసబ్కు ఉరితీశారు.ఇది కూడా చదవండి: రాజ్యాంగం జాతీయవాద మార్గదర్శి: రాష్ట్రపతి ముర్ము
లిపిస్టిక్తో గోడపై మెసేజ్ : జంట అనుమానాస్పద మరణం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని దంపతుల ఆత్మహత్య (?) కలకలం రేపింది. పదేళ్లు కలతలు లేకుండా కాపురం చేసిన భార్యాభర్తలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. తొలుత సంఘటనా కల్పించిన దృశ్యం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.సోమవారం ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని అటల్ ఆవాస్ కాలనీలో ఈ హృదయ విదారక సంఘటన సంచలనం సృష్టించింది. తొలుత భార్యభర్తల వివాదం అనుకున్నారు అంతా. కానీ లిప్స్టిక్తో గోడలపై రాసిన మెసేజ్ పోలీసులను నివ్వెర పోయేలా చేసింది. దీంతి ఇది హత్య లేక ఆత్మహత్యా అనే అనుమానాలను దారి తీసింది. నవంబర్ 24న, రాజ్ లేదా నేహా మధ్యాహ్నం వరకు ఇంటి నుండి బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన నేహా తల్లి రీనా అక్కడి వెళ్లి పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కంటతడి పెట్టించే దృశ్యాలు మృతులు శివాని తండే అలియాస్ నేహా, రాజ్ది ప్రేమ వివాహం. వీరు ప్రైవేట్ కంపెనీలో క్లీనర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు చిన్న పిల్లలున్నారు. ముప్పై ఏళ్ల నేహా, మంచం మీద చనిపోయి కనిపించగా, ఆమె భర్త రాజ్ సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. గోడలపై లిపిస్టిక్తో రాసిన రాతలు.. మృతుల ఇంటి లోపల, ఈ భయంకర దృశ్యాలు పలువురి కంట తడిపెట్టించాయి. ఇంతకీ ఏముందీ ఆ మెసేజ్లో గోడలపై రాసిన ఆ మెసేజ్లో రాజేష్ విశ్వాస్ అనే వ్యక్తి పేరు ,మొబైల్ నంబర్ ఉన్నాయి. అతని కారణంగా చనిపోతున్నామని, తమ సంసారంలో కలతలు రేపాడని ఆరోపించరాఉ. పిల్లలూ .. ఐ లవ్ యూ అంటూ మరో భావోద్వేగ నోట్ రాశారు. ఆ సందేశంలో భార్య ఫోన్ కాల్స్ కారణంగా తరచుగా గొడవలు జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అనుమానాలతో ఇద్దరి మధ్యా మధ్య తరచూ గొడవలు జరిగేవని పొరుగువారు వెల్లడించారు. ఫోరెన్సిక్ నిపుణులు నేహా మెడపై గీతలు పడిన గుర్తులను కనుగొన్నారు. దీంతో గొంతు కోసి భార్యని చంపిన రాజ్, ఆ తరువాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు బావిస్తున్నారు. గది నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ , గోడల మీద రాతల ఆధారం హత్య-ఆత్మహత్య అనే వాదనకు బలం చేకూరుస్తోంది.
ఎన్ఆర్ఐ
ఫీనిక్స్లో సాంస్కృతిక వేడుకలు.. శంకర నేత్రాలయ యూఎస్ఏకు భారీ విరాళం
మెసా(అరిజోనా): ఫీనిక్స్లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.దాతలకు సన్మానంగ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.హాస్యంతో హృదయాల హరివిల్లు“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.శంకర నేత్రాలయ సేవా లక్ష్యం1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.నిర్వాహకుల కృషివంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు.
శ్రీ శ్రీ రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి.
