ప్రధాన వార్తలు

వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తోందని, చేసిన తప్పును అవతలి వాళ్ల మీదకు నెట్టేయడం చంద్రబాబుకి, ఆయన తనయుడు నారా లోకేష్ అలవాటైన పనేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డాటా సెంటర్పై కూటమి ప్రభుత్వం.. దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాల్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే ఉద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేస్తోంది తెలియజేస్తూనే కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు.జగన్ ప్రెస్మీట్ హైలైట్స్గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారుగ్రామ సచివాలయం, వలంటీర్లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారుపొలిటికల్ గవర్నరెన్స్ వల్లే రాష్ట్రం అతలాకుతలం అవుతోంది ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకని పరిస్థితిబీమా సంగతి పట్టించుకోవడం లేదువర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం రైతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేయలేదుసబ్సిడీ విత్తనాలు ల్లేవ్ఉల్లి రైతులను గాలికి వదిలేశారుఅరటి, టమాట, పత్తికి డిమాండ్ లేదుక్వింటాల్ పత్తికి ఒకప్పుడు రూ.12 వేలు ఉండేది.. ఇప్పుడు రూ.5 వేలు కూడా లేదుటమాట రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారుపరిస్థితులు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారురాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలోనే కనిపిస్తున్నాయిస్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయిందివిద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదువైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయిప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కలేదుకనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారుమా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోందిదానిని గవర్నర్కు సమర్పించి.. రాష్ట్ర ప్రజల రెఫరండంను తెలియజేస్తాంఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారుజీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదుఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదుఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదుఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారుఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారుటీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారుఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారుమొత్తంరూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారుప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు.. ఒక్క నెల ఇచ్చారంతేకనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదుకాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారుపోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ పెండింగ్లో పెట్టారుఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదుఅధికారంలోకి వచ్చిన వారంలోనే ఐఆర్ ఇచ్చాంకోవిడ్ సమయంలోనూ వాళ్ల సంక్షేమం గురించే ఆలోచించాంమేం తెచ్చిన జీపీఎస్ను కేంద్రం, రాష్ట్రాలు ప్రశంసించాయిఆనాడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో ఉద్యోగులనూ చంద్రబాబు మోసం చేశారునాలుగు డీఏలు పెండింగ్లో పెట్టారుఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదుఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారుఅది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్లో ఇస్తామని అంటున్నారు)డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారుదీనికే దీపావళి సంబురాలు అంంటూ ప్రకటనలు చేస్తున్నారుకోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదుఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం తనను చూసే గూగుల్ వైజాగ్కి వచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారుహైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారుదాని పేరే హైటెక్ సిటీహైటెక్ సిటీకి ఆరు ఎకరాల్లో పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరుఅసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్తో సంబంధమే లేదుఅయినా అభివృద్ధి తనదేనంటూ బిల్డప్ ఇస్తుంటారువాస్తవం ఏంటంటే.. 2003-04 వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచే హైదరాబాద్లో నిజమైన అభివృద్ధి మొదలైందిఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయిఆ తర్వాత వైఎస్సార్ లేకపోయినా.. ఆ అభివృద్ధి అలా కొనసాగిందికేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్మెంట్ జరిగిందిక్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబుకి ఉన్న దుర్మార్గపు నైజంహైదరాబాద్ అభివృద్ధికి అసలు చంద్రబాబుకే సంబంధం లేదు డాటా సెంటర్ వల్ల ఉద్యోగవకాశాలు తక్కువే, కానీ, భవిష్యత్తులో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందిభవిష్యత్తులో పెద్ద మార్పులకు డాటా సెంటర్ కీలకందీనికి వైఎస్సార్సీపీ హయాంలోనూ నాంది అప్పుడే పడిందిఅందుకే తక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా నాడు అదానీతో ఒప్పందం చేసుకున్నాంఅదే సమయంలో.. ఐటీ పార్క్ రీక్రియేషన్, స్కిల్ సెంటర్ పెట్టి 25 వేల ఉద్యోగాలు కావాలని కోరాం ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్కి రాబోతోందిముమ్మాటికీ వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇదివేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారుఅదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారువైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయిఅదానీ కట్టాక గూగుల్ దీనిని వాడుకుంటుందిఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారుచంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదుజగన్ సర్కార్కు ఆ క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదువైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు 2020లో.. కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం2021 మార్చిలో సింగపూర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ రాశాం2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్కు వైజాగ్లో శంకుస్థాపన కూడా చేశాంఆనాడే.. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే అంకురార్పణ జరిగిందిదీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చిందివైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇదివైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే వైజాగ్ గూగుట్ డాటా సెంటర్ గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం..వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాంరాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయిందిఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందిక్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్రపరిస్థితి వీక్వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణంలిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగిందిఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేశారుకోర్టుకు వెళ్లడంతో సైలెంట్ అయిపోయారుచంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్ అసలు జనార్దన్రావు ఎవరు?జనార్దన్తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారుఏదో ఫంక్షన్లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారుతన రెండు ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారుతప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారుఈలోపే డైవర్షన్ పాలిటిక్స్తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించిందిలాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాంషాపుల సంఖ్య తగ్గించాంటైమింగ్ పెట్టి నడిపించాంఇల్లీగల్ పర్మిట్ రూమ్లు లేవుక్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లుకాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాంఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు ఇదసలు హైలైట్ కావాల్సిన అంశంలిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల దాకా అంతా చంద్రబాబు మనుషులే దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?ఎవరి క్యూఆర్కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోందిరేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారునకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులేతమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులేబెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులేసీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయిఅందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు జనార్దన్రావు వీడియోలో ఎలా మాట్లాడారు?.. ఫోన్ పోయిందని జనార్దనే చెప్పాడు. మరి ఫోన్ పోతే చాటింగ్ ఎలా బయటకు వచ్చింది?. అసలు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?ఈ 20 రోజుల్లో జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?.. పాస్పోర్టును ఎందుకు సీజ్ చేయలేదు?.. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పుడు.. పెద్దిరెడ్డి సోదరుడిపై జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎందుకు పోటీకి నిలబెట్టారు? టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు?తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని అఫిడవిట్లోనే జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.. మరి అప్పుడు ఆఫ్రికా లింకులు చంద్రబాబుకి, ఆయన టిష్యూ పేపర్లకు కనిపించలేదా?పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది?నకిలీ మద్యం బయటపడ్డాక ఎన్ని తనిఖీలు నిర్వహించారు? ఎన్ని బాటిళ్లను పట్టుకున్నారు?అన్ని చోట్ల దొరుకుతుందనే తనిఖీలు చేయలేదా?చంద్రబాబుకు ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారుఆర్గనైజ్డ్గా క్రైమ్చేయడం చంద్రబాబు, లోకేష్లకు అలవాటేఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులుమాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారుఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్లంటూ హడావిడి చేశారుచేసేది వీళ్లే.. కథా స్క్రీన్ప్లే అంతా వాళ్లదే ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!ఒక మొలకల చెరువులోనే 20 వేల లీటర్ల నకిలీ మద్యం బయటపడిందికల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లేచేసింది.. చేయిస్తోంది చంద్రబాబేటాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారుప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది విజయవాడ సీపీ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారుఅక్రమ మద్యం కేసులో మా పార్టీ వాళ్లను అనవసరంగా వేధిస్తున్నారుఅన్నమయ్య జిల్లా తంబళపళ్లె, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా పరవాడ, పాలకొల్లు, నెల్లూరులోనూ నకిలీ మద్యం బయటపడిందిపట్టుబడకుంటే వేల లీటర్ల మద్యం తయారయ్యేదే రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయిప్రైవేట్ మద్యం మాఫియా నడుస్తోందిపోలీసుల భద్రత నడుమ గ్రామాల్లో అమ్మకాలుఆక్షన్లు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారుబెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్రూమ్లు నిర్వహిస్తున్నారుడబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారుప్రభుత్వ ఖజానాకు వేల కోట్లకు గండి కొడుతున్నారువాటాల్లో తేడాలు రావడంతోనే ఇదంతా బయటపడింది ఏపీలో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతమైందిఇలాంటి మాఫియా ప్రపంచంలో ఎక్కడా చూడలేదునకిలీ మద్యం కోసం చిన్నపాటి పరిశ్రమల్నే ఏర్పాటు చేశారునకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది వాళ్లే.. బెల్ట్షాపులు పెట్టి నడిపిస్తోంది వాళ్లే ఇవాళ నాలుగు అంశాల మీద మాట్లాడుకుందాంనకిలీ మద్యం కేసులో నాణేనికి రెండో వైపు గురించి.. విశాఖలో డేటా సెంటర్ గురించి చంద్రబాబు చేస్తున్న గిమ్మికులు, డ్రామాల గురించి, అసలు వాస్తవాలేంటివి అనేది..ఉద్యోగులకు ఏరకంగా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు?.. ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నారనేదానిని మీడియా మీద ప్రజల దృష్టికి తీసకెళ్తా.. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, ఈ ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా..

చిరు-బాలయ్య ఎపిసోడ్పై స్పందించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మీద కాస్త దురుసు వ్యాఖ్య చేశారు. ఇది అటు అభిమానుల మధ్యే కాదు.. ఇటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే తాజాగా ఈ ఎపిసోడ్పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై ఓ రిపోర్టర్ వైఎస్ జగన్ను స్పందన కోరారు. ‘‘అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి?. పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుతించారు?. అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్కు బుద్ది లేదు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోంది. అలా మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి’’ అని జగన్ అన్నారు. ఇదిలా ఉంటే..శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఆనాడే ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదని, ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్ప్రీత్ కౌర్ 10, రిచా ఘోష్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్మేరీ మైర్, అమేలియా కెర్, సూజీ బేట్స్కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో మొదటి మూడు సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు

ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!
దీపావళి సెలవులు ముగిసిపోయాయి. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం థియేటర్లలో దీపావళికి టాలీవుడ్ చిత్రాలు చేశాయి. ఇక ఈ వారంలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తనయుడు హీరోగా వస్తోన్న బైసన్ రిలీజవుతోంది. ఇది తప్ప పెద్దగా బజ్ ఉన్న సినిమాలేవీ రావడం లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే ఇప్పటికే హిట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు ఆడియన్స్. ఈ శుక్రవారం జాన్వీ కపూర్ పరమ్ సుందరి, విజయ్ ఆంటోనీ భద్రకాళి, కురుక్షేత్ర లాంటి యానిమేషన్ సినిమాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. ఓటీటీ ప్రియులు ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్కురుక్షేత్ర - 2 (యానిమేటెడ్ సిరీస్) - అక్టోబర్ 24ఎ హౌజ్ ఆఫ్ డైనమైట్ - అక్టోబర్ 24పరిష్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 24ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25అమెజాన్ ప్రైమ్..ఈడెన్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24పరమ్ సుందరి(బాలీవుడ్ సినిమా) - అక్టోబర్ 24అడ్వెంచర్ టైమ్- ఫియాన్ అండ్ కేక్-సీజన్2 (యానిమేషన్)- అక్టోబర్ 24బోన్ లేక్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24(రెంట్ పద్దతిలో)జియో హాట్స్టార్..భద్రకాళి(తమిళ సినిమా) - అక్టోబర్ 24ది కర్దాసియన్స్ (సీజన్-7)- అక్టోబర్ 24మహాభారత్: ఏక్ ధర్మయుధ్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 25ఆహా..అక్యూజ్డ్(తమిళ సినిమా)- అక్టోబర్ 24లయన్స్ గేట్ ప్లే..ది అప్రెంటిస్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24నడికర్(మలయాళ సినిమా)- అక్టోబర్ 24ఫ్రీ లాన్స్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24యాపిల్ టీవీ ప్లస్..స్టిల్లర్ అంజ్ మియారా నథింగ్ ఈజ్ లాస్(హాలీవుడ్)- అక్టోబర్ 24సన్ నెక్ట్స్..టేల్స్ ఆఫ్ ట్రేడిషన్(తమిళ సినిమా)- అక్టోబర్ 24జంబూ సర్కస్(కన్నడ సినిమా)- అక్టోబర్ 24హెచ్బీవో మ్యాక్స్..వెపన్స్-(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24

నక్క తోక తొక్కిన ‘గోల్డ్ బాండ్లు’.. రూ.100కు రూ.325
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 325 శాతం రాబడిని వస్తోందన్నమాట.వాస్తవానికి అక్టోబర్ 2017లో గ్రాముకు రూ.2,987 వద్ద జారీ చేసిన బాండ్లు ఇప్పుడు రూ. 9,717 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 17, 20, 22 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.ఎస్జీబీలకు (Sovereign Gold Bonds ) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.సావరిన్ గోల్డ్ బాండ్లు అందుబాటులో లేనప్పటికీ డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికీ ఇప్పటికీ ఇతర మార్గాలు ఉన్నాయి. అవే గోల్డ్ ఈటీఎఫ్లు (Gold Exchange Traded Funds - Gold ETFs). వీటిని మ్యూచువల్ ఫండ్ సంస్థలు జారీ చేస్తాయి. వీటిలో పెట్టిన పెట్టుబడులు స్టాక్ ఎక్స్చేంజ్లలో షేర్లలా ట్రేడ్ అవుతాయి. గోల్డ్ ఈటీఎఫ్ ధర బంగారం మార్కెట్ ధరకు నేరుగా అనుసంధానమై ఉంటుంది. బంగారం ధర పెరిగితే, ఈటీఎఫ్ యూనిట్ విలువ కూడా పెరుగుతుంది.

కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే!
కేరళలోని కవస్సేరిలో జరిగిన ఒకముచ్చటైన పెళ్లి నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీపావళి నాడు పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు లావణ్య , విష్ణు వివాహం సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అయితే అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఆ విశేషమేమిటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మ్యారేజ్ హాలులోనే పంచాయితీ అధికారి ద్వారా వివాహ ధృవీకరణ పత్రాన్ని అందుకోవడమే ఈ స్టోరీలోని ప్రత్యేకత. అదీ డిజిటల్ విధానం ద్వారా. పెళ్లి అయిన మరుక్షణమే ఈ నూతన జంట మ్యారేజ్ రిజిష్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకుంది. కేరళలో వివాహ రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'K-SMART' అనే డిజిటల్ వేదిక ద్వారా ఇది సాధ్యమైంది. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్కు ఇదొక మైలు రాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు. వివాహం జరిగిన వెంటనే, ఈ జంట K-స్మార్ట్ వీడియో KYC వ్యవస్థ ద్వారా వారి వివాహ రిజిస్ట్రేషన్ను పూర్తి చేశారు. అంతేకాదు దీపావళి సెలవు రోజు అయినప్పటికీ కవస్సేరి పంచాయతీ అధికారులు దరఖాస్తును రియల్ టైమ్లో ప్రాసెస్ చేసి ఆమోదించడం, సర్టిఫికెట్ను నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా జంటకు అందించడం విశేషం. పంచాయతీ సభ్యుడు టి వేలాయుధన్ నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. కవస్సేరి పంచాయతీ సిబ్బంది వారి అంకితభావానికి విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.Kerala sets an example !! In Kawassery, Kerala, Lavanya and Vishnu got married and registered their marriage instantly through Video KYC.The Panchayat member even handed over a digitally verified certificate with their photo on the same day.Respected Panchayati Raj Minister… pic.twitter.com/HGAnoU5cu0— Sreekanth B+ve (@sreekanth324) October 23, 2025దీంతో చాలా మంది కాబోయే జంటల్లో ఇది ఎంతో సంతోషాన్ని నింపింది. ఎందుకంటే పెళ్లి తరువాత, వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు, ఫోటోలు, సర్టిఫికెట్లు పట్టుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగి కష్టాలేమీ లేకుండానే, ఆన్లైన్ వెరిఫికేషన్ కావడం, క్షణాల్లో సర్టిఫికెట్ రావడం సంతోషమే కదా. కేరళ ఒక ట్రెండ్ సెట్ చేసిందంటూ కొనియాడుతున్నారు ప్రజలు'K-SMART' అనే డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, వీడియో KYC ద్వారా వివాహ నమోదును పూర్తి చేయవచ్చు . తక్షణమే డిజిటల్లీ సైన్డ్ సర్టిఫికెట్ పొందవచ్చు. వీడియో KYCలో జంటలు, సాక్షులు ఆధార్ ఆధారిత OTP లేదా ఇమెయిల్ ద్వారా తమ గుర్తింపును వీడియో ద్వారా ధృవీకరించుకోవచ్చు. ఇది పూర్తయిన తరువాత డిజిటల్ సంతకం చేసిన వివాహ ధృవీకరణ పత్రాలు జారీ అవుతాయి. వీటిని వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ విధానం ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు (NRIs) ఎంతో సౌకర్యవంతంగా ఉంది, ఎందుకంటే వారు భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం లేదు. కె-స్మార్ట్ ప్రారంభించినప్పటి నుండి, కేరళ 1.5 లక్షలకు పైగా వివాహ రిజిస్ట్రేషన్లు నమెదయ్యాయి. దాదాపు 63 వేలు వీడియో KYC ద్వారా పూర్తయ్యాయి.

‘ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారు’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు. కేశినేని చిన్నికి సంబంధించిన ఆధారాలను కొలికపూడి బయటపెట్టారు. రూ.5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్ ఇచ్చారన్న కొలికపూడి.. సంచలన ఆధారాలను బయటపెట్టారు.2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను ఐదు కోట్లు అడిగాన్న కొలికపూడి.. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆయన బయటపెట్టారు. ‘‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫ్రిబవరి 8న మరో రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫిబ్రవరి 14న రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. కేశినేని చిన్ని పీఏ మోహన్కు రూ. 50 లక్షలు.. గొల్లపూడిలో నా మిత్రుల ద్వారా రూ.3.5 కోట్లు ఇచ్చా.. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం’’ అంటూ కొలికపూడి సంచలన పోస్టు పెట్టారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.మరోవైపు.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ‘‘తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకూ రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లాయి’’ అని చిన్ని వ్యాఖ్యానించారు.

ఆపరేషన్ మధ్యలో క్లారినెట్ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఇటీవల బ్రెయిన్కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒక మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.లండన్లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్లో క్రౌబేర్కు చెందిన 65 ఏళ్ల డెనిస్ బెకన్(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అయినా ఆమె పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్స్టెడ్ కచేరీ బ్యాండ్ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది బేకన్. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు. అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. Patient with Parkinson's disease plays clarinet during brain procedure at London hospital pic.twitter.com/en2vpRRfaA— The Associated Press (@AP) October 23, 2025 (చదవండి: కూతురి డ్రీమ్, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..)

ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వ్యవస్థీకృత పద్దతిలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోందన్నారు. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని తెలిపారు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోంది. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. ఆక్షన్లు వేసి మరీ బెల్లు షాపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఇది బయటకు వచ్చింది. ములకలచెరువులోనే 20208 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయి. 1050 లీటర్ల స్పిరిట్ అక్కడ దొరికింది. వీటితో వేల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేయవచ్చు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారు.ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అనకాపల్లి జిల్లా పరవాడలోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీకి బయటకు వచ్చింది. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లే, నెల్లూరులోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ప్రైవేటు మాఫియా ఆధ్వర్యంలోని మద్యం షాపులకు బెల్టుషాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లకు సరఫరా చేస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!. కల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లే.. చేసింది.. చేయిస్తోంది చంద్రబాబే. టాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారు. ఎల్లో మీడియా బిల్డప్పులు..ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?. నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేష్లకు అలవాటే. ఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులు. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారు. ఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్లంటూ హడావిడి చేశారు. చేసేది వీళ్లే.. కథా స్క్రీన్ప్లే అంతా వాళ్లదే. ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. ఎన్టీఆర్కు వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు అన్నీ మోసాలే. తప్పులు చేయడం.. వేరే వారిపై నెపం నెట్టేయడం బాబుకే సాధ్యం. బాబు నేరాలను కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. టాపిక్ డైవర్షన్లో భాగంగా ఎదుటివారిపై బురద చల్లుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తారు. నకిలీ మద్యం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి నిందితుడు. విదేశాల్లో ఉన్న జనార్థన్ రావు రెండు రోజుల్లో లొంగిపోతాడంటూ ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తారు. క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం..అసలు జనార్దన్రావు ఎవరు?. జనార్దన్తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఏదో ఫంక్షన్లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారు. తన రెండు ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారు. తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఈలోపే డైవర్షన్ పాలిటిక్స్తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించింది. లాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. షాపుల సంఖ్య తగ్గించాం. టైమింగ్ పెట్టి నడిపించాం. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు లేవు. క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లు. కాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారురేపల్లే పేకాట కింగ్..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు. ఇదసలు హైలైట్ కావాల్సిన అంశం. లిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల దాకా అంతా చంద్రబాబు మనుషులే. దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?. ఎవరి క్యూఆర్కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?. మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?. క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది. ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోంది. రేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే తమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే. బెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులే. సీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయి. అందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు. లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణం. లిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగింది. ఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్’ అని విమర్శించారు.

సంచలనం.. డీజీపీ వద్ద ‘లైంగిక వేధింపుల పంచాయితీ’లో ఐపీఎస్ vs ఎస్సై భార్య
రాయ్పూర్: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులపై లైంగిక ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవటంతోపాటు కుమారుడు మరణానికి కారణం అయ్యాడన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా,ఛత్తీస్గఢ్లో ఐజీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి రతన్లాల్ డాంగీపై ఓ ఎస్ఐ భార్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది2003 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఐజీ హోదాలో ఉన్న రతన్లాల్ డాంగీపై ఓ ఎస్ఐ భార్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఐపీఎస్ అధికారి రతన్లాల్ డాంగీపై బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేశారు.డీజీపీకి చేసిన ఫిర్యాదులో బాధితురాలు రతన్లాల్ డాంగీ తనపై గత ఏడు సంవత్సరాలుగా మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందుకు ఊతం ఇచ్చేలా తనవద్ద కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పారు.వాటి ఆధారంగా ఈ కేసు విచారణ పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఛత్తీస్గఢ్ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ క్రమంలో బాధితురాలు తనపై డీజీపీకి ఫిర్యాదు చేయడంపై రతన్ లాల్ డాంగీ అప్రమత్తయ్యారు. తిరిగి బాధితురాలిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో డాంగీ బాధితురాలిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. డాంగీ తనను తాను మహిళా బాధితుడినంటూ డీజీపీ వద్ద మొరపెట్టుకున్నారు. బాధితురాలు తనను బలవంతంగా వీడియో కాల్స్లో అసభ్యంగా ప్రవర్తించమని ఒత్తిడి తెచ్చిందన్నారు. ఇంకా చెప్పుకోలేని విధంగా మహిళ తనని ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే, డాంగీ చేసిన ఆరోపణలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఎస్సై భార్యను వేధిస్తుంటే ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడే.. ఐపీఎస్ రతన్లాల్ డాంగీ డీజీపీతో ఎందుకు భేటీ అయ్యారు?. ఉన్నతస్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారిని ఎస్ఐ భార్య ఎలా వేధిస్తారు?. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?ఇది ఐపీఎస్ అధికారిపై ఆరోపణల కేసు కావడంతో, పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులపై ఒత్తిడి ఉందా? విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందా?. ఈ కేసు విచారణను పారదర్శకంగా, న్యాయంగా జరిపి బాధితుడెవరో, నిందితుడెవరో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఛత్తీస్గఢ్ డీజీపీపై ఉంది. ఒకవేళ ఈ కేసును పోలీస్శాఖ మసిపూసిమారేడుగాయగా చేస్తే పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందనే అభిపప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు విచారణలో నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం ఎవరికి దక్కుతుందో? బాధితులు ఎవరో? కాలమే నిర్ణయించాల్సి ఉంది.
హ్యుందాయ్ సేల్స్ హెడ్గా సునీల్ మూల్చందాని
రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్
ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియామకం
ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!
రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం లేఖ
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!
నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
మహిళా న్యాయవాదిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. విచారణ సమయంలో ఏం చేశారంటే?
బిగ్బాస్ 'తనూజ' క్రేజ్.. పదేళ్ల నాటి హిట్ సాంగ్ ఇప్పుడు వైరల్
పెళ్లి తర్వాత శోభితా తొలి దీపావళి కళ్లు తిప్పుకోలేకపోతున్న నాగ చైతన్య (ఫోటోలు)
నటి అనసూయ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
చాయ్వాలా ఇంట తనిఖీలు.. షాకైన అధికారులు
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తి, ధనలాభాలు
బంగారం, వెండి క్రాష్..!
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఆప్తుల నుంచి శుభవార్తలు
పొరపాటున శిరీష్కు కాబోయే సతీమణి ఫోటో షేర్ చేసిన 'అల్లు స్నేహ'
ఫ్యామిలీతో యాంకర్ రష్మీ గౌతమ్ దీపావళి వేడుకలు (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
రిలయన్స్ రిటైల్ 600 డార్క్ స్టోర్లు ప్రారంభం
'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
ఏపీలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్
బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా
ఉద్యోగులకు డీఏ ఎగ్గొట్టడానికి కొత్త లెక్కలు కనిపెడుతున్నార్సార్!!
సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్
గోల్డ్ ఢమాల్: భారీగా తగ్గిన బంగారం ధరలు
244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి
వలంటీర్లు అయిపోయారు.. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు.. ఇంకా జాబితాలో ఎవరున్నార్సార్!!
హ్యుందాయ్ సేల్స్ హెడ్గా సునీల్ మూల్చందాని
రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్
ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియామకం
ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!
రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం లేఖ
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!
నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
మహిళా న్యాయవాదిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. విచారణ సమయంలో ఏం చేశారంటే?
బిగ్బాస్ 'తనూజ' క్రేజ్.. పదేళ్ల నాటి హిట్ సాంగ్ ఇప్పుడు వైరల్
చాయ్వాలా ఇంట తనిఖీలు.. షాకైన అధికారులు
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తి, ధనలాభాలు
బంగారం, వెండి క్రాష్..!
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఆప్తుల నుంచి శుభవార్తలు
పొరపాటున శిరీష్కు కాబోయే సతీమణి ఫోటో షేర్ చేసిన 'అల్లు స్నేహ'
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
రిలయన్స్ రిటైల్ 600 డార్క్ స్టోర్లు ప్రారంభం
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా
ఏపీలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్
ఉద్యోగులకు డీఏ ఎగ్గొట్టడానికి కొత్త లెక్కలు కనిపెడుతున్నార్సార్!!
సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్
గోల్డ్ ఢమాల్: భారీగా తగ్గిన బంగారం ధరలు
244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి
వలంటీర్లు అయిపోయారు.. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు.. ఇంకా జాబితాలో ఎవరున్నార్సార్!!
దీపావళి వేడుకల్లో నాగచైతన్య-శోభిత.. పెళ్లి తర్వాత తొలిసారిగా..!
జియో రీచార్జ్ ప్లాన్: డైలీ 3జీబీ డేటా.. ఫ్రీగా నెట్ఫ్లిక్స్
గిల్తో పాటే అరంగేట్రం.. పాపం ఆ ఐదుగురు.. జాడైనా లేదు!
సినిమా

