ప్రధాన వార్తలు

50 శాతం మించొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్ను కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు కేవలం షెడ్యూల్డ్ ఏరియాల్లోనే ఉన్నాయని గుర్తుచేస్తూ, 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వం వాదన ఇదీ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అత్యంత శాస్త్రీయంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’నిబంధనలకు అను గుణంగా, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి, ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సమగ్రంగా, శాస్త్రీయంగా సర్వే జరిపామని తెలిపారు. 94 వేల ఎన్యూమరేషన్ బ్లాక్లలో లక్షలాది మంది సమాచారాన్ని సేకరించి, బీసీ జనాభా డేటా ఆధారంగానే కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు పెంచామని వివరించారు. ఈ సందర్భంగా ఇందిరా సహానీ కేసులో తీర్పును సింఘ్వీ ఉటంకించారు. డేటా బేస్ ఆధారంగా, అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకునే సౌలభ్యం ఉందని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. వికాస్ కృష్ణారావ్ గవాలి కేసు తీర్పు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోందన్నారు. అంతేగాక ఈ వ్యవహారంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, అయితే గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. బిల్లును సవాల్ చేయకుండా, దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్ చేయడం సరికాదని సింఘ్వీ వాదించారు. ఇంతటి విస్తృత కసరత్తు తర్వాత, ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా హైకోర్టు స్టే విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కోటా 50% పరిమితి దాటరాదు: ప్రతివాదుల వాదన ప్రతివాది మాధవరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ ప్రభుత్వ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. కృష్ణమూర్తి కేసు తీర్పును ఉటంకిస్తూ ‘షెడ్యూల్డ్ ఏరియాలు, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఉంది. జనరల్ ఏరియాల్లో ఈ పరిమితిని దాటడానికి వీల్లేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెల్లడించింది’అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ టెస్ట్లో కూడా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనేది ఒక కీలకమైన షరతు అని, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల ఉదంతాలను ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల్లో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించి, 50 శాతం పరిమితికి లోబడే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో విభేదించింది. ‘ఎస్టీ ప్రాంతాల్లోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా?’అని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను, ముఖ్యంగా కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నిర్దేశించిన 50 శాతం పరిమితిని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనబడటం లేదంటూ తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా కేసు మెరిట్స్ ఆధారంగా తదుపరి విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతమున్న రిజర్వేషన్ల విధానం ప్రకారమే జరగనున్నాయి.

‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’
న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ రూమర్లేనని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ‘నిన్న అసలు మోదీ-ట్రంప్ల మధ్య ఎటువంటి సంభాషణ జరగేలేదు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడలేదు. రష్యా చమురు నిలిపివేస్తామని ట్రంప్కు మోదీ హామీనూ ఇవ్వలేదు. వారి మధ్య ఎటువంటి టెలిఫోన్ సంభాషణ జరగనేలేదు. ఇదంతా అవాస్తవం’ అని విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇదీ విషయం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. @రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పా’. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఇదీ చదవండి: మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు

సాక్షి మీడియాపై కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కుట్రలు
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇస్తున్నారు.కాగా, హైదరాబాద్లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం(అక్టోబర్ 15) కూడా దాదాపు 10 గంటల పాటు హల్చల్ చేయడం... ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించారు. ఇక ఎస్సీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు సాగిస్తోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కూడా ఆదివారం(అక్టోబర్ 12) తెల్లవారుజామున పోలీసుల దాష్టీకానికి దిగిన సంగతి తెలిసిందే.టీడీపీ సిండికేట్ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది.

పదే పదే అదే దాడి!
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది ప్రజలకు సమాచారం తెలుసు కునే హక్కు కూడా! ప్రభుత్వ తప్పిదాలు లేదా లోపాలను ఎత్తి చూపినందుకు, ముఖ్యంగా మద్యం మరణాల వంటి సున్నితమైన అంశాలలో, సంపాదకుడిని లేదా విలేకరులను వేధించడం, బీఎన్ఎస్ 179(1) వంటి అసంబద్ధమైన సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం, ‘సోర్స్’ వివరాలను అడగటం వంటి చర్యలు చట్టబద్ధమైన పరిధిని దాటి అధికార దుర్వినియోగానికి (అబ్యూజ్ ఆఫ్ అథారిటీ) పాల్పడటం కిందికి వస్తాయి.పత్రికా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలు జరిగినప్పుడు, వివిధ కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు జర్నలిస్టులకు బలమైన రక్షణ కవచంగా నిలిచిన విషయం గమనార్హం. సత్యాన్ని ధైర్యంగా నిల బెట్టే ప్రతీ జర్నలిస్టుకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ఎప్పుడూ రక్షణగా నిలుస్తుంది.ఒక వార్తా దినపత్రిక సంపాదకుడికి, మద్యం మరణాల గురించిన వార్తను ప్రచురించినందుకు గానూ, పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 179(1) కింద నోటీసులు జారీ చేయడం, ఆ వార్తకు సంబంధించిన విలేకరుల అన్ని డాక్యుమెంట్లు, వివరాలను బీఎన్ఎస్ సెక్షన్ 94 కింద సమర్పించాలని డిమాండ్ చేయడం చట్ట బద్ధమేనా? ఇటువంటి పోలీసు చర్యలు, లేదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు జర్నలిస్టులను వేధించడం కాదా? అవి వేధింపులే!ఏదైనా దర్యాప్తు, విచారణ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఏదైనా పత్రం, ఇతర వస్తువు అవసరమని కోర్టు లేదా పోలీస్ స్టేషన్ అధికారి భావించినప్పుడు, దానిని సమర్పించమని బీఎన్ఎస్ సెక్షన్ 94 (పాత సీఆర్పీసీ సెక్షన్ 91) కింద ఎవరికైనా సమన్లు జారీ చేయవచ్చు. కానీ అది పాత్రికేయులకు వర్తిస్తుందా? సాధారణంగా, విచారణ కోసం పత్రాలను అడగడానికి ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. అయితే, జర్నలిస్ట్ వనరు (సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) లేదా సమాచారాన్ని సమర్పించమని బలవంతం చేయడం, జర్నలిజం ప్రధాన సూత్రమైన ‘సోర్స్ గోప్యత’కు విరుద్ధం. విలేకరుల రక్షణ, పత్రికా స్వేచ్ఛ దృష్ట్యా, ఈ సెక్షన్ను విచక్షణా రహితంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం అవుతుంది. వార్తా ప్రచురణను కేవలం ప్రభుత్వంపై విమర్శగా భావించి, ఈ సెక్షన్లను ఉపయోగించి విలేకరుల వివరాలను, డాక్యుమెంట్లను కోరడం స్పష్టంగా ‘చట్టపరమైన వేధింపు’ కిందకు వస్తుంది.భారతదేశంలో జర్నలిస్టులు తమ వార్తా మూలాలను పోలీసు లకు బహిర్గతం చేయాలని ఏ చట్టం కూడా ఒత్తిడి చేయదు. సమాచా రాన్ని సేకరించే హక్కు, ప్రచురించే హక్కు – ఈ రెండింటినీ ఆర్టికల్ 19(1)(ఎ) కింద భారత రాజ్యాంగం ప్రసాదించింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సంబంధిత న్యాయస్థానం, అది కూడా అత్యవసర మైతేనే ఆ మూలాలను వెల్లడించమని ఆదేశించగలదు. కానీ పోలీసు లకు ఆ హక్కు లేదు. జర్నలిజంలో సమాచారాన్ని అందించిన వనరును రక్షించడం అత్యంత కీలకం. సోర్స్ను బహిర్గతం చేయమని బలవంతం చేయడం పత్రికా స్వేచ్ఛను అణిచివేయడమే అవుతుంది.జర్నలిస్టులకు ‘సుప్రీం’ బాసటరోమేష్ థాపర్ (1950) నుంచి ఆర్ణబ్ గోస్వామి (2020), ‘న్యూస్క్లిక్’ (2024) కేసుల వరకు, భారత అత్యున్నత న్యాయ స్థానం ఎప్పటికప్పుడు పోలీసుల లేదా రాజకీయ నేతల ఒత్తిడి లేకుండా మీడియా పని చేయాలనే హక్కును కాపాడుతూనే ఉంది. ‘ఆర్ణబ్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసును జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షా విచారించారు. ముఖ్యంగా టీవీ కార్యక్రమాల మీద పలు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం మీద విచా రణ జరిగింది. జర్నలిస్టులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగటం, ప్రభు త్వాన్ని విమర్శించడం వారి హక్కుగా కోర్టు పరిగణించింది. రాజకీయ దురుద్దేశంతో ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుకు విరుద్ధం అని వ్యాఖ్యానించింది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రతి పౌరుడికీ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది. ఈ హక్కులోనే పత్రికా స్వేచ్ఛ కూడా అంతర్లీనంగా ఉంది. పోలీసుల వేధింపులను ఎదుర్కొంటున్నప్పుడు, ఒక జర్నలిస్ట్ లేదా ఎడిటర్ తన రక్షణ కోసం హైకోర్టును లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులు తరచూ నాలుగు అంశాలను పరిగణన లోకి తీసుకుంటాయి: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్త ప్రచురిత మైందా? వార్తలో ఉన్న వివరాలు నిజమని భావించడానికి ప్రాథ మిక ఆధారాలు ఉన్నాయా? నేరారోపణ చేయబడిన సెక్షన్ (ఇక్కడ బీఎన్ఎస్ 179(1)) ఈ వార్తకు అసలు వర్తిస్తుందా? లేదా ఇది కేవలం జర్నలిస్టును వేధించడానికి లేదా భయపెట్టడానికి ఉపయో గించారా?ప్రభుత్వ చర్యలు పత్రికా స్వేచ్ఛను అరికట్టే విధంగా ఉండ కూడదు. అంటే భయపెట్టి, ఒత్తిడి చేసి జర్నలిస్టులు సత్యాన్ని రాసేందుకు వెనకాడేలా చేయడాన్ని ‘చిల్లింగ్ ఎఫెక్ట్’ అంటారు. సుప్రీం కోర్టు ఇటువంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. పత్రికా స్వేచ్ఛకు ఊతం‘న్యూస్క్లిక్’ ఎడిటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు అద్భు తమైన వ్యాఖ్యానాలు చేశాయి. తమకు ఇష్టం లేని రిపోర్టింగ్ చేసినందుకు జర్నలిస్టులను నిందితులుగా పరిగణించే అధికారం పోలీసులకు లేదని కోర్టులు స్పష్టం చేశాయి. అంతేకాకుండా, సదరు వార్త సాధనాలను స్వాధీనం చేయాలని కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.‘రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్’ కేసులో ఆర్టికల్ 19(1)(ఎ) కింద పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని 1950లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది ‘బ్రజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ’ కేసులో వార్తలను ప్రచురించడానికి ముందు సెన్సార్ షిప్ను కోర్టు కొట్టివేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు తొలి విజయం.‘అభిషేక్ ఉపాధ్యాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ’ (2024) కేసులో జర్నలిస్ట్ రాతలను ప్రభుత్వ విమర్శగా భావించినంత మాత్రాన, ఆ రచయితపై క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ చర్యలను విమర్శించే జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తుంది. ‘సిద్ధార్థ్ వరదరాజన్, ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం’ (2025) కేసులో, ఒక వార్తా పోర్టల్కు సంబంధించిన సీనియర్ జర్న లిస్టులపై నిర్బంధ చర్యలు తీసుకోకుండా అస్సాం పోలీసులను సుప్రీంకోర్టు నిలువరించింది. ఈ చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడిగా కోర్టు భావించింది.పత్రికా స్వేచ్ఛ గురించి న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇస్తున్నా, వేధింపులకు సంబంధించి పోలీసులను హెచ్చరిస్తున్నా ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారు ఈ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి కేసులు నిలవవని వారికీ తెలుసు. అయితే ఈ లోపు తాత్కాలికంగా ఇబ్బంది పెడుతూ ‘చిల్లింగ్ ఎఫెక్ట్’తో భయ పెట్టడమే వారి ప్రధానోద్దేశం. ఇలాంటి చర్యలకు సైతం వారు కచ్చి తంగా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుందనేది వాస్తవం.పి. విజయ బాబు వ్యాసకర్త రాజ్యాంగ న్యాయ శాస్త్ర పట్టభద్రులు, సీనియర్ సంపాదకులు

ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆకస్మిక ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.ఏకాదశి ప.1.09 వరకు, తదుపరి ద్వాదశి,నక్షత్రం: మఖ సా.4.41 వరకు, తదుపరి «పుబ్బ, వర్జ్యం: రా.12.54 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు తదుపరి ప.12.10 నుండి 12.56 వరకు, అమృత ఘడియలు: ప.2.16 నుండి 3.53 వరకు, సర్వ ఏకాదశి.సూర్యోదయం : 5.56సూర్యాస్తమయం : 5.35రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం.... ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనుకున్న పనుల్లో ప్రతిష్ఠంభన. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.వృషభం.... సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.మిథునం..పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.కర్కాటకం....కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.సింహం..... కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కన్య... కొత్త రుణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలు ముందకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త అనుకూలత.తుల.... ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృశ్చికం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు.ధనుస్సు... శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దైవదర్శనాలు. కుటుంబంలో స్వల్ప సమస్యలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో సమస్యలు మకరం.. పనులలో ఆటంకాలు. స్వల్ప అనారోగ్యం. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. దైవదర్శనాలు.కుంభం.... శుభకార్యాలపై చర్చలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి ఒప్పందాలు. కుటుంబంలో సమస్యలు తీరే సమయం. ఆప్తులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మీనం.... విలువైన వస్తువులు సేకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