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
క్రైమ్
లిపిస్టిక్తో గోడపై మెసేజ్ : జంట అనుమానాస్పద మరణం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని దంపతుల ఆత్మహత్య (?) కలకలం రేపింది. పదేళ్లు కలతలు లేకుండా కాపురం చేసిన భార్యాభర్తలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. తొలుత సంఘటనా కల్పించిన దృశ్యం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.సోమవారం ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని అటల్ ఆవాస్ కాలనీలో ఈ హృదయ విదారక సంఘటన సంచలనం సృష్టించింది. తొలుత భార్యభర్తల వివాదం అనుకున్నారు అంతా. కానీ లిప్స్టిక్తో గోడలపై రాసిన మెసేజ్ పోలీసులను నివ్వెర పోయేలా చేసింది. దీంతి ఇది హత్య లేక ఆత్మహత్యా అనే అనుమానాలను దారి తీసింది. నవంబర్ 24న, రాజ్ లేదా నేహా మధ్యాహ్నం వరకు ఇంటి నుండి బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన నేహా తల్లి రీనా అక్కడి వెళ్లి పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కంటతడి పెట్టించే దృశ్యాలు మృతులు శివాని తండే అలియాస్ నేహా, రాజ్ది ప్రేమ వివాహం. వీరు ప్రైవేట్ కంపెనీలో క్లీనర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు చిన్న పిల్లలున్నారు. ముప్పై ఏళ్ల నేహా, మంచం మీద చనిపోయి కనిపించగా, ఆమె భర్త రాజ్ సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. గోడలపై లిపిస్టిక్తో రాసిన రాతలు.. మృతుల ఇంటి లోపల, ఈ భయంకర దృశ్యాలు పలువురి కంట తడిపెట్టించాయి. ఇంతకీ ఏముందీ ఆ మెసేజ్లో గోడలపై రాసిన ఆ మెసేజ్లో రాజేష్ విశ్వాస్ అనే వ్యక్తి పేరు ,మొబైల్ నంబర్ ఉన్నాయి. అతని కారణంగా చనిపోతున్నామని, తమ సంసారంలో కలతలు రేపాడని ఆరోపించరాఉ. పిల్లలూ .. ఐ లవ్ యూ అంటూ మరో భావోద్వేగ నోట్ రాశారు. ఆ సందేశంలో భార్య ఫోన్ కాల్స్ కారణంగా తరచుగా గొడవలు జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అనుమానాలతో ఇద్దరి మధ్యా మధ్య తరచూ గొడవలు జరిగేవని పొరుగువారు వెల్లడించారు. ఫోరెన్సిక్ నిపుణులు నేహా మెడపై గీతలు పడిన గుర్తులను కనుగొన్నారు. దీంతో గొంతు కోసి భార్యని చంపిన రాజ్, ఆ తరువాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు బావిస్తున్నారు. గది నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ , గోడల మీద రాతల ఆధారం హత్య-ఆత్మహత్య అనే వాదనకు బలం చేకూరుస్తోంది.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్ రస్తోగి
బ్లూ డ్రమ్.. ఈ పేరు వింటేనే భర్తల వెన్నులో వణకు పుడుతోంది. అందుకు కారణం.. మీరట్లో జరిగిన ఓ ఘటన. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను ప్రియుడి సాయంతో గంజాయి మత్తులో కిరాకతంగా హతమార్చింది ఓ భార్య. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే.. భర్త సౌరభ్ రాజ్పుత్ (మర్చంట్ నేవీ ఆఫీసర్)ను అత్యంత కిరాతకంగా కడతేర్చిన ముస్కాన్ రస్తోగి మళ్లీ తల్లైంది. ఆదివారం సాయంత్రం మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సయమంలో ముస్కాన్ ప్రియుడు, ఈ కేసు సహ నిందితుడు సాహిల్ శుక్లా కూడా పక్కనే ఉన్నాడు. ఒకవేళ ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్ఏ పరీక్షల్లో తేలితే.. తమ మనవడిగా స్వీకరిస్తామని సౌరబ్ కుటుంబం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.మీరట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బ్లూ డ్రమ్ హత్యకేసు మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను క్రూరంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టైన ముస్కాన్ రస్తోగి, ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఆమె.. ఆదివారం సాయంత్రం జైలు అధికారుల పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ప్రియుడు సాహిల్ శుక్లా మోజులో పడి భర్త సౌరభ్ గుప్తను హత్య చేయించిన కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ముస్కాన్ రస్తోగి అరెస్టు సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. గర్భధారణ చివరి దశకు చేరుకోవడంతో, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు.ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రసవం అనంతరం, భద్రతా కారణాల వల్ల వారిని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ కేసు 2024లో వెలుగులోకి వచ్చింది.సౌరభ్ రాజ్పుత్ హత్య అనంతరం, అతని శవాన్ని బ్లూ డ్రమ్లో నింపి మాయం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు విచారణలో ముస్కాన్ రస్తోగి, ఆమె స్నేహితుడు సహా పలువురిని అరెస్టు చేశారు. శిశువు భవిష్యత్తుపై చర్చ ముస్కాన్ జైలులో శిశువుకు జన్మనివ్వడంతో, బిడ్డను ఎక్కడ ఉంచాలి? ఎవరు చూసుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చట్టం ప్రకారం, మహిళా ఖైదీలు తమ పిల్లలను ఆరు సంవత్సరాల వయస్సు వరకు జైలులోనే ఉంచుకునే అవకాశం ఉంది. ముస్కాన్ రస్తోగిపై హత్య, శవాన్ని మాయం చేయడం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రసవం అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు.
పోలీస్ శాఖకే మచ్చ తెచ్చిన ఎస్సై భాను ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు, ఓ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారింది.వివరాల్లోకి వెళ్తే, ఎస్సై భాను ప్రకాశ్ బెట్టింగ్లకు బానిసై భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కాడు. ఓ రికవరీ కేసులో(ఈ ఏడాది జనవరిలో జరిగింది) భాగంగా స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.అంతేకాకుండా, భాను ప్రకాశ్ వద్ద ఉండాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయంపై వారు నిలదీయగా, ఎస్సై నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో లోతుగా విచారించగా, బంగారంతో పాటే తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎస్సై భాను ప్రకాశ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
అత్తింటి వేధింపులకు అల్లుడు బలి
వెల్దుర్తి(తూప్రాన్): భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ (32)కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన పూజతో సుమారు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. వివాహం అయినప్పటినుంచి వేరుకాపురం పెట్టాలని భార్య, అత్తమామలు ఒత్తిడి తెచ్చారు.ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు కావడంతో తరచూ కూతురును తీసుకొని పూజ తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా అందరి సమక్షంలోనే తన కుమారుడిని దుర్భాషలాడి, పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని ఆరోపించారు. పంచాయితీ అనంతరం పూజ కూతురుతో వెల్దుర్తిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది.ఈ క్రమంలో హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తారింటిముందు పురుగులమందు తాగా డు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. తన కుమారుడి మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్లతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ట్రెయినీ ఎస్ఐ తెలిపారు.
వీడియోలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందినట్టు వార్తలు
Sudhakar Reddy: సుద్దపూస అని నిరూపించుకోవాలంటే నీకు దమ్ముంటే ఈ పని చెయ్
ఏం సమాధానం చెప్తావ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగిన జడ శ్రవణ్ కుమార్
మంత్రి సవిత ఇలాఖాలో విద్యార్థులకు పురుగుల భోజనం..
కోకాపేట, రాయదుర్గం ప్రాంతాల్లో భూములకు భారీ డిమాండ్
Hong Kong: భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
బయటపడ H1B వీసా కుంభకోణం
రామలింగారెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడిన వైఎస్.జగన్
వాడుకున్న నీచుడు... లోకేష్, పవన్ పై సుగాలి ప్రీతీ తల్లి సంచలన వ్యాఖ్యలు
Varudu Kalyani: నాలుగు సార్లు సీఎంగా చేశావ్ ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా చంద్రబాబు..