స్టార్ హీరోయిన్ బర్త్ డే.. విషెస్ చెప్పిన మాజీ ప్రియుడు!
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో పాయిజన్ బేబీ పాట అనే ఐటమ్ సాంగ్తో అలరించింది. అంతేకాకుండా ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ సిరీస్లో జడ్జిగా వ్యవహరిస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇవాళ 53వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు మలైకాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మలైకా పుట్టినరోజున ఆమె మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ సైతం బర్త్ డే విషెస్ చెప్పారు. ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్డే మలైకా.. మీరు ఎప్పుడు ఇలాగే ఎగురుతూ.. నవ్వుతూ ఉండాలి.. అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన మలైకా తన మాజీ ప్రియుడి పోస్ట్కు రిప్లై కూడా ఇచ్చింది. ధన్యవాదాలు అంటూ లవ్ సింబల్ ఎమోజీని జతచేసింది. కాగా.. ఈ ఏడాది జూన్లో అర్జున్ కపూర్ పుట్టినరోజున.. మలైకా సోషల్ మీడియా ద్వారా అర్జున్కు శుభాకాంక్షలు తెలిపింది.అర్జున్ కపూర్తో డేటింగ్..మలైకా అరోరా- అర్జున్ కపూర్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు గతేడాది విడిపోయినట్లు తెలిసింది. దీపావళి సందర్భంగా ఓ ఈవెంట్లో మాట్లాడిన అర్జున్ కపూర్.. తాను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానంటూ మలైకాతో బ్రేకప్పై క్లారిటీ ఇచ్చాడు. అయితే గతేడాది సెప్టెంబర్లో ఆమె తండ్రి అనిల్ మెహతా మరణించిన తర్వాత అర్జున్ కపూర్ ఆమెను ఇంటికెళ్లి పరామర్శించాడు. ఇటీవలే వీరిద్దరు ముంబయిలో జరిగిన హోమ్బౌండ్ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించుకున్నారు.అర్బాజ్ ఖాన్తో పెళ్లి- విడాకులు..కాగా.. మలైకా అరోరా గతంలో అర్బాజ్ ఖాన్ను వివాహం చేసుకుంది. 1998లో వివాహం చేసుకున్న ఈ జంటకు అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. వీరిద్దరు 2016లో విడిపోతున్నట్లు ప్రకటించి.. 2017లో విడాకులు తీసుకున్నారు.

బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఇటీవలే హారర్ కామెడీ థ్రిల్లర్ థామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే ఈ మధ్యే తెలుగు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికంటే ముందు రష్మికకు లవ్ బ్రేకప్ అనుభవం ఉన్న విషయం తెలిసిందే. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty)తో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా జరుపుకుంది. పెళ్లి బంధంతో ఒక్కటవుతారనుకుంటే.. బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.మగవారిలా గడ్డం పెంచలేంఇటీవల ఓ భేటీలో రష్మిక.. ప్రేమ, బ్రేకప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రేమ, బ్రేకప్లో విషయంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా బాధపడతారనే మాటను అంగీకరించనంది. బ్రేకప్ వల్ల మహిళలే ఎక్కువ బాధ, వేదనకు గురవుతున్నారని పేర్కొంది. తమ బాధను వ్యక్తం చేయడానికి మగవారిలా గడ్డం పెంచడం, మద్యం తాగడం వంటివి చేయలేమంది. మనసులోనే బాధను భరిస్తుంటామని, బయటకు వ్యక్తం చేయలేమని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా రష్మిక మందన్నా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.చదవండి: ప్రభాస్ బ్రాండ్.. రూ. 7వేల కోట్ల మార్కెట్

ఉపాసన గుడ్న్యూస్.. రెండోసారి తండ్రి కానున్న రామ్ చరణ్
నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ దీపావళి తనకు డబుల్ సంతోషాన్ని తెచ్చిందని ఒక వీడియోను పోస్ట్ చేశారు. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెసింగ్స్ అంటూ పేర్కొనడంతో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. కుటుంబ సభ్యులు అందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించడంతో మెగా వారసుడు రాబోతున్నాడంటూ ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన మొదటిసారి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వారి ఇంట్లో ఇలాగే ఒక వేడుకలా చేశారు. తాజాగా ఉపాసన షేర్ చేసిన వీడియోలో ఇరు కుటుంబ సభ్యులు అందరూ చేరి ఆమెకు కొత్త దుస్తులు అందించడం చూడొచ్చు. ఆపై ఆమెకు పూలు, పండ్లు, కానుకలు అందించిన పెద్దలు ఆశీర్వదించారు. మెగా కుటుంబంతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు అందరూ అక్కడ సందడిగా కనిపించారు.మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఉపాసన ఈ శుభవార్త చెప్పగానే 'సింబా' వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చైతూ పెళ్లికి ముందే తన ప్రియురాలు జైనాబ్ రవ్దీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్.. జూన్లో ఆమె మెడలో మూడుముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాలతో కలిసి సందడి చేశారు.ఈ ఏడాది పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి తొలిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పండుగ సెలబ్రేషన్స్ ఫోటోను అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపావళి శుభాకాంక్షలు.. ఈ పండుగ అందరికీ శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో నిండిన ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ జంటను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అఖిల్- జైనాబ్ జంటగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Zainab Ravdjee (@zainabravdjee)
న్యూస్ పాడ్కాస్ట్

క్రెడిట్ చౌర్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడు

చంద్రబాబు దిగిపోయాకే పెరిగిన ఐటీ ఎగుమతులు

గూగుల్ డేటా సెంటర్.. చంద్రబాబు రోల్ నిల్..

అదానీ పేరెందుకు ప్రస్తావించడం లేదు?

అక్రమ మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు.. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్లను అప్రూవర్లుగా మార్చే కుతంత్రం

డీఏపై దొంగాట.. దీపావళి వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు పిడుగుపాటులా చంద్రబాబు సర్కారు చీకటి జీవోలు జారీ

దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు.. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు

కూటమి సర్కార్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తాగునీటి బాదుడు

తుస్సుమన్న చంద్రబాబు కానుక... ప్రభుత్వ ఉద్యోగులకు దగా... నాలుగు డీఏలకు గాను ఒకే ఒక్క డీఏతో సరిపెట్టిన వైనం

ఏపీలో అద్దేపల్లి జనార్దనరావు డంప్ వద్ద స్వాధీనం చేసుకున్నది నకిలీ మద్యమే... ల్యాబ్ పరీక్షల సాక్షిగా బట్టబయలు
క్రీడలు

తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న మ్యాచ్లో 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. మంధనకు ఈ ఏడాది ఇది ఐదో శతకం. ఓవరాల్గా వన్డేల్లో 14వ శతకం. ప్రస్తుత ప్రపంచకప్లో తొలి మ్యాచ్ల్లో నిరాశపరిచిన మంధన.. గత రెండు మ్యాచ్లుగా సత్తా చాటుతూ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన చివరి రెండు మ్యాచ్ల్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో మెరిసింది. వాస్తవానికి ఆ రెండు అర్ద సెంచరీలు కూడా సెంచరీల్లోకి మారాల్సింది. అయితే అవి తృటిలో చేజారాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. ఆది నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మంధన, ప్రతీక రావల్ (77) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ను నిర్మించారు. అర్ద సెంచరీ తర్వాత మంధన గేర్ మార్చగా.. ప్రతీక రావల్ అదే టెంపోలో బ్యాటింగ్ చేస్తుంది. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 192 పరుగులుగా ఉంది. మంధన 100, ప్రతీక రావల్ 77 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో మొదటి మూడు సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం

IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆతిథ్య ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు.. తాజాగా అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ జయభేరి మోగించారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాఅడిలైడ్ ఓవల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. పర్యాటక భారత జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఒకే ఓవర్లో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) వికెట్ తీసి జేవియర్ బార్ట్లెట్ ఆసీస్కు శుభారంభం అందించాడు.రాణించిన రోహిత్, శ్రేయస్ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. రోహిత్ (97 బంతుల్లో 73), అయ్యర్ (77 బంతుల్లో 61) పరుగులతో రాణించగా.. మిగతా వారిలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (11) నితీశ్ రెడ్డి (8) రూపంలో కీలక వికెట్లు దక్కించుకున్నాడు. పేసర్లలో బార్ట్లెట్ గిల్, కోహ్లి, వాషింగ్టన్ సుందర్ (12) వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. మిచెల్ స్టార్క్ రోహిత్ శర్మ, అర్ష్దీప్ సింగ్ (13)లను అవుట్ చేశాడు.264 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (11)ను అర్ష్దీప్ త్వరగానే పెవిలియన్కు పంపగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 28)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.అదరగొట్టిన షార్ట్, కన్నోలి అయితే, వన్డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ అద్భుత అర్ధ శతకం (74)తో మెరిసి మ్యాచ్ను తమ వైపు తిప్పే ప్రయత్నం చేయగా.. మ్యాట్ రెన్షా (30) అతడికి సహకరించాడు. షార్ట్, రెన్షా వేసిన పునాదిపై ఆల్రౌండర్ కూపర్ కన్నోలి మిచెల్ ఓవెన్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.Just the wicket #TeamIndia needed! 🤩#NitishKumarReddy gets the wicket and #MohammedSiraj makes amends for the dropped catch. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YZwdPY0nr7— Star Sports (@StarSportsIndia) October 23, 2025 ఆఖర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినా కన్నోలి పట్టుదలగా నిలబడ్డాడు. ఓవెన్ 23 బంతుల్లో 36 పరుగులతో వేగంగా ఆడి.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వెనుదిరగగా.. బార్ట్లెట్ (3), స్టార్క్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.అయితే, కన్నోలి మాత్రం నిలకడగా ముందుకు సాగాడు. 53 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయిన ఆస్ట్రేలియా లక్ష్యం పూర్తి చేసింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి.. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు సిడ్నీ వేదిక. కాగా వన్డే సారథిగా గిల్కు తొలి సిరీస్లోనే ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఇక రెండో వన్డేలో జంపాకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ

సిరీస్ డిసైడర్.. ఆరంభం అదిరినా, ఆఖర్లో తడబడిన బంగ్లాదేశ్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాటర్లు మహిదుల్ ఇస్లాం 6, రిషద్ హొసేన్ 3, నసుమ్ అహ్మద్ 1 పరుగుకు ఔటయ్యారు. ఆఖర్లో నురుల్ హసన్ (16 నాటౌట్), కెప్టెన్ మెహిది హసన్ (17) ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించడంతో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డేలో బంగ్లాదేశ్, రెండో వన్డేలో వెస్టిండీస్ (సూపర్ ఓవర్) గెలిచాయి. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వెస్టిండీస్ బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది.చదవండి: IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్లో కీలక చేరిక

IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్లో కీలక చేరిక
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్కు ముందు గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ జోషి (2023-2025) స్థానంలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించింది. బహుతులే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ పదని నుంచి వైదొలిగాడు. తదుపరి సీజన్లో బహుతులే రికీ పాంటింగ్ (హెడ్ కోచ్) నేతృత్వంలోని కోచింగ్ బృందంలో చేరతాడు. ఈ టీమ్లో బ్రాడ్ హడ్డిన్, జేమ్స్ హోప్స్ అసిస్టెంట్ కోచ్లుగా ఉన్నారు. బహుతులే చేరిక శ్రేయస్ (Shreyas Iyer) బృందానికి అదనపు బలాన్ని ఇస్తుందని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. 51 ఏళ్ల బహుతులేకు దేశవాలీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ జట్లకు కోచింగ్ను అందించాడు. భారత యువ బౌలర్లను తీర్చిదిద్దడంలో సాయిరాజ్ది అందవేసిన చెయ్యిగా చెబుతారు.సాయిరాజ్ చేరికపై పంజాబ్ కింగ్స్ సీఈవో సతీష్ మీనన్ స్పందించాడు. అతని మాటల్లో.. "ముందుగా సునీల్ జోషికి కృతజ్ఞతలు. ఇప్పుడు బహుతులే చేరడం మాకు గర్వకారణం. అతని అనుభవం, వ్యూహాత్మక దృష్టి మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది".పంజాబ్ కింగ్స్తో డీల్ ఖరారయ్యాక సాయిరాజ్ కూడా స్పందించాడు. పంజాబ్ కింగ్స్లో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ జట్టు ప్రత్యేకమైన క్రికెట్ ఆడుతుంది. యువ ప్రతిభను మెరుగుపరచడంలో నా పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. కాగా, పంజాబ్ కింగ్స్ గత సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై తృటిలో టైటిల్ను చేజార్చుకుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్లోనే పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టి అద్భుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగతంగానూ రాణించాడు. శ్రేయస్ అంతకుముందు సీజన్లో (2024) కేకేఆర్కు విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. గత సీజన్ వేలంలో శ్రేయస్ను పంజాబ్ యాజమాన్యం రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది.చదవండి: NZ VS ENG: సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా బ్రూక్
బిజినెస్

ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఫీజులలో మార్పులు..
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే నవంబర్ 1 నుండి ఎస్బీఐ కార్డ్ అనేక సర్వీస్ ఛార్జీలు, ఫీజులను సవరించనుంది. ఈ మార్పులు విద్యా చెల్లింపులు, డిజిటల్ వాలెట్ లోడ్లు, కార్డు మార్పిడి వంటి లావాదేవీలను నేరుగా ప్రభావితం చేస్తాయి.థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లపై 1% ఫీజుఇకముందు పేటీఎం (Paytm), ఫోన్పే (PhonePe), గూగుల్ పే (Google Pay) వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ ద్వారా చేసే విద్యా సంబంధిత లావాదేవీలపై 1% ఫీజు వర్తిస్తుంది. అయితే నేరుగా పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయం వెబ్సైట్ ద్వారా లేదా పీవోఎస్ యంత్రాల ద్వారా చేసే చెల్లింపులపై మాత్రం ఎటువంటి ఫీజు ఉండదు.వాలెట్ లోడ్ ఛార్జీలుమీరు తరచుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం, ఫోన్పే, అమెజాన్ పే వంటి డిజిటల్ వాలెట్లలో డబ్బు లోడ్ చేస్తే, ఇప్పుడు కొత్త ఫీజు వర్తిస్తుంది. రూ.1,000 కంటే ఎక్కువ మొత్తంలో వాలెట్ టాప్-అప్ చేసినప్పుడు 1% ఛార్జీ విధిస్తారు.కొనసాగుతున్న ప్రస్తుత సర్వీస్ ఛార్జీలుకొన్ని ఛార్జీలు కొత్తగా ప్రవేశపెట్టినా, ఇప్పటికే ఉన్న అనేక ఫీజులు యథాతథంగా కొనసాగుతాయి. ప్రధానంగా గమనించాల్సినవి..క్యాష్ పేమెంట్ ఫీజు: రూ.250పేమెంట్ డిస్ హానర్ ఫీజు: పేమెంట్ మొత్తంలో 2% (కనీసం రూ.500)చెక్కు చెల్లింపు రుసుము: రూ.200క్యాష్ అడ్వాన్స్ ఫీజు: లావాదేవీలో 2.5% (కనీసం రూ.500)కార్డు రీప్లేస్ మెంట్ ఫీజు: రూ.100–రూ.250 (ఆరం కార్డులకు రూ.1,500)విదేశాలలో అత్యవసర కార్డు మార్పిడి: వీసా కార్డుల కోసం 175 డాలర్లు, మాస్టర్ కార్డ్ కోసం 148 డాలర్లుసవరించిన ఆలస్య చెల్లింపు ఛార్జీలుసకాలంలో చెల్లింపులు చేయడాన్ని ప్రోత్సహించేందుకు, ఎస్బీఐ కార్డ్ ఆలస్య చెల్లింపు ఫీజులను సవరించింది. మీరు కనీస బకాయి మొత్తాన్ని (MAD) సకాలంలో చెల్లించకపోతే, కింది రుసుములు వర్తిస్తాయి..బకాయి మొత్తంఆలస్య చెల్లింపు రుసుమురూ.0 – రూ.500ఫీజు లేదురూ.500 – రూ.1,000రూ.400రూ.1,000 – రూ.10,000రూ.750రూ.10,000 – రూ.25,000రూ.950రూ.25,000 – రూ.50,000రూ.1,100రూ.50,000 పైగారూ.1,300అదనంగా, వరుసగా రెండు బిల్లింగ్ సైకిల్స్కు కనీస బకాయి మొత్తాన్ని చెల్లించకపోతే, అదనంగా మరో రూ.100 పెనాల్టీ విధిస్తారు.ఎస్బీఐ కార్డ్ తీసుకువస్తున్న ఈ ఫీజు మార్పులు చిన్నగా కనిపించినా, తరచుగా వాలెట్ టాప్-అప్లు లేదా విద్యా చెల్లింపులు చేసే వినియోగదారులపై కొంత ప్రభావం చూపవచ్చు. వినియోగదారులు తమ లావాదేవీ అలవాట్లను సమీక్షించి, సరికొత్త ఫీజు నిర్మాణాన్ని అనుసరించడం ద్వారా అనవసర వ్యయాలను నివారించవచ్చు.

'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
నిజమైన డబ్బును మాత్రమే పొదుపు చేయండి. ఫేక్ కరెన్సీని పొదుపు చేయడం వల్ల ధనవంతులు కాలేరని సూచించే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో రెండు ట్వీట్స్ చేశారు.''గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ క్రాష్ అవుతున్నాయి. అయితే బట్కాయిన్ విలువ ఈ నెలలో పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బిట్కాయిన్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 మిలియన్ల మంది బిట్కాయిన్లను కొనుగోలు చేశారు. వీటి సంఖ్య 21 మిలియన్స్ మాత్రమే. కాబట్టి కొనుగోలును వేగవంతం అవుతుంది. దయచేసి ఆలస్యం చేయకండి'' అని కియోసాకి పేర్కొన్నారు.Why I am buying Bitcoin.Bitcoin is first truly scarce money… only 21 million ever to be mined.World close 20 million now.Buying will accelerate.FOMO realPlease do not be late.Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) October 22, 2025''ప్రస్తుతం అమెరికా అప్పు పెరుగుతూనే ఉంది. జాతీయ అప్పు 37 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. వేల సంవత్సరాలుగా నిజమైన డబ్బు అంటే.. బంగారం, వెండి అని నాకు తెలుసు. నేడు ఈ జాబితాలోకి బిట్కాయిన్ & ఎథెరియం కూడా చేరాయి. కాబట్టి డబ్బు సేవ్ చేయడంలో తెలివిగా వ్యవహరించండి. అయితే జాగ్రత్త వహించండి'' అని కియోసాకి స్పష్టం చేశారు.బంగారం, వెండి, బట్కాయిన్2025 అక్టోబర్ 17వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి. దీంతో రూ. 13,000 దాటిన గోల్డ్ రేటు రూ. 12,500 వద్దకు చేరింది. ఇదే సమయంలో రూ. 2.03 లక్షలకు చేరిన వెండి రేటు.. రూ. 17,4000 వద్దకు వచ్చింది. అయితే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..ఇక బట్కాయిన్ విషయానికి వస్తే.. గత వారంలో కొంత తగ్గుముఖం పట్టిన బట్కాయిన్ విలువ.. నేడు 1.87 శాతం పెరిగి రూ. 96,18,503.80 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బట్కాయిన్ విలువ మళ్లీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశం కూడా ఉంది.CLICK BAIT??? Don’t get sucked in to anyone who counts on “click bait.”FOR EXAMPLE: I now see “click bait” titles screaming “gold, silver, Bitcoin crashing” or Butcoin to $2 million this month. Then the podcaster then says “To support my channel “click and subscribe”Give…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 23, 2025

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల రుణ పరిమితి రెట్టింపు..?
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs) కీలకమైన నియంత్రణ మార్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ని సంప్రదించాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రుణ పరిమితిని రెట్టింపు చేయాలని, సహ-రుణాలలో (co-lending బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో కలిసి వచ్చే రుణాలు) పాల్గొనడానికి అనుమతించాలని, పోర్ట్ఫోలియో నిర్మాణంలో సడలింపులు కల్పించాలని కోరుతున్నాయి.ప్రస్తుతం వినియోగదారులకు గరిష్టంగా ఇచ్చే రుణ పరిమితిని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు రెట్టింపు చేయాలని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆర్బీఐని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ పరిమితిని 2014లో నిర్ణయించారు. ఇది రెట్టింపు అయితే చిన్న వ్యాపారాలకు, మైక్రో ఎంటర్ప్రైజెస్కు పెద్ద మొత్తంలో రుణాలు అందించేందుకు వీలు అవుతుందని అధికారులు చెబుతున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వ్యాపార పరిధిని పెంచుకోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని భావిస్తున్నారు.సెప్టెంబర్లో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఇటీవల ఆర్బీఐని సంప్రదించాయి. ఈ సమావేశంలో వారి వ్యాపార వృద్ధికి అడ్డుగా ఉన్న అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు ఎస్ఎఫ్బీలు తమ రుణ పోర్ట్ఫోలియో నిర్మాణంలో మార్పులు కోరుతూ నిబంధనలను సులభతరం చేయాలని ఆర్బీఐని అభ్యర్థించాయి.ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి సహ-రుణాలలో (co-lending) పాల్గొనడానికి ఎస్ఎఫ్బీలను అనుమతించాలని కోరుతున్నాయి. సహ-రుణాల ద్వారా విస్తృత స్థాయి కస్టమర్లకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇది వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ అభ్యర్థనలు బ్యాంకుల వృద్ధికి, ప్రస్తుత వ్యాపార నమూనా సామర్థ్యాన్ని పెంచడానికి, చిన్న తరహా వ్యాపారాలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి దోహదపడతాయని నమ్ముతున్నారు.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు

100 దేశాలు.. లక్ష యూనిట్లు!: జిమ్నీ అరుదైన రికార్డ్
పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. టాటా మోటార్స్ 30 రోజుల్లో లక్ష కార్లను విక్రయించి రికార్డ్ సృష్టించగా.. మారుతి సుజుకి కంపెనీకి చెందిన జిమ్నీ 5 డోర్ మోడల్.. లాంచ్ అయినప్పటి నుంచి లక్ష యూనిట్ల మైలురాయిని ఛేదించింది.భారతదేశంలో తయారైన మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ ఎస్యూవీ.. 100 దేశాలకు ఎగుమతి అవుతోంది. 2023 నుంచి ఈ కారు జపాన్, మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతూ ఉంది. అంతే కాకుండా.. ఈ ఏడాది ప్రారంభంలో జపాన్ మార్కెట్లో జిమ్నీ నోమేడ్ పేరుతో లాంచ్ అయింది. ఇది అక్కడ కూడా ఉత్తమ అమ్మకాలు పొందుతూ.. 50వేలకంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను ఛేదించింది. ఫ్రాంక్స్ క్రాస్ఓవర్ తర్వాత జిమ్నీ 5-డోర్ ఇప్పుడు మారుతి సుజుకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రెండవ వాహనంగా మారింది.మారుతి సుజుకి జిమ్నీ.. ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా రూపొందించబడి.. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు జతచేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పేరులో జీరో.. పనితీరులో హీరో: సరికొత్త సోలార్ కారుమారుతి సుజుకి మొత్తం మీద 16 కార్లను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇందులో జిమ్నీ మోడల్ ఎక్కువ మంది ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎగుమతులు, అంతకుముందు ఏడాదితో పిలిస్తే కొంత ఎక్కువే అని తెలుస్తోంది.
ఫ్యామిలీ