లొంగుబాట్ల పర్వం!
ఆవిర్భవించి దాదాపు అరవయ్యేళ్లు కావస్తుండగా నక్సలైట్ ఉద్యమం తొలిసారి కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అరెస్టులు, నిర్బంధాలు, ఎన్కౌంటర్లు ఆ ఉద్యమానికి కొత్త కాకపోయినా, ఈ స్థాయిలో బీటలు వారటం ఇదే ప్రథమం. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావుతో సహా 61 మంది నక్సలైట్లు గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముందు బుధవారం లొంగిపోయారు. అస్త్ర సన్యాసం చేసినవారు అప్పగించిన ఏకే–47లు, ఇతర తుపాకులు స్వీకరించి అందుకు బదులుగా వారికి సీఎం రాజ్యాంగ ప్రతులు అందజేశారు. నక్సల్స్కు బలమైన స్థావరంగా భావించే అబూజ్మాడ్ పూర్తిగా భద్రతా బలగాల అదుపులోకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించి ఛత్తీస్గఢ్లో నిన్న, ఈ రోజు 197 మంది లొంగిపోయారని తెలిపారు. మొత్తం ఈ రెండు రోజుల్లో 258 మంది ఉద్యమానికి వీడ్కోలు చెప్పారు. ముఖ్యంగా ఉత్తర బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా అంతరించింది. గత కొన్ని నెలలుగా ఛత్తీస్గఢ్లోని అబూజ్మాడ్, జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగాయి. బయటినుంచి వెళ్లిన క్యాడర్తోపాటు పలువురు ఆదివాసీలు కూడా వీటిల్లో మరణించారు. ఈ పరిణామాలు గమనిస్తే వచ్చే ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలన్న కేంద్ర సంకల్పం నెరవేరేలా కనబడుతోంది. పీపుల్స్ వార్గా 1980లో ఆవిర్భవించిన పార్టీ ఇరవయ్యేళ్లలో పెనువేగంతో విస్తరించింది. 2000వ సంవత్సరంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ), 2004లో మావోయిస్టు పార్టీగా రూపుదిద్దుకున్న సమయానికి దేశంలోని 92,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 180 జిల్లాల్లో దాని ప్రభావం ఉన్నదని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. నక్సలైట్ ఉద్యమం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పని తెలిపింది. తాజాగా ఆ ఉద్యమ ప్రభావం 11 జిల్లాలకు పరిమితమైంది. వాటిల్లో కూడా ఛత్తీస్గఢ్లోని మూడు జిల్లాలు – బీజాపూర్, సుక్మా, నారాయణ్పూర్లలో మాత్రమే నక్సల్ తీవ్రత అధికంగా ఉన్నదని కేంద్ర హోంమంత్రిత్వ వర్గాల కథనం. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మొదట్లో మందకొడిగా ప్రారంభమైన మార్పులు తర్వాత కాలంలో వేగం పుంజుకున్నాయి. పర్యవసానంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల నుంచి ఉద్యమంలోకి రిక్రూట్మెంట్ గణనీయంగా తగ్గింది. ఆదివాసీ యువత రాక కొంతమేర పెరిగిన మాట వాస్తవమే అయినా ఏదో సంచలనాత్మక ఘటనల సందర్భంలో తప్ప మావోయిస్టు స్వరం వినబడటం తగ్గింది. సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై ఆ పార్టీ వైఖరేమిటో తెలియని స్థితి నెలకొంది. ఇప్పటికీ ఆకలి, దారిద్య్రం ఉన్నా, గతంలో మాదిరి కాక వాటి నివారణకు ప్రభుత్వాలు ఏదో మేరకు పథకాలు రచించి అమలు చేస్తున్నాయి. తమ డిమాండ్లు అరణ్య రోదనగా మిగిలే గతకాలపు పరిస్థితి మారి, ఎవరో ఒకరు గొంతెత్తటం, వాటివల్ల సానుకూల ఫలితాలు రావటం సామాన్య ప్రజలకు ఊరటనిస్తోంది. అణచివేత, నిషేధాలతో అజ్ఞాత వాసంలో ఉండటం వల్ల కొద్దోగొప్పో బలం ఉన్న ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు వెనువెంటనే స్పందించే శక్తి లేకపోయింది. అంతక్రితం మాటేమోగానీ... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు ఎదురు కాల్పుల్లో మరణించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అంతర్మథనం మొదలైనట్టు కనబడుతోంది. మొన్న ఆగస్టులో సాయుధ పోరుకు తాత్కాలిక విరామం ప్రకటిద్దామంటూ మల్లోజుల పేరిట లేఖ విడుదలైనప్పుడు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని అందరూ అనుకున్నా పార్టీలో పలు కమిటీల మద్దతు కూడా ఉన్నదని మీడియా కథనాలు తెలిపాయి. ఇప్పుడేర్పడిన సానుకూల స్థితిని ఆదివాసీ జీవితాల మెరుగుకు వినియోగించటంతో పాటు పర్యావరణానికీ, ఆదివాసీ సంస్కృతికీ విఘాతం కలగని అభివృద్ధి నమూనాల రూపకల్పనకు పాలకులు కృషి చేయాలి. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలుచేస్తే సమస్యలు తలెత్తవు. ఆ వెంబడే వచ్చే సామాజిక, రాజకీయ ఉద్యమాలూ ఉండవు. లేకుంటే అసంతృప్తి రూపం మార్చుకుంటుంది తప్ప సమసి పోదు.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: 1.48 లక్షల ఎకరాల్లో 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మద్దతు ధర, బోనస్ 500 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్లో అగ్రికల్చర్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది.రాష్ట్ర వ్యాప్తంగా పలు సెక్టార్లకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయించింది. నల్సార్ యూనివర్సిటీ కి 7 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. నల్సార్ యూనివర్సిటీలో 25 నుంచి 50 శాతం సీట్ల కేటాయింపు కోటా పెంచుతూ కేబినెట్ తీర్మానించింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2A, 2B పొడిగింపుపై అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్గా ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కేబినెట్ ఆదేశించింది. రూ.10,500 కోట్లతో 5,500 కి.మీ మేర హ్యామ్ రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతాం.ఇద్దరు పిల్లలకు మించి సంతానం వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్ కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్ఫోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.

రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!
దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే రవాణా సాధనాలు రైళ్లు. సరళమైనవి, సౌకర్యవంతమైనవి, దేశవ్యాప్తంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటంతో నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిని భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.ఇండియన్ రైల్వే విస్తృత నెట్వర్క్, క్లిష్ట కార్యకలాపాలతోపాటు అనేక విశిష్ట చిహ్నాలు, గుర్తులతో ప్రయాణికులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ప్రముఖ గుర్తుల్లో ఒకటి, ప్రతి రైలు చివరి కోచ్పై ఉండే బోల్డ్ ‘ఎక్స్’ (X) గుర్తు. మొదటిసారి చూసినప్పుడు ఇది కేవలం డిజైన్ లేదా సాధారణ గుర్తుగా అనిపించవచ్చు. అయితే, ఈ గుర్తు రైలు భద్రత, కార్యకలాపాల సమర్థతలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వాస్తవ అర్థం, ఉపయోగాన్ని తెలుసుకోవడం ట్రాక్ నిర్వహణ, రైలు ఆపరేషన్లకు ఎంతో అవసరం.రైలు పూర్తిగా దాటిందని నిర్ధారణచివరి కోచ్పై ఉన్న "X" గుర్తు ప్రధానంగా రైలు పూర్తిగా స్టేషన్ గుండా దాటిందని రైల్వే సిబ్బందికి తెలియజేస్తుంది. ఇది ఒక దృశ్య సూచనగా పని చేస్తూ, అన్ని కోచ్లు పూర్తిగా వెళ్లిపోయాయని నిర్ధారించడంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో లేదా దృష్టి మందగించే వాతావరణంలో ఇది మరింత కీలకంగా మారుతుంది. కేవలం సిగ్నళ్లపై ఆధారపడటం చాలనిపించినా ఈ "X" మార్కింగ్ అదనపు భద్రతా పొరగా నిలుస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపుకొన్నిసార్లు అరుదైన సంఘటనల్లో, ఒక కోచ్ రైలు నుండి వేరు కావచ్చు. అలాంటి సందర్భంలో, రైలు చివరి కోచ్పై "X" గుర్తు కనపడకపోతే, అది తక్షణమే ఒక హెచ్చరికగా మారుతుంది. దీనివల్ల రైల్వే అధికారులు సమస్యను వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ప్రమాదాలను నివారించడంలో, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను పరిరక్షించడంలో కీలకంగా ఉంటుంది.

వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదింది.కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.రెండు మ్యాచ్ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం విశేషం. భారత్తో మ్యాచ్లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.నేటి మ్యాచ్లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్.. న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్కు ఓ వికెట్ దక్కింది.చదవండి: చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..!

గుజరాత్లో కీలక పరిణామం.. మంత్రులంతా రాజీనామా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. "ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు" అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు.
కెనడాలో రీతూ వర్మ చిల్.. రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్!
సాక్షిపై చంద్రబాబు సర్కార్ దమనకాండ.. జర్నలిస్టుల నిరసన
పేద దేశమైనా రూపాయి కంటే బలమైన కరెన్సీ.. ఎలా?
‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
నాకిప్పుడు 16 నెలల ప్రెగ్నెన్సీ.. రూమర్స్పై స్పందించిన సోనాక్షి సిన్హా!
వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
హైదరాబాద్ యువతకు ఫ్లిప్కార్ట్ ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ
రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!
ఈ రాశి వారికి భూలాభాలు
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
కొత్తింట్లోకి యాంకర్ లాస్య.. ఘనంగా గృహప్రవేశం
WTC: రెండో స్థానంలోకి దూసుకువచ్చిన పాక్
ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్
ఆర్ఆర్ఆర్ నం.161ఏఏ
హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధీల విడుదల
ప్రపంచ వేదికలపై ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తుతున్న పాక్ ప్రధాని
చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్
లాలు ఫ్యామిలీకి భారీ షాక్.. హోటళ్ల అవినీతి కేసులో నోటీసులు
తెలుగు టైటాన్స్ పరాజయం
ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన పాకిస్తాన్
20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ
మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
నెలలోపే ఓటీటీలోకి మంచు లక్ష్మీ థ్రిల్లర్ సినిమా
పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం
Rave Party: హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం
ఎలా ఉన్నావు హీరో!
'అప్పటికి బంగారం ధరలు భారీగా పడిపోతాయ్'
4 వారాల్లో 4 లక్షల బుకింగ్స్..
కెనడాలో రీతూ వర్మ చిల్.. రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్!
సాక్షిపై చంద్రబాబు సర్కార్ దమనకాండ.. జర్నలిస్టుల నిరసన
పేద దేశమైనా రూపాయి కంటే బలమైన కరెన్సీ.. ఎలా?
‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
నాకిప్పుడు 16 నెలల ప్రెగ్నెన్సీ.. రూమర్స్పై స్పందించిన సోనాక్షి సిన్హా!
వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
హైదరాబాద్ యువతకు ఫ్లిప్కార్ట్ ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ
రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!
ఈ రాశి వారికి భూలాభాలు
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
కొత్తింట్లోకి యాంకర్ లాస్య.. ఘనంగా గృహప్రవేశం
WTC: రెండో స్థానంలోకి దూసుకువచ్చిన పాక్
ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్
ఆర్ఆర్ఆర్ నం.161ఏఏ
హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధీల విడుదల
ప్రపంచ వేదికలపై ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తుతున్న పాక్ ప్రధాని
చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్
లాలు ఫ్యామిలీకి భారీ షాక్.. హోటళ్ల అవినీతి కేసులో నోటీసులు
తెలుగు టైటాన్స్ పరాజయం
ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన పాకిస్తాన్
20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ
మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
నెలలోపే ఓటీటీలోకి మంచు లక్ష్మీ థ్రిల్లర్ సినిమా
పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం
Rave Party: హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం
'అప్పటికి బంగారం ధరలు భారీగా పడిపోతాయ్'
ఎలా ఉన్నావు హీరో!
4 వారాల్లో 4 లక్షల బుకింగ్స్..
సినిమా

పేరు పెట్టకుండా బండ్ల గణేశ్ ట్వీట్.. ఆయన మీదేనా?
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh)కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ఏ ట్వీట్ చేసినా.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపైన తనదైన శైలీలో స్పందిస్తుంటారు. కొన్ని విషయాలపై డైరెక్ట్గా, మరికొన్ని విషయాలపై పరోక్షంగా ఆయన కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. గురువారం మధ్యాహ్నం ఆయన తన ఎక్స్ ఖాతాలో “అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……! అంటూ రాసుకొచ్చాడు. పేరునూ ప్రస్తావించకుండా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉంటాయా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఆ నిర్మాతకు కౌంటర్గానేనా?ఇటీవల టాలీవుడ్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ ముందు కొంతమంది దర్శకనిర్మాతలు, హీరోలు ఇచ్చే స్టేట్మెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా మిత్రమండలి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నివాసు(Bunny Vasu) చాలా ఎమోషనల్గా మాట్లాడారు. తమ సినిమాను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తొక్కేయాలని చూస్తున్నారని.. కానీ జనాలు సినిమా బాగుంటేనే చూస్తారని, లేకపోతే చూడరని... డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది నడవదని అన్నారు. అంతటితో ఆగకుండా..తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకోవద్దని.. నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ రోజు సినిమా రిలీజై మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. ఇదే రోజు బండ్ల గణేశ్ పైవిధంగా ట్వీట్ చేయడంతో .. బన్నీవాసుకి కౌంటర్గానే ఇలా పోస్ట్ పెట్టాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆయన పోస్ట్ కింద చాలామంది ఇది బన్నీవాసు గురించే అని కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని, ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అన్నారని తెలియదు కానీ.. బన్నీవాసు పేరు అయితే బాగా ట్రోల్ అవుతుంది.“అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……!— BANDLA GANESH. (@ganeshbandla) October 16, 2025

కెనడాలో రీతూ వర్మ చిల్.. రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్!
కెనడాలో చిల్ అవుతోన్న హీరోయిన్ రీతూ వర్మ..పదహారణాల అమ్మాయిలా ముస్తాబైన హీరోయిన్ మాధవీలత..హీరోయిన్ రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్..కలర్ఫుల్ డ్రెస్లో పాలక్ తివారీ హోయలు..శారీలో సింగర్ గీతా మాధురి ట్రెడిషనల్ లుక్.. View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma)

హోటల్ లీజు వివాదం.. వెంకటేశ్, రానాకు కోర్టు షాక్!
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోలు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబు కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. కాగా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేశ్, రానా, అభిరామ్తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేశ్పై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.అసలు ఈ కేసు వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్లోని వెంకటేష్కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు ఈ ఏడాది జనవరిలో గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

కొత్తింట్లోకి యాంకర్ లాస్య.. ఘనంగా గృహప్రవేశం
ప్రముఖ తెలుగు యాంకర్ లాస్య (Anchor Lasya Manjunath) కొత్తింట్లో అడుగుపెట్టింది. భర్త మంజునాథ్తో కలిసి బుధవారం గృహప్రవేశం చేసింది. ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది. బంధుమిత్రులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. వారిలో నయని పావని, బంచిక్ బబ్లూ, గీతూ రాయల్, దేత్తడి హారిక, నోయెల్.. తదితరులు ఉన్నారు. లాస్య గృహప్రవేశానికి వెళ్లిన వారు ఆమె ఇల్లు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.కుళ్లుకుంటావ్..లాస్య ఫ్రెండ్ నోయెల్ (Noel Sean) అయితే ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'నా ఇల్లు చూసి నువ్వు కచ్చితంగా కుళ్లుకుంటావు' అని లాస్య నాతో అంది. నిజంగానే ఇల్లు చూశాక నేను జెలసీగా ఫీలయ్యాను. ఇల్లు అంత బాగుంది. ఆ దేవుడు మీ జంటను ఎప్పుడూ ఇలాగే ఆశీర్వదించాలి అంటూ లాస్యతో దిగిన ఫోటోలు షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు లాస్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.బిగ్బాస్ నుంచి ఫ్రెండ్స్బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్గా ఓ వెలుగు వెలిగింది లాస్య. మంజునాథ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె వైవాహిక జీవితంలో అడుగుపెట్టాక కెరీర్కు గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది. తెలుగు బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. ఆ సమయంలోనే లాస్య, దేత్తడి హారిక, నోయెల్ సేన్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇకపోతే పేరెంట్స్ కోసం గతంలో ఇల్లు కట్టించిన లాస్య.. నాలుగు నెలల కిందట తండ్రికి మంచి కారును బహుమతిగా ఇచ్చింది. View this post on Instagram A post shared by Noel Sean (@mr.noelsean) చదవండి: శ్రియాతో లవ్ సీన్.. ఇబ్బందిపడ్డ రామ్చరణ్.. వీడియో చూశారా?
న్యూస్ పాడ్కాస్ట్

‘సాక్షి’ పత్రిక గొంతు నొక్కే కుతంత్రం... ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులతో చంద్రబాబు సర్కారు వేధింపులు

‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు సీరియస్. ఏపీలో కూటమి సర్కార్ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు.

ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కు. అన్ని గ్రామాల్లోనూ టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే షాపులు

తవ్వేకొద్ది బయటపడుతోన్న టీడీపీ నేతల నకిలీ లిక్కర్ బాగోతం..A1 జనార్ధన్రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు..

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..పెండింగ్ బిల్లులు చెల్లించాలని నెట్వర్క్ ఆస్పత్రుల డిమాండ్...పేదలకు పెనుశాపంగా మారిన కూటమి పాలన

ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు... ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి

నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను వైఎస్ జగన్ సందర్శన

ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల రక్షణకు పోరుబాట... నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట... ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
క్రీడలు

‘వైభవ్ సూర్యవంశీ గురించి ఆ మాట అస్సలు నమ్మను’
భారత్తో పాటు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఓ సంచలనం. పదమూడేళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 1.10 కోట్లకు అమ్ముడు పోయిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్ల వయసులోనే క్యాచ్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి అతిపిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత భారత అండర్-19 క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సత్తా చాటాడు.బిహార్ జట్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ఇక వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో బిజీగా ఉన్నాడు. బిహార్ జట్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ కొట్టేసిన వైభవ్.. ప్లేట్ గ్రూప్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో విఫలమయ్యాడు.టీ20 తరహాలో చెలరేగి.. నిరాశపరిచిరంజీలోనూ టీ20 తరహా విధ్వంసకర బ్యాటింగ్కు దిగిన వైభవ్.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ యాబ్ నియా బౌలింగ్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది.. ఆ వెంటనే క్లీన్బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఐదు బంతుల్లో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆశ్చర్యపోయాఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా తెరమీదకు వచ్చాయి. టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నిజంగా నేను ఆశ్చర్యపోయా. జైపూర్లో కామెంట్రీ చేస్తున్నా.నాలుగో ఓవర్లో లైవ్లోకి వెళ్లా. అయితే, ఆ సమయంలో మాకు ఓ కామెంటేటర్ తక్కువగా ఉన్నారు. తొమ్మిది, పదో ఓవర్.. అప్పుడే వైభవ్ సెంచరీ చేశాడు. తనదైన శైలిలో శతక్కొట్టేశాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి మేటి బౌలర్లను చితక్కొడుతూ.. ఎక్స్ట్రా కవర్, మిడ్ వికెట్ మీదుగా షాట్లు బాదాడు.అతడి వయసు పద్నాలుగే అంటే నమ్మనుఆ సమయంలో హైడోస్ (మాథ్యూ హెడెన్) అక్కడే ఉన్నాడు. అప్పుడు తను.. ‘ఓహ్.. అతడి వయసు పద్నాలుగే అంటే నేను అస్సలు నమ్మను’ అంటూ ఎగ్జైట్ అయ్యాడు. ఇందుకు నేను బదులిస్తూ.. ‘కమాన్.. కామ్డౌన్’ అన్నాను’’ అంటూ విల్లో టాక్ షోలో రవిశాస్త్రి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.చదవండి: అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్నే.. నువ్వు చైర్మన్వి కదా!

సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) రంజీ ట్రోఫీ (Ranji Trophy 2025-26) తొలి మ్యాచ్లోనే చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్ కెప్టెన్గానూ వ్యవహరిస్తున్న పాటిదార్.. పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. పాటిదార్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది 16వ సెంచరీ. దేశవాలీ క్రికెట్లో పాటిదార్ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత 8 ఇన్నింగ్స్ల్లో అతను 3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలు చేశాడు. ఆ స్కోర్లు ఇలా ఉన్నాయి. 100*(160), 10(25), 66(132), 13(27), 101(115), 77(84), 66(72) & 125(96)పంజాబ్తో మ్యాచ్లో పాటిదార్ వెంకటేశ్ అయ్యర్తో (73) కలిసి ఐదో వికెట్కు 147 పరుగులు జోడించాడు. 92 ఓవర్ల తర్వాత (రెండో రోజు) మధ్యప్రదేశ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 304 పరుగులుగా ఉంది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్తో పోలిస్తే 72 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుందిపాటిదార్తో పాటు సరాన్ష్ జైన్ (2) క్రీజ్లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లో హిమాన్షు మంత్రి (40), శుభమ్ శర్మకు (41) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 232 పరుగులకు ఆలౌటైంది. సరాన్ష్ జైన్ 6 వికెట్లు తీసి పంజాబ్ను దెబ్బకొట్టాడు. కుమార్ కార్తికేయ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ఉదయ్ సహరన్ (75) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. విధ్వంసకర ఆటగాడు ప్రభ్సిమ్రన్ సింగ్ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. చదవండి: విధ్వంసకర వీరుడికే ప్రతిష్టాత్మక అవార్డు.. సహచరుడు పోటీ పడినా..!

విధ్వంసకర వీరుడికే ప్రతిష్టాత్మక అవార్డు.. సహచరుడు పోటీ పడినా..!
టీమిండియా నయా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు (ICC Player Of The Month Award) గెలుచుకున్నాడు. సెప్టెంబర్ నెలకు గానూ అభిషేక్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం అభిషేక్తో పాటు మరో టీమిండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్, జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ పోటీ పడ్డారు. ఓటింగ్ అనంతరం అభిషేక్ విజేతగా ఆవిర్భవించాడు.అభిషేక్ ఈ అవార్డు గెలుచుకోవడం ఇది మొదటిసారి. భారత్ తరఫున ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న 10వ ఆటగాడు అభిషేక్. అభిషేక్కు ముందు శుభ్మన్ గిల్ (4 సార్లు), బుమ్రా (2), శ్రేయస్ అయ్యర్ (2), పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, సిరాజ్ ఈ అవార్డు గెలుచుకున్నారు.అభిషేక్ సెప్టెంబర్ నెలలో విశేషంగా రాణించినందుకు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. టీ20 ఆసియా కప్లో అతను 7 మ్యాచ్ల్లో 200 స్ట్రైక్ రేట్తో, 44.85 సగటున 314 పరుగులు చేశాడు. అభిషేక్ ప్రదర్శనల కారణంగా భారత్ ఆసియా కప్ను సునాయాసంగా గెలుచుకుంది.అభిషేక్ ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఆసియా కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్న అభిషేక్.. ఆ ప్రదర్శనల తర్వాత ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.మహిళల విభాగంలో మంధనమహిళల విభాగంలో సెప్టెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు టీమిండియాకే చెందిన స్మృతి మంధనకు (Smriti Mandhana) దక్కింది. గత నెలలో ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో (58, 117, 125) విశేషంగా రాణించినందుకు ఆమె ఈ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డు కోసం మంధనతో పాకిస్తాన్కు చెందిన సిద్రా అమీన్, సౌతాఫ్రికాకు చెందిన తజ్మిన్ బ్రిట్స్ పోటీ పడ్డారు. తిరుగులేని ప్రదర్శన కారణంగా మంధననే ఈ అవార్డు వరించింది. చదవండి: Chiranjeevi: ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు

చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
టీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చరిత్ర సృష్టించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (వన్డేలు, టెస్ట్లు, టీ20లు) 500 మ్యాచ్ల మార్కును తాకనున్న పదో ఆటగాడిగా, నాలుగో భారతీయుడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే మ్యాచ్ (India vs Australia) రోహిత్కు అంతర్జాతీయ కెరీర్లో 500వ మ్యాచ్ అవుతుంది. ఇప్పటివరకు 499 మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 42.18 సగటున, 49 సెంచరీల సాయంతో 19700 పరుగులు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ మూడు ఫార్మాట్లలో 664 మ్యాచ్లు ఆడి 100 శతకాల సాయంతో 34357 పరుగులు చేశాడు.సచిన్ తర్వాత భారత్ తరఫున విరాట్ కోహ్లి (550), ఎంఎస్ ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509) మాత్రమే 500 అంతర్జాతీయ మ్యాచ్ల అరుదైన మైలురాయిని తాకారు.కాగా, రోహిత్ శర్మ గతేడాది (2024) టీ20 ప్రపంచకప్ గెలిచాక పొట్టి ఫార్మాట్కు, ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ చివరిగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఆ టోర్నీలో కెప్టెన్గా వ్యవహించిన హిట్మ్యాన్ టీమిండియాను ఛాంపియన్గా నిలిపాడు.రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు వన్డేలు ఆడాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. ఇందులో భాగంగా భారీగా బరువు తగ్గి, కెరీర్ తొలినాళ్లలో రోహిత్ను గుర్తు చేస్తున్నాడు. వన్డేల్లో రోహిత్ భవితవ్యం ఆసీస్ పర్యటనలో ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటనలో రాణిస్తే హిట్మ్యాన్ను తిరుగుండదు.ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్పై హిట్మ్యాన్ను అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ జట్టుపై అతను 46 ఇన్నింగ్స్ల్లో 57.3 సగటున 2407 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 9 అర్ద సెంచరీలు ఉన్నాయి.🚨 ROKO IN NETS AT PERTH 🚨- Virat Kohli & Rohit Sharma in the bathing practice together at Perth ahead of ODI series. 🐐 (RevSportz).pic.twitter.com/1IMvphZIvi— Tanuj (@ImTanujSingh) October 16, 2025అభిమానులు రోహిత్ నుంచి మరోసారి ఇదే ప్రదర్శనను ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ కోరికల అనుగుణంగానే హిట్మ్యాన్ కూడా కఠోరంగా శ్రమిస్తున్నాడు. నిన్న పెర్త్లో ల్యాండ్ అయిన వెంటనే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లితో కలిసి గంటల కొద్ది నెట్స్లో చమటోడ్చాడు.చదవండి: హర్భజన్ సింగ్ రీఎంట్రీ
బిజినెస్

హైదరాబాద్ యువతకు ఫ్లిప్కార్ట్ ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు
యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. హైదరాబాద్, బెంగళూరులోని యువతకు ఉద్యోగ నైపుణ్యాల శిక్షణనివ్వడంతో పాటు అవకాశాలను కూడా దక్కించుకోవడంలో తోడ్పాటు అందించనున్నాయి. ఈ ప్రోగ్రాం కింద 540 మందికి ట్రైనింగ్ కల్పించనుండగా, వీరిలో కనీసం 70 శాతం మంది మహిళలు ఉంటారు.సుమారు 380 మంది ట్రైనీలకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. ఇందులో పాల్గొన్న వారి కుటుంబాలతో పాటు సుమారు 2,700 మందికి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. బీఎఫ్ఎస్ఐ కంటెంట్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలైన అంశాల్లో శిక్షణనిస్తారు.ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్లు ఇదివరకే భాగస్వామ్యంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అది సత్ఫలితాలను ఇవ్వడంతో మరోసారి యువతకు శిక్షణ ఇచ్చేందుకు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఈ భాగస్వామ్యంతో గతంలో 546 మంది యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. వీరిలో 73 శాతం మంది అర్థవంతమైన ఉపాధి అవకాశాల నుండి ప్రయోజనం పొందుతున్నారు. నిర్మాణాత్మక పోస్ట్-ప్లేస్మెంట్ ట్రాకింగ్ ద్వారా యువతకు ఉపాధిని మరింత పెంచడం, దీర్ఘకాలిక ఉద్యోగ నిలుపుదల, స్థిరమైన ఆదాయ వృద్ధికి మద్దతు ఇవ్వడం కొత్త ప్రాజెక్ట్ లక్ష్యం.

రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!
దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే రవాణా సాధనాలు రైళ్లు. సరళమైనవి, సౌకర్యవంతమైనవి, దేశవ్యాప్తంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటంతో నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిని భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.ఇండియన్ రైల్వే విస్తృత నెట్వర్క్, క్లిష్ట కార్యకలాపాలతోపాటు అనేక విశిష్ట చిహ్నాలు, గుర్తులతో ప్రయాణికులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ప్రముఖ గుర్తుల్లో ఒకటి, ప్రతి రైలు చివరి కోచ్పై ఉండే బోల్డ్ ‘ఎక్స్’ (X) గుర్తు. మొదటిసారి చూసినప్పుడు ఇది కేవలం డిజైన్ లేదా సాధారణ గుర్తుగా అనిపించవచ్చు. అయితే, ఈ గుర్తు రైలు భద్రత, కార్యకలాపాల సమర్థతలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వాస్తవ అర్థం, ఉపయోగాన్ని తెలుసుకోవడం ట్రాక్ నిర్వహణ, రైలు ఆపరేషన్లకు ఎంతో అవసరం.రైలు పూర్తిగా దాటిందని నిర్ధారణచివరి కోచ్పై ఉన్న "X" గుర్తు ప్రధానంగా రైలు పూర్తిగా స్టేషన్ గుండా దాటిందని రైల్వే సిబ్బందికి తెలియజేస్తుంది. ఇది ఒక దృశ్య సూచనగా పని చేస్తూ, అన్ని కోచ్లు పూర్తిగా వెళ్లిపోయాయని నిర్ధారించడంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో లేదా దృష్టి మందగించే వాతావరణంలో ఇది మరింత కీలకంగా మారుతుంది. కేవలం సిగ్నళ్లపై ఆధారపడటం చాలనిపించినా ఈ "X" మార్కింగ్ అదనపు భద్రతా పొరగా నిలుస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపుకొన్నిసార్లు అరుదైన సంఘటనల్లో, ఒక కోచ్ రైలు నుండి వేరు కావచ్చు. అలాంటి సందర్భంలో, రైలు చివరి కోచ్పై "X" గుర్తు కనపడకపోతే, అది తక్షణమే ఒక హెచ్చరికగా మారుతుంది. దీనివల్ల రైల్వే అధికారులు సమస్యను వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ప్రమాదాలను నివారించడంలో, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను పరిరక్షించడంలో కీలకంగా ఉంటుంది.

'అప్పటికి బంగారం ధరలు భారీగా పడిపోతాయ్'
ప్రస్తుతం బంగారం ధరలు(Gold price) రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది పుత్తడి ధరలు పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2026 ద్వితీయార్థంలో బంగారం ధర గణనీయంగా తగ్గే అవకాశముందని ఏఎన్జెడ్ (ANZ) బ్యాంక్ అంచనా వేసింది.ప్రస్తుత బంగారం ధరల పరిస్థితిస్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు 0.4 శాతం పెరిగి 4,224.79 డాలర్లకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ (డిసెంబర్ డెలివరీ) 0.9 శాతం పెరిగి 4,239.70 డాలర్లకు చేరుకుంది. భారత్లో ప్రస్తుతం (అక్టోబర్ 16) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,29,590 వద్ద ఉంది.అనిశ్చిత భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, ఆర్థిక ఒడిదుడుకులు, యూఎస్ డాలర్ బలహీనత, వడ్డీ రేట్లు తగ్గే అంచనాలు అన్నీ కలిపి బంగారం ధరను ప్రస్తుతం ఆల్టైమ్ హై స్థాయికి చేర్చాయని నిపుణులు పేర్కొన్నారు.ఏఎన్జెడ్ అంచనాతక్కువ వడ్డీ రేటు వాతావరణంలో బాగా పనిచేసే అనిశ్చితి కాలంలో సురక్షితమైన ఆస్తిగా కనిపించే బంగారం ఇప్పటి వరకు 61 శాతం పెరిగింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.1 శాతం పడిపోయి ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకుంది.ఏఎన్జెడ్ అంచనా ప్రకారం (Gold price prediction).. బంగారం ధరలు ఇదే విధంగా పెరిగి 2026 మొదటి ఆరు నెలలు శిఖరానికి చేరుకుంటాయి. 2026 జూన్ నాటికి బంగారం ధర ఔన్స్కు 4,400 డాలర్లకు చేరే అవకాశం ఉంది. అయితే, ఆ తర్వాత ఈ ఏడాది రెండో భాగంలో ధరలు పడిపోవొచ్చని ఏఎన్జెడ్ అంచనా వేసింది.ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్వెండి కూడా..2026 మధ్య నాటికి వెండి (Silver price) ఔన్స్ కు 57.50 డాలర్లకు చేరుకుంటుందని ఏఎన్జెడ్ బ్యాంక్ అంచనా వేసింది. ఏదేమైనా, హాకిష్ ఫెడ్ వైఖరి, ఊహించిన దానికంటే బలమైన యూఎస్ ఆర్థిక వృద్ధి ప్రతికూల ప్రమాదాలను కలిగిస్తుందని ఏఎన్జెడ్ హెచ్చరించింది.(Disclaimer: బంగారం, వెండి గురించి నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. కొనుగోలుదారులకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఈ కంపెనీ దీపావళికి ఇచ్చిన గిఫ్ట్లు చూశారా..?
దీపావళి.. దేశంలో అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన్ని పుస్కరించుకుని దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు బోనస్లు, బహుమతులు (Diwali Gifts) ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు కేవలం స్వీట్ బాక్స్ లతోనే సరిపెట్టేస్తుంటాయి. మరి కొన్ని కంపెనీలు అయితే అవి కూడా లేకుండా ఉద్యోగులకు వట్టి చేతులు చూపిస్తుంటాయి. కేవలం కొన్ని కంపెనీలే తమ ఉద్యోగులకు గుర్తుండిపోయేలా బహుమతులిచ్చి ఆశ్చర్యపరుస్తుంటాయి.భారతీయ టెక్నాలజీ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ (Info Edge) తన ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి బహుమతులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఉద్యోగులు స్వయంగా చిత్రీకరించిన అనేక ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి, సంస్థ వారికిచ్చిన రిచ్ గిఫ్ట్ హ్యాంపర్స్ను హైలైట్ చేస్తున్నాయి.వీడియోలలో ప్రతి ఉద్యోగి తమ వర్క్స్టేషన్ వద్దకు రాగానే, వీఐపీ బ్రాండెడ్ సూట్కేస్, స్నాక్స్ బాక్స్, సాంప్రదాయ దీపం (దియా) అమర్చి ఉండటం కనపడుతోంది. ఆఫీసు అంతటా పండుగ శోభను సంతరించుకుని, డెస్కులు అందంగా అలంకరించి ఉన్నాయి.వైరల్గా మారిన దీపావళి గిఫ్ట్ రీల్స్తమ సంస్థ ఇచ్చిన గిఫ్ట్లను చూపుతూ ఉద్యోగులు చేసిన రీల్స్ సోషల్ మీడియా లో వైరల్గా మారాయి. ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తీసిన వీడియోలలో, బహుమతులను చూస్తూ వారు ఆశ్చర్యపోతున్న క్షణాలు బంధించారు. కొన్ని క్లిప్లలో ఉద్యోగులు సూట్కేస్ తెరిచి చూపించారు. లోపల మరొక చిన్న సూట్కేస్ ఉంది. అలాగే స్నాక్స్ బాక్స్ లను అన్బాక్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. గత ఏడాది కూడా ఈ సంస్థ ఉద్యోగులకు ఎయిర్ఫ్రైయర్లు బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు.నెటిజన్ల స్పందనలుఈ వీడియోలు వైరల్ కావడంతో, సోషల్ మీడియా కామెంట్లు వ్యంగ్యంతో పాటు అసూయతో నిండిపోయాయి. “నేను నా ఆఫీస్ నుండి వచ్చిన కాజు బర్ఫీ బాక్స్ని చూస్తూ ఈ వీడియోను చూస్తున్నాను” ఒకరు కామెంట్ చేయగా “దీనిని నా మేనేజర్కి చూపించాను. ఆయన ఇది ఏఐ అన్నాడు!” మరో వ్యక్తి హాస్యంగా కామెంట్ చేశారు.కంపెనీ గురించి..ఇన్ఫో ఎడ్జ్ సంస్థను 1995లో సంజీవ్ బిఖ్చందానీ స్థాపించారు. ఇది నౌకరి, 99ఎకర్, జీవన్ సాథీ, శిక్షిక.కామ్ వంటి ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను నిర్వహిస్తోంది. అలాగే, పలు స్టార్ట్అప్లలో కూడా పెట్టుబడులు పెట్టింది. సంస్థ ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది.ఇదీ చదవండి: ఈ కంపెనీల్లో కెరియర్కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్ లిస్ట్
ఫ్యామిలీ

కామితార్థ ప్రదాయిని కామాక్షీదేవి
కంచి (Kanchi) అనగానే మనకు కామాక్షిదేవి పేరే గుర్తుకు వస్తుంది. ఆ నగరాన్ని స్మరిస్తేనే మోక్షం లభిస్తుంది. అందరూ దర్శించే కామాక్షీదేవి ఆలయానికి వెనుకవైపు ఒక ఆలయం ఉంది. అదే ఆదికామాక్షీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని కాళీకొట్టమ్ (కాళీ కోష్టమ్) అనే పేరుతో కూడా పిలుస్తారు. ఒకానొక సమయంలో పార్వతీదేవి ఇక్కడ కాళీరూపంలో వెలసిందట. నాటినుండీ ఆమెకు ఆ పేరు ప్రసిద్ధమైంది.కంచి కామాక్షిదేవి ఆలయం కంటే ఇది ప్రాచీనమైనదని చెబుతారు. కామాక్షీదేవికి ముందు భాగంలో శక్తి లింగం ఒకటుంది. అమ్మవారి ముఖం లింగంపై ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరలింగంగా పూజలందుకుంటోంది. కల్యాణం కాని వారు ఈ శక్తి లింగాన్ని పూజిస్తే తప్పక కల్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపచేశారట.గర్భగుడిలో ఆదికామాక్షీదేవి పద్మాసనంలో కూర్చుని అభయముద్రను, పానపాత్రను, పాశాంకుశాలనూ నాలుగు చేతులతో ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి పీఠానికి కింది భాగంలో మూడు శిరస్సులు దర్శనమిస్తాయి. వాటి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది.శిల్పకుశలురైన ధర్మపాలుడు, ఇంద్రసేనుడు, భద్రసేనుడు అనే ముగ్గురు కాంచీపురంలో తమ శిల్పాలను ప్రదర్శించడానికి వస్తారు. వారి శిల్పకళకు అచ్చెరువొందిన కంచిరాజు వారికి ఒక మాట ఇచ్చి తప్పుతాడు. దాంతో రాజుకు శిల్ప సోదరులకు యుద్ధం జరుగుతుంది. భీకరమైన ఈ యుద్ధాన్ని నివారించేందుకు కామాక్షీదేవి ప్రత్యక్షమై రాజుకు, ఆ శిల్పులకు సంధి చేస్తుంది. శిల్పులకు తన పాదసన్నిధిలో స్థానం కల్పించి అనుగ్రహిస్తుంది. ఈ కథ ధర్మపాలవిజయం పేరిట ప్రసిద్ధి పొందింది. సకలశుభాలనూ, సకల సిద్ధులనూ అనుగ్రహించే ఆదికామాక్షీదేవిని దర్శించి అభీష్టసిద్ధిని పొందండి.చదవండి: పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి

సహజమైన స్టైల్ దుస్తులే ఇష్టం: కునాల్ కపూర్
బాలీవుడ్ నటుడు ఓ స్టోర్ లాంచింగ్లో సందడి చేశారు. కొత్తగూడలోని శరత్సిటీ మాల్లో ఇండియన్ టెర్రైన్ ఎండీ నర్సింహన్తో కలిసి బుధవారం ఆయన సరికొత్త కాన్సెప్ట్ స్టోర్ను ప్రారంభించారు. ఫ్యాషన్ ప్రేమికులకు నాణ్యమైన వివిధ డిజైన్ల దుస్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సహజమైన స్టైల్గా ఉండే దుస్తులు ఇష్టమని ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న కునాల్ కపూర్ పేర్కొన్నారు. చేనేత..ఓ ప్రామాణికత..ఫ్యాషన్ అంటే అనుసంధానం చేసేది, అనుభూతిని కలిగించేది.. మనం ధరించే వ్రస్తాలు అందమైన అనుభూతులనే కాకుండా సామాజికంగా మంచిని ప్రోత్సహించాలని నటి తేజస్వి మడివాడ తెలిపారు. కళాధర్ హ్యాండ్లూమ్స్ ఆధ్వర్యంలో రానున్న హైఫ్రీక్వెన్సీ దుస్తుల శ్రేణి కోసం నటి తేజస్వి సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజంగా లభించే ఫైబర్స్, స్వచ్ఛమైన పత్తి, నార, పట్టు నుంచి తయారైన దుస్తులను అమితంగా ఇష్టపడతాను, ఇలాంటి చేనేత ఫ్యాషన్ ఔత్సాహిక ఉన్న బ్రాండ్తో భాగస్వామిగా మారడం సంతృప్తిగా ఉందని అన్నారు. ప్రామాణికతపై నమ్మకం, చేతన ఫ్యాషన్ పట్ల నటి తేజస్వీకి ఉన్న ఉత్సుకత ఈ తరం ఫ్యాషన్ ప్రియులకు ఆదర్శమని కళాధర్ హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ కళాధర్ రచబతుని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా మొదటి డ్రాప్లో క్లీన్ సిల్హౌట్లు, బ్రీతబుల్ టెక్చర్తో సమకాలీన హంగులతో భారతీయ హస్తకళను ప్రదర్శించే సీజన్లెస్ కలెక్షన్స్ ఉంటాయని పేర్కొన్నారు. (చదవండి: ఫ్యాషన్ టు డైరెక్షన్..! కాదేదీ సృజనకు అనర్హం)

పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?
శ్రీ మహావిష్ణువు అవతారంగా, దేవతలకు వైద్యుడుగా, ఆయుర్వేద వైద్యానికి ఆది వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన ధన్వంతరి క్షీర సాగర మథన సమయాన ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆవిర్భవించాడు. చతుర్భుజుడైన ధన్వంతరి నాలుగు చేతులలో శంఖం, చక్రం, జలౌకం (జలగ) అమృత తుల్యమైన పునరుజ్జీవన తేనె భాండం దర్శనమిస్తాయి.ధన్వంతరిని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజిస్తున్నప్పటికీ, ధన్వంతరికి అంకితం చేయబడిన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ. ఆ ఉన్న కొద్ది ఆలయాలు కూడా దక్షిణ భారతదేశంలోనే దర్శనమిస్తాయి ఉత్తర భారతాన న్యూఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఒక విగ్రహం, హరిద్వార్లోని ఒక ఆశ్రమంలో మరొక విగ్రహం తప్ప ఉత్తర భారతాన ధన్వంతరికి ఆలయాలంటూ అసలేం లేవనే చెప్పాల్సి ఉంటుంది.రంగనాథస్వామి ఆలయం వద్ద ధన్వంతరి ఆలయంతమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన పురాతన మందిరం ఉంది. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఆరోగ్యాభిలాషులైన భక్తులకు ‘ప్రసాదం’గా మూలికలను అందిస్తారు.కోయంబత్తూరు శ్రీ ధన్వంతరి ఆలయంకోయంబత్తూరులోని శ్రీ ధన్వంతరి ఆలయం తమిళనాడులోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. కోయంబత్తూరు నగర నడిబొడ్డున ఆర్య వైద్య చికిత్సాలయం, పరిశోధనా సంస్థలో ఉన్న శ్రీ ధన్వంతరి మందిరం, జీవానికి, వైద్యానికి దేవుడు, ధన్వంతరిని ప్రధాన దేవతగా ప్రతిష్టించింది.నెల్లువాయ భగవాన్ ధన్వంతరి ఆలయంగురువాయూర్, త్రిసూర్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నెల్లువాయ వద్ద ఉన్న లార్డ్ ధన్వంతరి ఆలయం కేరళలోని ముఖ్యమైన ధన్వంతరి ఆలయాలలో ఒకటి. ఆయుర్వేద వైద్యులు వైద్యం ్ర΄ారంభించే ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదంగా భావిస్తారు.మలప్పురంలో రుద్ర ధన్వంతరి ఆలయంమలప్పురంలోని పులమంథోల్ మధ్యలో ఉన్న శ్రీ రుద్ర ధన్వంతరి ఆలయం కేరళలోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ అష్టవైద్య పులమంథోల్ మూస్ కుటుంబానికి చెందినది, అయితే అన్ని వర్ణాలకు చెందిన హిందువులు ఆలయంలో పూజలు చేసుకోవడానికి అనుమతి ఉంది.శ్రీ ధన్వంతరి ఆలయం, పెరింగవుకేరళలోని త్రిస్సూర్ పట్టణ శివార్లలో ఉన్న మరొక పురాతన ధన్వంతరి ఆలయం పెరింగావులోని శ్రీ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయ గర్భగుడి రెండు అంతస్తులతో గుండ్రని ఆకారంలో నిర్మించబడింది, ఇది ఇతర కేరళ శైలి నిర్మాణ శైలికి భిన్నంగా అరుదైన డిజైన్. గణపతి, లక్ష్మీదేవి, అయ్యప్పన్ ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన ఇతర దేవతలు.వడక్కంచెరి ధన్వంతరి ఆలయంవడక్కంచెరి ఆయుర్వేద ప్రభువుకు అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం కేరళలోని త్రిస్సూర్కు ఉత్తరాన 18 కి.మీ దూరంలో వడక్కంచెరి నుండి 8 కి.మీ దూరంలో కున్నంకుళం – వడక్కంచెరి రహదారిపై ఉంది. (అక్టోబర్ 18, శనివారం ధన్వంతరి జయంతి)

ఫ్యాషన్ టు డైరెక్షన్..! కాదేదీ సృజనకు అనర్హం
దుస్తులు చెక్కిన చేతులు దృశ్యాలకు రూపమిస్తున్నాయి. మోడల్స్ని మెరిపించిన సృజన యాక్టర్స్ను కదిలిస్తోంది. ఫ్యాషన్ డిజైనర్లు సినిమా రంగం వైపు దృష్టి మళ్లిస్తున్నారు. కాదేదీ సృజనకు అనర్హం అనుకుంటూ తమ స్కిల్స్కు సాన పెడుతున్నారు. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభం కాగా.. నగరంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. సినిమా రంగం వైపు డిజైనర్ల చూపు ‘అక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ రావాలి.. ఆ షేడ్ ఇంకొంచెం మార్చాలి’.. వగైరా సూచనలు చేసిన వారే ‘లైట్స్, కెమెరా, యాక్షన్..’ అంటూ నిర్ధేశిస్తున్నారు. నగరంలో కొన్ని సినిమా షూటింగ్స్లో డైరెక్టర్లుగా మారిన ఫ్యాషన్ డిజైనర్లు చేస్తున్న సందడి ఇది. బాలీవుడ్తో మొదలై.. ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే జాబితాలో ముందుంటాయి విక్రమ్ ఫడ్నిస్, మనీష్ మల్హోత్రా అనే పేర్లు. అయితే ఇప్పుడు వీరి పేర్లకు ముందు ఇప్పుడు డిజైనర్లతో పాటు డైరెక్టర్లు అనే కొత్త ప్రొఫెషన్ కూడా చేరింది. కొన్నేళ్ల క్రితమే సినిమా దర్శకత్వంలో అడుగుపెట్టి హృదయాంతర్(2017), స్మైల్ ప్లీజ్(2019) అనే రెండు మరాఠీ చిత్రాలకు విక్రమ్ ఫడ్నిస్ దర్శకత్వం వహించారు. అదేవిధంగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హిందీ చిత్రం ద్వారా మనీష్ మల్హోత్రా దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. అయితే వీరు మాత్రమే కాకుండా గతంలో ఇతర డిజైనర్లు కూడా రంగుల లోకంలో భిన్న పాత్రలను పోషించారు. కాంతార ద్వారా దేశవ్యాప్తంగా అటు దర్శకత్వం, ఇటు హీరోగానూ పేరు సాధించిన రిషబ్ శెట్టి తొలి దశలో తాను తీసిన రిక్కి అనే సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేశారు. అదే విధంగా డిజైనర్గా సినిమా రంగంలో అడుగుపెట్టిన కేరళకు చెందిన స్టెఫీ జేవియర్ సైతం కొన్నేళ్ల తర్వాత మధుర మనోహర మోహం అనే సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. నగరానికి వచ్చేసిన ట్రెండ్.. ఇప్పుడు అదే ట్రెండ్ నగరానికి కూడా విస్తరించినట్టు కనిపిస్తోంది. నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్లు సినిమా రంగంపై తమ దృష్టి మళ్లించినట్టు స్పష్టమవుతోంది. డిజైనర్గా విజయవంతంగా కొనసాగుతున్న రామ్జ్.. పచ్చీస్ అనే సినిమా ద్వారా హీరోగా మారాడు. అలాగే ఫైటర్ రాజా పేరిట మరో సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఇక డైరెక్టర్లుగా మెగాఫోన్ పడుతున్నవారూ క్రమక్రమంగా పెరుగుతున్నారు. వీరిలో సినీ స్టైలిస్ట్, డిజైనర్గా పేరొందిన నీరజ కోన త్వరలో విడుదల కానున్న తెలుసు కదా సినిమాతో దర్శకురాలిగా ఆరంగేట్రం చేస్తున్నారు. గోదావరి వంటి సినిమాలకు పనిచేయడం ద్వారా శేఖర్ కమ్ములకు సన్నిహితుడైన మరో ప్రముఖ డిజైనర్ అరవింద్ జాషువా కూడా పేషన్ పేరుతో ఒక సినిమా తీస్తున్నారు.డిజైనర్గా ఉన్నా కాబట్టే డైరెక్టర్గా మారా.. దాదాపు 12ఏళ్ల పాటు కాస్ట్యూమ్స్ డిజైనర్, స్టైలిస్ట్గా ఉన్నాను. అందువల్లే నేను డైరెక్టర్గా మారగలిగాను. సినిమా రంగంతో సన్నిహితంగా ఉంటూ తొలుత స్క్రిప్ట్ రాయడం మీద పట్టు సాధించి అలా అలా ఒక స్టోరీని రెడీ చేసుకుని ఇప్పుడు సినిమా డైరెక్షన్ చేశాను. ఖచ్చితంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాను. – నీరజ కోన, ఫ్యాషన్ స్టైలిస్ట్, దర్శకురాలుఅదే ప్యాషన్తో.. సినిమా సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ తరహాలో కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. స్క్రిప్ట్ చదవడం దగ్గర నుంచి ప్రతీ అంశంపై నా ఆసక్తిని గమనించి శేఖర్ కమ్ముల బాగా నన్ను ప్రోత్సహించారు. అణువణువునా సృజనాత్మకత నింపే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది రెగ్యులర్ స్టడీస్ లాంటిది కాదు. నిఫ్ట్లో చదువుతున్నప్పుడు నాతో పాటు సహ విద్యార్థుల్లో కూడా గమనించిన ప్యాషన్ను బుక్గా రాశాను. అదే నా సినిమాకి ఇప్పుడు నేపథ్యం. – అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్, దర్శకుడు (చదవండి: హెయిర్కి బియ్యపిండి మాస్క్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..)
ఫొటోలు


డిఫరెంట్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)


డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ 35వ 'ఫ్యాషన్ గాలా'లో బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)


‘తెలుసు కదా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీ SWAG ఈవెంట్ (ఫొటోలు)


సాయి దుర్గ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


తెలంగాణలో గుప్త ఆలయం! సాహసోపేతమైన ప్రయాణం.. కోపాన్ని తగ్గించే కోనేరు.. మీకు తెలుసా? (ఫొటోలు)


దీపావళి ఈవెంట్లో సెలబ్రిటీలు.. ఇండస్ట్రీ అంతా ఒకేచోట (ఫొటోలు)


దత్తత కూతురి బర్త్ డే సెలబ్రేషన్లో సన్నీ లియోన్ (ఫొటోలు)


‘తెలుసు కదా’ సినిమా ప్రెస్ మీట్లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)


ట్రెడిషనల్ శారీ లుక్లో ‘కూలి’ బ్యూటీ..
అంతర్జాతీయం

చైనాను అడ్డుకోవడానికి భారత్ మద్దతు కావాలి: స్కాట్ బెసెంట్
వాషింగ్టన్: అమెరికా, చైనా(China) మధ్య టారిఫ్ల కారణంగా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్(Scott Bessent) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనాను టార్గెట్ చేసి.. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు.అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకానమీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు. అరుదైన ఖనిజాల(rare Metals) ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా దీనిని వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది. ఇక, అక్టోబర్ 9 నుంచి అరుదైన ఖనిజాల ఎగుమతులకు అనుమతులు తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.NEW:🇺🇲🇮🇳 US Treasury Secretary Scott Bessent now expects to receive support from India in the case of China's rare earth materials, despite the fact that a few weeks ago Trump imposed tariffs on them and blackmailed India to stop buying oil from Russia. pic.twitter.com/S0ol7tWiR8— Megatron (@Megatron_ron) October 14, 2025అయితే.. ఆయన మాటల్లో స్పష్టంగా చైనాపై వ్యతిరేక ధోరణి కనిపించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, సాంకేతిక పరమైన పోటీ, దక్షిణ చైనా సముద్రం వివాదం వంటి అంశాలు ఇప్పటికే ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పుడు అరుదైన ఖనిజాల విషయం కూడా ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమెరికా ఈ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో, అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది.మరోవైపు, అమెరికా ఇటీవల భారత్పై కొన్ని ఉత్పత్తులపై టారిఫ్లు విధించడం, వాణిజ్య పరమైన అడ్డంకులు సృష్టించడం విమర్శలకు దారితీసింది. టారిఫ్లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే, చైనాపై పోరులో మద్దతు కోరడం విరుద్ధ ధోరణిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినప్పటికీ, ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.

శాంతి చర్చల వేళ సంచలనం.. హమాస్ ప్రత్యర్థుల ఊచకోత
గాజా: ఇజ్రాయెల్ బందీల విడుదల అనంతరం హమాస్ సాయుధ గ్రూపు చూపు ఇప్పుడు ప్రత్యర్థి వర్గాలపై పడింది. గాజా ప్రాంతంపై పట్టు తిరిగి సాధించేందుకు విరోధి సాయుధ శ్రేణులను ఏరి పారేసే పనికి పూనుకుంది. ఈ పరిణామం అమెరికా మధ్యవర్తిత్వంతో నెలకొన్న కాల్పుల విరమణ మనుగడపై కొత్త అనుమానాలను తెరపైకి తెస్తోంది. ఇప్పటికైనా శాంతి నెలకొందని సంతోష పడుతున్న పాలస్తీనియన్లను హమాస్ వైఖరి భయపెడుతోంది.వివరాల ప్రకారం.. హమాస్ ఫైరింగ్ స్క్వాడ్ తాజాగా ప్రత్యర్థి వర్గాలకు చెందిన 8 మందిని కాల్చి చంపినట్లు సమాచారం. మొత్తమ్మీద 50 మందిని ఇప్పటి వరకు మట్టుబెట్టి ఉంటుందని వైనెట్ వార్తా సంస్థ తెలిపింది. అంతర్గత భద్రతను హమాస్ చూసుకుంటుందని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ వ్యాఖ్యానించింది. కళ్లకు గంతలు కట్టి, బంధించిన వారిని ముసుగులు ధరించిన హమాస్ సభ్యులు దాదాపు బహిరంగంగానే కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియోను షఫఖ్ న్యూస్ ప్రసారం చేసింది.Hamas continues mass executing anyone it sees as a potential threat in Gaza. No trial, no judge, no jury. But yeah, sure, these are the “freedom fighters.” 🤨https://t.co/v8o5CGqild— The Persian Jewess (@persianjewess) October 15, 2025దీనిపై స్పందించిన హమాస్.. ఇజ్రాయెల్ బలగాలకు సహకరించడంతోపాటు నేర కార్యకలాపాల్గో పాల్గొన్నందుకే వీరిని శిక్షించామని తెలిపింది. అయితే, హమాస్ చర్యలు గాజాలోని డొగ్ముష్ వంటి గ్రూపులతో హింసాత్మక ఘర్షణలకు దారి తీస్తున్నాయి. డొగ్ముష్ వర్గం గాజాలోని అత్యంత శక్తివంతమైన సాయుధ గ్రూపుల్లో ఒకటి. హమాస్ భద్రతా విభాగంతో జరిగిన కాల్పుల్లో డొగ్ముష్కు చెందిన 52 మంది చనిపోయారని వైనెట్ పేర్కొంది. ఈ పోరులో 12 మంది హమాస్ సాయుధులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హమాస్ సీనియర్ నేత బస్సెమ్ నయీమ్ కుమారుడు కూడా ఉన్నట్లు వైనెట్ పేర్కొంది. ప్రత్యర్థుల ప్రాంతాల్లోకి గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్సుల్లో వెళ్లిన హమాస్ శ్రేణులు శత్రు సంహారం చేస్తున్నారని తెలిపింది. పౌరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ హమాస్పై విమర్శలు వస్తున్నాయి.కొన్ని గ్రూపులకు ఇజ్రాయెల్ సాయంఅత్యంత అధునాతన, భారీ ఆయుధాలు కలిగిన డొగ్ముష్కు ఎప్పట్నుంచో హమాస్తో విభేదాలున్నాయి. ఈ గ్రూపునకు ఇజ్రాయెల్ మద్దతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. రఫాలోని యాసెర్ అబూ షబాబ్ సారథ్యంలోని గ్రూపు సహా గాజాలోని పలు ముఠాలకు పరిమితంగా సాయం, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటించడం గమనార్హం. ఇటీవల హమాస్ శ్రేణులు యాసెర్ అబూ షబాబ్ సన్నిహితుడొకరిని చంపేసినట్లు ప్రకటించుకున్నాయి. షబాబ్ను వదిలేది లేదని కూడా తెలిపాయి.@DonaldTrump @SecRubio @HowardLutnik32 @StephenM @jaredkushner This isn’t October 7 - it’s from the past few hours. Hamas is parading through Gaza, showing off the bodies of the many people they’ve executed since the ceasefire. pic.twitter.com/oWffZUI0g2— Flor (@HeavensFlor) October 15, 2025హమాస్లోని యారో యూనిట్ హింసాత్మక ప్రతీకార చర్యల్లో ఆరితేరిందని నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లూ సొరంగాల్లో రహస్యంగా నక్కుతూ పనిచేసిన హమాస్ సాయుధులు ఇప్పుడు తమ శత్రువుల అంతం చూసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. శాంతి ఒప్పందాన్ని అనుసరించే ఉద్దేశం హమాస్ లేనట్లు కనిపిస్తోందంటున్నారు. ‘ఆయుధాలను ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే హమాస్ ఇప్పటికీ ఉంది. నిరాయుధీకరణ రెండో దశ చర్చలు ప్రారంభమయ్యేటప్పటికి గాజాపై పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది’అని విశ్లేషకులు అంటున్నారు.

ఛీ.. ఈ చెత్త ఏంటి? అసహ్యమేస్తోంది.. ఎందుకిలా చేశారు?: ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంతోషం వచ్చినా.. కోపం వచ్చినా అస్సలు ఆగరు. తాజాగా టైమ్ మ్యాగజైన్ ఆయన్ని పొడుగుతూ ఓ కథనం ఇచ్చింది. అయినా కూడా ట్రంప్కు బాగా కోపం వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. టైమ్ మ్యాగజైన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా సోషల్ ట్రూత్లో ఓ పోస్ట్ పెట్టారు(Trump Angry On Time Magazine). కవర్ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఇంతకీ ఆయన ఆ పోస్టులో ఏమన్నారంటే.. నా గురించి వచ్చిన కథనం కొంతవరకు బాగానే ఉంది. కానీ కవర్పై ఉన్న ఫోటో మాత్రం చరిత్రలోనే చెత్త ఫోటో. వాళ్లు నా జుట్టును కనిపించకుండా చేశారు. నా జుట్టును తలపై చిన్న తలపాగా.. ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. నాకు ఎప్పుడూ కింది యాంగిల్ నుంచి తీసే ఫోటోలు నచ్చవు. ఇది మాత్రం చాలా చాలా చెత్త ఫొటో. అందుకే దీన్ని తప్పక విమర్శించాలి. అసలు వాళ్లు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?’’ అంటూ ట్రంప్ మేనేజ్మెంట్పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే టైమ్ మ్యాగజైన్ను ట్రంప్ కోపడ్డడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్ చీఫ్గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను ప్రచురించింది. ట్రంప్ ఆ ఫొటోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ వెటకారం ప్రదర్శించారు. అదే సమయంలో.. అయితే మస్క్ పని తీరును ఆ సమయంలో ఆయన ప్రశంసించారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు ట్రంప్ మీద టైమ్ మాగజైన్ His Triumph అనే శీర్షికతో కవర్ పేజీ ఇచ్చింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది. ఈ ఒప్పందంతోనే 20 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేయగా.. ఇజ్రాయెల్ సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను, 360 మంది పాలస్తీనీయుల మృతదేహాలను విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ ఏడాదిలోనే తాను పలు యుద్ధాలను ఆపానంటూ ట్రంప్ నోబోల్ శాంతి బహుమతి డిమాండ్ చేయగా.. రూల్స్ అడ్డురావడంతో ఆయన కల నెరవేరలేదు!. దీంతో వచ్చే ఏడాదైనా దక్కవచ్చనే ఆశ పెట్టుకున్నారాయన.ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇదీ.. ఇంత భజనా?

ఇక నేనే అధ్యక్షుడిని
ఆంటనానారివో: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్లో అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన మిలటరీ కమాండర్, కల్నల్ మైఖేల్ ర్యాండ్రియానిరినా బుధవారం తన మనసులోని మాట బయటపెట్టారు. త్వరలో దేశాధ్యక్షునిగా పగ్గాలు చేపట్టబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. జెన్ జెడ్ యువత నేతృత్వంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారడంతో ప్రాణభయంతో అధ్యక్షుడు రాజోలీనా విదేశానికి పారిపోయారు. రాజోలీనా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్ చెప్పారు. మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్శాట్ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలీనా చేతులెత్తేయడం తెల్సిందే. ‘‘నిన్ననే మేం వాస్తవానికి బాధ్యతలు తీసుకోవాల్సింది. దేశంలో అధ్యక్షుడు లేడు. సెనేట్లోనూ అధ్యక్షుడి జాడ లేదు. అసలు ప్రభుత్వమే లేదు. అందుకే త్వరలో మేం నూతన ప్రధానికి నియమిస్తాం’’అని మైఖేల్ వ్యాఖ్యానించారు. అయితే ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనే మైఖేల్ స్పష్టంచేయలేదు. సెనేట్, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్ ఇప్పటికే జాతీయరేడియోలో ప్రకటించడం తెల్సిందే. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్ల పాలిటపడింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటికొరత, విద్యుత్ సంక్షోభం, అమాంతం పెరిగిన అవినీతితో జెన్జెడ్ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది.
జాతీయం

ట్రంప్ ప్రకటన.. రాహుల్ విమర్శలు.. స్పందించిన కేంద్రం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్ను చూసి మోదీ భయపడ్డారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంధన దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నోట్ రూపేణా స్పందించింది. అస్థిర పరిస్థితుల నడుమ.. వినియోగదారుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం ఉంటుందని అందులో కేంద్రం స్పష్టం చేసింది(India Reacts On Trump Russia Oil Comments).మీడియా ప్రశ్నలకు బదులుగా.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తాజా పరిణామాలపై ఒక నోట్ విడుదల చేశారు. చమురు సంబంధిత దిగుమతులు భారత్కు ఎంతో కీలకం. మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి.... స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా.. ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఇంధన వనరుల విస్తరణ, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం జరుగుతోంది అని అందులో పేర్కొన్నారాయన. అలాగే..Our response to media queries on comments on India’s energy sourcing⬇️🔗 https://t.co/BTFl2HQUab pic.twitter.com/r76rjJuC7A— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025అమెరికాతో సంబంధం గురించి మాట్లాడుతూ.. గత దశాబ్దంగా ఇంధన సహకారం పెరుగుతోంది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్తో సహకారం మరింతగా అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి అని జైస్వాల్ అందులో తెలిపారు. తద్వారా.. అంతర్జాతీయ ఒత్తిడులకు కాకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా భారత్ ముందుకు వెళ్తుందని మరోసారి భారత్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) ముగింపు దిశగా కీలక అడుగు పడిందని, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోతోందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన లేకపోయినా తరచూ అభినందన సందేశాలు ఎందుకంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ తరుణంలో కౌంటర్గా కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.ఇదీ చదవండి: మోదీ నన్ను ప్రేమిస్తారు.. అంటే మరోలా కాదు!

30 ఏళ్లుగా భారత్లో ‘బంగ్లా’ ట్రాన్స్.. నకిలీ పత్రాలతో హల్చల్
ముంబై: భారత్లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పలువురు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులు ‘గురు మా’ పేరుతో గుర్తింపు పొందిన జ్యోతి అనే బంగ్లాదేశ్కు చెందిన ట్రాన్స్ జెండర్ను అరెస్టు చేశారు.ట్రాన్స్ జెండర్ జ్యోతి గత 30 ఏళ్లుగా నకిలీ ధృవపత్రాలతో భారత్లో ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి అసలు పేరు బాబు అయాన్ ఖాన్. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ వచ్చి, ఇక్కడ ఉంటున్న వలసదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే జ్యోతితో పాటు ఆమె సహచరులను ముంబైలోని శివాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇతర ధృవీకరణ పత్రాలు ఉండటంతో తొలుత వదిలేశారు. అయితే ఆ తరువాత జ్యోతికి సంబంధించిన ధృవపత్రాలను మరోమారు తనిఖీ చేయడంతో అవి నకిలీవని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.శివాజీ నగర్, నార్పోలి, డియోనార్, ట్రోంబే, కుర్లాతో సహా ముంబై పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో జ్యోతిపై ఇప్పటికే పలు నేర సంబంధిత కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జ్యోతికి ముంబైలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జ్యోతిని ‘గురు మా’ పేరుతో పిలుస్తారు. జ్యోతికి పలువురు అనుచరులు కూడా ఉన్నారు. జ్యోతి అలియాస్ ‘గురు మా’ను పాస్పోర్ట్ చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని పలు నిబంధనల కింద అరెస్టు చేశారు.ఇదిలావుండగా ఢిల్లీలోని షాలిమార్ బాగ్, మహేంద్ర పార్క్ ప్రాంతాలలో నిర్వహించిన వరుస ఆపరేషన్లలో ఢిల్లీ పోలీసులు దేశంలో అక్రమంగా నివసిస్తున్న పది మందికి పైగా బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. వీరంతా మహిళలుగా కనిపించేందుకు సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, భిక్షాటన చేస్తుంటారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ‘హైదర్పూర్ మెట్రో స్టేషన్, న్యూ సబ్జీ మండి ప్రాంతాలలో అనుమానిత బంగ్లాదేశీయుల గురించి అందిన సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదర్పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎనిమిది మందిని, న్యూ సబ్జీ మండి సమీపంలో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు చెబుతున్న భారత పౌరసత్వ వాదనలపై సందేహాలు తలెత్తాయని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. 35 మార్కులు రాకున్నా పాస్..
పదో తరగతి.. లేదా ఎస్ఎస్ఎల్సీ.. విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ఇది మొదటి మెట్టు. టెన్త్ పాసైతే పీయూసీ, ఆపై చదువులకు తలుపులు తెరుచుకుంటాయి. లేదా చిన్నా చితకా ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఇందుకోసం ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులను తెచ్చుకోవాలి. కానీ చాలామంది విద్యార్థులు, పేదరికం, చదువు అర్థం కాక తదితర సమస్యలతో ఒకటీ అరా మార్కులతో పరీక్షలు తప్పి శాశ్వతంగా చదువుల తల్లికి దూరం కావడం అన్నిచోట్లా జరుగుతోంది. టెన్త్ ఫెయిల్ అనేది ఒక శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణతకు 33 శాతం మార్కులు చాలని కుదించింది. శివాజీనగర: రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 33 శాతం మార్కులు వస్తే చాలు పాసైపోయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. 35 శాతం మార్కులు పొందేందుకు అవస్థలుపడే అనేకమంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలం కానుంది. ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తామని, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. 206 మార్కులు చాలు బుధవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మధు.. ఈ విద్యా సంవత్సరం నుంచి 33 శాతం మార్కులు పొందితే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయినట్లేనని తెలిపారు. మొత్తం మార్కులు 625 కాగా, 206 మార్కులు వస్తే చాలు విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పారు. అంతర్గత మార్కులు, బాహ్య మార్కులు రెండు కలిపి 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఒక మార్కు, రెండు మార్కుల్లో పరీక్షలు తప్పిపోయే వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్షలు రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీలో పరీక్షల వ్యవస్థ మెరుగుపరిచేందుకు మూడంచెల విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఉత్తమ రీతిలో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. ఉత్తీర్ణత వృద్ధి కోసం 33 శాతం పాసింగ్ మార్కులను నిర్ధారించామన్నారు. ఆయా సబ్జెక్టుల మార్కుల్లో 30 మార్కులు పొంది, అంతర్గత, బాహ్య మార్కులు కలిపి మొత్తం 33 శాతం మార్కులు వచ్చినా ఉత్తీర్ణులవుతారని తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు, రిపీటర్స్కు ఇది వర్తిస్తుందని చెప్పారు.

తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్లో విపక్ష మహాఘట్ బంధన్లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.పది మంది అభ్యర్థులకు సింబల్ పంపిణీ చేసింది కాంగ్రెస్. ఆ ఫొటోలను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేగింది.బీహార్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఖాన్లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.బీహార్లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అయితే.. विधानसभा क्षेत्र - बिक्रम सेINDIA गठबंधन समर्थित कांग्रेस उम्मीदवार श्री अनिल कुमार जी को अनंत बधाई एवं शुभकामनाएं!जीत रहा है INDIA ✊ pic.twitter.com/au4idsuiOm— Bihar Congress (@INCBihar) October 15, 2025ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్ అహ్మద్ ఖాన్ను కార్యకర్తలు రౌండప్ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.Congressmen clash at Patna airport, causing uproar over ticket dispute #Patna #Airport #Congress बिहार कांग्रेस के कार्यकर्ता पटना एयरपोर्ट पर टिकट बंटवारे से नाराज़! कृष्णा अल्लावरू, राजेश राम के सामने पहुंचे, लेकिन पप्पू यादव समर्थकों से भिड़ंत। गोली नहीं चली, यही बड़ी बात! pic.twitter.com/cpMcx35U5C— DVN TV (@dvntvnews) October 16, 2025ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్!
ఎన్ఆర్ఐ

బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం
భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.వికసిత్ భారత్ 2047(Viksit Bharat@2047)దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు "దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని ,ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు.

‘రష్యా.. పచ్చి అబద్ధం’: ఉక్రెయిన్ అదుపులో భారతీయుడు!?
ఉక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. రష్యా తరపున పోరాడుతున్న ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతను భారతీయుడని తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది(Is Indian Captured By Ukraine Army). ది కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. పట్టుబడిన యువకుడి పేరు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్(22). స్వస్థలం గుజరాత్ మోర్బీ. ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లి.. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా ఉక్రెయిన్కు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని స్టేట్మెంట్తో సదరు మీడియా సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన మజోత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడట. ఏడేళ్ల శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడట. అయితే.. యుద్ధంలో పోరాడితే శిక్షా కాలం తగ్గిస్తామని, ఆర్థికంగా కూడా సాయం అందిస్తామని మజోత్కు రష్యా అధికారులు ఆఫర్ చేశారట. జైల్లో ఉండడం ఇష్టం లేక అందుకు అంగీకరించానని, అయితే ఆ ఒప్పందంపై సంతకం చేసింది అక్కడి నుంచి బయటపడేందుకేనని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. రష్యాలో అంతా పచ్చి అబద్ధం. నాకు ఆర్థిక సాయం అందలేదు. తగ్గిస్తామని అధికారులు చెప్పడం, జైల్లో ఉండడం ఇష్టం లేకనే ఆ ఒప్పందం కుదుర్చుకుని రష్యా తరఫున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్(Special Military Operation)లో పాల్గొన్నానంటూ అతను చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్ స్థావరాన్ని చూడగానే తాను తన రైఫిల్ను పక్కన పెట్టి సాయం కోసం అర్థించానని చెప్పాడతను. తనకు రష్యాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని.. రష్యా జైల్లో మగిపోవడం కంటే ఇక్కడ ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవించడం ఎంతో నయంగా భావిస్తున్నట్లు చెప్పాడతను. Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4— Sidhant Sibal (@sidhant) October 7, 2025మరోవైపు ఈ కథనం తమ దృష్టికీ వచ్చిందని, అయితే ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ చెబుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దురాక్రమణను మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాల యువకులకు గాలం వేసి రష్యా సైన్యం ఉపయోగించుకుంటోందని.. ఉత్తర కొరియా, భారత్.. ఇలా పలు దేశాలకు చెందిన యువకులకు ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుందనే విమర్శ తొలి నుంచి వినిపిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే 48 దేశాలకు చెందిన 1,500 మందికి పైగా విదేశీయులను పట్టుకున్నట్లు(Foreigners Caught in Ukraine War) నివేదికలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోవడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యాలో ఉన్న భారతీయుల్లో 126 మందిని ఉక్రెయిన్ యుద్ధంలో దించారని, అందులో 12 మంది మరణించగా.. మరో 16 మంది ఆచూకీ లేకుండా పోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇదే విషయాన్ని మాస్కో వర్గాల దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ఈ యుద్దంలో చిక్కుకున్న తన పౌరులకు విముక్తి కల్పించాలని కోరింది కూడా. ప్రధాని మోదీ సైతం జోక్యం చేసుకున్న నేపథ్యంలో 96 మందిని రష్యా విడుదల చేసింది. అయితే ఇలాంటి నియామకాలు ఆపేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ నియామకాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలపై గీతా గోపినాథ్ షాకింగ్ రియాక్షన్

పెర్ఫ్యూమ్ తెచ్చిన తంటా....తీవ్ర ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
ఒక చిన్న పొరపాటుతో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇబ్బందులు పాలయ్యాడు. అమెరికాలోని బెంటన్లో తన అమెరికన్ భార్యతో నివసిస్తున్న కపిల్ రఘును పెర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా అర్కాన్సాస్లో అరెస్ట్ చేశారు. వీసాను రద్దు చేశారు. దీంతో అతని దేశ బహిష్కరణ తప్పదేమో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఫుడ్ డెలివరీ డ్రైవర్గా పనిచేసే రఘు అనే 32 ఏళ్ల వ్యక్తిని మే 3న బెంటన్ పోలీసులు చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చేసిన తనిఖీల్లో దొరికిన పెర్ఫ్యూమ్ బాటిల్ పెద్ద దుమారాన్నే రేపింది. రఘు కారు సెంటర్ కన్సోల్లో "ఓపియం" (నల్లమందు) అని రాసి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ను కనుగొన్నారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనుమానించారు. అది కేవలం పెర్ఫ్యూమ్ అని రఘు పదే పదే వివరణ ఇచ్చినా, పోలీసులు విశ్వసించలేదు. చివరికి రఘుని అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చట్టపరమైన, ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి దారితీసింది. వీసాను రద్దు చేయడంతో మరింత ఆందోళన నెలకొంది.చదవండి: నో అన్న రెండేళ్లకే గూగుల్ ఇండియా కీలక బాధ్యతలు, ఎవరీ రాగిణీ?మరోవైపు అర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ తదుపరి పరీక్షలో ఆ పదార్థం హానికరం కాదని , మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, రఘు ఇప్పటికే మూడు రోజులు సెలైన్ కౌంటీ జైలులో గడిపాడు.మే 20న జిల్లా కోర్టు మాదకద్రవ్యాల కేసును కొట్టివేసిన తర్వాత ,ఈలోపు రఘు వీసా గడువు ముగిసిందంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించి, 30 రోజుల పాటు నిర్బంధించారని రఘు న్యాయవాది మైక్ లాక్స్ వెల్లడించారు.దీనిపై బాధితుడు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తంచే శారు. తన భార్య యాష్లీ మేస్, మొత్తం భారాన్ని మోస్తోందని, కోర్టు ఖర్చులు, భరించడం కష్టం మారిందని వాపోయారు. ఈ జంటకు ఈ ఏప్రిల్లో వివాహం అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయానికి రాసిన లేఖలో, రఘు తన వీసాను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశాడు. కపిల్ రఘు విడుదల అయినప్పటికీ, @బహిష్కరణ' (deportation) స్టేటస్లో ఉంటాడని, మరింత ముఖ్యంగా, ఇది అతను పని చేయకుండా ,డబ్బు సంపాదించకుండా నిరోధిస్తుందని ఇది మరింత ఆందోళన కరమని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే తన భర్తను నిర్దోషిగా బయటకొచ్చే క్రమలో అయ్యే ఖర్చుల కోసం భార్య ఆన్లైన్లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో

టీపాడ్ బతుకమ్మ- దసరా సంబరాలు.. థమన్, హీరోయిన్లు శివాని, అనన్య సందడి
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (TPAD-టీపాడ్) ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ప్రతీ ఏడాదిలాగానే ఈసారి కూడా డే టైమ్లో స్థానిక కళాకారులు, స్టూడెంట్స్ తమ ప్రదర్శనలతో అదరగొట్టగా సాయంత్రం బతుకమ్మ, దసరా సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన సంగీతంతో షేక్ చేశారు. ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత స్పెషల్గెస్ట్గా హాజరైన ఈ వేడుకలో హీరోయిన్లు శివాని, అనన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.దద్దరిల్లిన అల్లెన సెంటర్టీపాడ్ వేడుకలకు వేదికైన డాలస్లోని అల్లెన ఈవెంట్ సెంటర్ దద్దరిల్లిపోయింది. ఈ మెగా ఈవెంటుకు తెలుగువారంతా భారీగా తరలి వచ్చారు. ఏటా పదిహేను వేల మందికి పైగా ఏర్పాట్లు చేస్తున్న టీపాడ్.. ఈసారి అంతకుమించి జనం వస్తారని ఊహించి అందుకు తగ్గట్టు సౌకర్యాలు సమకూర్చినా.. సుమారు రెండు వేల మంది మాత్రం కనీసం నిల్చుకునేందుకు స్థలం లేక వెనుదిరిగిపోయారు. ఉదయం 11 గంటలకే ప్రారంభమైన వేడుకలు రాత్రి 11 గంటలకు థమన్ మ్యూజిక్ కన్సర్ట్తో ముగిశాయి. మహిషాసుర మర్ధిని నృత్యరూపకంవేడుకల్లో భాగంగా తొలుత సుమారు 200 మంది స్థానిక కళాకారులు, విద్యార్థులు డ్యాన్సలు, సింగింగ్ టాలెంట్తో ఆహూతులను మెస్మరైజ్ చేశారు. రోజంతా సందడిగా సాగిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవన్న అనుభూతికి లోనయ్యేలా చేశారు. సాక్షాత్తూ అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టు సాగిన 70 మంది సంప్రదాయ నృత్యకారులు ప్రదర్శించిన మహిషాసురమర్ధిని నృత్యరూపకం ప్రతి ఒక్కరిలో గూస్బంప్స్ తెప్పించాయి. డెబ్బయ్ మంది అడుగులు కాలిగజ్జెలతో నర్తిస్తుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. స్టేడియంలో ప్రతి ఒక్కరూ ఆ శబ్దానికి, నృత్యానికి పులకించి, కొత్తలోకంలో ఉన్నామా అన్న అనుభూతి కలిగింది. తెలంగాణ నేలపై నవరాత్రుల వైభవాన్ని చూడలేకపోయామే అనుకున్న వారికి ఈ వేడుక ఆ గ్యాప్ను భర్తీ చేసింది.బతుకమ్మ ఆడిన హీరోయిన్లుసాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. హీరోయిన్లు శివాని, అనన్య మహిళలందరితో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన అనంతరం శమీవృక్షానికి, అమ్మవారికి పూజలు నిర్వహించి దేవేరులను పల్లకిలో ఊరేగించారు. ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఓవైపు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి గిన్నిస్రికార్డ్లో నమోదు చేయిస్తే.. ఇటు టీపాడ్ డాలస్లో దాదాపు అదే స్థాయిలో బతుకమ్మ పండుగను నిర్వహించి వేలాది మంది మహిళల మనసు దోచుకుంది. కన్వెన్షనను తలపించిన ప్రాంగణంరోజంతా మీడియా ప్రతినిధులతో పాటు ఇనఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల సందడి కనిపించింది. అల్లెన సెంటర్ ప్రాంగణంలో నగలు, దుస్తులతో పాటు కన్వెన్షనను తలపించేలా అనేక వెండర్బూతలు వెలిశాయి. రకరకాల ఫుడ్కోర్టులు కొలువుదీరాయి. జోష్ నింపిన థమన్ మ్యూజిక్సంప్రదాయ వేడుకలన్నీ ముగిశాక థమన్ హైఓల్టేజీ ఎనర్జీ మ్యూజిక్ వెరీవెరీ స్పెషల్గా మారింది. ఆయన డ్రమ్స్ వాయిస్తుంటే ప్రతి ఒక్కరూ జోష్లో ఉండిపోయారు. డాలస్లోనే తన మొదటి కాన్సర్ట్ జరిగిందని చెప్పిన థమన.. మళ్లీ టీపాడ్ వేడుకపై ప్రదర్శన ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రోగ్రామ్లో సింగర్స్ పాడిన ఒక్కొక్క పాటకు స్టేడియంలో పలువురు స్టెప్పులేసి, చప్పట్లు కొట్టి హుషారు నింపారు. ఓజీ డైరెక్టర్ సుజిత ఈ వేదికపై అభిమానులనుద్దేశించి ప్రసంగించారు. ఈ మెగా ఈవెంట్ను ఫౌండేషన కమిటీ చెయిర్ రావు కల్వల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చెయిర్ పాండురంగారెడ్డి పాల్వాయి, ప్రెసిడెంట్ అనూరాధ మేకల, కోఆర్డినేటర్ రమణ లష్కర్, ఫౌండేషన కమిటీ సభ్యులు అజయ్రెడ్డి, జానకీరాం మందాడి, రఘువీర్ బండారు పర్యవేక్షించారు. వంద మంది వలంటీర్లు రెండు నెలలు శ్రమించి ఎక్కడా నిర్వహణ లోపాలు రాకుండా ఏర్పాట్లకు సహకరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్

పాతబస్తీ మహిళకు పాతికేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళకు దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గంజాయి అక్రమ రవాణా చేస్తూ అక్కడి విమానాశ్రయంలో చిక్కడంతో ఈ మేరకు తీర్పు ఇచి్చంది. బహదూర్పురలోని ఆమె కుటుంబీకులు బ్యాంకాక్కు చెందిన ట్రావెల్ ఏజెంట్పై ఆరోపణలు చేస్తున్నారు. మహిళకు న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బహదూర్పురకు చెందిన ఓ మహిళ బ్యూటీషియన్ కోర్సు చేశారు. ఈమెకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. తండ్రి పక్షవాతంతో మంచం పట్టగా...తల్లి గృహిణి కావడంతో కుటుంబ పోషణ భారం మహిళ పైనే పడింది. దీంతో కుమారుడిని తల్లిదండ్రుల వద్ద వదిలి దుబాయ్ వెళ్లి బ్యూటీషియన్ ఉద్యోగం చేయాలని భావించింది. దీనికోసం ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేయించుకుంది. అతగాడు ఈ మహిళను బ్యాంకాక్ మీదుగా దుబాయ్ పంపాడు. బ్యాంకాక్లో సదరు ఏజెంట్కు సంబంధించిన వ్యక్తి ఈ మహిళకు ఓ ప్యాకెట్ ఇచ్చాడు. దాన్ని దుబాయ్లో తమ మనిషి వచ్చి తీసుకుంటారని చెప్పారు. ఈ ప్యాకెట్తో మహిళ ఈ ఏడాది మే 18న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగింది. అక్కడ తనిఖీలు చేపట్టిన అధికారులు మహిళ తీసుకువచి్చన ప్యాకెట్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు ఈ నెల 6న నేరం నిరూపణ అయినట్లు ప్రకటించింది. మçహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి సదరు మహిళ వీడియో కాల్ ద్వారా నగరంలోని తల్లితో మాట్లాడింది. తీవ్రంగా రోదిస్తూ తాను కేవలం పది నిమిషాలే మాట్లాడగలనని, ఒక్కసారి తన కుమారుడిని చూపించాలంటూ తల్లిని కోరింది. న్యాయసహాయం చేస్తే నిరోషిగా బయటపడతాననే నమ్మకం ఉందని చెప్పింది. దీంతో మహిళ తల్లి పాతబస్తీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులకు విషయం తెలిపింది. వీరి ద్వారా విషయం తెలుసుకున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో దుబాయ్లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ జనరల్ (సీజీఐ) స్పందించారు. యువతికి అవసరమైన న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చి బహదూర్పురలోని ఆమె కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

మద్యం తాగిన మైనర్.. రైలుకింద పడి ఆత్మహత్య
చంద్రగిరి: కూటమి నాయకుల ‘బెల్టు’ దాహం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో మద్యం మంచినీళ్లలా దొరుకుతోంది. అంతేకాదు... మైనర్లనూ బలి తీసుకుంటోంది. తాజాగా తిరుపతి జిల్లాలో ఓ విద్యార్థి మద్యం సేవించి పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలోని ముంగళిపట్టు గ్రామానికి చెందిన బాలుడు జస్వంత్ (15) ఎం.కొంగరవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు మద్యం తాగి రావడంతో తోటి విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జశ్వంత్ బ్యాగ్ను తనిఖీ చేయగా, మద్యం బాటిల్ లభ్యమైంది. ఉపాధ్యాయులు వెంటనే హెచ్ఎం భాస్కర్ నాయుడుకు సమాచారం ఇవ్వగా, ఆయన జశ్వంత్ను మందలించారు. ఆపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంతలో జశ్వంత్ పాఠశాల గోడ దూకి పారిపోయాడు.అనంతరం అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉన్నాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో స్కూల్ వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. పాకాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.బెల్టు దుకాణమే కారణమా? చంద్రగిరి మండలంలో బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జస్వంత్ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అసలు జస్వంత్కు మద్యం ఎక్కడ నుంచి వచి్చంది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. వాస్తవంగా 21 ఏళ్లు నిండని వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. జస్వంత్ వద్ద దొరికిన బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా మద్యం ఏ దుకాణంలో కొనుగోలు చేశాడో తెలుసుకోవచ్చు. మరి ఎక్సైజ్ అధికారులు ఆ దిశగా విచారణ చేపడతారా? లేక బెల్టు దుకాణాలకు అండగా కేసును నీరుగారుస్తారా? అనేది తేలాల్సి ఉంది.

చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
ఆలమూరు: కుటుంబ కలహాలు, బంధువుల వేధింపులతో కన్న పిల్లలను చంపి, ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పావులూరి కామరాజు అలియాస్ చంటి(36), నాగదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. చంటి సెలూన్ షాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబంలో మనస్పర్ధలతో నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల కుటుంబంలో కలహాలు, బంధువుల వేధింపులు ఎక్కువవయ్యాయి. దీంతో చంటి తన ఇద్దరు కుమారులు అభిరామ్ (11), గౌతమ్ (8)తో పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కాగా, ఆత్మహత్యకు తన బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రోలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసు వేధింపులే కారణమని చంటి ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఇటీవల వేధింపులు అధికమయ్యామని, వారంతా తనను చంపేందుకు యత్నిస్తున్నారని వీడియోలో వాపోయాడు. తాను చనిపోతే తన కుమారులను ఎవ్వరూ పట్టించుకోరనే ఉద్దేశంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆలమూరు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Rave Party: హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులో మళ్లీ రేవ్ పార్టీ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు, మద్యం, క్యాసినో కాయిన్స్తో సాగే ఈ రాత్రి పార్టీలకు మరోసారి తెరలేపిన ఘటన ఇది. రాచకొండ పరిధిలోని మహేశ్వరం మండలం చెర్రాపల్లి సమీపంలోని కె. చంద్రారెడ్డి రిసార్ట్స్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా SOT పోలీసులు రాత్రి ఆలస్యంగా దాడులు నిర్వహించి, రిసార్ట్స్లో జరిగిన అశ్లీల విందును అడ్డుకున్నారు.ఈ పార్టీని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన ఇతర డీలర్లను, వ్యాపార భాగస్వాములను కలిపి “బిజినెస్ గ్యాదరింగ్” పేరుతో ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు . ఈ మహిళలు హైదరాబాద్, బెంగళూరుకు చెందినవారని సమాచారం. వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలు, యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దాడుల్లో 3 బ్లాక్డాగ్ విస్కీ మద్యం బాటిళ్లు, రెండు కాటన్ల బీర్లు స్వాధీనం చేసుకున్నారు.
వీడియోలు


Pithapuram: మంత్రి నారాయణ వాఖ్యలపై స్పందించిన వర్మ


పోలీసు యంత్రాంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు


కేబినెట్ భేటీకి హాజరుకాని మంత్రి కొండా సురేఖ


సాక్షి ఆఫీస్ లో హై డ్రామా!


Bhupendra Patel: గుజరాత్ కేబినెట్ రాజీనామా


కర్నూలులో రూ.2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు శంకుస్థాపన


మద్యం అక్రమ కేసు బెయిల్ పిటిషన్లపై ACB కోర్టు విచారణ


Pothina: నకిలీ మద్యం అమ్మకాలను కూటమి నేతలే ప్రోత్సహిస్తున్నారు


Varudu : సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా


కొండా సురేఖ, కుమార్తె సుస్మితా పటేల్ విక్రమార్కను కలిసేందుకు ప్రజాభవన్ వెళ్లారు