రేపు విశాఖకు వైఎస్ జగన్.. స్టీల్ప్లాంట్ బాధితులకు పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు విశాఖకు బయిలుదేరనున్నారు. అదేవిధంగా నిన్న స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రిలో వైఎస్ జగన్ పరామర్శిస్తారు.నిన్న ( సోమవారం) సాయంత్రం 150 టన్నుల ద్రవపు ట్రక్కున మెుసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్పోటనం చెందింది. దీంతో అది కార్మికులపై పడి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ ఇదివరకే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో రేపు స్వయంగా వైఎస్ జగన్, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, బాధిత కుటుంబాలను కలువనున్నారు.
టీ20 ముంబై లీగ్లో అర్జున్ టెండూల్కర్ విధ్వంసం!
టీ20 ముంబై లీగ్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ విజృంభించాడు. టోర్నీలో ఏఆర్సీఎస్ అంధేరీ తరఫున ఆడుతున్న అర్జున్ సోమవారం బాంద్రా బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. మొదట బౌలింగ్లో మూడు వికెట్లు (3-1-11-3) కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో వన్డౌన్లో వచ్చిన అర్జున్ టెండూల్కర్ 34 బంతుల్లోనే 66 పరుగులు అజేయ ఇన్నింగ్స్తో మ్యాచ్లో వన్మ్యాన్ షో ప్రదర్శన చేశాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్ను అందుకున్న అర్జున్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అర్జున్ విధ్వంసంతో అంధేరీ 145 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ముషీర్ఖాన్ (38 బంతుల్లో 58 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్ అర్జున్ టెండూల్కర్ ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. ఓమ్ కేశ్కామత్ (36 బంతుల్లో 49) టాప్ స్కోరర్ కాగా, సాగర్ ఛాబ్రియా (23 బంతుల్లో 44) రాణించాడు. అర్జున్ మూడు వికెట్లు తీయగా, ప్రసూన్ సింగ్ 2, అజమ్ మిశ్రా, శివమ్ దూబే, ముషీర్ ఖాన్, ప్రగ్నేశ్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆడింది ఒక్క మ్యాచ్ అయినప్పటికీ, తన ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసిన అర్జున్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.Arjun Tendulkar picked up a wicket in his very first over, but the funniest part was Musheer Khan going in for the high-five 😭 Arjun hit his hand so hard Musheer was genuinely shocked and started telling everyone on the field to look at how hard he got hit 😂💀 pic.twitter.com/ldx9GCD2po— OldMonkOfCricket (@OldMonkofCric) June 9, 2026Match 16 | AA v BB: A performance to remember! Arjun Tendulkar bags the Player of the Match honours.📌 June 1-13 | Wankhede Stadium.🎟️ Tickets live at the link in bio. 🎥 Watch live on Jio Hotstar and Star Sports.🌐 Track live on https://t.co/2GVUXSuuuk and the T20 Mumbai… pic.twitter.com/2C4JBSxKVw— T20 Mumbai (@T20Mumbai) June 8, 2026Arjun Tendulkar hit such a massive six in today’s T20 Mumbai League match that the ball landed in the stands and struck a young child. The child appeared to be in a lot of pain and started crying loudly.😢 pic.twitter.com/yJIyGc3Oit— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 8, 2026
విజయ్ ఫొటో కోసం.. కుర్చీ ఖాళీ!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజాదరణ ఇప్పుడు కేవలం రాజకీయ సభలకే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ఆయన ఫొటోలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో ఉంచి తీరాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే.. తిరునెల్వేలిలో చివరకు మేయర్ ‘కుర్చీ’నే ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు అక్కడ జరిగిందంటే.. తిరునెల్వేలి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేయర్ జి. రామకృష్ణన్ కార్యాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ ఫొటో ఏర్పాటు చేశారు. అయితే దానిని గదిలో మధ్యభాగంలో, మేయర్ కుర్చీకి నేరుగా పైన ఉంచాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తలు కోరినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామకృష్ణన్.. తన నిరసనను మరోలా వ్యక్తం చేశారు. ఆయన తన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కార్యాలయ పనులు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని.. నిరసన తెలిపేందుకే తాను ఇలా చేస్తున్నానని అన్నారాయన. రెండు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని గదుల్లో విజయ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరగా అంగీకరించామని, ఇప్పుడు తన కుర్చీ పైనే ఫొటో ఉండాలని పట్టుబడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.అసలు వివాదం రెండు వారాల క్రితమే మొదలైంది. అప్పట్లో కూడా మేయర్ రామకృష్ణన్ నిరసనగా తన టేబుల్పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఫొటోను ఉంచి సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇదే తరహా వివాదం కోయంబత్తూరులోనూ చోటుచేసుకుంది. అక్కడ మేయర్ ఆర్. రంగనాయకి తొలుత తనకు కేటాయించిన గదిలో విజయ్ ఫొటో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో చివరకు అంగీకరించారు. అయినప్పటికీ స్టాలిన్ ఫొటోను తొలగించేందుకు మాత్రం నిరాకరించారు.కరూర్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. విజయ్ ఫొటో పక్కనే స్టాలిన్ ఫొటోను కూడా ఉంచాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ నేతల ఫొటోలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సమావేశం రాజకీయ వాగ్వాదాలకు వేదికగా మారింది.కూనూర్లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయ్ ఫొటోతో పాటు స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి చిత్రాలను ఉంచగా, టీవీకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫొటోలను తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఫొటోల వివాదం మాత్రమే కాదు. స్థానిక సంస్థల్లో టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే లేదంటే ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపానికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో ప్రజా సమస్యలు పక్కన పడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Polimer News (@polimernews) VIDEO Credits: polimernews
పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను: బంగ్లా కెప్టెన్
ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆడాలనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో మెరవాలని కోరుకోని ప్లేయర్ ఉండరు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రభుత్వ నిర్ణయం కారణంగా బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఈ ఏడాది కోల్పోయారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి అర్హత సాధించినప్పటికీ.. ప్రభుత్వం పంతానికి పోవడంతో ఈవెంట్ నుంచే జట్టు నిష్క్రమించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్కప్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.దౌత్యపరమైన ఉద్రిక్తతలుఅయితే, టోర్నీ ఆరంభానికి ముందు భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను బీసీసీఐ తొలగించింది. ఈ నేపథ్యంలో భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని.. ప్రపంచకప్ ఆడేందుకు అక్కడకు వెళ్లమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) కొత్త రాగం ఎత్తుకుంది.ప్రభుత్వ నిర్ణయం.. కాదు కాదు ఆటగాళ్లేనంటూ..తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీని కోరింది. అయితే, బీసీబీ వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు బీసీబీ ప్రకటించింది. ఇందుకు సరేనన్న ఐసీసీ.. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను వరల్డ్కప్లో ఆడించింది.అయితే, నాటి బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్.. టోర్నీ నుంచి తప్పుకోవాలన్నది తొలుత ప్రభుత్వ నిర్ణయమని చెప్పి.. ఆ తర్వాత తమ ఆటగాళ్లే దేశం కోసం భారత్లో ఆడలేదంటూ బాంబు పేల్చాడు. సర్వత్రా విమర్శలు రావడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు.భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా..ఈ చేదు అనుభవాల గురించి ప్రపంచకప్-2026 బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన లిటన్ దాస్ తాజాగా స్పందించాడు. తాము పాకిస్తాన్లో తుపాకుల మధ్య క్రికెట్ ఆడిన సందర్భాలు ఉన్నాయని.. అలాంటిది భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా టోర్నీ నుంచి వైదొలగడం తీవ్రంగా కలచివేసిందన్నాడు.ప్రథోమ్ అలోతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు మాతో బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. మీరేం కోరుకుంటాన్నరో చెప్పండని అడిగారు. ప్రతి ఆటగాడు వరల్డ్కప్ ఆడాలనే అనుకున్నాడు. కానీ బోర్డుతో యుద్ధానికి దిగడం ఎవరికీ ఇష్టం లేదు.పాకిస్తాన్లో ఆడాము.. అంతకంటే ప్రమాదకరమా?కేవలం ప్రపంచకప్ టోర్నీ ఆడాలన్నదే మా కల. కానీ వాళ్లు భారత్లో భద్రత లేదని అన్నారు. అప్పుడు నేను నా వాదన వినిపించాను. ‘పాకిస్తాన్లో మేము క్రికెట్ ఆడాము. అప్పుడు గదుల వెలుపల తుపాకీలతో నిలబడి మాకు రక్షణ ఇచ్చారు.ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ (భారత్) ఉంటాయా?’ అని అడిగాను. కానీ వాళ్లు మాత్రం వినలేదు. తమకు నచ్చిన నిర్ణయమే తీసుకున్నారు. ఆటగాళ్లుగా వాళ్లు ఏం చెబితే మేము అదే వినాలి కదా!’’ అని లిటన్ దాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.బీసీసీఐతో సంబంధాల పునరుద్ధరణపై దృష్టికాగా బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీసీఐతో సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం బీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ను నియమించింది. పదవి చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన తమీమ్ ఇక్బాల్.. బోర్డు తరఫున బీసీసీఐకి లేఖ రాయించాడు. ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు.ఏదేమైనా పాత ప్రభుత్వం వల్ల తాము ఎంతో నష్టపోయామని.. వారి అనుచిత నిర్ణయం వల్ల వరల్డ్కప్ ఆడే అవకాశం కోల్పోయామని ఆటగాళ్లు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా ఐసీసీ గట్టిగానే మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మెగా టోర్నీలో ఆతిథ్య టీమిండియా విజేతగా నిలిచి... ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.చదవండి: అర్జున్ టెండుల్కర్ అదరగొట్టాడు
ఇద్దరు ప్రపంచకప్ సభ్యులపై వేటు
‘అది మా 20 ఏళ్ల కష్టం.. కబ్జా చేయడానికి చూస్తున్నారు’
రామ్ చరణ్ పెద్ది వసూళ్లు.. ఐదు రోజుల్లోనే క్రేజీ మార్క్
న్యాయం కోసం ప్రేమికుడి పోరాటమే ‘ఒక కోర్టు కేస్’
పాఠశాలల్లో చివరి బెంచీకి స్వస్తి?
12 నూక్లియర్ ఆయుధాలు మోహరింపు : ఇండియా వ్యూహాత్మక మార్పు!
భార్య వివాహేతర సంబంధం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
లీటర్పై రూ.20 డిస్కౌంట్!
'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'.. ఫుల్ కామెడీగా టీజర్
చీఫ్ ఇంజనీర్ ఇంట్లో.. నోట్ల కుప్పలు, బంగారు బిస్కెట్లు
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఊళ్లో నెమళ్ల బెడద
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
సాక్షి కార్టూన్ 09-06-2026
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
క్యాబ్ డ్రైవర్పై సినీ నటుడు దాడి
ఇద్దరు ప్రపంచకప్ సభ్యులపై వేటు
‘అది మా 20 ఏళ్ల కష్టం.. కబ్జా చేయడానికి చూస్తున్నారు’
రామ్ చరణ్ పెద్ది వసూళ్లు.. ఐదు రోజుల్లోనే క్రేజీ మార్క్
న్యాయం కోసం ప్రేమికుడి పోరాటమే ‘ఒక కోర్టు కేస్’
పాఠశాలల్లో చివరి బెంచీకి స్వస్తి?
12 నూక్లియర్ ఆయుధాలు మోహరింపు : ఇండియా వ్యూహాత్మక మార్పు!
భార్య వివాహేతర సంబంధం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
లీటర్పై రూ.20 డిస్కౌంట్!
'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'.. ఫుల్ కామెడీగా టీజర్
చీఫ్ ఇంజనీర్ ఇంట్లో.. నోట్ల కుప్పలు, బంగారు బిస్కెట్లు
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్కు రాహుల్ రామకృష్ణ చురకలు!
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
దురంధర్కు అలా.. పెద్దికేమో ఇలా.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఊళ్లో నెమళ్ల బెడద
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
సాక్షి కార్టూన్ 09-06-2026
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
క్యాబ్ డ్రైవర్పై సినీ నటుడు దాడి
ఫొటోలు
కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్’ఫుల్ ఫోటోస్
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. గుండెలు పిండేసే దృశ్యాలు
చేప మందు కోసం వేలాదిగా తరలివచ్చిన ప్రజలు (ఫోటోలు)
బాలీవుడ్ బ్యూటీ నేహ కక్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తన ముద్దుల గారాలపట్టితో బిగ్బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)
శారీలో అనసూయ గ్లామర్ చూశారా? (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
మృగశిర ఎఫెక్ట్.. కిక్కిరిసిన మార్కెట్ (ఫొటోలు)
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం (ఫొటోలు)
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
సినిమా
హిందీ కంటే సౌత్ సినిమాలే మెరుగ్గా రాణిస్తున్నాయి: కాజల్
వృత్తిపరమైన అంశాల్లో దక్షిణాది చిత్ర పరిశ్రమదే పైచేయి అంటున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘నటీ మణులకు ఉత్తరాదిలో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయా? లేక దక్షిణాదిలోనా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి కాజల్ అగర్వాల్ బదులిస్తూ– ‘‘అవకాశాలైతే రెండు చోట్ల (ఉత్తరాది, దక్షిణాది) ఉన్నాయని నేను నమ్ముతున్నాను. కానీ, వృత్తిపరమైన నైపుణ్యం, నిబద్ధత విషయాల్లో మాత్రం దక్షిణాది ఉన్నతమైనది. అద్భుతమైన దర్శకులు, గొప్ప సాంకేతిక నిపుణులు, కథాంశాలు, సృజనాత్మకత మనకు సౌత్లోనే కనిపిస్తున్నాయి. దక్షిణాది సినిమా పరిధి కూడా పెరిగింది. చాలా హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలు మెరుగ్గా రాణిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ జూలై 24న రిలీజ్ కానుంది. అలాగే బాలకృష్ణ–గోపీచంద్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్గా, రణ్బీర్కపూర్ ‘రామాయణ’ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కాజల్ నటిస్తున్నారు.
ఆ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ని.. ఇప్పుడు హీరో చేశా: విజయ్ సేతుపతి
‘‘పూరి జగన్నాథ్గారి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా తమిళ రీమేక్లో జయం రవి (రవి మోహన్ ) హీరోగా నటించారు. ఈ చిత్రంలో నేను జూనియర్ ఆర్టిస్ట్గా నటించాను. ఇప్పుడు పూరిగారి దర్శకత్వంలో నేను హీరోగా ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా చేయడం సంతోషాన్నిస్తోంది. ఆయన కెరీర్లో ఇది ఒక బెస్ట్ ఫిల్మ్గా నిలుస్తుంది’’ అని విజయ్ సేతుపతి చెప్పారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన చిత్రం ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’. సంయుక్త, టబు, విజయ్కుమార్ ఇతర పాత్రల్లో నటించారు. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మించారు. సోమవారం చెన్నైలో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ–‘‘నిజ జీవిత ఘటనలతో రాసిన కథ ఇది. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. చాలా భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అన్నారు. ‘‘పూరిగారు, నా కాంబినేషన్లో చేసిన తొలి స్ట్రయిట్ తమిళ్ సినిమా ఇది’’ అన్నారు చార్మీ కౌర్. ‘‘పూరి జగన్నాథ్గారితో పని చేయాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది’’ అని పేర్కొన్నారు సంయుక్త. ‘‘పూరి జగన్నాథ్గారితో నిర్మాణ బాధ్యతలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత జేబీ నారాయణరావు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడారు.
నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను: ఎస్.ఎస్. తమన్
‘‘హైదరాబాద్లో ఈ నెల 13న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ని నిర్వహించబోతున్నాం. ఈ కాన్సర్ట్ పూర్తి మ్యాజికల్గా ఉండబోతోంది. మా ప్లే లిస్ట్ చూస్తుంటే మాకే ఎనర్జీ వస్తోంది. ఫైర్వర్క్స్, ఎల్ఈడీ స్క్రీన్స్ , 3డీ ఎఫెక్ట్స్, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ... అన్నీ అద్భుతంగా ఉంటాయి. గత కొన్ని రోజులుగా నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ షోలో ఫుల్ లెంగ్త్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఉంటాయి’’ అని సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తెలిపారు.ఏసీటీసీ, ఎస్.ఎస్.తమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ ఈ నెల 13న హైదరాబాద్లో జరగనుంది. ఈ ఈవెంట్కు సంబంధించిన వివరాలను తెలిపేందుకు హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ–‘‘ఓజీ’ సినిమా అప్రిషియేషన్ సెలబ్రేషన్ ను కొనసాగిస్తూ ‘ఓజీ టూర్ ఇండియా’ను నిర్వహిస్తున్నాం.జూన్ 13న హైదరాబాద్లో, జూలై 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్లో ఈవెంట్లు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం నేను ‘మెగా 158, ఎన్బీకే 111, ఆదర్శ కుటుంబం, లెనిన్, ఇట్లు అర్జున’ వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘తమన్గారితో కలిసి ఈ టూర్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ఏసీటీసీ నిర్వాహకుడు శరవణన్ వాసు.
ఊహించలేని మలుపులున్నాయి: ఆకాష్
‘‘విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం రొమాంటిక్ అండ్ కామెడీ సబ్జెక్ట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నాను. నటుడిగా కొంత ప్రయాణం చేసిన తర్వాత యాక్షన్ చిత్రాలు కూడా చేస్తాను. ఒకే జానర్కే నన్ను నేను పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు’’ అని ఆకాష్ గోపరాజు చెప్పారు.ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా, భైరవి ఆరాధ్య హీరోయిన్గా నటించిన రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ సినిమా ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకాష్ గోపరాజు విలేకరులతో మాట్లాడుతూ–‘‘కోనసీమ నేపథ్యంతో సాగే విలేజ్ లవ్ స్టోరీ ఇది.పల్లెటూరి అందాలు, నవ్వులు, ఎమోషన్స్ , సస్పెన్స్ , ప్రేమ.. ఇలా అన్ని అంశాల మేళవింపుతో రూపొందించాం. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే చాలా ఎనర్జిటిక్ పాత్ర చేశాను. ఈ సినిమా టైటిల్కు తగ్గట్లే కథలో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. బాలకృష్ణగారు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. యశ్వంత్ నాగ్ సంగీతం, ఆర్ఆర్ ప్లస్ అవుతుంది. మా అమ్మగారు ఈ సినిమా ఔట్పుట్ పట్ల సంతోషించారు’’ అని చెప్పారు.
క్రీడలు
కొంపముంచిన రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో వింత రనౌట్!
ఇండియా-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే వింత రనౌట్కు మ్యాచ్ సాక్ష్యంగా నిలిచింది. విషయంలోకి వెళితే.. ఓపెనర్దిద్దరు తొందరగానే పెవిలియన్ చేరడంతో రుతురాజ్, ప్రియాన్ష్ ఆర్యలు ఆచితూచి ఆడారు. ఇద్దరు కలిసి చాలా బంతులెదుర్కొని 53 పరుగులు జోడించారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో రుతురాజ్ చేసిన తప్పిదం కొంపముంచింది. రవిందు ఫెర్నాండో వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతినే గైక్వాడ్ సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత బంతికే హైడ్రామా చోటుచేసుకుంది. పాయింట్ దిశగా ఆడిన రుతురాజ్ రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్వైపు ఉన్న ప్రియాన్ష్ ఆర్య రుతురాజ్ రెండో పరుగు కోసం వచ్చిన విషయం గమనించలేదు. అప్పటికే క్రీజులో బ్యాట్ పెట్టాడు. కానీ అప్పటికే రుతురాజ్ స్ట్రైక్ ఎండ్వైపు వచ్చేశాడు. ఈలోగా బంతిని కీపర్ బౌలర్ వైపు విసిరే క్రమంలో ప్రియాన్ష్ బ్యాట్ను తొక్కడం కనిపించింది. ఇంతలో కీపర్ నుంచి బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్లో ఉండడంతో నిబంధనల ప్రకారం ఎవరు బ్యాట్ను మొదటగా క్రీజులో పెట్టారనేది అంపైర్లు పరిశీలించారు. రిప్లేలో ప్రియాన్ష్ ఆర్య బ్యాట్ క్రీజుపై ఉంచినప్పటికీ, ప్రియాన్ష్ కంటే ముందే రుతురాజ్ బ్యాట్ను క్రీజులో ఉంచడం కనిపించింది. దీంతో అంపైర్లు ప్రియాన్ష్ ఆర్యను రనౌట్ అయినట్లు ప్రకటించారు. ఇద్దరి మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ వింత రనౌట్ జరిగింది. ఇలాంటి వింత రనౌట్లకు పాకిస్తాన్ పెట్టింది పేరు. ఇప్పుడు రుతురాజ్, ప్రియాన్ష్లు వింత రనౌట్తో వార్తల్లోకెక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే 69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రుతురాజ్ గైక్వాడ్ (101), కెప్టెన్ తిలక్ వర్మ (60 బ్యాటింగ్) ఆదుకున్నారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 150 పరుగులు జోడించారు. లిస్ట్-ఏ క్రికెట్లో మంచి రికార్డు కలిగిన రుతురాజ్ మరోసారి ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ సెంచరీతో మెరిశాడు. అయితే సెంచరీ చేసిన మరుక్షణమే రుతురాజ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇండియా-ఏ 45 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అంతకముందు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (14) ఫామ్ను కొనసాగించడంలో విఫలమయ్యాడు.pic.twitter.com/Ga3qBawcIN— crictalk (@crictalk7) June 9, 2026చదవండి: మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్!
‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’
స్వదేశంలో టీమిండియా అదరగొట్టింది. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (126), ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (81), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (81) అర్ద శతకాలతో మెరిశారు. కాగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతేడాది కాలంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 800కు పైగా పరుగులు సాధించాడు. ఇక అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా 165 బంతుల్లో 100 రన్స్ చేసిన రాహుల్.. టెస్టు కెరీర్లో 12వ సెంచరీ నమోదు చేశాడు.అశ్విన్ సంచలన వ్యాఖ్యలుమొత్తంగా ఇప్పటికి టీమిండియా తరఫున 68 టెస్టులు ఆడిన రాహుల్ 4153 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సగటు 36.43. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కేఎల్ రాహుల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్లో లేకుంటే ఈ కర్ణాటక బ్యాటర్ నుంచి ఒక్క పరుగు కూడా ఆశించలేమన్నాడు.పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే..తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘విదేశాల్లో కఠినమైన పిచ్ల మీద ఆడటం వల్ల అతడి బ్యాటింగ్ సగటు తక్కువగా ఉందని చాలా మంది కేఎల్ రాహుల్ను వెనకేసుకువస్తారు. కానీ అతడిలో నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.పిచ్ గనుక బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే.. అతడు ఒక్క పరుగు కూడా చేయడు. ఇలా బ్యాటింగ్కు వెళ్తాడు. అలా అవుటై పెవిలియన్కు చేరతాడు. ఒకవేళ అదే స్థానంలో విరాట్ కోహ్లి ఉంటే.. అప్పుడతడు ఫామ్లో లేకపోయినా కనీసం 30, 33, 43.. లేదంటే 28 పరుగులైనా చేస్తాడు.కొడితే సెంచరీ.. లేదంటేకానీ కేఎల్ రాహుల్ మాత్రం 0- 10 మధ్య కూడా పరుగులు రాబట్టలేడు. ఫామ్లో ఉన్నాడంటే సెంచరీ అయినా చేస్తాడు. అది వేరే సంగతి. ఒకవేళ ఫామ్లో లేడంటే మాత్రం మనం అతడి నుంచి పరుగులు ఆశించకూడదు.కొడితే సెంచరీ.. లేదంటే ఇలా వెళ్లి అలా వచ్చేయడం.. కేఎల్ రాహుల్లో నేను ఈ రెండు మాత్రమే చూశాను. అతడు మధ్యస్థంగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. అయితే, గత రెండేళ్లుగా అతడి ఆట తీరులో పరిణతి కనిపిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగ్గా ఆడుతున్నాడు’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటికి 119 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన 34 ఏళ్ల కేఎల్ రాహుల్ ఖాతాలో తొమ్మిది డకౌట్లు, 31 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉండటం గమనార్హం.చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను
పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను: బంగ్లా కెప్టెన్
ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆడాలనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో మెరవాలని కోరుకోని ప్లేయర్ ఉండరు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రభుత్వ నిర్ణయం కారణంగా బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఈ ఏడాది కోల్పోయారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి అర్హత సాధించినప్పటికీ.. ప్రభుత్వం పంతానికి పోవడంతో ఈవెంట్ నుంచే జట్టు నిష్క్రమించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్కప్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.దౌత్యపరమైన ఉద్రిక్తతలుఅయితే, టోర్నీ ఆరంభానికి ముందు భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను బీసీసీఐ తొలగించింది. ఈ నేపథ్యంలో భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని.. ప్రపంచకప్ ఆడేందుకు అక్కడకు వెళ్లమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) కొత్త రాగం ఎత్తుకుంది.ప్రభుత్వ నిర్ణయం.. కాదు కాదు ఆటగాళ్లేనంటూ..తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీని కోరింది. అయితే, బీసీబీ వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు బీసీబీ ప్రకటించింది. ఇందుకు సరేనన్న ఐసీసీ.. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను వరల్డ్కప్లో ఆడించింది.అయితే, నాటి బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్.. టోర్నీ నుంచి తప్పుకోవాలన్నది తొలుత ప్రభుత్వ నిర్ణయమని చెప్పి.. ఆ తర్వాత తమ ఆటగాళ్లే దేశం కోసం భారత్లో ఆడలేదంటూ బాంబు పేల్చాడు. సర్వత్రా విమర్శలు రావడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు.భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా..ఈ చేదు అనుభవాల గురించి ప్రపంచకప్-2026 బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన లిటన్ దాస్ తాజాగా స్పందించాడు. తాము పాకిస్తాన్లో తుపాకుల మధ్య క్రికెట్ ఆడిన సందర్భాలు ఉన్నాయని.. అలాంటిది భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా టోర్నీ నుంచి వైదొలగడం తీవ్రంగా కలచివేసిందన్నాడు.ప్రథోమ్ అలోతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు మాతో బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. మీరేం కోరుకుంటాన్నరో చెప్పండని అడిగారు. ప్రతి ఆటగాడు వరల్డ్కప్ ఆడాలనే అనుకున్నాడు. కానీ బోర్డుతో యుద్ధానికి దిగడం ఎవరికీ ఇష్టం లేదు.పాకిస్తాన్లో ఆడాము.. అంతకంటే ప్రమాదకరమా?కేవలం ప్రపంచకప్ టోర్నీ ఆడాలన్నదే మా కల. కానీ వాళ్లు భారత్లో భద్రత లేదని అన్నారు. అప్పుడు నేను నా వాదన వినిపించాను. ‘పాకిస్తాన్లో మేము క్రికెట్ ఆడాము. అప్పుడు గదుల వెలుపల తుపాకీలతో నిలబడి మాకు రక్షణ ఇచ్చారు.ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ (భారత్) ఉంటాయా?’ అని అడిగాను. కానీ వాళ్లు మాత్రం వినలేదు. తమకు నచ్చిన నిర్ణయమే తీసుకున్నారు. ఆటగాళ్లుగా వాళ్లు ఏం చెబితే మేము అదే వినాలి కదా!’’ అని లిటన్ దాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.బీసీసీఐతో సంబంధాల పునరుద్ధరణపై దృష్టికాగా బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీసీఐతో సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం బీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ను నియమించింది. పదవి చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన తమీమ్ ఇక్బాల్.. బోర్డు తరఫున బీసీసీఐకి లేఖ రాయించాడు. ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు.ఏదేమైనా పాత ప్రభుత్వం వల్ల తాము ఎంతో నష్టపోయామని.. వారి అనుచిత నిర్ణయం వల్ల వరల్డ్కప్ ఆడే అవకాశం కోల్పోయామని ఆటగాళ్లు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా ఐసీసీ గట్టిగానే మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మెగా టోర్నీలో ఆతిథ్య టీమిండియా విజేతగా నిలిచి... ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.చదవండి: అర్జున్ టెండుల్కర్ అదరగొట్టాడు
మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్!
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షార్పణమైంది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను లంక 1-0తో కైవసం చేసుకుంది. దీంతో విండీస్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో అర్జున రణతుంగ, ఆటపట్టు ఈ ఫీట్ను సాధించారు. జమైకా వేదికగా జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది.కనీసం టాస్ వేసేందుకు కూడా వరుణుడు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని, మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో వన్డే కూడా వర్షార్పణమైన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో మాత్రం శ్రీలంక జట్టు 41 పరుగుల తేడాతో గెలిచింది. కరీబియన్ గడ్డపై 13 ఏళ్ల తర్వాత లంక విజయం సాధించడం విశేషం. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ గురువారం నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్లు కూడా జరగనున్నాయి.చదవండి: రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్!
న్యూస్ పాడ్కాస్ట్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
బిజినెస్
క్యాపిటల్ మార్కెట్లపై గురి
దేశీయంగా కుటుంబ పెట్టుబడులలో క్యాపిటల్ మార్కెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్నట్లు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. పొదుపు సొమ్ము మదుపు చేసేందుకు కీలక మార్గంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. సంపద సృష్టిలో భాగమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇది వ్యవస్థాగత మార్పును ప్రతిబింబిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తద్వారా భారతీయులు దేశ వృద్ధిలో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, భాగస్వాములవుతున్నట్లు వివరించారు.వెరసి కుటుంబాల పొదుపు సొమ్మును ఇన్వెస్ట్ చేసేందుకు క్యాపిటల్ మార్కెట్లు కీలక అవకాశంగా మారుతున్నట్లు 2026 ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇండియా ఇన్వెస్టర్ సదస్సు సందర్భంగా తెలియజేశారు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు(పీఎంఎస్) నిబంధనలపై విస్తారిత చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. త్వరలో చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన రెండు సెషన్లలో తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా మంగళవారం పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
ఇన్నోవా క్రిస్టా.. సరికొత్తగా
టయోటా ఇన్నోవా క్రిస్టా సరికొత్త లగ్జరీ హంగులతో కస్టమర్ల ముందుకు వచ్చింది. కొత్త డిజైన్ అప్డేట్లు, ఆధునిక ఫీచర్లు, మరింత మెరుగైన క్యాబిన్ అనుభవంతో మల్టీ–పర్పస్ వెహికల్(ఎంపీవీ) విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే, ఇంజిన్, పనితీరులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీని ఎక్స్–షోరూమ్ ధర రూ. 19.72 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.టయోటా డీలర్షిప్లో, సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే అన్ని మోడల్స్ ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వెనుక ఏసీ వెంట్స్, మొబైల్ ఛార్జర్ లాంటి ఫీచర్లున్నాయి. సుదూర ప్రయాణాల్లో సౌకర్యం, మంచి పనితీరు, బలమైన డీజిల్ ఇంజిన్ కారణంగా ఇన్నోవా క్రిస్టాకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఎంపీవీ లీటరుకు 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.బీఎండబ్ల్యూ ఇండియా కార్ల ధరలు పెంపుజూలై 1 నుంచి అమల్లోకి ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా’ వాహన ప్రియులకు షాక్ ఇచ్చింది. వచ్చే నెల (జూలై 1) నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు సోమ వారం ప్రకటించింది. తమ పోర్ట్ఫోలియోలోని బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ల కార్ల ధరలపై 2 శాతం వరకు పెంపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దేశీయంగా తయారయ్యే మోడళ్లతో పాటు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల మోడళ్లకు ఈ ధరల పెంపు వర్తిస్తుంది.
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:40 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు పెరిగి 23,152 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 67 పాయింట్లు ఎగబాకి 73,588 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.95బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 93.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3 శాతం పెరిగింది.నాస్డాక్ 0.86 శాతం పుంజుకుంది.Today Nifty position 09-06-2026(time: 10:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే ఆహారం పోషకవంతమైనది, బరువు అదుపులో ఉంచేది తీసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటోంది ఈ ముంబై ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఒకప్పుడు ఏకంగా 145 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఇప్పుడు ఏకంగా 55 కేజీల బరువు తగ్గి నాజుగ్గా మారానని, అందుకోసం ఆ ఏడు ఆహారాలను తీసుకుంటున్నానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని వెల్లడించారామె. మరి ఆ ఆహారాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ముంబై ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ డాలీ సుమారు 145 నుంచి 90 కేజీ బరువు తగ్గేందుకు చేసిన ఆ ఏడు ఆహార మార్పుల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పోస్ట్లో తాను చేసిన ఈ ఆహారపు మార్పులు అదనపు కేలరీలను తగ్గించి..వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడిందని నమ్మకంగా చెబుతోందామె. మరి అవేంటంటే..చక్కెర పానీయాలుడాలీ చక్కెర పానీయాలను పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరి, బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా, తాను నిమ్మరసం, కొబ్బరి నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకున్నట్లు డాలీ వెల్లడించింది. తెల్ల రొట్టె(మైదాతో చేసేవి)శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, అతిగా తినడానికి దారితీస్తుంది. కాబట్లి ఆమె తెల్ల రొట్టెను పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ గోధుమ రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఓట్స్ను తీసుకోవడం ప్రారంభించింది.చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్వాటిలో ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఆమె చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం మానేసినట్లు పేర్కొంది. దానికి బదులుగా ఆమె మితంగా వేయించిన మఖానా, వేయించిన శనగలు, నట్స్ను ఎంచుకుంది.ఫాస్ట్ ఫుడ్ఫాస్ట్ ఫుడ్లో కొవ్వు, ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా డాలీ పనీర్ శాండ్విచ్లు, గోధుమ కూరగాయల ర్యాప్లు లేదా ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుందామె.ఐస్ క్రీమ్ఐస్ క్రీమ్లో తరచుగా చక్కెర,కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని తన ఆహారం నుంచి తొలగించింది. గ్రీక్ యోగర్ట్, పండ్లు, ఫ్రోజెన్ బనానా స్మూతీలు లేదా చిన్న మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆమె తన కోరికలను నియంత్రించుకుంది.మద్యంమద్యపానం డీహైడ్రేషన్కు, ముఖం ఉబ్బడానికి కారణమవుతుందని అందుకే తాను దానిని పూర్తిగా మానేసినట్లు తెలిపింది డాలీ. నిమ్మరసం కలిపిన సోడా నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం, డిటాక్స్ వాటర్ ఆమె ఇష్టపడే ప్రత్యామ్నాయాలుగా మారాయి.ప్రాసెస్ చేసిన ఆహారాలుప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా సోడియం సంకలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని మానేశారు. దానికి బదులుగా, ఆమె గుడ్లు, టోఫు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ వంటి సహజమైన ఆహార వనరులపై దృష్టి సారించింది.పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి.. ఎక్కువ నీరు తీసుకుంటూ.. బాగా నిద్రపోండి. అలాగే మీరు నిర్దేశించుకున్న డైట్ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోమని సూచిస్తోంది. ఇలా చేస్తే కచ్చితంగా శరీరం వేగంగా నాజూకుగా మారుతుందంటూ తన పోస్ట్ని ముగించింది డాలీ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఒక్క ఏడాదిలో 35 కిలోలు..!ఆ ఆరుబోరింగ్ అలవాట్లు..)
పప్పు కూర
చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ప్రతి శనివారం తిరుమలకి వచ్చి వెళ్ళడం అలవాటు. ఉదయమే చెన్నై నుంచి కారులో బయలుదేరి కొండకు చేరేవాడు. కొండ దిగేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాడు. కుదిరితే స్వామివారి దర్శనం చేసుకునే వాడు. కుదరకపోతే ప్రశాంతంగా గుడి ముందర కూర్చునేవాడు. పుష్కరిణి దగ్గరకు వెళ్ళి తలమీద నీళ్ళు చల్లుకునే వాడు. వరాహస్వామి దర్శనం చేసుకునే వాడు. ఆపైన బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిలబడి ఆలయ గోపురానికి నమస్కరించే వాడు. కర్పూర హారతి ఇచ్చి కొండ దిగేసే వాడు. తిరుపతిలో అతడికి పిల్లనిచ్చిన అత్తగారు ఉన్నారు. కొండ దిగిన ప్రతిసారీ అత్తగారి ఇంటికి వెళ్లి ఆమె బాగోగులు తెలుసుకునేవాడు. అల్లుడు వచ్చిన ప్రతిసారీ ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టులోని కొన ఆకు కోసి తను చేసిన వేడి వేడి వంటలు వడ్డించేది. పచ్చటి అరిటాకులో పప్పుకూర వడ్డించేది. ఘుమఘుమలాడే నెయ్యి కూడా వేసేది. వెళ్ళిన ప్రతిసారీ ఆమె పప్పుకూరే చేసేది. ఎందుకంటే ఆమె పప్పు కూర మాత్రమే బాగా చేయగలదు. ఎంతో రుచిగా ఉన్నప్పటికీ వారం వారం పప్పుకూర తినలేక అల్లుడికి విసుగు వచ్చింది. ఒకరోజు ఏడుపు ముఖం పెట్టి ‘‘అత్తా, ఎప్పుడూ పప్పు కూరేనా? తినాలంటే మొహం మొత్తుతోంది’’ అన్నాడు. ఆమె నవ్వింది.‘‘అల్లుడూ... పప్పుకూర సరే, పదేళ్ళుగా తిరుమల వచ్చి వెళ్తున్నావు. గుడిలోని స్వామి అప్పుడూ, ఇప్పుడూ ఒక్కరే కదా... ఏ మాత్రం మార్పు లేదు కదా, నీకెప్పుడూ స్వామిని ‘చూసింది చాల్లే’ అనిపించలేదా?’’ అని అడిగింది.అతడు నవ్వాడు.‘‘స్వామిని చూడటం ‘చాలు’ అనిపించదత్తా. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. కొండకి వచ్చిన ప్రతిసారీ దర్శనం చేసుకుని బంగారు వాకిలి దాటి వచ్చేలోగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏమిటో ఈ మాయ’’ అంటూ చేయి కడిగాడు. అత్త తాను చేసిన పప్పు కూర కొద్దిగా గిన్నెలో పెట్టి కూతురికిమ్మనిచెప్పింది. అలాగేనని తల ఊపి ‘రాకుండా ఉండలేను నీ కొండకు... చూడకుండా ఉండలేను ఏ నాటికీ’ అని పాడుకుంటూ చెన్నైకి బయలుదేరాడు. ఆ రోజునుంచి అత్త ముందు పప్పు కూర మాట ఎత్తలేదు అల్లుడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
అమాయకత్వంలో ఆధ్యాత్మికత
పసిప్రాయం ఒక తెల్ల కాగితం లాంటిది. వారు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ, అనుకరిస్తూ ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. వారి చిన్ని చిన్ని ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అయితే పిల్లల నుంచి పెద్దలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పసిపిల్లలకు ‘నేను, నాది’ అనే అహంకారం ఉండదు. వారు తమను తాము ప్రత్యేకంగా చూసుకోరు. ప్రకృతిలో, అందరిలో కలిసిపోతారు. ఈ నిర్మలత్వమే వారిని దైవస్వరూపులుగా చేస్తుంది.గత జ్ఞాపకాల్లో లేదా భవిష్యత్తు ఆందోళనల్లో కాకుండా, ప్రస్తుత క్షణంలో ఉండటం పసిపిల్లల లక్షణం. వారు గడిచిన నిమిషం గురించి బాధపడరు, రేపటి గురించి భయం చెందరు. ఈ ‘స్థితప్రజ్ఞత’ వారికి దైవికమైన ఆనందాన్ని ఇస్తుంది. కోపాన్ని మనసులో పెట్టుకోకుండా ఉండటం. రేపటి చింత లేకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించడం. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం పిల్లల మనస్తత్వం. ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మలక్షణం ’సత్–చిత్–ఆనందం’. పిల్లల ప్రతి చర్యలోనూ ఒక చైతన్యం, ఒక సహజ సిద్ధమైన ఆనందం కనిపిస్తుంది. వారిని చూసినప్పుడు మనసు ప్రశాంతంగా మారడానికి కారణం వారిలో ప్రతిబింబించే ఆ పరమాత్మ తత్వమే. పిల్లల ప్రేమలో ఎటువంటి ఆశలు, నిబంధనలు ఉండవు. వారు కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. భగవంతుడు కూడా అటువంటి నిష్కల్మషమైన ప్రేమకే లొంగుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. మనం మనలోని బాల్యాన్ని మర్చిపోవడం వల్లే ఒత్తిడికి, అసూయకు లోనవుతున్నాం. ఆధ్యాత్మిక సాధన అంటే కొత్తగా ఏదో సంపాదించడం కాదు, మళ్ళీ పసిపిల్లవాడిలా నిర్మలమైన మనసును పొందడమేనని పెద్దలు చెబుతుంటారు. మనలోని ఆ ‘బాల్యాన్ని’ మేల్కొల్పడమే నిజమైన ఆత్మసాక్షాత్కారం. అందుకే ఆధ్యాత్మికవేత్తలు‘ మళ్ళీ ఒక బిడ్డలా మారిపొమ్మని చెబుతుంటారు.మనిషి ఎదుగుతున్న కొద్దీ అనుభవాలు, పంతాలు, పట్టింపులు, సమాజం నేర్పిన ముసుగులు ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం కాదు, మనపై పేరుకున్న ఈ కృత్రిమ పొరలను తొలగించుకుని, మన లోపల అంతర్లీనంగా ఉన్న ఆ పసిబిడ్డ వంటి స్వచ్ఛతను తిరిగి దర్శించడమే.పిల్లలు దేవుడిచ్చిన వరాలు. పిల్లల కళ్ళలో కనిపించే మెరుపు కోటి వెలుగులతో సమానం. వారికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. ఒక చిన్న రంగుల బంతి లేదా వాన చినుకు వారిని పరవశానికి గురిచేస్తుంది. వారి ప్రపంచంలో ప్రతి వస్తువు ఒక వింతే, ప్రతిరోజూ ఒక పండుగే. ఒక ఖాళీ అట్టపెట్టె వారికి విమానం కావచ్చు, ఒక చిన్న కర్ర గుర్రం కావచ్చు. పిల్లలు తమ ఊహలతో ఒక మాయా లోకాన్ని సృష్టించుకుంటారు. అక్కడ బొమ్మలు మాట్లాడతాయి, చెట్లు కథలు చెబుతాయి. పిల్లలకు కులమతాలు, పేద– ధనిక భేదాలు తెలియవు. తోటిచిన్నారి నవ్వితే వీరు నవ్వుతారు, ఏడిస్తే పలకరిస్తారు. క్షణంలో గొడవపడినా, మరుక్షణమే మర్చిపోయి మళ్ళీ ఆడుకునే గుణం కేవలం వారి పసిడి మనసులకే సొంతం. వారి పసిడి ప్రపంచాన్ని ప్రేమతో, భద్రతతో కాపాడుకోవడం మన అందరి బాధ్యత. వారి చిరునవ్వు ఇంట్లో ఉంటే, ఆ ఇల్లే ఒక నందనవనం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి
చెడు స్నేహానికి ప్రతీక శకుని
మహాభారతయుద్ధంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దుష్టచతుష్టయంలో ఒకరుగా పేరుగాంచి, కౌరవులకు మేనమామగా, వారిలో యువరాజైన దుర్యోధనునికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించి అన్నీ తప్పుడు సలహాలు, సూచనలిచ్చి కౌరవులకు కీడు తలపెట్టడంతో, పాండవులకు మేలు జరిగేది. శకుని ఉద్దేశ్యం కూడా ఇదే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాంధహార్ ఆనాటి గాంధార దేశం. గాంధారదేశపు రాజు సుబలుడు, రాణి సుధర్మల కుమారుడే శకుని. సుబలునికి వందమంది కుమారులు, గాంధారి అనే కుమార్తె ఉన్నారు. అందరిలో ఆఖరివాడే శకుని. ఇతని అసలు పేరు సుబలోత్తముడు. అపారమైన తెలివితేటలు కల్గిన, శకుని ‘చౌసర్’ అనే మాయా జూదపు ఆటలో మంచి నేర్పరి. శకుని ప్రాణప్రదంగా అభిమానించే తన సోదరి గాంధారిని, కౌరవ సామ్రాజ్యాధీశుడు, పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి పట్టమహిషిగా చేయాలని భీష్ముడు భావించాడు. అయితే జాతకం ప్రకారం గాంధారికి వైధవ్య యోగం ఉందని తెలిసిన శకుని తన సోదరి అంటే ఉన్న వల్లమాలిన అభిమానంతో, ఈ విపత్తు నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో, జ్యోతిష్యుల సూచనలు, సలహాల మేరకు గాంధారికి మొదటగా ఓ మేకతో వివాహం జరిపించి, అనంతరం ఆ మేకను బలిచ్చి ఆపై ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తే ఆ దోష పరిహారం అవుతుందని ఆ విధంగా చేశాడు. వివాహానంతరం ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆగ్రహం చెంది సుబలుని కుటుంబాన్ని చెరశాలలో బంధించి, మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు. చెరసాలలో ఉన్న సుబలుని కుటుంబానికి ఇచ్చే ఆహారం ఒక్కరికి మాత్రమే సరిపోయేది. మిగిలిన సోదరులు ఆహారాన్ని తమలో తెలివైన, ఆఖరి సోదరుడైన శకునికే పెట్టి ఎలాగైనా కౌరవులపై పగ తీర్చుకోవాలని ప్రమాణం చేయించుకున్నారు. అనంతరం క్షుద్బాధతో తండ్రి, ఒక్కొక్క సోదరుడు మృతి చెందారు. తన తండ్రి మరణానంతరం అతని తొడ ఎముకతో తయారైన పాచికలను వినియోగిస్తూ, తాను అనుకున్న సంఖ్య పడేలా శకుని వరం పొందాడు. ఆ పాచికలతో శకుని మాయాజూదం ఆడి మోసపూరితంగా పాండవులను ఓడించి, కౌరవులచే మరిన్ని అన్యాయాలు, అక్రమాలు చేయిస్తూ మహాభారత యుద్ధం జరిగేలా పథకం రచించి కౌరవవంశాన్ని నాశనం చేసాడు. అయితే మహాభారత యుద్ధంలో ఆఖరిరోజున (18వ రోజు)సహదేవుని చేతిలో శకుని మరణించాడు. ఇదిలావుండగా శకునికి కూడా గుడి ఉంది. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం నిర్మించారు అక్కడి కురువర్ తెగ ప్రజలు. అయితే అక్కడ ఏ విధమైన శకుని విగ్రహం ఉండదు.– సి.ఎన్. మూర్తిసీనియర్ పాత్రికేయులు
అంతర్జాతీయం
ట్రంప్నకు షాక్.. H-1B వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో పరాభవం ఎదురైంది. తీసుకున్న H-1B వీసాలపై 1,00,000 డాలర్ల ఫీజు విధించాలన్న నిర్ణయం చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్కే ఉందని, అధ్యక్షుడికి అలాంటి అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణం చేత ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ కేసు 20 మంది డెమోక్రటిక్ స్టేట్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణకు వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసా దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని కూడా డేటా చూపించింది. బోస్టన్లోని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ ఈ ఫీజును 'కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన పన్ను'గా పేర్కొన్నారు.ప్రతి ఏటా ఇచ్చే వీసాలుసాధారణంగా H-1B ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం సుమారు 65,000 వీసాలను ఇస్తుంది. అదనంగా మాస్టర్స్ లేదా ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి మరో 20,000 వీసాలు లభిస్తాయి. ఇప్పటి వరకు ఈ వీసాలకు కంపెనీలు చెల్లించే ఫీజు సుమారు 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు మాత్రమే ఉండేది. కానీ.. కొత్తగా ప్రతిపాదించిన 1,00,000 ఫీజు కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేసింది.ఈ భారీ ఫీజు కారణంగా అనేక సంస్థలు.. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనకడుగు వేసినట్లు కోర్టు రికార్డులు తెలిపాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H-1B రిజిస్ట్రేషన్లు గతంతో పోలిస్తే దాదాపు 38.5% తగ్గినట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది. ఇది విదేశీ నిపుణులపై ప్రభావం చూపింది.నిర్ణయాన్ని సమర్థించిన ట్రంప్ ప్రభుత్వంట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. అమెరికా ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యమని తెలిపింది. విదేశీ ఉద్యోగులు తక్కువ జీతాలతో అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో ఇది పెద్ద సమస్యగా మారిందని వాదించింది. కానీ కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. ఎంతోమందికి ఉపశమనంఇక భారతదేశంపై కూడా ఈ విధానం ప్రభావం చూపింది. H-1B వీసాలపై ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కఠిన నిబంధనల వల్ల దరఖాస్తులు తగ్గి, అనేక మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా అధికారులతో చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇది మార్పు దశలో ఉన్న విధానం అని, కొన్ని ఇబ్బందులు సహజమని వ్యాఖ్యానించారు. కానీ తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు అటు కంపెనీలకు, ఇటు యూఎస్ వెళ్లాలనుకునే ఎంతోమందికి ఉపశమనం కలిగించింది.
భారతీయ నౌకపై దాడి.. 24 మంది నావికులు..!
టెహ్రాన్: హర్ముజ్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు (సోమవారం) ఒమన్ తీర సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో భారత వాయుసేన తక్షణమే స్పందించి అందులోని నావికులను రక్షించింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.ఒమన్ తీర సమీపంలో 'ఎంటి మారివెక్స్'అనే ఆయిల్ సరఫరా చేస్తున్న నౌకలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో 24మంది నావికులు ఉన్నారు. దీంతో హుటాహుటీన స్పందించిన నావిక దళం వారందరినీ హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడి ఎవరూ చేశారని సమాచారం ఇంకా తెలియలేదు. కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్ఫరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో సహా పలు ప్రాంతాలలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ మాటలు లెక్కచేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.Helicopter rescue operation underway for 24 Indian seafarers after vessel Marivex was struck off the coast of OmanFootage from the scene show the crew being lifted from the damaged vessel after fighting for survival at sea pic.twitter.com/crlSDYaU6y— RT (@RT_com) June 8, 2026
మళ్లీ ఉద్రిక్తతలు.. ఆ దేశం విడిచి వెళ్లండి: భారత్
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. భారతీయులు ఇరాన్కు ప్రయాణించవద్దని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాయం సూచించింది.గత 24 గంటల్లో పలు నగరాల్లో సైనిక చర్యలు, వ్యూహాత్మక కేంద్రాలపై వైమానిక దాడులు, భారీ క్షిపణి దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. “ఆ ప్రాంతంలో తాజా పరిణామాల దృష్ట్యా, ఇరాన్కు ప్రయాణించవద్దన్న మా గత సూచనను మరోసారి తెలుపుతున్నాం. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వెంటనే బయటకు రావాలి” అని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 100వ రోజుకు చేరుకున్న వేళ, సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికే సున్నితంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రాంతీయ స్థాయిలో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం చెలరేగే భయం నెలకొంది.ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ బలగాలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్కు చెందిన నౌకల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలక సముద్ర మార్గం. తాజా సైనిక చర్యల్లో ఇరాన్లోని ఒక పెట్రోకెమికల్ సముదాయంపై దాడి జరగగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాత్రం రెండు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యలు చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను కోరిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దానికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేపట్టింది. అనంతరం సోమవారం ఇరు పక్షాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇజ్రాయెల్లోనూ.. టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో చేసిన పోస్టులో.. భారతీయులు ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.“ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్లోని భారతీయులు అన్ని వేళలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా అనుసరించాలి” అని తెలిపింది.అధికారిక మార్గాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న భద్రతా సూచనలను పరిశీలించాలని రాయబార కార్యాలయం సూచించింది.భారతీయులు తమ నివాసాలు, కార్యాలయాల సమీపంలోని ఆశ్రయ కేంద్రాల గురించి తెలుసుకుని, వాటికి దగ్గరగా ఉండాలని తెలిపింది. తమ నివాసం లేదా ఉద్యోగ ప్రాంతం వద్ద ఉన్న ఆశ్రయ ప్రదేశాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించింది.తదుపరి సమాచారం వచ్చే వరకు ఇజ్రాయెల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనించాలని భారతీయులకు సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాన్ని 24 గంటల సహాయ కేంద్రం ద్వారా సంప్రదించాలని తెలిపింది.
32 మంది మృతి.. వందల మందికి గాయాలు
మనీలా: ఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపం సమీపంలో ఈ రోజు సోమవారం ఉదయం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 32 మంది మరణించారు. 200కు పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు ప్రకటించారు.దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్లో భూకంప తీవ్రతకు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 17 మంది మరణించారని, గ్లాన్ అనే పర్వత ప్రాంత పట్టణంలో 13 మంది గ్రామస్థులు మరణించారని తెలిపారు. కాగా ఈ రోజు ఉదయం ఫిలిప్పీన్స్లో తీవ్ర స్థాయిలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం వచ్చిన వెంటనే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల్లో సుమారు 3 అడుగుల (1 మీటరు) ఎత్తులో అలలు ఎగిసిపడటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. దీంతో వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.భయంతో పరుగులు తీసిన ప్రజలుభూకంపం సంభవించిన వెంటనే పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు అరుస్తూ బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఓ పాఠశాలలో విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జనరల్ సాంటోస్ నగరంలో ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు కిందపడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని వాణిజ్య భవనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.A powerful magnitude 7.8 offshore earthquake struck the southern Philippines region of Mindanao, causing widespread destruction and triggering tsunami warnings across parts of the Pacific.Authorities say at least 19 people have been confirmed dead and more than 200 others… pic.twitter.com/xJqbPqAeWA— Washington Eye (@washington_EY) June 8, 2026
జాతీయం
సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల
తమిళనాడు: బస్సు లేక 56 ఏళ్లుగా అవస్థలు పడుతున్న కొండ గ్రామ ప్రజల కలలో తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో ఆ గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వివరాలు.. తేని జిల్లాలోని మారుమూల కోటగుడి కొండ గ్రామం ప్రాంతం చాలా మంది సినిమాటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఈ ప్రాంతంలోని కోటగుడి కొండ గ్రామంలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది నీలగిరి పరిధిలో ఉంటుంది.ఈ గ్రామానికి చెందిన 25 మందికి పైగా పిల్లలు పోడి నాయక్కనూరులోని ప్రభుత్వ , ప్రభుత్వ – సహాయక పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కోటగుడి నుండి బస్సు సౌకర్యాలు లేకపోవడంతో, ఇక్కడి నుండి పాఠశాలకు వెళ్లే పిల్లలు రోజూ 2 నుండి 3 కిలోమీటర్లు నడిచి, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లడానికి కోటగుడి డివిజన్ సమీపంలోని కురంగానికి బస్సు ఎక్కవలసి వచ్చేది. దీంతో కోటగుడి కొండ గ్రామానికి బస్సు, మినీబస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ తక్షణ చర్యలు తీసుకున్నారు. కోట గుడి కొండకు ప్రభుత్వ బస్సు సర్వీసును ప్రారంభించే విషయంపై అధ్యయనం చేయాలని తేని జిల్లా కలెక్టర్ వైద్యనాథన్ రాష్ట్ర రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, కోట గుడి రోడ్డుపై బోడి నుండి కురంగణి వరకు ఉదయం 3.30 నుండి సాయంత్రం 5.30 వరకు బస్సును నడపాలని నిర్ణయించారు. మొదటిసారిగా బస్సు గ్రామంలోకి ప్రవేశించడాన్ని చూసి మలై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు సర్దుమణిగాయి అనుకునేలోపే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కొత్త తలనొప్పి మొదలైంది. కేబినెట్ కేటాయింపులపై అసంతృప్తి.. ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మా మొర ఆలకించండి మహా ప్రభో’.. అంటూ మరో ఇద్దరు సీనియర్లు ఢిల్లీకి పయనమవడం కొత్త చర్చకు దారితీసింది.బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కృష్ణ బైరేగౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ కీలక శాఖ నిర్వహణపై స్పష్టత లేకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలోనే ఉండటంతో అధికార విభజనపై గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన పార్టీ హైకమాండ్తో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నారని సమాచారం.ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన గతంలోనూ నాయకత్వ మార్పుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇక గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటికే సీనియర్ నేత రామలింగారెడ్డి వ్యవహారం, ఆయన రాజీనామా వెనక్కి తీసుకోవడం.. తదితర పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారింది. అదే సమయంలో సీనియర్ నేత కెహెచ్ మునియప్ప కూడా తనకు ఇచ్చిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేవారు. తన స్థాయికి తగ్గ ప్రాధాన్యం లభించలేదని హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో సహా పార్టీ పెద్దలకు తన అభిప్రాయాలు తెలియజేశానని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలివారాల్లోనే కర్ణాటక కాంగ్రెస్లో కేబినెట్ అసంతృప్తి, శాఖల పంపిణీ వివాదాలు, ఢిల్లీ లాబీయింగ్ రాజకీయ వేడి పెంచుతున్నాయి. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
భారత రాజకీయ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నరేంద్ర మోదీ ఖాతాలో జమ కానుంది. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. తద్వారా.. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఇన్నేళ్ల తర్వాత మోదీ చెరిపేయబోతున్నారు. మోదీ ఇవాళ్టితో.. ప్రధానిగా నెహ్రూ పదవి కాలాన్ని సమం చేయబోతున్నారు. రేపటితో(జూన్ 10) 4,399 రోజులతో అత్యధిక కాలం నిరవధిక ప్రధానమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారు. నెహ్రూ తరహాలోనే.. వరుస ఎన్నికల్లో ఎన్నికై మోదీ ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం. 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. 2019, 2024 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం నిరవధికంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు 4,077 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగి.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.భారత ప్రధానమంత్రుల పదవీకాలం – టాప్ లిస్ట్జవహర్లాల్ నెహ్రూ – 4,398 రోజులు (ఎన్నికల తర్వాత నిరవధిక పదవీకాలం)నరేంద్ర మోదీ – 4,399+ రోజులు (ప్రస్తుత ప్రధానమంత్రి)ఇందిరా గాంధీ – 4,077 రోజులుమన్మోహన్ సింగ్ – 3,652 రోజులు (2004–2014)అటల్ బిహారీ వాజ్పేయి – 2,272 రోజులు (మూడు విడతలు కలిపి)పి.వి. నరసింహారావు – 1,827 రోజులురాజీవ్ గాంధీ – 1,826 రోజులుమొరార్జీ దేశాయ్ – 857 రోజులులాల్ బహదూర్ శాస్త్రి – 576 రోజులుఅయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 1964 మే 27న మరణించే వరకు మొత్తం 6,131 రోజులు పదవిలో కొనసాగారు. అయితే 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన కొనసాగిన కాలాన్ని మాత్రమే అధికారిక రికార్డుగా పరిగణిస్తారు. అందుకే ప్రస్తుతం నరేంద్ర మోదీ అధిగమిస్తున్నది నెహ్రూ మొత్తం పదవీకాల రికార్డు కాదు.. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా కొనసాగిన ప్రధానమంత్రి రికార్డు మాత్రమే. అంటే.. ఆ రికార్డు ఇంకా నెహ్రూ పేరిటే పదిలంగా ఉందన్నమాట. మోదీ ప్రధానిగా ఇంకో 1,732 రోజులు.. అంటే దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు పూర్తి చేసుకుంటే ఆ రికార్డు కూడా బద్ధలు కానుంది. మరోవైపు మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. గత 12 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఆ మార్పుల కేంద్రబిందువు పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమేనని పేర్కొన్నారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, స్వచ్ఛ భారత్, ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చామని మోదీ తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందని వర్గాలకు చేరేలా పనిచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వానికి పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నీట్, సీబీఎస్ఈ పరీక్షల వ్యవహారాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రతిపక్షాల నుంచి విమర్శలకు దారితీస్తున్నాయి. అదే సమయంలో మహిళా రిజర్వేషన్, ఒకే దేశం-ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.మొత్తానికి, ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ కొత్త చరిత్ర సృష్టించడం భారత రాజకీయాల్లో మరో ముఖ్య ఘట్టంగా నిలవనుంది.
టిఫిన్ బాక్స్లో గొడ్డు మాంసం.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
గోల్పారా: అస్సాంలోని గోల్పారా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ బాక్స్లో గొడ్డు మాంసం (బీఫ్) తీసుకువచ్చిన ఉదంతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. క్లాస్మేట్స్కు ఈ ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఐదుగురు ముస్లిం విద్యార్థులను పాఠశాల నుండి బహిష్కరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఘటన స్థానికంగా మతపరమైన వివాదంగా మారడంతో పోలీసులు, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగాల్సి వచ్చింది.తల్లి అరెస్ట్.. మైనర్ బాలుడి నిర్బంధంకృష్ణాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు జూన్ 5వ తేదీన తమ టిఫిన్ బాక్స్లోని గొడ్డు మాంసాన్ని ఇద్దరు హిందూ సహచర విద్యార్థులకు తినిపించడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హిందూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, మతపరమైన నమ్మకాలను దెబ్బతీశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే టిఫిన్ తెచ్చిన మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అతని తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు బాలురను విచారిస్తున్నారు.స్కూల్ మేనేజ్మెంట్ సంచలన నిర్ణయంమొదట ఈ వివాదాన్ని పాఠశాల పరిధిలోనే పరిష్కరించాలని ఉపాధ్యాయులు భావించినప్పటికీ, విషయం గ్రామంలో తెలియడంతో స్థానిక సంస్థలు, ప్రజలు పాఠశాల వద్దకు భారీగా చేరుకుని నిరసనలు చేపట్టారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ నేపథ్యంలో స్కూల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు సుబ్రతా దాస్ మాట్లాడుతూ.. మంగళవారం జరిగే ప్రత్యేక సమావేశంలో ఆ ఐదుగురు విద్యార్థులను పాఠశాల నుండి శాశ్వతంగా బహిష్కరించే ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. మెజారిటీ సభ్యులు బహిష్కరణకే మొగ్గు చూపినట్లు ఆయన తెలిపారు.మాంసాహారంపై నిషేధం విధించిన కలెక్టర్ఈ ఘర్షణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రదీప్ తిముంగ్, ఎస్ఎస్పీ నవనీత్ మహంత పాఠశాలను సందర్శించి శాంతిభద్రతలను సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు స్కూల్ టిఫిన్ బాక్సులను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులు గరిష్టంగా కోడిగుడ్లు మాత్రమే తెచ్చుకోవచ్చని, చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.ఇది కూడా చదవండి: యూసుఫ్ పఠాన్కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్!
ఎన్ఆర్ఐ
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు.
ఆటా సభలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్కు వివరించారు.
కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై అమెరికా దాడులు చేసింది.
అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు)
క్రైమ్
పోలీసుస్టేషన్కు సూది పంచాయితీ!
శ్రీసత్యసాయి జిల్లా: వెనుక నుంచి సూది గుచ్చిందంటూ ఓ మహిళ మరో మహిళతో గొడవకు దిగింది. చివరికి ఈ పంచాయితీ పోలీసుస్టేషన్కు చేరింది. వివరాలు.. కదిరి పట్టణానికి చెందిన పక్కీరమ్మ సోమవారం ఆరోగ్యం బాగాలేకపోవడంతో బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు వచ్చింది. వెనక వైపు నుంచి సూదితో గుచ్చినట్లు అనిపించగా.. వెనకే ఉన్న మహిళ గుచ్చిందంటూ ఆమెతో వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాబ్జాన్ వెంటనే అక్కడకు చేరుకుని ఇద్దరినీ పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం పక్కీరమ్మను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆమె శరీరంపై ఎటువంటి ఇంజెక్షన్ ఆనవాళ్లు లేవని తేలడం గమనార్హ
60 ఏళ్ల వయసులో జల్సాలు..! స్నేహితుడిని నమ్మించి..
బంజారాహిల్స్: 60 ఏళ్ళ వయసులో జల్సాలకు అలవాటుపడ్డాడు..పేకాటకు బానిసై అప్పులు చేశాడు.. వాటిని చెల్లించేందుకు నమ్మిన స్నేహితుడినే నట్టేట ముంచి బంగారు నగలతో ఉడాయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నయ్య అలియాస్ రాములు(60) పేకాటకు బానిసై జల్సాలకు అలవాటు పడి అందరి వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చడానికి మోసాలకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే అమీర్పేట్లోని ఓ హాస్టల్లో ఉంటూ బస్టాప్లలో అపరిచితులను పరిచయం చేసుకొని స్నేహం నటించి వారితో రాకపోకలు సాగిస్తూ వారి కదలికలు గమనిస్తుండేవాడు. గచ్చిబౌలికి చెందిన ఆర్అండ్ బీ రిటైర్డ్ ఉద్యోగి రాజామ్ రాజయ్య ప్రకాశ్ను ఇలాగే పరిచయం చేసుకొని 62 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 57.66 గ్రాముల బంగారంతోపాటు ఒక మొబైల్ ఫోన్ను రికవరీ చేసి రిమాండ్కు తరలించారు.
అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మిర్లోనిగూడెం గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి(45) విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమారులు ప్రశాంత్రెడ్డి, ప్రణీత్రెడ్డి(14) ఉన్నారు. లింగారెడ్డి కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసముంటున్నారు. లింగారెడ్డి పెద్ద కుమారుడు ప్రశాంత్రెడ్డి ఇటీవల పదో తరగతి పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటరీ్మడియట్లో చేరాడు. సోమవారం ఉదయం ప్రశాంత్రెడ్డిని హాస్టల్లో వదిలిరావడానికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాద్కు వెళ్లింది. అదే సమయంలో లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన మిర్లోనిగూడెం వెళ్లగా.. ఇంట్లో లింగారెడ్డి, అతడి చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డి మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డికి ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడగగా.. తిన్నానని సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకునేసరికి గేటుకు లోపలి నుంచి బేడం వేసి ఉంది. ఎంత పిలిచినా భర్త, కుమారుడు స్పందించకపోవడంతో పక్కింటి బాలుడి సహాయంతో గేటు తెరిపించి లోపలికి వెళ్లి చూడగా భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత్రెడ్డి తలపై తీవ్ర గాయాలు ఉండగా, ఇంట్లో టీవీ స్టాండ్పై సుత్తి కనిపించింది. మరోవైపు లింగారెడ్డి నోటి నుంచి నురగలు రావడంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అయితే కొడుకును సుత్తితో కొట్టి హత్య చేసిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సుత్తిపై ఉన్న వేలిముద్రలతో పాటు మృతుల వేలిముద్రలను కూడా సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నేరాలు చేసి నేపాలీలు పరార్!
సాక్షి, సిటీబ్యూరో: రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో నిందితులైన ఏడుగురు నేపాలీల్లో ఒక్కరే చిక్కారు. సూత్రధారి, కీలక నిందితురాలు కల్పన సహా మిగతవారు పరారీలోనే ఉన్నారు.ఈ ఒక్క కేసులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నేపాలీ సంబంధిత నేరాల్లో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న వారి సంఖ్య 170గా తేలింది. నేపాలీ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిని పట్టుకోవడానికి సమన్వయంతో, సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.ఈ నేపాలీ నేరగాళ్లు సంపన్నుల ఇళ్లల్లో పని వాళ్లు, వంట వాళ్లు, వాచ్మెన్లుగా చేరుతున్నారు. తొలినాళ్లలో నమ్మకంగా పనిచేసినా.. ఆపై అదును చూసుకుని పంజా విసురుతున్నారు. సరైన సమయంలో తమ ముఠాకు చెందిన మిగిలిన వారిని రంగంలోకి దింపుతున్నారు. అంతా కలిసి తమ ‘పని’ పూర్తి చేసుకున్న తర్వాత ముందు నగరం..ఆపై దేశం దాటేస్తున్నారు. కల్పన కూడా నేపాల్ చేరినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేటుగాళ్లు నేరం చేసిన వెంటనే తమ సెల్ఫోన్లు, సిమ్కార్డులు ధ్వంసం చేసేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఫలితంగా పోలీసులకు వీరి ఆచూకీ కనిపెట్టడం పెద్ద సవాల్గా మారుతోంది.రెండు రకాల వ్యూహంతో ముందుకు..వాంటెడ్గా ఉన్న నేపాలీలను పట్టుకోవడానికి పోలీసులు రెండు రకాలైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సాంకేతిక నిఘా ఉంచడంతో పాటు సరిహద్దుల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టులు, ఇతర విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క ఈ నేరగాళ్ల వివరాలు, ఆచూకీ చెప్పాల్సిందిగా కోరుతూ ఆయా అసోసియేషన్లు, యూనియన్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినప్పటికీ నేపాల్లోకి ప్రవేశించి, వీరికి అరెస్టు చేసుకురావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.బెయిల్ వస్తే మళ్లీ దొరకరు... ప్రస్తుతం రాష్ట్ర పోలీసులకు వాంటెడ్గా ఉన్న 170 మందీ నేరం చేసిన వెంటనే పరారు కాలేదు. వీరిలో కొందరు అరెస్టయి.. బెయిల్పై వచి్చ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ష్యూరిటీలు ఇచి్చన వారికీ వీరి వివరాలు తెలియట్లేదు. శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ పంథా అనుసరిస్తుండటంతో వీరిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాయి.కీలకంగా వ్యవహరిస్తున్న జీవన్... రాష్ట్రంలో నేపాలీలకు ఉద్యోగాలు ఇప్పించడం, నేరాలు చేయించడంలో జీవన్ అనే నేపాలీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు ఓ దళారిగా వ్యవహరిస్తూ సంపన్నుల ఇళ్లల్లో నేపాలీలను పనిలో పెడుతున్నాడు. ఆపై పథక రచన చేసి, మిగతవారిని రంగంలోకి దింపి టార్గెట్ చేసిన ఇంట్లో నేరం చేయిస్తున్నాడు. పథకం సిద్ధమైన తర్వాత నేరం జరగడానికి ముందు తొలుత అతగాడే నేపాల్ వెళ్లిపోతాడు. అతని సహచరులు ఇక్కడే ఉండి ప్రణాళికను అమలు చేస్తారు. కొన్నాళ్లకు మరో పేరుతో వస్తున్న జీవన్ నేర పంథా కొనసాగిస్తున్నాడని పోలీసులకు ఆధారాలు లభించాయి. అతడి కోసం ఆరా తీస్తున్నారు.
వీడియోలు
ఒక్క మ్యాచ్ ఆడకుండానే.. ఇంగ్లాండ్ లో బుడ్డోడి ప్రకంపనలు
తండ్రి , కొడుకులు అవినీతిలో PHD చేశారు..!
స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు
Mahua Moitra: సిగ్గు,ధైర్యం ఉంటే రాజీనామా చేసి... అంటూ సవాల్
Viral Video: సగం తిన్న యాపిల్ ను జనాల్లోకి విసరిన డీకే శివకుమార్
ఇంత దరిద్రపు పాలనను .. ఎప్పుడు చూడలేదు..!
స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ
రేపు విశాఖలో జగన్ పర్యటన
ట్రంప్ ఒక్క ఫోన్ కాల్తో వెనక్కి తగ్గిన..!
ప్రస్టేషన్ ఎక్కువై YSRపై నిందలు, KVP మొట్టికాయలు