సర్వదోషాల నివారణకు నాగుల చవితి పూజ
దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనం గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక, దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల విశ్వాసం. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నాగుల చవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటే కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు నాగుల చవితి జరుపుకుంటారు. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగి΄ోతాయని ప్రతీతి. ఈ నాగుల చవితి నాడు నాగులను పూజిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక పరంగా చూస్తే మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుపాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ము’ ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ‘శ్రీమహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువు గా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ పుట్టలో పాలు పోయటంలోగల ఆంతర్యమని పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం తొలగుతుంది. కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ శనివారం(అక్టోబర్ 25న) నాగుల చవితి సందర్భంగా..(చదవండి: అపమృత్యుదోషాలను దూరం చేసే యమ విదియ)

అపమృత్యుదోషాలను దూరం చేసే యమ విదియ
సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రక్షాబంధనం పండుగ తర్వాత చెప్పుకోదగినది యమ విదియ లేదా భగినీ హస్తభోజనం.. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. తమ తోబుట్టువుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటారు. కొందరు సోదరులకు పెట్టరు కానీ, సోదరులే తమ అక్కచెల్లెళ్లకు చీర, సారె పెడతారు. ఈ సంప్రదాయం మొదలవడానికి కారణం యమధర్మరాజు, ఆయన చెల్లెలు యమి (యమున). దీనికి సంబంధించిన ఒక ఇతిహాస గాథ ఉంది. అదేమిటో చూద్దాం.రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. ‘భయ్యా ధూజీ’ లేదా ‘భాయి ధూజ్’ అనే పేరుతో ఉత్తరదేశంలో ప్రాచుర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది. దీనికి యమ విదియ అని, భగినీ హస్త భోజనమనీ పేరు. కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ. దీనికి సంబంధించిన కథ ఇలా చెప్పుకుంటారు.యముడు, యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమున లో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! అందువల్ల సోదర సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చునని శాస్త్రం చెబుతోంది. (చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే)

ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం
కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఐదుగురికి ఉన్నత విద్యాభ్యాసం కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఆ కాలేజీ పూర్వ విద్యార్థి, మకుట డెవలపర్స్ ఛైర్మన్ కొంపల్లి జనార్ధన్. ఇటీవలే ముగిసిన వార్షిక సమావేశంలో పూర్వవిద్యార్థులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ఎస్.సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో కొంపల్లి జనార్ధన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. మెరిటోరియస్ విద్యార్థులు ఐదుగురిని ఎంపిక చేసి ఒకొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, ఇది వారి ఉన్నత విద్యాభ్యాసానికి, లేదా నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కాలేజీ యాజమాన్యం, పూర్వవిద్యార్థులు పలువురు ఈ విరాళంపై హర్షం వ్యక్తం చేశారు. భావితరాలకు విద్యాభ్యాసానికి ఉపయుక్తమని కొనియాడారు. కొంపల్లి జనార్ధన్ 2-006లో స్థాపించిన మకుట డెవలపర్స్ దక్షిణ భారతదేశం మొత్తమ్మీద అనేక వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.(చదవండి: ఇలా అయితే కష్టం సుమీ!)

ఇలా అయితే కష్టం సుమీ!
సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే ప్రీ టీనేజర్లు, ఉపయోగించని లేదా తక్కువగా ఉపయోగించే వారితో పోలిస్తే చదువులో వెనకబడిపోతున్నారని, జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని తాజా అధ్యయనం ఒకటి తెలియజేస్తుంది. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జమ)లో ప్రచురించబడ్డాయి.‘పిల్లలు గతంలోలాగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. ఎందుకంటే సమాచారాన్ని ప్రాసెస్ చేసే వారి సామర్థ్యాన్ని సోషల్ మీడియా మార్చేసింది. పిల్లలు బడిలో సోషల్ మీడియా వాడడం అనేది వారి అభ్యాసంపై ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ తాజా అధ్యయనం ఉపయోగపడుతుంది’ అంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత, శిశువైద్య నిపుణుడు జాసన్ నగటా.ఈ అధ్యయనం కోసం జాసన్ అతని బృందం కౌమారదశపై జరుగుతున్న అధ్యయనాలలో ఒకటైన అడోలసెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్(ఏబీసీడీ) స్టడీ నుంచి డేటాను ఉపయోగించుకుంది. జాసన్ బృందం తొమ్మిది నుంచి పది సంవత్సరాల వయస్సుగల ఆరువేల మందికి పైగా పిల్లలకు సంబంధించిన డేటాను తమ అధ్యయనానికి ఉపయోగించుకుంది. సోషల్ మీడియాను ఉపయోగించే పిల్లలను మూడు గ్రూప్లుగా విభజించారు. వారిలో ఆరు శాతం మంది పిల్లలకు ‘హై ఇంక్రీజింగ్ సోషల్ మీడియా గ్రూప్’గా నామకరణం చేశారు. ఈ పిల్లలు మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. (చదవండి: చెట్టు చనిపోయింది... ఊరు దుఃఖసముద్రం అయింది!)
ఫొటోలు


అల్లు అర్జున్ వీరాభిమాని శాన్వీ మేఘన దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)


చంద్రబాబు ఎఫీషియన్సీ వీక్..క్రెడిట్ చోరీలో పీక్: వైఎస్ జగన్ (ఫోటోలు)


బాలీవుడ్ స్వీట్ కపుల్.. కొత్త ఇల్లు చూశారా! (ఫోటోలు)


తిరుమల శ్రీవారి సేవలో మిరాయ్ టీమ్ (ఫోటోలు)


డేంజర్ జోన్లో ఢిల్లీ ప్రజలు (ఫోటోలు)


'ఉపాసన' సీమంతం.. సందడిగా మెగా ఫ్యామిలీ (ఫోటోలు)


‘తెలుసు కదా’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


రాజాసాబ్ బ్యూటీ దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)


పిల్లలతో తారకరత్న సతీమణి అలేఖ్య దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)


భర్తతో మొదటిసారి నటి అభినయ దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
అంతర్జాతీయం

జపాన్లో ‘ట్రంప్’ పాలన?.. వలసదారులపై ‘తకైచి’ ఉక్కుపాదం
టోక్యో: జపాన్ దేశ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. తొలి మహిళా ప్రధానిగా 64 ఏళ్ల సనే తకైచి ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్లో తకైచి అనూహ్యంగా తొలి రౌండ్లోనే మెజార్టీ సాధించి, అనూహ్య విజయం దక్కించుకున్నారు. అధికారాన్ని అందుకున్న వెంటనే తకైచి తనదైన పాలనకు శ్రీకారం చుట్టారు.వలస విధానాలపై ప్రత్యేక దృష్టిఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసదారులపై అనుసరిస్తున్న కఠిన విధానాలను తమ దేశంలోనూ అమలు చేసేందుకు జపాన్ నూతన ప్రధాని తకైచి నడుంబిగించారు. తన పరిపాలనలో కొత్తగా సామూహిక బహిష్కరణల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇది దేశ యుద్ధానంతర చరిత్రలో అత్యంత దూకుడుగా కనిపించే వలస విధానాలలో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని తకైచి ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా ఈ నూతనశాఖ ఏర్పాటుపై ప్రకటన వచ్చింది. జపాన్ సరిహద్దుల భద్రతకు ప్రాధాన్యతజపాన్లో నూతనంగా సామూహిక బహిష్కరణల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అనేది జాతీయవాద పాలనకు బలాన్నిచ్చేదిగా ఉండనుంది. ఈ నూతన మంత్రిత్వ శాఖ.. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులను, వలస చట్టాలను ఉల్లంఘించిన వారిపై దృష్టి సారించి, వారిని స్వదేశాలకు పంపే దిశగా పనిచేస్తుంది. ఈ నూతన శాఖ ఏర్పాటుపై ప్రకటన చేస్తున్నప్పుడు ప్రధాని తకైచి ‘జపాన్ సరిహద్దుల భద్రత- సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ నూతన మంత్రిత్వ శాఖ దేశ చట్టాలను గౌరవించేలా ఉంటుంది. అలాగే ఎటువంటి రాజీ లేకుండా దీనిని అమలు చేస్తామన్నారు.ప్రతిపక్షాల నుంచి విమర్శలుకాగా ప్రధాని తకైచి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు, పౌర హక్కుల సంఘాలు.. విదేశీ ద్వేషపూరిత చర్యగా, ప్రమాదకరమైన తిరోగమనంగా అభివర్ణించాయి. ఇది జపాన్కున్న ప్రపంచ ఖ్యాతిని దెబ్బతీస్తుందని, కీలక పరిశ్రమలలో కార్మికుల కొరతను మరింత తీవ్రతరం చేస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. దేశంలో తగ్గిపోతున్న శ్రామిక శక్తిని నిలబెట్టేందుకు విదేశీ కార్మికులు అవసరమని జపాన్ వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానం అంతర్జాతీయ పెట్టుబడులను నిరోధిస్తుందని, పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో..
పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు.. నిర్లక్ష్యంతో, ఏమరుపాటుతో వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనలెన్నో చూశాం. అయితే ఇక్కడో జంట ప్రమాదం అని తెలిసి కూడా తమ నెలల పసికందుతో సాహసానికి సిద్ధపడింది. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే!.. లిథువేనియాకు చెందిన ఓ జంట.. పోలాండ్లోని మంచుతో కప్పబడిన మౌంట్ రైసీ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధపడింది. అయితే తమ 9 నెలల బిడ్డతో కలిసి ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండానే ముందుకు వెళ్లింది. తల్లిని ముందు భాగంలో క్యారీ చేస్తూ ఆ తల్లి పైకి ఎక్కడం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు అలా చేయొద్దని వారించినా వినలేదు. అయినా వినకుండా ఆ పేరెంట్స్ మొండిగా ముందుకు వెళ్లారు. అయితే.. కాస్త దూరం వెళ్లాక ఆ బిడ్డ తండ్రి ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఆ సమయంలో క్రాంపాన్(మంచులో జారకుండా షూలకు బిగించే పరికరాలు) కోసం ఓ మౌంట్ గైడ్ను సంప్రదించాడు. బిడ్డకు ప్రమాదం అని భావించిన ఆ మౌంట్గైడ్.. వాళ్లు సర్దిచెప్పి కిందకు తీసుకొచ్చారు. ఆ బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. చిన్నారిని ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. మౌంట్ రైసీ (Mount Rysy) అనేది పోలాండ్లోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారు 2,501 మీటర్లు (8,205 అడుగులు). పోలాండ్- స్లోవేకియా సరిహద్దులో ఉన్న హై టాట్రాస్ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది.“No words.” A couple climbed Poland’s highest mountain with a baby — and sparked outrageA Lithuanian couple attempted to ascend Mount Rysy while carrying their nine-month-old child, Delfi reports.Conditions were extremely dangerous. Guides and rescuers warned them repeatedly,… pic.twitter.com/jgN8l6mPEg— NEXTA (@nexta_tv) October 21, 2025

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ట్రంప్నకు మోదీ థ్యాంక్యూ
రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు.. ప్రపంచం కోసం కలిసి కట్టుగా ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ తన ఎక్స్ ఖాతాలో(Modi Diwali Reply To Trump) ఓ ట్వీట్ చేశారు.దీపావళి సందర్భంగా భారత ప్రధాని మోదీతో మాట్లాడినట్లు ట్రంప్(Trump Diwali Wishes) చెప్పిన సంగతి తెలిసిందే. ప్రపంచ వాణిజ్యం సహా పలు అంశాలు తమ మధ్య చర్చకు వచ్చినట్లు చెప్పారాయన. ఈ క్రమంలో థ్యాంక్యూ చెబుతూ మోదీ బుధవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.వెలుగుల పండుగ పూట(Diwali).. ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశాకిరణాలు ప్రసరింపజేస్తూ ముందుకు సాగాలి. ముఖ్యంగా.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి అని మోదీ ట్వీట్ చేశారు.Thank you, President Trump, for your phone call and warm Diwali greetings. On this festival of lights, may our two great democracies continue to illuminate the world with hope and stand united against terrorism in all its forms.@realDonaldTrump @POTUS— Narendra Modi (@narendramodi) October 22, 2025పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఈ ఏడాది మే మొదటి వారంలో ఆపరేషన్ సిందూర్ను చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో ఇరు దేశాల ఉద్రిక్తతలను తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకుంటూ వస్తున్నారు. అయితే కాల్పుల విరమణలో ఆయన ప్రమేయాన్ని భారత్ మాత్రం ఖండిస్తూ వస్తోంది. మరోవైపు.. పాక్ మాత్రం ట్రంప్ చెప్పిందే నిజమని, ఆయన చొరవతోనే యుద్ధం ఆగిందని, అందుకే ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేటె్ చేశామని అంటోంది. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘గాజా శాంతి సదస్సు’లో ప్రసంగిస్తూ ట్రంప్ భజనకు దిగగా.. ఆ దేశ ప్రజలే ఆ వ్యవహారాన్ని భరించలేక సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పడేశారు.ఇంకోవైపు,.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ను ఉద్దేశిస్తూ రష్యా చమురు కొనుగోళ్ల చేసే ప్రకటనల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) వైట్హౌస్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో ట్రంప్తో సహా కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ- అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘భారతదేశ ప్రజలకు మా దీపావళి శుభాకాంక్షలు. భారతీయులంటే నాకు చాలా ఇష్టం. ఇరుదేశాల మధ్య కొన్ని ముఖ్యమమైన ఒప్పందాల కోసం పని చేస్తున్నాం. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనబోదని వ్యాఖ్యానించారు. నేను ఈ రోజు మీ ప్రధానితో మాట్లాడాను. మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది. అనేక విషయాల గురించి మేం మాట్లాడుకున్నాం. వాణిజ్యం గురించి చాలాసేపు చర్చించాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. పాకిస్థాన్తో ఘర్షణలు వద్దనే విషయంపై మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. వాణిజ్యం ద్వారానే అది సాధ్యమైందనుకుంటున్నా’ అని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇప్పటిదాకా.. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ (India) నిలిపివేసిందని, నిలిపివేయబోతోందని, నిలిపివేయకపోతే భారీ సుంకాలు తప్పవంటూ ట్రంప్ రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడేమో.. భారత్ పెద్ద మొత్తంలో చమురు (Russian Oil) కొనబోదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదీ చదవండి: దీపావళికి ఏఐతో విషెస్.. మండిపడ్డ హిందువులు

పాకిస్తాన్కు బిగ్ షాక్.. భారత్ విషయంలో తాలిబన్ల సంచలన ప్రకటన
కాబూల్: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్-ఆప్ఘన్ బంధంపై విమర్శలు చేస్తున్న పాకిస్తాన్కు ఆప్ఘనిస్తాన్ రక్షణమంత్రి మవ్లావీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్(Mawlawi Mohammad Yaqoob) స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. భారత్తో తమ బంధం తమ స్వతంత్ర నిర్ణయమని, ఈ విషయంలో పాకిస్తాన్(Pakistan) వాదన అసంబద్దమైనదని అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, దాయాది పాక్కు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.ఇటీవలి కాలంలో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణం భారత్ అంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత్ వల్లే ఆఫ్ఘనిస్థాన్ దాడులు చేస్తోందనే వాదనపై తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మౌలావి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ వ్యాఖ్యలు నిరాధారం.. అశాస్త్రీయమైనది. పాక్ ఆరోపణలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర దేశంగా భారత్తో సంబంధాలను కొనసాగిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్తో మంచి సంబంధాలను కూడా కోరుకుంటుంది.రెచ్చగొడితే మూల్యం తప్పదు..ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎవరికీ ఉపయోగపడవు. మా విధానంలో ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించడం ఎప్పుడూ ఉండదు. పాకిస్తాన్ దోహా ఒప్పందాన్ని గౌరవించడంలో విఫలమైతే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ దాడులు జరిపితే ఆఫ్ఘనిస్థాన్ తన భూభాగాన్ని ధైర్యంగా రక్షించుకుంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను ఉగ్రవాదులుగా పాకిస్తాన్ ముద్ర వేయడాన్ని కూడా ఆయన విమర్శించారు. ఈ పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.ఇదిలాఉండగా.. పశ్చిమాసియాలో కీలకమైన ఆఫ్ఘనిస్థాన్తో బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలమిస్తున్నాయి. దీంతో అక్కడి తాలిబాన్ ప్రభుత్వంలో మంత్రులు భారత్కు అనుకూలంగా స్వరం పెంచుతున్నారు. ఇప్పటికే తాలిబాన్ విదేశాంగమంత్రి భారత్లో వారం రోజుల పాటు పర్యటించి వెళ్లారు. దీంతో పొరుగుదేశం పాక్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్-ఆప్ఘన్ బంధంపై పాకిస్తాన్ విమర్శలకు దిగుతోంది. అలాగే, దాడులకు పాల్పడింది. దీంతో ఈ వ్యవహారంలో మళ్లీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలదూర్చాల్సి వస్తోంది.
జాతీయం

లవ్ జిహాద్పై చట్టం తెస్తాం
నాగోమ్ (అస్సాం): అస్సాంలో త్వరలో లవ్జిహాద్, బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టాలు తెస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెడతామని చెప్పారు. అస్సాంకే ప్రత్యేకతను తెచ్చిపెట్టిన శాస్త్రాల (వైష్ణవ సాంస్కృతిక కేంద్రాలు) పరిరక్షణతోపాటు టీ తోటల్లో పనిచేసే ఆదివాసీలకు భూములపై హక్కులు కల్పించే చట్టాలు కూడా చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను రూపొందించి, కేబినెట్ ఆమోదించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాకు తెలిపారు.

‘జీవిక దీదీ’లకు ఆర్జేడీ బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు కీలక హామీలతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాల సభ్యు(జీవిక దీదీ)లకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘‘ రాష్ట్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కారి్మకులందరి ఉద్యోగాలను పరి్మనెంట్ చేస్తాం. జీవిక దీదీలుసహా మొత్తం 2,00,000 మంది కమ్యూనిటీ మొబిలైజర్ల ఉద్యోగాలను క్రమబదీ్ధకరిస్తా. కమ్యూనిటీ మొబిలైజర్లకు రూ.30,000 గౌరవ వేతనం అందిస్తా’’ అని తేజస్వీ ప్రకటించారు. ప్రపంచబ్యాంక్ ఆర్థికసాయంతో బిహార్ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ‘జీవిక’ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే.రూ.2,000 అదనపు అలవెన్స్ ‘‘మా ప్రభుత్వం వస్తే జీవిక దీదీలు ఇప్పటికే తీసుకున్న రుణాలను మాఫీ చేస్తా. వచ్చే రెండేళ్లపాటు ఇలాంటి వడ్డీ లేని రుణాలు మంజూరుచేస్తా. జీవిక దీదీలు అందరికీ రూ.5 లక్షల విలువైన ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రభుత్వకార్యక్రమాల్లో నిమగ్నమైన వారికి నెలకు అదనంగా రూ.2,000 అలవెన్స్ ఇస్తా’’ అని తేజస్వీ అన్నారు. బిహార్లో ప్రస్తుతం దాదాపు 1.45 కోట్ల మంది జీవిక దీదీలున్నారు. ‘‘తాము అధికారంలోకి వస్తే 20 రోజుల్లోçపు ఉపాధి గ్యారంటీ పథకం తెస్తా. 20 నెలల్లోపు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తా’’ అని తేజస్వీ గతంలోనే ప్రకటించడం తెల్సిందే. ‘‘జీవిక దీదీలకు లభిస్తున్న గౌరవ వేతనం చాలా తక్కువగా ఉంది. వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదు’’ అని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తేజస్వీ మండిపడ్డారు. ‘‘ నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచారం జోరుమీదుంది. పాలనాపగ్గాలు ఎన్డీఏ కూటమి ఇవ్వకూడదని ఓటర్లు నిర్ణయించుకున్నారు. డబుల్ ఇంజిన్ మోతతో ఓటర్ల చెవులకు చిల్లులు పడ్డాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు, అవినీతి, నేరాలు నితీశ్ హయాంలో పెరిగాయి. నిరుద్యోగం, వలసలతో ప్రజలు విసిగిపోయారు’’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు.

అయ్యప్ప సన్నిధిలో ముర్ము
పథనంతిట్ట(కేరళ): కేరళలోని ప్రఖ్యాత శబరిమల గిరిపై కొలువైన అయ్యప్ప స్వామిని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం దర్శించుకున్నారు. పథనంతిట్ట జిల్లా దట్టమైన అభయారణ్యంలో వెలసిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము కొత్త రికార్డ్ సృష్టించారు. గతంలో 1970వ దశకంలో నాటి రాష్ప్రపతి వీవీ గిరి మాత్రమే శబరిమలకు రాష్ట్రపతి హోదాలో వచ్చారు. ఆయన అప్పుడు పల్లకీలో వచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతులెవ్వరూ ఈ ఆలయ దర్శనానికి రాకపోవడం గమనార్హం. సంప్రదాయ నలుపు దుస్తుల్లో..శబరిమల దర్శనం కోసం బుధవారం ఉదయం 7 గంటలకే రాష్ట్రపతి ముర్ము తిరువనంతపురం నుంచి ఆర్మీ హెలికాప్టర్లో బయల్దేరి పథనంతిట్ట సమీపంలోని ప్రమదం పట్టణ రాజీవ్గాంధీ ఇండోర్ స్టేడియంలో దిగారు. అక్కడి తన వాహనశ్రేణిలో పంబ నది వద్దకు చేరుకుని నదీజలాల్లో కాళ్లు కడుక్కున్నారు. తర్వాత సమీపంలోని గణపతి ఆలయం సహా పలు ఆలయాలను సందర్శించారు. నలుపు రంగు చీరలో వచ్చిన ముర్ముకు కెట్టునీర మండపం వద్ద గణపతి ఆలయ ప్రధాన పూజారి ఇరుముడిని ఆమె తలపై పెట్టారు. తర్వాత అక్కడి రాతిగోడపై ఆమె కొబ్బరికాయలు కొట్టారు. ఇరుముడిని తలపై పెట్టుకుని సన్నిధానంకు బయల్దేరారు. ఇందుకోసం ఆమె 4.5 కిలోమీటర్ల పొడవైన స్వామి అయ్యప్పన్ రోడ్డులో ప్రత్యేక వాహనంలో వచ్చారు. రాష్ట్రపతి ముర్ముతోపాటు ఆమె ఎయిర్–డీ–క్యాంప్(ఏడీసీ) సౌరభ్ ఎస్ నాయర్, వ్యక్తిగత భద్రతాధికారి వినయ్ మాథుర్, ఆమె అల్లుడు గణేష్ చంద్ర హోంబ్రమ్ సైతం తలపై ఇరుముడి ధరించి రావడం విశేషం.పూర్ణకుంభంతో సాదర స్వాగతంసన్నిధానం చేరుకున్నాక నేరుగా ఆమె 18 అత్యంత పవిత్రమైన మెట్ల మీదుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు కేరళ దేవాలయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ స్వాగతం పలికారు. ఆలయ తంత్రి కందదారు మహేశ్ మొహనారు పూర్ణకుంభంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. తర్వాత ఇరుముడితోనే ఆమె ఆలయ దర్శనం చేసుకున్నారు. గర్భగుడిని సమీపించి ఆలయ ప్రధాన మెట్లపై ఇరుముడిని ఉంచారు. ప్రధాన పూజారి ఆ ఇరుముడిని తీసుకుని పూజ కోసం గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు అయ్యప్పస్వామి జ్ఞాపికను బహూకరించారు. దర్శనం తర్వాత ఆమె సమీపంలోని మాళికాపురం సహా పలు ఉపాలయాలను దర్శించుకున్నారు. తర్వాత దేవస్థానం బోర్డ్ వారి గెస్ట్హౌస్కు తిరుగుపయనమయ్యారు. సాయంత్రంకల్లా తిరిగి తిరువనంతపురం చేరుకున్నారు. గురు వారం రాజ్భవన్లో ఆమె మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రతిమను ఆవిష్కరించనున్నారు.

మన మెదడే.. కంప్యూటర్ చిప్!?
కంప్యూటర్ చిప్ల స్థానంలో మానవ మస్తిష్కంలోని కణ సముదాయాలను (మినీ బ్రెయిన్స్) ఉంటే.. మన జీవశక్తితో కంప్యూటర్లు పనిచేయడం మొదలుపెడితే.. అసాధ్యం అనిపిస్తోంది కదూ! కానీ, ఇది సాధ్యం కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదే జరిగితే జీవశక్తితో కంప్యూటర్లు నడుస్తాయి. దీన్నే ‘బయోకంప్యూటింగ్’ లేదా ‘వెట్వేర్’ అంటున్నారు. స్విట్జర్లాండ్, వెవీలోని ‘ఫైనల్స్పార్క్’ స్టార్టప్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు.. మినీ బ్రెయిన్స్ సజీవంగా ఉంచటానికి అవసరమైన పోషకాలతో కూడిన ద్రవాన్ని తయారు చేయటంతో ఈ పరిశోధనలో మరొక ముందడుగు పడింది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవమున్న ‘మినీ బ్రెయిన్స్’ను ప్రాథమిక కంప్యూటర్ ప్రాసెసర్లుగా ఉపయోగించటానికి అవి ‘బతికి’ ఉండటం ఎంతో అవసరం. మినీ బ్రెయిన్స్ నిర్జీవం అయిపోతే ల్యాప్టాప్లోని ప్రాసెసర్ల మాదిరిగా వాటిని రీబూట్ చేయలేం. అయితే వీటిని ల్యాబ్లో అనంతంగా పునరుత్పత్తి చేయగల అవకాశం ఉండటం ‘వెట్వేర్’పై పనిచేస్తున్న శాస్త్రవేత్తల్లో ఆశలు రేకెత్తిస్తోంది. వెట్వేర్ను ఎలా సృష్టిస్తారు? అజ్ఞాత మానవ దాతల చర్మం నుంచి మూల కణాలు కొనుగోలు చేసి న్యూరాన్లుగా మారుస్తారు. చర్మ కణాలను మిల్లీ మీటరు వెడల్పులో ‘బ్రెయిన్ ఆర్గానాయిడ్లు’ అనే సమూహాలుగా సేకరిస్తారు. అవి ‘పండు ఈగ’ లార్వా మెదడు ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటాయి. ప్రయోగశాలలో ఈ ఆర్గానాయిడ్లకు ఎలక్ట్రోడ్లు (విద్యుత్ వాహకాలు) జత చేస్తారు. ఇవి ఆర్గనాయిడ్ల పనితీరును అధ్యయనం చేస్తాయి. ఆర్గనాయిడ్లను కొద్దిపాటి విద్యుత్తుతో ప్రేరేపిస్తారు. అవి స్పందిస్తే సంప్రదాయ కంప్యూటింగ్ విధానమైన ‘1’,గానూ, స్పందించకపోతే ‘0’గానూ గుర్తిస్తారు. అంటే కంప్యూటర్లకు జీవం వచి్చనట్లే! ‘ఫైనల్ స్పార్క్’ చెబుతున్న ప్రకారం ఆర్గానాయిడ్లు ఆరు నెలల వరకు జీవిస్తాయి. ‘ఏఐ’కి ఏనుగు బలం! చాట్జీపీటీ వంటి భారీ ఏఐ ఇంజిన్లను నడిపిస్తున్న సూపర్ కంప్యూటర్లు.. మానవ మెదడులోని కణాలను, నాడీ వ్యవస్థను పోలిన సిలికాన్ సెమీ కండక్టర్లను ఉపయోగించటం తెలిసిందే. అయితే మెదడు కణాలను లేదా ‘మినీ బ్రెయిన్స్’ను ఉపయోగించి తయారు చేసే ప్రాసెసర్లు ఏదో ఒక రోజు, ప్రస్తుతం కృత్రిమ మేధ విజృంభణకు శక్తిని ఇస్తున్న చిప్ల స్థానాన్ని ఆక్రమిస్తాయని ఫైనల్స్పార్క్ ల్యాబ్ సహ–వ్యవస్థాపకులు ఫ్రెడ్ జోర్డాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. ఏఐ వల్ల పర్యావరణ కాలుష్యమూ తగ్గిపోతుంది. ‘వెట్వేర్’ సాధ్యమేనా! ఆర్గానాయిడ్లతో ప్రాసెసర్ను సృష్టించటం అసంభవమని కొందరు శాస్త్రవేత్తలు వాది స్తున్నారు. ‘మానవ మెదడులోని 10,000 కోట్ల న్యూరాన్లతో పోలిస్తే ఆర్గానాయిడ్లో ఉండేవి పది వేల న్యూరాన్లే. పైగా వీటిల్లో ‘నొప్పి గ్రాహకాలు’ ఉండవు. అలాగే మాన వ మెదడు.. ‘స్పృహ’ను ఎలా కలిగిస్తోందనే విషయం, ఇంకా మెదడు పనితీరుకు సంబంధించిన అనేక అంశాలు నేటికీ మిస్టరీగానే ఉన్నాయి’ అనేది వారి వాదన.ప్రపంచ వ్యాప్తంగా.. ఫైనల్స్పార్క్ సృష్టించిన ఆర్గానాయిడ్స్తో ప్రపంచ వ్యాప్తంగా 10 వర్సిటీలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్లోని పరిశోధకులు.. ఒక ఆర్గానాయిడ్ను రోబో మెదడుగా ఉపయోగించి బ్రెయిలీ అక్షరాల మధ్య తేడాను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆటిజం, అల్జీమర్స్ వంటి సమస్యలతో బాధపడేవారి మెదడు పనితీరును తెలుసుకునేందుకు, తద్వారా వాటికి కొత్త ట్రీట్మెంట్లు కనుక్కునేందుకు ఫైనల్స్పార్క్ ఆర్గానాయిడ్స్నే ఉపయోగించారు.హార్డ్వేర్కంప్యూటర్లలో: లోహ భాగాలు, చిప్స్ మానవులలో: మెదడు కణాలు, నాడీ వ్యవస్థసాఫ్ట్వేర్ కంప్యూటర్లలో : ప్రోగ్రామ్లు, యాప్లు మానవులలో: ఆలోచనలు,జ్ఞాపకాలు, అభ్యాసంవెట్వేర్ కంప్యూటర్లలో : ఇంకా తయారు కాలేదు. మానవులలో : సేంద్రియ, జీవమున్నహార్డ్వేర్వెట్వేర్ ప్రయోజనాలు రోగ నిర్ధారణ : శరీరంలో నిర్దిష్ట రకాల కణాల గుర్తింపు. ప్రోస్థెటిక్స్: కృత్రిమ అవయవాల సృష్టిలో తోడ్పాటు డేటా నిల్వ: డీఎన్ఏ దీర్ఘకాలిక డేటా నిల్వకు స్థిరమైన ఏర్పాటు. హైబ్రిడ్ బయో ఎలక్ట్రానిక్ పరికరాలు: ఎలక్ట్రానిక్ హార్డ్వేర్తో కలపటం ద్వారా కొత్త బయో పరికరాల సృష్టి
ఎన్ఆర్ఐ

భారతదేశ ప్రతిభకు అమెరికా సంస్థల "సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు"
"అర్చన ఫైన్ ఆర్ట్స్, అమెరికా", "శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ – హ్యూస్టన్, అమెరికా" సంస్థలు సంయుక్తంగా 2025 దీపావళి పండుగను మరింత దేదీప్యమానం చేస్తూ, తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను వేసిన మహనీయులకు 'సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు' ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. ఈ నిర్వాహక సంస్థల వ్యవస్థాపకులు 'నాట్యభారతి' కోసూరి ఉమాభారతి మరియు ప్రమీల సూర్యదేవర సంయుక్తంగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది.సంగీత, సాహిత్య, నాటక రంగాలలో బహుముఖ ప్రజ్ఞా ధురీణులు రామాయణం ప్రసాద రావు; కథా చైతన్య స్రవంతిగా తన కథల ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని నింపిన డి.కామేశ్వరి; కథలు, కవితలు, చిత్రాలతో సృజనాత్మక లోకానికి మరింత అందంగా సొబగులద్దిన మన్నెం శారద, దూరదర్శన్ వ్యాఖ్యాతగా అందరి హృదయాలలో నిలిచిన ఓలేటి పార్వతీశం.. తమ సంస్థల తరఫున ఈ సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర పత్రికా ప్రకటనలో తెలియజేశారు.అకాడెమీ తరఫున హైదరాబాదులో జ్యోతి వలబోజు నేతృత్వంలో రచయిత్రుల బృందం పురస్కార గ్రహీతల స్వగృహాలలోనే వారిని గౌరవప్రదంగా సత్కరించి పురస్కారాలని అందజేశారు. సాహిత్య కళారంగాలలో పలువురు ప్రముఖులు ఈ పురస్కార ప్రదానంపై తమ హర్షం వ్యక్తం చేస్తూ పురస్కార గ్రహీతలను నిర్వాహకులను అభినందించారు.

డాలస్లో ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు
డాలస్, అక్టోబర్ 12: డాలస్ నగరంలో ఆదివారం సాయంత్రం, భావప్రధానమైన సంగీతంతో, శ్రుతి-లయల అద్భుత సమన్వయంతో డా. కొమరవోలు శివప్రసాద్ గారి ఈలపాట సంగీత విభావరి, సంగీతాభిమానులైన ఆహూతులకు ఒక గొప్ప రసానుభూతిని కలిగించింది.కాపెల్లోని పింకర్టన్ ఎలిమెంటరీ స్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో, "విజిల్ విజర్డ్" (Whistle Wizard) గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పద్మశ్రీ, కళారత్న డా. కొమరవోలు శివప్రసాద్ తన ఈలపాటతో శ్వాసస్వర మాధుర్యాన్ని పంచి, సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు.ఎటువంటి ముందు పరిచయం లేకుండా, ఒక్క రిహార్సల్ కూడా లేకుండా నేరుగా ఈ కచేరీలో సహాయక వాయిద్యకారులుగా చేరిన రామకృష్ణ గడగండ్లకు, నిండు సరస్వతీ కటాక్షం సంపాదించుకున్న చిరంజీవి చిదాత్మ దత్త చాగంటికి, చిరంజీవి స్వప్నతి మల్లజోస్యులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియశారు.ప్రముఖ ట్రావెల్స్ సంస్థ వోల్డీలక్స్, ఇన్సూరెన్స్ సంస్థ SNR ఇన్సూరెన్స్, సిలికానాంధ్ర మనబడి డాలస్ జట్టు సభ్యులు సంయుక్తంగా ఈ సంగీత వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు.బాల్యంలోనే ఈలపాట రఘురామయ్య గారి సాహచర్యం, ఆ తర్వాత సంగీతసమ్రాట్ పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యరికంతో డా. శివప్రసాద్ సంగీతంలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. ఎక్కువమంది చేపట్టడానికి సాహసించని ఈ అరుదైన "శ్వాసాధార సంగీత" ప్రక్రియపై ఆయన పరిశోధన చేసి, దానిని పరిపుష్టం చేశారు. ప్రతిరోజూ ఐదు గంటలకు పైగా సాధన చేస్తూ, ఉచ్ఛ్వాస-నిశ్వాసాలను నియంత్రించి, గుక్కతిప్పుకోకుండా సంగీతాన్ని సృష్టించే ఒక విశిష్ట శైలిని ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు.ఈ కచేరీలో ఆయన త్యాగరాజ కీర్తనలు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనల నుండి శక్తివంతమైన "భో శంభో శివ శంభో" భక్తి గీతం వరకు, శంకరాభరణం రాగంలోని తిల్లానాల వరకు ఎన్నో ప్రఖ్యాత గీతాలను తన ఈలపాటలో అలవోకగా పలికించారు. ఆయనకు తోడుగా డాలస్కు చెందిన యువ కళాకారులు తబలా, వయోలిన్, మృదంగంపై అద్భుతమైన స్వరసమరస్యాన్ని ప్రదర్శించి, కచేరీ స్థాయిని మరింత పెంచారు. ప్రతి కీర్తన ముగిసినప్పుడు సభా ప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది.కార్యక్రమం ముగింపులో, దాదాపు రెండు వందల మంది ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో తమ అపారమైన ఆనందాన్ని, కళాకారుడి పట్ల తమకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. డా. ప్రసాద్ తోటకూర, శ్రీ శ్రీకాంత్ బొర్రా దంపతులు, శ్రీమతి శారద, శ్రీ భాస్కర్ రాయవరం కళాకారులకి గౌరవ సత్కారాలని అందించారు. శ్రీ ప్రసాద్ జోస్యుల సభకు అధ్యక్షత వహించారు. శ్రీ రమేశ్ నారని, శ్రీ రంగాల మన్మధ రావు సాంకేతిక సహకారం అందించారు.శ్రీ సూర్యనారాయణ విష్ణుభొట్ల ఆడిటోరియం సదుపాయాలు, ఏర్పాట్లు, సమయపాలనలో సహాయం చేశారు. కాపెల్ విద్యాలయం అడ్మిన్ జట్టు సహకారం వల్ల మంచి సదుపాయాలతో కూడిన ప్రాంగణం ఈ సంగీత కచేరి చక్కగా జరగడానికి దోహదపడింది. 'పద్మశ్రీ', 'కళారత్న' పురస్కారాలు, రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు, మరియు ప్రపంచవ్యాప్తంగా 6,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఘనత డా. శివప్రసాద్ గారు సంప్రదాయ సంగీతానికి ఆధునికతను జోడించి, "శ్వాసలో సంగీతం" అనే కొత్త స్ఫూర్తిని ఆయన ప్రపంచానికి అందించారు.

చికాగోలో వైస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. అంబటి రాంబాబు కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరమ యరసాని, శరత్ యెట్టపు, నరసింహ రెడ్డి, కేకే రెడ్డి, KSN రెడ్డి, కందుల రాంభూపాల్ రెడ్డి, ఆర్వీ రెడ్డి , వెంకట్ రెడ్డి లింగారెడ్డి, హరినాథ్ పొట్టేటి , వినీల్ తోట తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరులు.. వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబు పై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. చికాగోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాసుల ప్రేమ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందన్నారు. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చినవారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యిందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతను.. తన రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కావటంలేదన్నారు అంబటి. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగనే అన్నారు. అమ్మ ఒడి పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశ పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. కానీ చంద్రబాబు ఆ పథకాలను కాపీ చేసి మేమే వీటిని సృష్టించాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు అంబటి ఎంతో ఒపికగా సమాధనం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు)

అమెరికాలో ఐదేళ్లలో 100 మందిపైగా భారత విద్యార్థుల మృతి
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం భారత యువత ఎక్కువగా అమెరికా వెళ్తుతున్నారు. అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే అధికంగా ఉన్నారు. ఉన్నత చదువులతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో భారత విద్యార్థుల్లో అధికశాతం అమెరికావైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అమెరికాలో మన విద్యార్థుల మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.భారత విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో అమెరికాలో దాదాపు 160 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 2020, జూన్ నుంచి 2024 జూన్ వరకు 108 మంది భారత విద్యార్థులు (Indian Students) మరణించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు మరో 10 మంది వరకు చనిపోయారు. అధికారిక లెక్కల కంటే భారతీయుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ప్రమాదాలు, దొంగతనాలు, తుపాకీ కాల్పుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడించారు. 40 కుటుంబాలకు సహాయం''అమెరికాలో మనవాళ్లు చనిపోతున్న విషాదకర ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. యాక్సిడెంట్లు, చోరీలు, తుపాకీ కాల్పుల్లో మనవాళ్లు ఎక్కువగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విహారయాత్రలకు వెళ్లి నీళ్లలో మునిగిపోయి చనిపోతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 40 కుటుంబాలకు సహాయం అందించాం. పార్థీవదేహాలను ఇండియా పంపించడానికి, ఇక్కడ అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మా వంతు సాయం చేశామ''ని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు వంశీరెడ్డి కంచరకుంట్ల 'టైమ్స్ ఆఫ్ ఇండియాకు' తెలిపారు.జాగ్రత్తలు తప్పనిసరికాగా, నేరాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా పనిచేస్తుండడం కూడా మన యువతపై దాడులకు మరో కారణమని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు విశ్వేశ్వర్రెడ్డి కాల్వల అన్నారు. అయితే దాడులకు గురవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అని ఇమ్మిగ్రేషన్ (Immigration) లాయర్ జనేత ఆర్ కంచర్ల అన్నారు. హైరిస్క్ ఏరియాలు అవైడ్ చేయాలని, లేట్నైట్ బయట తిరగకూడదన్నారు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదని సూచించారు.చెడు అలవాట్లతో..మోతాదుకు మించి మత్తు పదార్థాలు సేవించే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ కార్యదర్శి అశోక్ కోళ్ల ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి కేసులు గత సంవత్సరంలో దాదాపు 30 వరకు తానా (TANA) దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు. కాలిఫోర్నియా, టెక్సాస్, కనెక్టికట్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే కొంత మంది చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.కాగా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో ఎక్కువగా భారతీయుల మరణాలు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 60 శాతం మంది భారతీయులు (Indians) నివసిస్తున్నారు.చదవండి: ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!2025లో కాల్పుల్లో చనిపోయిన తెలుగు విద్యార్థులుఅక్టోబర్ 4, 2025: టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి నగర్కు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం డల్లాస్ వెళ్లిన చంద్రశేఖర్.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకునే క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.సెప్టెంబర్ 3, 2025: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన యువకుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) మృతి చెందాడు. కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో రూమ్మేట్తో గొడవపడి, కత్తితో అతడిని పొడిచాడు. దీంతో పోలీసులు నిజాముద్దీన్పై కాల్పులు జరిపారు.జనవరి 20, 2025: హైదరాబాద్కు చెందిన రవితేజ అనే ఎంబీఏ విద్యార్థి కనెక్టికట్లోని న్యూ హెవెన్లో దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. సైన్స్లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లిన అతడు.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకోవడంతోనే ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి.
క్రైమ్

మేడ్చల్ కాల్పుల ఘటన.. ఇబ్రహీం సహా ఇద్దరు అరెస్ట్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో కాల్పుల ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు నిందితులు(అజ్జు, శ్రీనివాస్) పోలీసుల అదుపులో ఉన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కీసర మండలం రాంపల్లికి చెందిన గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ కొన్ని రోజులుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కారులో ఇంటి నుంచి ఘట్కేసర్కు వస్తున్న క్రమంలో బహుదూర్పురకు చెందిన ఇబ్రహీం వెంబడించాడు. యంనంపేట వద్ద కారును అడ్డగించి అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే సోనూ సింగ్పై నిందితుడు రెండు రౌండ్ల కాల్పులను జరిపాడు. దీంతో ఆయన పక్కటెముకల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి గాయమైంది.అనంతరం, స్థానికులు బాధితుడిని హుటాహుటిన మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ, అతడికి సర్జరీ చేశారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించి పరిశీలించారు. కాల్పులకు గల కారణాలను స్థానికులను అడిగి ఆయన తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా సీపీ తెలిపారు.

మంటగలుస్తున్న మానవత్వం
వర్గల్(గజ్వేల్): ఆస్తుల ఆశలో బంధాలు బలహీనమవుతున్నాయి. మానవత్వం మంట కలుస్తున్నది. ఆత్మీయ అనురాగాలు మసకబారుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానమే కాలయములవుతున్నారు. వర్గల్ మండలం మీనాజీపేట హత్యోదంతం ఘటన తల్లీకూతుళ్ల అనుబంధానికి మచ్చగా మారింది. ఆస్తి కోసం ఓ కూతురు తల్లినే కడతేర్చిన తీరు నివ్వెరపరుస్తున్నది. నీడనిస్తున్న చెట్టునే నరికినట్లు, కుటుంబానికి అండగా నిలిచిన తల్లిని హతమార్చి, భర్తతో సహా ఆ కూతురు కటకటాల పాలైంది. అమాయకులైన ఆమె పిల్లలను, తండ్రిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. పచ్చని సంసారం.. కకావికలంవర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాల్నర్సయ్య, బాలమణి(55) దంపతులకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కుమారుడు గిరి చేతికందే తరుణంలో మృతిచెందాడు. కాగా పెద్దకూతురు లావణ్యకు తునికి బొల్లారం భిక్షపతితో పెళ్లి చేశారు. తమకు మగదిక్కు లేకపోవడంతో చిన్నకూతురు నవనీత, మధు దంపతులు, వారి ముగ్గురు పిల్లలతో సహా ఇక్కడే ఉంటున్నారు. పొలం పనులను తండ్రి చూసుకుంటుండగా, తల్లి బాలమణి దినసరి కూలీగా ఆ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నది. ఈ క్రమంలో ఆస్తిలో కొంత భూమి పెద్ద కూతురు లావణ్యకు ఇవ్వాలనే తల్లిదండ్రుల ఆలోచన పచ్చని కాపురంలో చిచ్చుగా మార్చింది. మృత్యురూపమెత్తిన చిన్న కూతురుఅన్నీ తానై తల్లిదండ్రులను చూసుకుంటుంటే, ఆస్తిలో కొంత భూమిని అక్కకు ఎలా ఇస్తారంటూ చిన్న కూతురు నవనీత గొడవపడింది. ఈ క్రమంలో అసలు అమ్మనే లేకుండా చేస్తే ఆస్తి తనకే మిగులుతుందని పథకం రచించింది. తన భర్త మధు, తూప్రాన్ మండలం యావాపూర్కు చెందిన వరుసకు సోదరుడైన రామని గౌరయ్యతో కలిసి ఈ నెల 10న ఇంట్లోనే తల్లిని ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతదేహాన్ని తునికి బొల్లారం అయ్యప్ప చెరువులో పడేసి వెళ్లిపోయారు. తరువాత అమ్మ కనపడటం లేదంటూ నాటకానికి తెరలేపింది. ఈ క్రమంలో బాలమణి మృతదేహం లభ్యమవడంతో గుట్టురట్టయింది. కూతురే ఆస్తి కోసం భర్త, మరొకరితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తెలిసింది. చివరకు భర్తతో సహా కటకటాలపాలైంది.పసిపిల్లలతో.. బాల్నర్సయ్య కూతురు, అల్లుడు కలిసి చేసిన దారుణానికి తన భార్య బాలమణి కానరాని తీరాలకు చేరడంతో బాల్నర్సయ్య తల్లడిల్లిపోతున్నాడు. పట్టుమని ఏడేండ్ల వయసు కూడా లేని మహనీత(7), రాంచరణ్(4)ల తల్లిదండ్రులు కటకటాల పాలవడంతో, అమ్మమ్మకు ఏమైందో, తల్లిదండ్రులకు ఏమి జరిగిందో తెలియని అమాయకత్వంలో తాత పంచన ఒంటరిగా మిగిలిపోయారు. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసి నా కూతురు పుట్టెడు దుఃఖం మిగిలి్చందని బాల్నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పాలు తాగే ప్రాయంలో ఉన్న యేడాదిన్నర చిన్న కొడుకును తల్లి వెంటే పంపించారు.

తుని ఘటన: నారాయణరావు మృతదేహం లభ్యం
సాక్షి, కాకినాడ: బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) మృతదేహాం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.నారాయణరావును నిన్న సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో.. అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తీసుకెళ్లబోయారు. వాష్రూమ్కు వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా?.. ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది.కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అధికార టీడీపీ పార్టీకి చెందిన ఓ నేత.. మైనర బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక(13)కు చదువుకుంటోంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడు వచ్చి చూసి పోతుంటుంది. అయితే ఆమె తన మనవరాలని, ఇంజెక్షన్ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికి తుని హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి నారాయణరావు తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయబోతున్న సమయంలో తోట కాపలదారుడు గమనించి నిలదీశాడు. దీంతో.. ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ దబాయించాడు.ఈలోపు.. కాపలదారుడు వీడియో తీస్తుండడం గమనించి.. బాలికను గురుకుల పాఠశాలలో దించేసి నారాయణరావు కొండవారపేట పారిపోయాడు. అప్పటికే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.నారాయణరావు అరెస్ట్ను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈలోపే.. నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకుని ఇలా చెరువులో దూకేసి శవమై తేలాడు.

సంక్షేమ హాస్టల్ బాలికపై లైంగిక దాడి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంక్షేమ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన బాలిక రాజమహేంద్రవరంలోని సంక్షేమ హాస్టల్లో ఉంటూ టెన్త్ చదువుతోంది. ఆమెకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన పాము అజయ్(22) పరిచయమయ్యాడు. ఆ బాలికను చెల్లి అని çసంబోధిస్తూ ఏదైనా అవసరమైతే తనకు చెప్పమనేవాడు.ఈ క్రమంలో సోమవారం సా.5 గంటల సమయంలో బాలిక సబ్బులు, ఇతర వస్తువులు తెచ్చుకుంటానని హాస్టల్ వార్డెన్ ఉమాదేవికి చెప్పి బయటకెళ్లింది. అయితే, అదేరోజు రాత్రి 7 గంటలకు బాలిక తల్లి హాస్టల్కు వచ్చింది. అదే సమయంలో బాలిక బయటి నుంచి రావడంతో ఎక్కడికి వెళ్లావని తల్లి నిలదీసింది. బాలిక జరిగినదంతా తల్లికి చెప్పింది. తనను అజయ్, రావులపాలెం మండలం రావులపాడుకు చెందిన అతడి స్నేహితుడు కాగితపల్లి సత్యస్వామి (21) కలిసి బైక్ మీద బయటకు తీసుకెళ్లారని, సత్యస్వామి తమను రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ వద్ద దింపి వెళ్లిపోయాడని తెలిపింది. ఆ తర్వాత అజయ్ హోటల్ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు వెంటనే లాడ్జి వద్దకు వెళ్లి ఆరా తీయగా లాడ్జి నిర్వాహకులు జరిగిందంతా చెప్పారు. తాము వేరే ఊరు నుంచి పరీక్షలు రాయడానికి వచ్చామని, మర్నాడు వెళ్లిపోతామని యువకుడు చెప్పినట్లు వివరించారు. పోలీసులు అజయ్, సత్యస్వామిపై మంగళవారం కేసులు నమోదు చేశారు. అలాగే, మైనర్లకు గది ఇచ్చిన లాడ్జి నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నిందితులిద్దరినీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు.. కలెక్టర్ కీర్తి చేకూరి హాస్టల్ వార్డెన్ ఉమాదేవికి షోకాజ్ నోటీసు జారీచేసి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించారు.
వీడియోలు


8 Districts: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు


Jada Sravan: రాత్రి 10 గంటలకు పోలీసులు ఫోన్ చేసి నాతో చెప్పిన మాట..


AP: రోడ్డు పక్కన ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు


Birthday Special: Box Office రూలర్... ప్రభాస్


ఈ ఘటన జరిగినప్పుడు నేను విధుల్లో లేను : హేమలత


నా ఏరియా లో వేలు పెట్టకు.. పవన్ కు రఘురామా వార్నింగ్!


ప్రమాదంలో ఢిల్లీ.. డేంజర్ జోన్లో ఢిల్లీ ప్రజలు..


Kesineni: ఎమ్మెల్యే సీటుకు 5 కోట్లా కొలికపూడి ఒక దొంగ..


Local Body Elections: కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం


KTR: కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోంది