Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

AP High Court shock with Chandrababu govt conspiracies on YS Jagan1
బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ!

ఇదో అసాధారణ కేసు.. సాధారణంగా ఎఫ్‌ఐఆర్‌ దశలో మేం జోక్యం చేసుకోం.. కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసు.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తదితరులు కేవలం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. సెక్షన్‌ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే.. జగన్‌ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదు.– సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. సింగ­య్య­ను ఉద్దేశపూర్వకంగానే కారు కింద పడేసి తొక్కించా­రంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాద­నను హైకోర్టు ఎండగట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తదిత­రులపై బీఎన్‌ఎస్‌లోని కఠిన సెక్షన్‌ 105 కింద కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. జీవిత ఖైదు పడే ఈ సెక్షన్‌ కింద జగన్‌ తదితరులపై ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఆక్షేపించింది. సెక్షన్‌ 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సాధారణంగా ఏ కేసులో కూడా ఎఫ్‌ఐఆర్‌ దశలో తాము జోక్యం చేసుకోమని, అయితే ఇది జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసని, అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్‌ పీఏ నాగేశ్వరరెడ్డిలపై పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌– ఓ వ్యక్తి మర­ణా­నికి కారణమైనప్పటికీ హత్య కానిది) కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జగన్‌ తదితరులు కేవలం కారులో ప్రయా­ణిç­Ü్తున్న ప్రయాణికులు మాత్రమేనని స్పష్టం చేసింది. సెక్షన్‌ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపా­లన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపో­తారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి అని, అప్పుడు మాత్రమే ఆ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీ­లిస్తే, జగన్‌ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపో­తా­రని తెలిసి ఉండటం గానీ జరగలేదంది. సాధారణంగా తాము ఏ కేసులో కూడా ఎఫ్‌ఐఆర్‌ దశలో జోక్యం చేసుకోబో­మని, అయితే ఎఫ్‌ఐఆర్‌లోని నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవన్న నిర్ణయానికి వస్తే మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండలేమంది. జోక్యం చేసుకోకుండా ఉండే విష­యంలో ఎలాంటి నిషేధం లేదంది. అలా జోక్యం చేసుకోవాల్సి­నటు­వంటి అరుదైన కేసుల్లో ఈ కేసు కూడా ఒకటని, అందువల్ల ఈ కేసులో జోక్యం చేసు­కుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తు­న్నట్లు తెలిపింది. జగన్‌ తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్య­లన్నింటినీ నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాస­రెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది.దుర్గారావు చెప్పింది ఇదీ...‘ఈ కేసులో నిమ్మకాయల దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ కోర్టు పరిశీలించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన రోజు ఉదయం 10.30–11 గంటలకు మాజీ సీఎం కాన్వాయి తాడేపల్లి వైపు నుంచి జాతీయ రహదారి వైపు వచ్చింది. కారు డ్రైవర్‌కు సమీపంలో మాజీ సీఎం నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ ఆయన వైపు పరిగెత్తుకెళ్లారు. దీంతో మాజీ సీఎం కారు నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సమయంలోనే కారు ఎడమ వైపు సర్వీసు రోడ్డులోకి తిరిగింది. ఓ వ్యక్తి డ్రైవరు వైపు ఉన్న కారు చక్రం కింద పడ్డారు. వెంటనే కాన్వాయిలో ఉన్న నలుగురు ఆ వ్యక్తిని పక్కకు తీసి చెట్ల కిందకు తీసు­కెళ్లారు. ఆ తరువాత కాన్వాయి సర్వీసు రోడ్డులోకి వచ్చింది. అనంతరం గాయపడిన వ్యక్తిని చూసేందుకు వెళ్లా. కొద్దిసేపటికి అంబులెన్స్‌లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ తరువాత నాకు తెలిసింది ఏమిటంటే గాయపడిన వ్యక్తి మరణించాడు..’ అని దుర్గారావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు. పోలీ­సులు దుర్గారావు ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధా­రంగా చేసుకుని మొదట పెట్టిన బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారంటూ)ను సెక్షన్‌ 105 కింద మార్చారని పేర్కొన్నారు.అలా చనిపోతారని జగన్‌ తదితరులకు తెలుసని పోలీసులు చెబుతున్నారు...దర్యాప్తులో భాగంగా పోలీసులు మాజీ సీఎం వెంట ఉన్న భద్రతా సిబ్బందిని విచారించారని న్యాయ­మూర్తి తెలిపారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారని, అనంతరం జూన్‌ 25న పోలీసులు మేజి­స్ట్రేట్‌ ముందు ఓ మెమో దాఖలు చేశారన్నారు. టర్నింగ్‌ తీసుకునే సమయంలో కారును వేగంగా నడపడం వల్ల ప్రజలు కారు కింద పడి మరణి­స్తారని డ్రైవర్‌తోపాటు ఆ కారులో ఉన్న జగన్‌ తదితరులకు స్పష్టంగా తెలుసునని పోలీసులు ఆ మెమోలో పేర్కొన్నారన్నారు. జగన్‌ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్‌కు చెప్పారని, అందువల్లే భారీగా జనాలు ఉన్న చోట కారును వేగంగా నడిపారని పోలీసులు ఆ మెమోలో చెప్పారని తెలి­పారు. అయితే సెక్షన్‌ 105 వర్తించాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల చని­పోతాడని తెలిసి ఉండటం తప్పనిసరని, ఈ కేసులో జగన్‌ తదితరులకు చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదన్నారు. అందువల్ల వారిని సెక్షన్‌ 105 పరిధిలోకి తీసుకురాలేరని తేల్చి చెప్పారు.

Pakistan social media accounts AGain ban In India2
పాకిస్తాన్‌ సెలబ్రిటీలకు బిగ్‌ షాకిచ్చిన భారత్‌

ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన సెలబ్రిటీలకు భారత ప్రభుత్వం బిగ్‌ షాకిచ్చింది. పాక్‌ సెలబ్రిటీలు, క్రికెటర్లు సోషల్‌ మీడియా ఖాతాలపై కేంద్రం మళ్లీ నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు చెందిన పలు ఛానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, బుధవారం వారి అకౌంట్లు ప్రత్యక్షం కావడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, అప్రమత్తమైన కేంద్రం.. వారి ఖాతాలపై మళ్లీ నిషేధం విధించినట్లు సమాచారం.ఇక, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు, పాకిస్తానీ క్రికెటర్ల ట్విట్టర్‌ అకౌంట్స్‌ అన్నింటినీ భారత్‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్‌కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్‌ను కూడా భారత్ బ్యాన్ చేసింది. అయితే బుధవారం నాడు ఈ ఛానెల్స్ అన్నీ భారత్‌లో ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చాయి.An Indian soldier takes a bullet on the border.A Pakistani influencer takes creator payouts from Indian views.The government banned their content… then quietly unbanned it.This isn't soft diplomacy.This is soft headed.#BanPakContent pic.twitter.com/HlOZNvE2AX— SambhavāmiYugeYuge (Ministry of Aesthetics) (@Windsofchange72) July 2, 2025హనియా అమీర్, మహీరా ఖాన్, క్రికెటర్‌ షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, సాబా కమర్, అహద్ రజా మిర్ వంటి పాక్ సెలెబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ ఖాతాలు భారత్‌లో అన్‌బ్లాక్ అయ్యాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్‌లో దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ చూసిన భారత నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భారత్‌లో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై బ్యాన్ తొలగించారా? అని పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నెటిజన్ల విమర్శల నేపథ్యంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి నిషేధం విధించినట్టు తెలుస్తోంది.

Mali 3 Indians India asks for Safe and Expeditious Release3
Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ

న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే నేపధ్యంలో మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా అపహరించింది. దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తూ, మాలి ప్రభుత్వం ఆ ముగ్గురు భారతీయుల సురక్షితమైన విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.మాలిలోని కేస్‌లోగల డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ ముగ్గురు భారతీయులు పనిచేస్తున్నారు. వీరి కిడ్నాప్‌ విషయం తెలిసిన వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. జూలై ఒకటిన సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ప్రాంగణంలో దాడి చేసి, ముగ్గురు భారతీయులను బందీలుగా తమ వెంట తీసుకువెళ్లిందని ఎంఈఏ తెలిపింది.అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్‌ఐఎం)మాలి అంతటా జరిగిన దాడులకు బాధ్యత వహించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆ ముగ్గురు భారతీయుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం ఖండిస్తోందని, అపహరణకు గురైన భారత పౌరులను సురక్షితంగా విడుదల చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఎంఈఏ కోరింది. మాలిలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని,అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని ఎంఈఏ సూచించింది.ఇది కూడా చదవండి: విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే..

AP police Involved In IPS Siddharth Kaushal VRS4
ఐపీఎస్‌ సిద్ధార్థ్‌ కౌశల్‌ వీఆర్‌ఎస్‌.. ఏపీ పోలీస్‌ బిగ్‌ బాస్‌ ఎంట్రీ!

సాక్షి, అమరావతి: వేధింపులు, అవమానాలతో ఐపీఎస్‌ సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా జీపీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్‌) సిద్ధార్థ్‌ కౌశల్‌పై ప్రభుత్వ పెద్దలు తమ ప్రతాపం చూపించారు. ‘ఐపీఎస్‌కు సిద్ధార్థ్‌ కౌశల్‌ గుడ్‌ బై’ అనే శీర్షికతో ‘సాక్షి’ పత్రిక బుధవారం ప్రచు­రించిన కథనం పోలీసు శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది.అసలు రాష్ట్ర పోలీసు శాఖలో ఏం జరు­గుతోంది.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తోందని పోలీసు వర్గాలు తీవ్రస్థాయిలో చర్చించుకున్నాయి. రానున్న రోజుల్లో పోలీసు శాఖలో పరిస్థితులు మరింతగా దిగజారుతాయని ఆవేదన వ్యక్తంచేశాయి. తమ వేధింపుల వ్యవహారం మరోసారి బట్టబయలు కావడంతో హడలిపోయిన ప్రభుత్వ పెద్దలు వెంటనే పోలీస్‌ బిగ్‌ బాస్‌ను రంగంలోకి దించారు.కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎస్‌ సర్వీసు నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాలని సిద్ధార్థ్‌ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. తాము చెప్పినట్టు ప్రకటన జారీ చేయకపోతే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం ఆయన చేసిన దరఖాస్తును ఆమోదించబోమని కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. పోలీస్‌ బిగ్‌ బాస్‌ ఒత్తిడికి ఆయన తలొగ్గారు. అనంతరమే సిద్ధార్థ్‌ కౌశల్‌ పేరుతో ఓ పత్రికా ప్రకటనను పోలీసు వర్గాలు విడుదల చేశాయి. సిద్ధార్థ్‌ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆయనతో పత్రికా ప్రకటన జారీ చేయించిందని పోలీసు వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వీఆర్‌ఎస్‌: సిద్ధార్థ్‌ కౌశల్‌ సుదీర్ఘంగా ఆలోచించి, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐపీఎస్‌ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని సిద్ధార్థ్‌ కౌశల్‌ బుధ­వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న స్పష్టమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఐపీఎస్‌ అధికారిగా పని చేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన అనుభవమన్నారు. తనకు సహ­కరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Shubman Gill Creates History: Becomes First Asian Player To Complete Stunning Feat5
చ‌రిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్‌.. తొలి భారత ప్లేయర్‌గా

భారత టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన టీమిండియాను జైశ్వాల్‌తో కలిసి గిల్ ఆదుకున్నాడు.ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నాక తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను భారీ స్కోర్ దిశగా శుబ్‌మన్ నడిపిస్తున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. గిల్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ.కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు. ఇ​క ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన శుబ్‌మన్ గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.గిల్‌ సాధించిన రికార్డులు ఇవే..👉కెప్టెన్‌గా వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా గిల్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు విజయ్ హాజారే, సునీల్ గవాస్కర్ టెస్టు కెప్టెన్లుగా మొదటి రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లి వరుసగా మూడు మ్యాచ్‌లలో శతక్కొట్టాడు.👉ఇంగ్లండ్ గ‌డ్డ‌పై రెండు టెస్టు సెంచ‌రీలు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆసియా కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ నిలిచాడు. గిల్ కేవ‌లం 25 సంవత్సరాల 297 రోజుల వ‌య‌స్సులో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇంగ్లండ్‌లో అతి త‌క్కువ వ‌య‌స్సులో రెండు టెస్టు సెంచ‌రీలు ప‌ర్యాట‌క బ్యాట‌ర్‌గా ద‌క్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గ‌జం గ్రేమ్ స్మిత్ కొన‌సాగుతున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఈ ఘనతను 22 సంవత్సరాల 180 రోజుల వయస్సులో సాధించాడు. స్మిత్ త‌ర్వాత ఈ ఫీట్ సాధించింది శుబ్‌మ‌నే కావడం గ‌మ‌నార్హం.👉అదేవిధంగా ఇంగ్లండ్‌లో రెండుసార్లు టెస్టు మ్యాచ్‌ మొదటి రోజే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్‌ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివర​కు ఏ భారత ఆటగాడిగా ఈ ఫీట్‌ సాధించలేకపోయారు. ఓవరాల్‌గా 13వ ప్లేయర్‌గా గిల్‌ రికార్డులకెక్కాడు.చదవండి: వైభ‌వ్ సూర్య‌వంశీ వీర‌విహారం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భార‌త్‌

Happy Mother Son Photo then Tragedy 4 of Rajasthan Family6
ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం

బార్మర్: ఇద్దరు పిల్లలతో నిండుగా కళకళలాడుతున్న ఆ పచ్చని సంసారాన్ని కుటుంబ కలహాలు చిదిమేశాయి. క్షణికావేశంలో కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం స్థానికులకు తీరని ఆవేదనను మిగిల్చింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.బార్మర్‌కు చెందిన కవిత కవిత తన చిన్న కుమారుడు రామ్‌దేవ్‌కు బాలికల దుస్తులు ధరించి, కళ్లకు కాజల్ పెట్టి, బంగారు ఆభరణాలు వేసి, చూడముచ్చటగా తయారుచేసింది. ఆ తరువాత వారి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇంటిలోని భర్త, భార్య ఇద్దరు కుమారులు ఇంటికి సమీపంలో ఉన్న నీటి ట్యాంక్‌లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శివలాల్‌ మేఘ్వాల్‌ (35), అతని భార్య కవిత (32), కుమారులు బజరంగ్ (9) రామ్‌దేవ్ (8)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శివలాల్‌ మేఘ్వాల్‌ కుటుంబం సామూహిక ఆత్మహత్య వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శివలాల్‌ మేఘ్వాల్‌ కుటుంబ సభ్యుల మృతదేహాలను వారి బంధువుల సమక్షంలో వాటర్‌ ట్యాంక్ నుండి వెలికితీశారు.శివలాల్‌ మేఘ్వాల్‌కు అతని సోదరుడు ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం రాకపోవడంతో, అతను పొరుగింటివారిని శివలాల్‌ మేఘ్వాల్‌ ఇంటికి వెళ్లి చూసిరమ్మనడంతో ఈ ఘటన వెలుగు చూసిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్‌పీ)మనారామ్ గార్గ్ మీడియాకు తెలిపారు. శివలాల్‌ మేఘ్వాల్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో తమ నిర్ణయానికి ముగ్గురు వ్యక్తులు కారకులని, వారిలో తన సోదరుడు ఒకరని రాసివుంది. కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం సంవత్సరాల తరబడి నడుస్తున్నదని లేఖలో వెల్లడయ్యింది. తమ నలుగురి అంత్యక్రియలు తమ ఇంటి ముందు నిర్వహించాలని ఆ లేఖలో శివలాల్‌ మేఘ్వాల్‌ అభ్యర్థించారు.మృతురాలు కవిత మామ తెలిపిన వివరాల ప్రకారం, శివలాల్‌ మేఘ్వాల్‌.. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన నిధులను ఉపయోగించి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అయితే అందుకు అతని తల్లి, సోదరుని నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. ఈ నేపధ్యంలోనే శివలాల్‌ మేఘ్వాల్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని కవిత మామ ఆరోపించారు. ఘటన జరిగిన రోజున ఇతర కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేదని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ

Amaran Director Rajkumar Periasamy Tells Story Line to Prabhas7
ప్రభాస్‌కు కథ చెప్పిన 'అమరన్‌' డైరెక్టర్‌!

హీరో ప్రభాస్ (Prabhas), ‘అమరన్‌’ ఫేమ్‌ రాజ్‌కుమార్‌ పెరియసామి కాంబినేషన్‌లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్‌ను కలిసి రాజ్‌కుమార్‌ ఓ కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్‌ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్‌కుమార్‌ కూడా ధనుష్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్‌మెంట్స్‌ పూర్తి చేశాకే ఈ హీరో–దర్శకుడి కాంబినేషన్‌ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభాస్‌ చేతిలో ది రాజా సాబ్‌, ఫౌజీ, సలార్‌ 2, స్పిరిట్‌ చిత్రాలున్నాయి. ఇందులో ది రాజాసాబ్‌ డిసెంబర్‌ 5న విడుదల కానుంది.చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్‌’ రాజు

Janasena And Bjp Not Participate In Tdp Door To Door Campaign8
మీ అడుగులకు మడుగులొత్తలేం.. సైడైపోతున్న జనసేన, బీజేపీ

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఎన్నికలకు ముందు అందరూ కలిసికట్టుగా ఉన్నామన్నట్లుగా కలరింగ్ ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. పవర్ చేతిలోకి వచ్చాక ఎవరి చేతికి ఎక్కువ పవర్ దక్కిందన్న విషయంలో పార్టనర్‌ల మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతున్నప్పటికీ అంతా గుంభనగా ఉన్నట్లుగా మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు.అన్నిటికి మించి పొత్తులకు ముందు ఓడ మల్లయ్య అని పిలిచే చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక బోడి మల్లయ్య అంటారన్న విషయం జనసేన, బీజేపీలకు మరో మరో అర్థమయింది. దీంతో ఇప్పుడు వాళ్లు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఓడలో నుంచి బయటకు రాలేక.. అందులోనే ప్రయాణం చేయలేక సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కాంట్రాక్టర్లు ఇతరత్రా వ్యవహారాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన, బీజేపీ నాయకులను కేవలం పెయిడ్ కూలీలుగా మాత్రమే భావిస్తూ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.నీకు ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఇచ్చేసాంగా ఎవరి కోసం మా జెండా మోస్తారు అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు తీరు ఉంది. ఇదే తరుణంలో ప్రభుత్వంలో చంద్రబాబుకు బదులుగా లోకేష్ పెత్తనం పెరిగిపోవడం బీజేపీ, జనసేన నాయకులను తొక్కేస్తూ కేవలం టీడీపీ వారికి ప్రాధాన్యం ఇస్తూ వెళ్లడం కూడా భాగస్వామి పక్షాలైన ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.లోపల సరుకు పుచ్చిపోయినా.. బయట మంచి కలరింగ్.. కవరింగ్ ఇచ్చేసి జనానికి అంటగట్టే వ్యాపారి మాదిరిగా చంద్రబాబు సైతం ఇటు తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెలువెత్తుతున్న దాన్ని మీడియా ఇతర పబ్లిసిటీ సంస్థలు మాటున దాచిపెట్టి అంతా బాగుంది అన్నట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు అంటూ ఇంటింటికి తన ప్రభుత్వ విజయాన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో భాగంగా భాగస్వామి పక్షాలైన జనసేన, బీజేపీతో బాటు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన పథకాలు సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తారు. అయితే చంద్రబాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్నట్లుగా సర్వేల్లో వెళ్లడవడం.. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, తెలుగుదేశం నాయకుల అలవిమాలిన అవినీతి.. దందాలు.. గూండాగిరి వంటి అంశాల ద్వారా ప్రజల్లో ఘోరమైన అప్రదిష్టను ఏడాదిలోనే మూటగట్టుకుంది.దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలు ఈ క్షణమే ఓడిపోతారని.. ఇంకా ఎంతోమంది ఓటమి అంచులో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బాటు గెలిచిన తరువాత టీడీపీ నాయకుల్లో అహంకారం పెరగడం.. జనసేన, బీజేపీ నేతలను చిన్నచూపు చూస్తుండడం వంటి అంశాలు కూడా గ్రామ స్థాయిలో కూడా చర్చలకు కారణమవుతున్నట్లు.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు ప్రచార కార్యక్రమానికి జనసేన, బీజేపీ నాయకులు దూరంగా ఉంటున్నారు."మీ అవకాశవాదానికి ఒక దండం.. మీ అడుగులకు మేం మడుగులొత్తలేం" అంటూ చిన్నగా సైడ్ అయిపోతున్నారు. మంచి ప్రభుత్వం పేరిట చేపట్టని ఈ ప్రచారానికి కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే హాజరవుతున్నారు. అక్కడక్కడ అరా ఒకటి తప్ప జనసేన-బీజేపీ నాయకుల హాజరు లేనేలేదు. కూటమి గెలవడానికి మా అవసరం ఉంది.. ఆ పొత్తు లేకపోతే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యేనా అంటూ ఇటు జనసేన-బీజేపీ నాయకులు లోలోన భావిస్తున్నారు. అలాంటపుడు తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కానీ అధికారం దక్కాక బాబు.. టీడీపీ నేతల తీరు మారిందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడా వీళ్లు ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఊసురో మంటూ కేవలం టీడీపీ నేతలు ఈ ప్రచారాన్ని చేపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న

TVS electric scooter with the new iQube variant9
టీవీఎస్‌ ఐక్యూబ్‌ కొత్త వేరియంట్‌.. ధర ఎంతంటే..

టీవీఎస్‌ మోటార్‌ తన ఫ్లాగ్‌షిప్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌ కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఎక్స్‌–షోరూం ధర రూ.1.03 లక్షలుగా ప్రకటించింది. ఇందులో అమర్చిన 3.1 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ వల్ల సింగిల్‌ ఛార్జింగ్‌తో 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ ఫీచర్, బ్యాక్‌రెస్ట్‌ ఈ స్కూటర్‌ ప్రత్యేకతలు.‘ఇప్పటికే ఆరు లక్షలకు పైగా ఐక్యూబ్‌ యూనిట్లు విక్రయించాం. డ్యూయల్‌ టోన్‌ కలర్స్‌తో రోజు వారీ అనువైన ప్రయాణాలకు అనుగుణంగా తాజా ఐక్యూబ్‌ను తీర్చిదిద్దాం. కొత్త వేరియంట్‌ విడుదల ద్వారా విద్యుత్‌ వాహన విభాగాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాం’ అని టీవీఎస్‌ కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’టఫే, ఏజీసీవో వివాదం సెటిల్మెంట్‌మాసే ఫెర్గూసన్‌ బ్రాండ్‌ వివాదాన్ని టఫే, ఏజీసీవో కార్పొరేషన్‌ సంస్థలు కోర్టు వెలుపల పరిష్కరించుకున్నాయి. సెటిల్మెంట్‌ ప్రకారం ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ (టఫే) సంస్థ రూ.2,225 కోట్లు చెల్లించి మాసే ఫెర్గూసన్‌లో ఏజీసీవో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, నేపాల్, భూటాన్‌లో ఈ బ్రాండు పూర్తి యాజమాన్య హక్కు లు టఫేకు దక్కుతాయి. ఏజీసీవో కార్పొరేషన్‌ గత సెపె్టంబర్‌లో మాసే ఫెర్గూసన్‌ బ్రాండ్‌ లైసెన్స్‌ సహా టఫేతో ఉన్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది.

Sensational Allegations On Ahmedabad Plane Crash10
విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం.. జీపీఎస్‌ స్పూఫింగ్‌?

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీని వెనుక కుట్రకోణం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌మ మొహోల్‌ సైతం చెప్పారు. గ్లోబల్‌ పోజీషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) సంకేతాలను తారుమారు చేసి ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయేలా ఎవరైనా కుట్రలు సాగించారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే 2023 నవంబర్‌ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశ సరిహద్దుల్లో 465 జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు చోటుచేసుకున్నాయి. అమృత్‌సర్, జమ్మూ ప్రాంతాల్లో అధికంగా జరిగాయి. గత నెలలో ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన ఎయిర్‌ విమానం కొద్దిసేపటికే తిరిగివచ్చింది. జీపీఎస్‌ సంకేతాల్లో ఏదో తారుమారు జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. పైలట్‌కు తప్పుడు సంకేతాలు భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన సి–130జే విమానం ఏప్రిల్‌లో మయన్మార్‌ గగనతలంపై ప్రయాణిస్తుండగా జీపీఎస్‌ స్పూఫింగ్‌ జరిగింది. దాంతో అప్రమత్తమై సురక్షితంగా ల్యాండ్‌చేశారు. జీపీఎస్‌ సిగ్నళ్లలోకి అపరిచితులు, విద్రోహులు చొరబడుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. స్పూఫింగ్‌ లేదా జామింగ్‌ అనేది పెనువిపత్తుగా మారుతోంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్‌పోర్ట్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2023–2024 మధ్య జీపీఎస్‌లో ఇంటర్‌ఫియరెన్స్‌ రేటు 175 శాతం, జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు 500 శాతం పెరిగాయి. స్ఫూపింగ్‌ లేదా జామింగ్‌ చేస్తే విమానం కాక్‌పిట్‌లోని పైలట్‌కు తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం కన్పిస్తాయి. నిర్దేశిత మార్గంలో వెళ్లాల్సిన విమానం మరో మార్గంలో వెళుతుంది. విమానం ప్రయాణించాల్సిన ఎత్తులోనూ మార్పులు వస్తాయి. దాంతో గగతలంలో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎత్తయిన భవనాలు, కొండలను ఢీకొట్టొచ్చు. అలాగే రన్‌వే కిందికి దూసుకెళ్లడం కూడా జరగొచ్చు. కల్లోలిత ప్రాంతాల్లో అధికం.. యుద్ధాలు జరిగే కల్లోలిత ప్రాంతాల్లో జీపీఎస్‌ స్పూఫింగ్‌ సమస్య అధికంగా ఉంది. 2024లో ఆయా ప్రాంతాల్లో శాటిలైట్‌ సిగ్నల్‌ జామింగ్‌ లేదా స్పూఫింగ్‌ ఘటనలు 4.3 లక్షలు నమోదయ్యాయి. 2023లో 2.6 లక్షలు నమోదయ్యాయి. అంటే ఏడాది కాలంలో 62 శాతం పెరిగాయి. ఈజిప్టు, లెబనాన్, నల్ల సముద్రం, రష్యా–ఎస్తోనియా, రష్యా–లాతి్వయా, రష్యా–బెలారస్‌ సరిహద్దుల్లో స్ఫూపింగ్‌ బెడద ఎక్కువగా ఉందని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చెబుతున్నాయి. మయన్మార్‌తోపాటు భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ వైమానిక పరిశ్రమ ఎదుర్కొంటున్న సైబర్‌ దాడుల్లో జీపీఎస్‌ స్ఫూపింగ్, జామింగ్‌ కూడా ఒకటి. ఇలాంటి ఘటనలు తెలియపర్చడానికి అమెరికాలో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిని్రస్టేషన్‌ ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement