అభివృద్ధికి కలసిరండి
సాక్షి, హైదరాబాద్: ‘మల్కాజిగిరి ఎంపీగా గెలిపించినప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నందున మీరు ఆశించిన అభివృద్ధి చేయలేకపోయాను. కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నా. రాజకీయాలకతీతంగా ఎన్ని నిధులైనా, ఎన్ని అనుమతులైనా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లు, తాగునీరు, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, మెట్రో విస్తరణ తదితరమైనవి ఏవి కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచిస్తున్నా. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం. కావాల్సినవి అడిగి సాధించుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కొడంగల్లో ఓడిపోయాక, రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన సమయంలో మల్కాజిగిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారన్నారు. అక్కడి నుంచే సీఎం వరకు రాగలిగానన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు రాజకీయాల కతీతంగా సహకరించాలని కోరారు. శనివారం ఉప్పల్ భగాయత్ లేఔట్ ఫేజ్–3లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం, టీకేఆర్ జంక్షన్ ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారులు, వంద పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపనల శిలాఫలకాలను రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల్ భగాయత్లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాజకీయ స్వార్థం, ఎన్నికల లబ్ధి కోసం మూడు కార్పొరేషన్లు చేశానని కొందరంటున్నారు కానీ, పరిపాలన సౌలభ్యం, అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం చేశానని తెలిపారు. క్యూర్ పరిధిలోని 2,100 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న 1.34 కోట్లమంది ప్రజల సదుపాయాల కోసం జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లుగా, అదే మాదిరిగా పోలీసు వ్యవస్థను వికేంద్రీకరించినట్లు చెప్పారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ను పదెకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిచుకుంటున్నామని, రూ. 1,511 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. కనీస కనికరం ఉండొద్దా? ‘గుజరాత్ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునానది, యూపీలో గంగానది రివర్ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకోవచ్చు కానీ.. మనం మూసీనది ప్రక్షాళన చేయొద్దా? అని అడ్డంపడుతున్న వారిని అడుగుతున్నా’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు, 55 కి.మీ. ప్రక్షాళన చేసి మూసీని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి తీరతానన్నారు. ‘న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యనున్న రివర్ఫ్రంట్ దగ్గర ఒక్కో అపార్ట్మెంట్ వందల కోట్ల విలువ ఉంది. ఇక్కడ మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు. ఇక్కడ ప్రజలు నివసించడం లేదు. నల్లగొండ ప్రజలను కాలుష్యం కాటేస్తుంటే కనికరం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా’ అని చెప్పారు. ఆలేరు, భువనగిరి, ప్రాంతాల్లోని ప్రజలు కొత్తగా పెళ్లయిన వారికి గర్భధారణ సమస్యలొస్తాయని, కలుషిత నీరు, ఆహారంతో కడుపుకోతకు గురవుతారని పట్టణానికి పంపిస్తున్నారన్నారు. ఫ్లోరైడ్, మూసీ కాలుష్యం, చచ్చిన శవాల కళేబరాలు కొట్టుకువస్తుంటే, అక్కడి ప్రజలు ప్రక్షాళన చేయాలని కోరారని చెప్పారు. సింగపూర్, న్యూయార్క్తో పోటీ నాగోల్ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం వెళ్లేందుకు నాగోల్ జంక్షన్– ఎల్బీనగర్ –ఒవైసీ హాస్పిటల్–చాంద్రాయణగుట్ట–రాజేంద్రనగర్–ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ చేయాల్సిందేనన్నారు. అంతేకాదు, ఎల్బీనగర్ – హయత్నగర్ వరకు కూడా చేయాలన్నారు. మెట్రోను 122 కి.మీ.వరకు పొడిగించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయనగరం చేయాలని తాను ప్రయత్నిస్తుంటే, అన్ని అనుమతులొచ్చాక , ఇక్కడి నుంచి మంత్రిగా చేస్తున్నాయన పోయి పుల్లలు పెట్టి అర్ధంతరంగా ఆపారని ఆరోపించారు. ఓఆర్ఆర్ వచ్చినందుకు అంతర్జాతీయ నగరంగా మారిందని.. రీజినల్ రింగ్రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే, ప్రపంచంలోనే పోటీపడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందన్నారు. అంతర్జాతీయ నగరమని చెప్పుకుంటే సరిపోదని, ఆమేరకు అభివృద్ధి జరగాలన్నారు. జెడ్పీటీసీ నుంచి తాను ఈ స్థాయికి ఎదగడానికి ఆడబ్డిలే కారణమని, తన ప్రతిసభలో వారికి ముందు కూర్చునే అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూర్–1 యాప్ను సీఎం ప్రారంభించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు బండారి రాజిరెడ్డిపేరు పెట్టామని, చౌరస్తాలో విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కిషన్రెడ్డి గారూ ఉపన్యాసాలు ఆపండి... ‘హైదరాబాద్కు రెండో దశ మెట్రో రావాల్సిందే. ట్రిపుల్ ఆర్కు అనుమతులివ్వాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. రాష్ట్రంలో పండించిన పంటలను మొత్తం కొనాల్సిందే. వీటన్నింటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చూస్తాం’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నీ పార్టీకి నువ్వు ఎప్పుడూ పనిచేయలేదని మీ కార్యకర్తలే అంటున్నారు. మా సార్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ చెప్పింది వింటారని చెబుతున్నారు. ఇక నువ్వు పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? ఉపన్యాసాలు ఆపండి కిషన్రెడ్డి గారూ..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లుగా తాను కాలికి బలపం కట్టుకొని 50 సార్లు ఢిల్లీ వెళ్లినా, ఐదుసార్లు మోదీని కలిసినా ఏ అనుమతులూ రాకపోవడానికి కారణం కిషన్రెడ్డే అని తెలిసిందన్నారు. వీటికి అనుమతులు తీసుకురా.. లక్ష మంది సమక్షంలో ఎల్బీ స్టేడియంలో శాలువా కప్పి గండపెండేరం తొడుగుతామన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ఓసారి అంబర్పేటలో వారేంటో చూపించారన్నారు. ఇప్పటికైనా సహకరించాలని, లేని పక్షంలో 15 తర్వాత కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు.
మా చావులకు కారణం కావొద్దు
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘నిర్దిష్ట సమయం ప్రకారం మా చేత పనులు చేయించుకోండి. అంతేగాని ఒకేసారి అన్ని పనులు పూర్తి చేయాలని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి మా చావులకు కారణం కావొద్దు. ఒత్తిడి భరించలేక ఇప్పటికే 70 మందికి పైగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో పలు హామీలు ఇచ్చినప్పటికీ, వాటిలో కొన్ని కూడా అమలు చేయలేదు. ఉద్యోగుల అసంతృప్తిని, ఆవేదనను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ నెల 15లోగా హామీలు అమలు చేయాలి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. లేనిపక్షంలో 16వ తేదీ నుంచే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తాం’ అని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రమోషన్లు, పెండింగ్ ఇంక్రిమెంట్లు, హేతుబద్దీకరణ, డెప్యుటేషన్లు, పెరుగుతున్న పని భారం, ఎన్నికల విధులపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. నిర్దిష్ట సమయం లేకుండా డ్యూటీలు రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం జేఏసీ చైర్మన్ జి.సురేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులకు నిర్దిష్ట సమయం ఇవ్వకుండా వరుసగా డ్యూటీలు వేస్తున్నారని చెప్పారు. దీంతో పనిభారం పెరిగి తీవ్రమైన ఒత్తిడితో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే 70 మందికి పైగా బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. కర్నూలులో సచివాలయ ఉద్యోగి మహమ్మద్ హుస్సేన్ కేవలం ఒత్తిడి కారణంగానే మృతి చెందాడని తెలిపారు. ఒక పని తర్వాత మరో పనిచేయడానికి తాము సిద్ధమేనని, అయితే, ప్రభుత్వం అన్ని పనులు ఒకేసారి చేయాలని ఒత్తిడి చేసి ఉద్యోగుల చావులకు కారణం కావొద్దని కోరారు. ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదోన్నతుల అంశాన్ని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, ఉద్యోగులు ఇప్పటికే చేరుకున్న పే స్కేల్లోనే పదోన్నతులను చూపించడం వల్ల అసలు ప్రయోజనం లేకుండా పోతోందన్నారు.జేఏసీ అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీశ్ మాట్లాడుతూ హేతుబద్దీకరణ పేరుతో ఉద్యోగులను వివిధ కార్యాలయాలకు డెప్యుటేషన్పై పంపడం వల్ల వారి బాధ్యతలను సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగులే నిర్వర్తించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పడుతోందన్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు తమ శాఖల విధులతోపాటు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల సంబంధిత బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇతర విధుల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీ కో–చైర్మన్లు చేవూరి వెంకట్, గంటా రామకృష్ణ, బెక్కం రవితేజ, పువ్వుల కిరణ్కుమార్, మేరిరాజు, హంపిరెడ్డి, శ్రీమన్నారాయణ, మణికంఠ, కిషోర్, హనుమంతరావు, మహబూబ్ సుభాని, కృష్ణచైతన్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కృత్రిమ మాయలో మనిషి
‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది. కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం. తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి. ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం.
అర్ధరాత్రి.. పబ్.. మఫ్టీలో మహిళా డీసీపీ
సాక్షి, హైదరాబాద్/కేపీహెచ్బీ కాలనీ: నగరంలో అదో పేరుమోసిన పబ్.. నిబంధనలకు పాతరేసి నిత్యం అర్ధరాత్రి దాటినా నడుపుతుండటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలతో చెలరేగుతూ భారీగా డబ్బు దండుకుంటోంది. దీనిపై సమాచారం అందుకున్న కూకట్పల్లి మహిళా డీసీపీ రుతురాజ్ ఈ పబ్బులో గబ్బు పనులకు తెరదించేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి కేపీహెచ్బీ కాలనీ పరిధిలోని మంజీరా మాల్లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ (క్లబ్ మస్తీ) పబ్లోకి ఓ సగటు మహిళా టెకీలాగా స్వయంగా వెళ్లారు.సెక్యూరిటీ సిబ్బందిని దూరంగా ఉంచి ఒంటరిగానే పబ్లోకి ప్రవేశించారు. ఆపై అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల తతంగాన్ని రికార్డు చేసి ఆధారాలు సంపాదించారు. అనంతరం అదనపు డీసీపీ షమీర్, కేపీహెచ్బీ ఠాణా అదనపు ఇన్స్పెక్టర్ కె.రవిలతోపాటు సిబ్బందికి సమాచారం ఇచ్చి పబ్పై దాడి చేశారు. ఈ తనిఖీల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని నిగ్గుతేలడంతో నలుగురు మహిళా సిబ్బంది, ఐదుగురు పురుష సిబ్బందిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.అలాగే పబ్తోపాటు నిందితులపై బీఎన్ఎస్లోని 223, 292, 318(4) రీడ్ విత్ 3 (5) సెక్షన్లతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్లోని 5, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్రెడ్డి ఆదివారం వెల్లడించారు. కస్టమర్లకు మహిళా సిబ్బందితో ప్రలోభాలు.. పబ్ నిర్వాహకులు అక్కడ పనిచేస్తున్న యువతుల ద్వారా పురుష కస్టమర్లను వ్యభిచారం కోసం ప్రలోభపెట్టేలా చేస్తున్నారని.. వ్యభిచార కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని డెకాయ్ ఆపరేషన్లో వెలుగుచూసిందని ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్రెడ్డి వివరించారు. యువతులను ఎర వేయడం ద్వారా అక్రమ లాభం పొందేందుకు నిర్వాహకులు కస్టమర్లు తాగిన మద్యం, తిన్న ఆహార పదార్థాలకు అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు తేలిందన్నారు.అలాగే పబ్లోకి మైనర్ల ప్రవేశాన్ని నిరోధించేందుకు అవసరమైన చర్యలేవీ యాజమాన్యం తీసుకోకుండా యథేచ్ఛగా దందా సాగిస్తోందని చెప్పారు. అనుమతించిన సమయానికి మించి పబ్ను నిర్వహించడంతోపాటు ప్రభుత్వ అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా మద్యం, ఆహారం అందిస్తున్నారని గుర్తించామన్నారు. వాటన్నింటికీ మించి పోలీసు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) లేకుండానే పబ్ నడుస్తోందని పేర్కాన్నారు. స్థానిక పోలీసుల తీరుపై డీసీపీ ఆగ్రహం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన డీసీపీ రితిరాజ్ ఆ పబ్లో అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు నిరోధించలేకపోయారంటూ స్థానిక పోలీసులను ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
అన్నంత పని చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం
వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్!
గణాంకాలపై మార్కెట్ ఫోకస్!
జెన్ జెడ్.. కొత్త పాఠాలు
4 గంటలు.. 90 వేల మంది
యూరియా.. ‘గ్రీన్’ ఐడియా..
రూరల్ టీనేజర్లకు టెన్షన్
పని భారం.. ఏఐతో దూరం!
పప్పు కూర
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
అపచారం... దైవద్రోహం
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
ఊళ్లో నెమళ్ల బెడద
30 ఏళ్ల నాటి కేసు.. నటికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా..!
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
మెగా మామ్!
తమిళ రాజకీయం.. లతా రజినీకాంత్ ‘మక్కల్ మేడై’ ప్రారంభం
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
అన్నంత పని చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం
వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్!
గణాంకాలపై మార్కెట్ ఫోకస్!
జెన్ జెడ్.. కొత్త పాఠాలు
4 గంటలు.. 90 వేల మంది
యూరియా.. ‘గ్రీన్’ ఐడియా..
రూరల్ టీనేజర్లకు టెన్షన్
పని భారం.. ఏఐతో దూరం!
పప్పు కూర
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
.. మనం కొన్ని పదాల మీద పేటెంట్ రైట్స్ తీసుకోవాలి సార్!
అపచారం... దైవద్రోహం
ఈ రాశి వారికి బంధువుల నుంచి ధనలాభం
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇక ఏఐని ఆపేద్దాం-అగ్రశ్రేణి సంస్థలకు ఆంద్రోపిక్ పిలుపు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
ఊళ్లో నెమళ్ల బెడద
30 ఏళ్ల నాటి కేసు.. నటికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా..!
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
మెగా మామ్!
తమిళ రాజకీయం.. లతా రజినీకాంత్ ‘మక్కల్ మేడై’ ప్రారంభం
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
ఫొటోలు
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్నెస్తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్ సందడి (ఫొటోలు)
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
సినిమా
రెబల్ స్టార్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. కల్కి-2 క్రేజీ అప్డేట్
కల్కి మూవీతో హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి-2 అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ చెన్నైలో జరిగిన సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ క్రేజీ న్యూస్ షేర్ చేశారు. కల్కి-2 సీక్వెల్ షూటింగ్ షెడ్యూల్పై క్లారిటీ ఇచ్చారు.కల్కి-2 ఇప్పటికే ప్రారంభమైందని నాగ్ అశ్విన్ తెలిపారు. తదుపరి షెడ్యూల్ వచ్చేనెలలో మొదలు కానుందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీని మరింత వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నాగ్ అన్నారు. ఏప్రిల్ 2027 నాటికి మెయిన్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.కాగా.. మొదటి భాగం కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె సైతం అభిమానులను మెప్పించింది. కల్కిలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ కోసం నిర్మాతలు మరింత భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా సాంగ్ రిలీజ్
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం. సంగీతమే ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. 94 ఏళ్ల వయసులో ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఈ మూవీ జూన్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా సింగ్ గీతం మూవీ నుంచి క్రేజీ సాంగ్ విడుదల చేశారు. ఓరి జీవుడా జీవుడా అంటూ సాగా పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శంకర్బాబు ఆలపించారు. ఈ సాంగ్ను దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ పాట మ్యూజిక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటోంది.
45 ఏళ్లుగా ఆ సినిమా చేయలేకపోయాం: కమల్ హాసన్
కమల్ హాసన్-సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన ‘పుష్పక విమానం’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత సింగీతం శ్రీనివాస రావు మరో కథను కూడా కమల్కు వినిపించాడట. 45 ఏళ్ల క్రితమే ఆ సినిమాను తెరకెక్కించాలని భావించారట కానీ, అది సాధ్యం కాలేదు. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ని చెన్నైలో నిర్వహించారు. ప్రముఖ హీరో కమల్ హాసన్ ముఖ్య అథితిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన సింగీతం శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ.. ‘సింగ్ గీతం’సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సింగీతం శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. మా తొలి సినిమా అనుకోకుండా తెరకెక్కింది. ఆ తర్వాత నాకు రెండు కథలు వినిపించాడు. అందులో పుష్పక విమానం తెరకెక్కింది. రెండో కథ మాత్రం అలానే ఉండిపోయింది. దాని గురించి 45 ఏళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ చేయలేకపోయాం. అదే సింగ్ గీతం. 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింగీతం శ్రీనివాసరావుకు వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఆలోచన విషయంలో ఆయన ఇప్పటికీ జెన్ జీ కన్నా ఒక అడుగు ముందే ఉంటాడు. ఆయన నుంచి ఇంకా నేర్చుకుంటున్నా. సింగీతం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయాలని ఉంది’ అని కమల్ అన్నారు. నాకు 20 ఏళ్ల వయసున్నప్పుడు సింగీతం గారితో మొదటిసారి ఈ సినిమా గురించి మాట్లాడాను... మాట్లాడుకుంటున్నాం కానీ చేయలేకపోయాం. ఇప్పుడు నాకు 71... ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. Some Ideas are Ageless - Ulaganayagan #KamalHaasan #SingGeetham pic.twitter.com/fjHwUA5p0O— Sai Satish (@PROSaiSatish) June 7, 2026
ఓటీటీకి టాలీవుడ్ ఎమోషనల్ డ్రామా..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎమోషనల్ డ్రామా రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. మే 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు.ఈ సినిమా ఓటీటీ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సన్ నెక్ట్స్ వేదికగా ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈనెల 12 నుంచే సన్ నెక్ట్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు.ఈ సినిమా కథేంటంటే.. సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.When the perfect match is the one who heals your soul.Stream Ramani Kalyanam on Sun NXT from 12 June!#RamaniKalyanam #TeluguMovies #TFI #SunNXT [Feel Good Movies, Telugu Movies, New Telugu Movies, Deepshika, Surya Vashistta, Romance Movies, Emotional Drama, Poetic Movies,… pic.twitter.com/LL5Wa17mDS— SUN NXT (@sunnxt) June 7, 2026
క్రీడలు
జయహో జ్వెరెవ్
పారిస్: నిరీక్షణ ముగిసింది.... జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను గెల్చుకున్నాడు. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో రెండో సీడ్ జ్వెరెవ్ విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ జ్వెరెవ్ 6–1, 4–6, 6–4, 6–7 (5/7), 6–1తో ప్రపంచ 14వ ర్యాంకర్, పదో సీడ్ ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై గెలిచాడు. 4 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది సమరంలో జ్వెరెవ్ నిర్ణాయక ఐదో సెట్లో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడిన కొబోలి చివరి సెట్లో తడబడ్డాడు. ఈ సెట్లో జ్వెరెవ్ మూడుసార్లు కొబోలి సర్వీస్ను బ్రేక్ చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ గాయంతో వైదొలగడం... ప్రపంచ నంబర్వన్ సినెర్ రెండో రౌండ్లోనే వెనుదిరగడం... సెర్బియా దిగ్గజం జొకోవిచ్ మూడో రౌండ్లోనే ఓడిపోవడం .... వెరసి జ్వెరెవ్కు తన ‘గ్రాండ్’ కలను నిజం చేసుకునేందుకు సువర్ణావకాశం లభించింది. నాలుగో ప్రయత్నంలో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్నుకైవసం చేసుకున్నాడు. 2020 యూఎస్ ఓపెన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్లో ఓడిపోయిన జ్వెరెవ్ ఈసారి మాత్రం వదల్లేదు. కాస్త ఒత్తిడికి లోనైనా... కీలకదశలో తన అనుభవంతో గట్టెక్కి ‘గ్రాండ్’ స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జ్వెరెవ్కు 28 లక్షల యూరోలు (రూ. 30 కోట్ల 62 లక్షలు), రన్నరప్ కొబోలికి 14 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 31 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. బోరిస్ బెకర్ (1996లో ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ ప్లేయర్గా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు.
WTC పాయింట్ల పట్టికలో మార్పులు
ఇవాళ ముగిసిన లార్డ్స్ టెస్ట్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత WTC 2025-27 పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్పై గెలిచినా ఇంగ్లండ్ స్థానంలో ఎలాంటి మార్పు జరగలేదు. వారి PCT (పాయింట్ల శాతం) 31.67 నుంచి 37.88కి పెరిగినప్పటికీ ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోవడంతో సౌతాఫ్రికా, శ్రీలంక రెండు, మూడు స్థానాలకు ఎగబాకాయి.భారత్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల పాక్ను రెండు మ్యాచ్ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్ (9), పాకిస్తాన్ (8) జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.లార్డ్స్ టెస్ట్ విషయానికొస్తే.. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ పూర్తిగా చేతులెత్తేసింది. 138 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకపడిపోయింది.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది. జేమీసన్ 5, నాథన్ స్మిత్ 3, విలియమ్ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం న్యూజిలాండ్ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ 5, టంగ్ 3, అట్కిన్సన్ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన జేమీసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు.27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే (57), డకెట్ (33), జేమీ స్మిత్ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్ స్మిత్ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్ ఓరూర్కీ 2, మ్యాట్ హెన్రీ, జేమీసన్ తలో వికెట్ తీశారు.254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్ 5, రాబిన్సన్, టంగ్ తలో 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కాన్వే (41), గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 17న మొదలవుతోంది.
టీమిండియాపై పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు
పాకిస్తాన్ ఆల్రౌండర్ ఖుష్దిల్ షా టీమిండియాను ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. తమ మధ్య జరిగే మ్యాచ్ల్లో అంపైరింగ్ నిర్ణయాలు, షెడ్యూలింగ్ సహా అనేక అంశాలు భారత్కు అనుకూలంగా ఉంటాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. భారత్తో మ్యాచ్ల్లో చాలా విషయాలు వాళ్లకు అనుకూలంగా ఉంటాయి. అంపైరింగ్ నిర్ణయాలు, కొన్ని డ్రెస్సింగ్రూమ్ నిర్ణయాలు, మ్యాచ్ల నిర్వహణ కూడా వారి కోరికల మేరకే జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గెలిస్తే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నాడు.భారత్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో..ఇటీవలికాలంలో భారత్పై పాకిస్తాన్ రికార్డు నిరాశాజనకంగా ఉంది. టీమిండియాపై పాక్ చివరిసారి 2022 ఆసియా కప్ సూపర్-4 దశలో విజయం సాధించింది. అప్పటి నుంచి జరిగిన ఆరు వరుస మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది.వన్డేల్లో అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత పాకిస్తాన్ భారత్ను ఓడించలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఆరు వన్డేల్లోనూ భారత్దే పైచేయిగా నిలిచింది.గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలుభారత్కు అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని కొందరు పాక్ మాజీలు గతంలోనూ ఆరోపించారు. అయితే ప్రస్తుత క్రికెటర్ ఖుష్దిల్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.ఖుష్దిల్ షా భారత్పై ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన వన్డేలో 39 బంతుల్లో 38 పరుగులు చేసి, వికెట్ తీసుకున్నప్పటికీ, ఆ మ్యాచ్లో పాక్ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. మొత్తంగా షా పాక్ తరఫున 15 వన్డేలు, 38 టీ20లు ఆడి 762 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు.
కెప్టెన్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత టీ20 కెప్టెన్గా నియమితుడయ్యాక శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి పనిచేయబోతున్న నేపథ్యంలో, తన నాయకత్వ శైలిని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.ప్రస్తుతం ముంబై టీ20 లీగ్ ఆడుతున్న అయ్యర్ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్సీ పెద్ద సవాలే కానీ, దాని కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇంతకుముందు ఎలా ఉన్నానో, ఇకపై కూడా అలాగే ఉంటానని అన్నాడు. ఈ వ్యాఖ్యలను కొందరు గంభీర్కు పరోక్ష సందేశంగా అభివర్ణిస్తున్నారు.గంభీర్-అయ్యర్ గతంలో ఐపీఎల్లో కలిసి పని చేశారు. 2024లో వీరిద్దరి కాంబినేషన్లో (మెంటార్-కెప్టెన్) కేకేఆర్ టైటిల్ గెలిచింది. అంతకుముందు ఇద్దరూ ఆటగాళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడారు.అయ్యర్ శైలి ప్రత్యేకంఅయ్యర్ నాయకత్వంలో ప్రధానంగా కనిపించే అంశం ఆటగాళ్లపై నమ్మకం. ఒకసారి ఆటగాడికి అవకాశం ఇస్తే అతడికి పూర్తి మద్దతు ఇవ్వడం అయ్యర్ శైలిగా గుర్తింపు పొందింది.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ప్రభ్సిమ్రన్ సింగ్ అభివృద్ధిలో అయ్యర్ పాత్ర కీలకమని పలుమార్లు ప్రశంసలు వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అయ్యర్ బలంగా భావిస్తారు.
న్యూస్ పాడ్కాస్ట్
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
బిజినెస్
రూ.20 వేలు తగ్గిన వెండి రేటు!
గడిచిన వారం రోజులు (మే 31 నుంచి జూన్ 6)గా భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో దేశంలో ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో మే 31న (ఆదివారం) రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు జూన్ 6 (శనివారం) నాటికి రూ.2.70 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో రూ.20 వేలు తగ్గిందన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, చెన్నైలలో కూడా కొనసాగుతాయి.అయితే.. ముంబైలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.65 లక్షల వద్ద ఉంది. ఢిల్లీలో కూడా ఇదే ధర కొనసాగుతుంది. దీన్నిబట్టి చూస్తే.. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.2026లో వెండి రేటు గరిష్టంగా రూ.3 లక్షలు దాటేసింది. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ నేడు జూన్ 7 (ఆదివారం) రూ.2.75 లక్షల వద్ద స్థిరంగా ఉంది. అంటే.. సిల్వర్ రేటు భారీగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.వెండికి ఎందుకు డిమాండ్!వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఇది పారిశ్రామిక రంగంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండి ఎలక్ట్రానిక్స్లో సర్క్యూట్ బోర్డులు, మైక్రోచిప్లలో, విద్యుత్ పరిశ్రమలో కేబుల్స్, టర్మినల్స్, కనెక్టర్లలో ముఖ్యంగా వినియోగించబడుతుంది. ఆప్టికల్ పరికరాలు, లెన్స్లు, రిఫ్లెక్టర్లు, కొన్ని వైద్య పరికరాలు, డెంటల్ టూల్స్లో కూడా వెండి ఉపయోగం ఉంది. కాబట్టి వెండికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: తండ్రి మాట.. అంబానీ విజయ రహస్యం!
మే నెలలో ఎక్కువ మంది ఈ కార్లనే కొన్నారు!
మే 2026లో దేశీయ విఫణిలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అమ్మకాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయించింది. ఈ బ్రాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలో ఆరు మోడళ్లకు స్థానం కల్పించింది. టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేశాయి.అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ సెడాన్ మే 2026లో 24,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మంచి మైలేజ్, సౌకర్యం, తక్కువ ధర కారణంగా ఇది వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది.రెండవ స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలిచింది. ఈ మోడల్ 20,686 యూనిట్ల అమ్మకాలతో 52 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది మార్కెట్లో హాట్ సెల్లింగ్ మోడల్గా మారింది.మూడవ స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా నిలిచింది. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే ఈ ఎంపీవీ 20,350 యూనిట్ల అమ్మకాలతో 26 శాతం వృద్ధిని సాధించింది.నాలుగవ స్థానంలో టాటా పంచ్ నిలిచింది. టాప్ 10 అమ్మకాల జాబితాలో ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ చోటు సంపాదించుకుంది. దీనికి కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మోడల్ 20,208 యూనిట్ల అమ్మకాలు చేసి 54 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఐదవ స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తమ్ 19,100 యూనిట్ల అమ్మకాలతో 46 శాతం వృద్ధిని చూపింది.ఆరవ స్థానంలో మారుతి సుజుకి బాలెనో నిలిచింది. ఇది 18,396 యూనిట్లు అమ్ముడై, టాప్ 10లోనే అత్యధిక వృద్ధి రేటు (58%) సాధించింది.ఏడు, ఎనిమిది స్థానాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ చోటు సంపాదించుకున్నాయి. వీటి అమ్మకాలు వరుసగా 18,076.. 17,519 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎంట్రీ లెవల్, యూత్ సెగ్మెంట్లో ఇవి ఇప్పటికీ బలమైన డిమాండ్ను కొనసాగిస్తున్నాయి.తొమ్మిదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. దీని క్లాసిక్, కొత్త వెర్షన్లు కలిపి 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి. పదవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా నిలిచింది. కఠినమైన పోటీ ఉన్నప్పటికీ ఇది 15,253 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన పనితీరు చూపించింది.ఇదీ చదవండి: కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్!
తండ్రి మాట.. అంబానీ విజయ రహస్యం!
భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. నేడు ముఖేష్ అంబానీ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి, ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ చెప్పిన మాట అని ఒక సందర్భంలో పేర్కొన్నారు.ఒకసారి ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. తన తండ్రి చెప్పిన ఒక మాటను గుర్తుచేశారు. ''నువ్వు వ్యాపారవేత్త కావాలనుకుంటే సమస్యలకు పరిష్కారాలను నువ్వే కనుగొనాలి. మేనేజర్లకు మాత్రమే ఏం చేయాలో చెబుతారు. కానీ వ్యాపారవేత్తలకు ఎవరూ దారి చూపరు'' అని ధీరూభాయ్ అంబానీ తనకు చెప్పారని వెల్లడించారు.వ్యాపారవేత్త పరిస్థితి భిన్నం!ఈ మాటల్లో గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. సాధారణంగా ఒక ఉద్యోగి లేదా మేనేజర్కు సంస్థలో ఉన్నతాధికారులు పనులను అప్పగిస్తారు. వారు ఇచ్చిన సూచనల ప్రకారం పని చేస్తారు. కానీ.. ఒక వ్యాపారవేత్త పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతడే సమస్యలను గుర్తించాలి, అవకాశాలను వెతకాలి, నిర్ణయాలు తీసుకోవాలి, వాటి ఫలితాలకు పూర్తి బాధ్యత వహించాలి.జీవితంలో లేదా వ్యాపారంలో ఎదగాలంటే ఎప్పుడూ ఇతరుల మార్గదర్శకత్వం కోసం ఎదురు చూడకూడదని, స్వయంగా ఆలోచించి ముందుకు సాగాలని ధీరూభాయ్ అంబానీ ఉద్దేశ్యం. ఒక వ్యాపారాన్ని నిర్మించాలంటే నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, వాటికి పరిష్కారాలు కనుగొనే ఆత్మవిశ్వాసం అవసరమని ఆయన చెబుతారు.నిర్ణయాలపై నమ్మకంప్రస్తుత కాలానికి కూడా ధీరూభాయ్ అంబానీ మాటలు చాలా ఉపయోగపడతాయి. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఎంతో మంది యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధమవుతారు. అయితే.. చాలామంది ప్రతి అడుగులోనూ ఎవరో ఒకరు మార్గనిర్దేశం చేయాలని ఆశిస్తుంటారు. కానీ నిజమైన వ్యాపారవేత్త తన నిర్ణయాలపై తానే నమ్మకం ఉంచి ముందుకు సాగాలి.సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఇతరులపై ఆధారపడకుండా ముందుగా మనమే ఆలోచించాలి. తప్పులు చేసినా వాటి నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అనుభవమే మనకు ఉత్తమ గురువు. విజయవంతమైన నాయకులు తమ తప్పులను అంగీకరించి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ముందుకు సాగుతారు.కొత్త ప్రయత్నాలు అవసరంఅలాగే.. జీవితంలో ప్రతి విషయం స్పష్టంగా కనిపించిన తర్వాతే చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా సరైంది కాదు. కొన్నిసార్లు చర్యలు తీసుకున్న తర్వాతే స్పష్టత వస్తుంది. అందుకే అపజయాలకు భయపడకుండా.. కొత్త ప్రయత్నాలు చేయడం అవసరం. కాబట్టి ఎప్పుడూ ఇతరులు చెప్పేదాన్ని అనుసరించే వారిగా కాకుండా, సొంత దారిని సృష్టించే వారిగా మారితేనే విజయం సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ!
మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ!
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. అదానీ గ్రూప్కు చెందిన పలు కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో ఆయన సంపద గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో ఆసియా ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆయన తిరిగి కైవసం చేసుకున్నారు.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఒక్క రోజులోనే అదానీ సంపద సుమారు 2.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ 89.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను అధిగమించి అదానీ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అంబానీ సంపద 88 బిలియన్ డాలర్లుగా ఉండగా, సాఫ్ట్బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ సంపద 87 బిలియన్ డాలర్లుగా నమోదైంది.అదానీ సంపద పెరగడానికి ప్రధాన కారణం అదానీ గ్రూప్కు చెందిన కంపెనీల షేర్లలో నమోదైన భారీ ర్యాలీ. ముఖ్యంగా అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. వీటిలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు దాదాపు 6.9 శాతం పెరగగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 3.8 శాతం లాభపడింది.గత నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద దాదాపు 10 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇటీవల అదానీ గ్రూప్పై నమోదైన మోసం ఆరోపణలకు సంబంధించిన కేసులను అమెరికా న్యాయశాఖ విరమించుకున్న తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే.. ఆ ఆరోపణలను అదానీ, ఆయన సహచరులు మొదటి నుంచే ఖండించారు.ప్రస్తుతం అదానీ గ్రూప్కు చెందిన ఆరు ప్రధాన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కలిపి సుమారు 191 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గ్రూప్ వ్యాపార సామర్థ్యాన్ని, మార్కెట్లో ఉన్న బలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వివిధ ఆరోపణలు, మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అదానీ గ్రూప్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. అయితే.. ప్రస్తుతం కంపెనీల పనితీరు మెరుగుపడటం, షేర్ల ధరలు పుంజుకోవడం వల్ల గౌతమ్ అదానీ మళ్లీ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిపాయి.
ఫ్యామిలీ
వాలెట్ పవర్..!
ప్రపంచంలో గుండెపోటు కంటే, జేబులో పర్స్ లేనప్పుడు వచ్చే ‘జేబుపోటు’ చాలా డేంజర్! ప్రేమలో అయినా, పెళ్లిచూపుల్లో అయినా, ఫ్రెండ్స్తో బిర్యానీ పార్టీల్లో అయినా మన గౌరవాన్ని కాపాడేది ఒక్క ‘మనీ పర్స్’ పల్స్ మాత్రమే! ఇలా ప్రపంచాన్ని మొత్తం మోసే పాకెట్ వాలెట్ ఫ్యాషన్లోనూ మీ రేంజ్ పెంచేయగలదు. మీరు కనుక ఈ లేటెస్ట్ ట్రెండ్స్, వాటి సీక్రెట్స్ తెలుసుకుంటే!ది మోడ్రన్ లైనప్ఇది ఒక మినిమలిస్ట్ కార్డ్ హోల్డర్. క్యాష్ కంటే కార్డ్స్, యూపీఐలే ఎక్కువ వాడేవాళ్లకి ఇది బెస్ట్. చిన్నగా, స్లిమ్గా ఉంటుంది. జేబులో పెట్టుకున్నా ‘ఏమీ లేనట్టు’ ఫీల్ వస్తుంది. క్లీన్ , మోడ్రన్ , అల్ట్రా స్టయిలిష్.క్లాసిక్ బై–ఫోల్డ్ఇది ఎప్పటికీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ కాని జెంటిల్మన్ స్టయిల్ వాలెట్. క్యాష్, కార్డ్స్ రెండూ క్యారీ చేయాలనుకునేవాళ్లకి ఇది పర్ఫెక్ట్. కానీ, ఇందులో పాత బిల్లులు, సినిమా టికెట్లు, ఫుడ్ కూపన్స్ అన్నీ నింపేస్తే, వాలెట్ కంటే చిన్న ఫైల్లా కనిపించే చాన్స్ ఉంది!స్మార్ట్ మనీ క్లిప్నోట్లను ఫోల్డ్ చేసి మధ్యలో క్లిప్తో లాక్ చేసే ఈ స్టయిల్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది. జీన్స్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. షార్ప్, రిచ్ మ్యాన్ ఎన ర్జీ వైబ్ ఇస్తుంది.లెదర్ అంటే ఎప్పటికీ క్లాస్ఫుల్ గ్రెయిన్ లెదర్ వాలెట్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంటాయి. బ్లాక్, డార్క్ బ్రౌన్, టాన్కలర్స్ అయితే ఏ అవుట్ఫిట్కైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు కార్బన్ ఫైబర్, క్యాక్టస్ లెదర్లాంటి కొత్త మెటీరియల్స్ కూడా ట్రెండ్లోకి వచ్చేశాయి. అంటే, వాలెట్లో కూడా టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చేసింది అన్నమాట!కలర్స్ కూడా క్యారెక్టర్ చెప్పేస్తాయిబ్లాక్ వాలెట్ అంటే క్లాసీ వైబ్. బ్రౌన్ అంటే రిచ్ లుక్. టాన్ అంటే ట్రెండీ స్టయిల్! నేవీ బ్లూ లేదా ఆలివ్ గ్రీన్ అయితే ‘ఈయనకి ఫ్యాషన్ గురించి తెలుసు’ అనే ఫీలింగ్ వస్తుంది.ఔట్ఫిట్కి మ్యాచ్ చేయాలిఫార్మల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ప్రీమియం లెదర్ బై–ఫోల్డ్ బెస్ట్. జీన్స్, టీషర్ట్తో అయితే స్లిమ్ కార్డ్ హోల్డర్ లేదా మనీ క్లిప్ సూపర్గా సెట్ అవుతుంది. ట్రావెల్ టైమ్లో జిప్ వాలెట్స్, పాస్పోర్ట్ హోల్డర్స్ చాలా యూజ్ఫుల్. అయితే, ఇక్కడ రూల్ ఏంటంటే, మీ వాలెట్ కలర్, మీ బెల్ట్ లేదా షూస్ కలర్కి మ్యాచ్ అయితే, లుక్ ఆటోమేటిక్గా రిచ్గా కనిపిస్తుంది.జాగ్రత్తలు!వాలెట్ని ఎక్కువగా నింపేయొద్దు. అలా చేస్తే, జేబులో చిన్న దిండు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. చాలా చీప్గా కనిపించే మెటీరియల్ అస్సలు వద్దు. మంచి క్వాలిటీ వాలెట్ అయితేనే క్లాస్గా ఉంటుంది.బ్యాక్ పాకెట్లో పెట్టుకుని కూర్చుంటే వాలెట్ షేప్ కూడా మారిపోతుంది. కాబట్టి, ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం బెటర్. (చదవండి: నారికేళంతో నయన సంరక్షణ..!)
నిక్కమైన చిక్కదనం ఆమె వాక్కు!
‘స్త్రీలకు స్త్రీల ఆసరా ఎప్పుడూ అవసరమే! వాళ్ళు పరస్పరం ద్వేషించుకునేందుకే, ఒకరితో ఒకరు స్నేహం చేస్తుంటారు. అలా ఒకర్నొకరు ద్వేషించుకునే క్రమంలోనే వారిమధ్య ఏదో బంధం పెనవేసుకుంటుంది!’ అన్న మాటలు ఏ స్త్రీద్వేషో అన్నవి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. 2009లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న జెర్మన్ రచయిత్రి హెర్తా మ్యూల అన్న మాటలివి. ‘అసలు, మృత్యువుతో తలపడడానికి ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితమేం అవసరం లేదు– ఇంకా ముగింపునకు రాని చిన్నపాటి బతుకు చాల’ని కూడా అన్నారు హెర్తా. ఆమె శైలి గురించి చెప్తూ, అది ‘కవిత్వంలోని చిక్కదనంతోనూ, వచనంలోని సూటిదనంతోనూ నిండివుంటుంద’ని స్వీడిష్ ఎకాడెమీ నిపుణులు ఎందుకన్నారో ఇలాంటి మాటలు వింటే అర్థమైపోతుంది. పరాయిచోట్ల తమ మూలభాషనే మాట్లాడుతూ మనుగడ సాగించే జాతి– ప్రజాతుల భాషకు కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. (ఇది తెలుగుతో సహా అన్ని భాషలకూ వర్తిస్తుంది. ఏమైనా సందేహం ఉంటే, పక్కనే వున్న తమిళనాట్లో తెలుగులు మాట్లాడే భాష వింటే అలాంటి సంశయాలు నిర్మూలమై పోతాయి!) కాఫ్కా తన రచనల్లో వాడిన జెర్మన్ లాంటి భాషనే, హెర్తా మ్యూల సైతం వాడుక చేశారని స్వీడిష్ ఎకాడెమీ పెద్దలు వ్యాఖ్యానించారు. ఇది ప్రశంసా కాదు– అభిశంసా కాదు! ఉన్నది వున్నట్లు చెప్పినమాట మాత్రమే!! ఎటొచ్చీ, కాఫ్కా 40 యేళ్ళపాటు చెక్ రాజధాని ప్రాగ్ నగరంలో బతికాడు– హెర్తా 34 యేళ్ళపాటు రొమానియాలో మనుగడ సాగించారు. అంతే! మనదేశంతో పాటే విదేశీ పాలన కాడి బరువు వదిలించుకున్న దేశాల్లో రొమానియా కూడా ఒకటి. 1947లోనే – నాజీలను మినహాయించి– అఖిలపక్ష జాతీయ ప్రభుత్వం అక్కడ ఏర్పాటయింది. కానీ, మొదటినుంచీ, రొమానియాలో సోవియెట్ పెత్తనం కొనసాగుతూనే వచ్చింది. ‘ఇంక, ఇదేం స్వాతంత్య్రం మహాశయా?’ అని గొంతెత్తి ప్రశ్నించిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు అక్కడి పాలకులు. ఆ దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉన్న జెర్మన్లలో– హెర్తా తండ్రి మాదిరిగా– నాజీ సైన్యంలో పనిచేసినవారూ కొందరున్నారు. వాళ్ళలో వీలైనంతమందిని విరగడ చేసుకున్నారు పాలకులు. మిగిలిన స్త్రీ– శిశు– వృద్ధులను నిర్బంధ శ్రామిక క్షేత్రాలకు తరలించారు. వారి శ్రమఫలాన్ని ‘రొమానియా స్వాతంత్య్ర పోరాటానికైన ఖర్చులకు మింజుమిలె’ జమకట్టుకున్నారు ధర్మప్రభువులు! ఇదే కథను ఇతివృత్తంగా చేసుకుని హెర్తా 2009 లో ‘ఆకలి దేవత’ (ద హంగర్ ఏంజెల్) అనే నవల రాశారు. అదే సంవత్సరం ఆమెకి నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ! వాస్తవానికి అప్పటికి 27 సంవత్సరాలుగా హెర్తా సృజనాత్మక రచనలు చేస్తూనే వున్నారు. 1982లో ఆమె తొలి కాల్పనిక రచన, ‘న్యాదిర్స్’ (అధోలోకాలు) వెలువడింది. రొమానియన్ గ్రామీణ జీవనంలోని చీకటి కోణాలను విమర్శనాత్మకంగా చిత్రించిన అధిక్షేప రచన అది. పల్లెలో బతికే ఓ బాలుడి దృష్టికోణం నుంచి కథనం సాగడం ఇందులో చాలామందిని ఆకర్షించిన విషయం. ముఖచిత్రంపై బోదురుకప్ప బొమ్మతో వెలువడిన ఈ పుస్తకం ఆమెకి అభిమానులనూ, విమర్శకులనూ సమానంగా సంపాదించి పెట్టింది. విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జెర్మనులు హెర్తా విమర్శను పూర్తిగా సమర్థించగా, సాంప్రదాయిక జెర్మనులు ఆమెని దుమ్మెత్తి పోశారు. కాగా, కమ్యూనిస్టు యువజన సంఘం ఈ రచనకు పురస్కారం ప్రకటించి నెత్తినపెట్టుకోవడం విశేషం.హెర్తా మ్యూల 1994లో రాసిన ‘ఆకుపచ్చ పళ్ళతోట’ ఆమెకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఈ రచనకు –జెర్మన్ భాషలో– హెర్తా పెట్టిన పేరు ‘హెర్జ్ టియర్.’ ఇది జెర్మన్ భాషలో వాడుకలో వున్న మాట కాదు– హెర్జ్(గుండెకాయ)+ టియర్ (జంతువు) అనే రెండు మాటల్ని కలిపి జంతుప్రవృత్తి అనే అర్థంలో ఈ మాటను సృష్టించారు హెర్తా. నికలాయ్ చౌషెస్క్యూ హయాంలో అణచివేతను తప్పించుకునే నిమిత్తం జెర్మనీకి పారిపోయిన నలుగురు యువజనుల కథ ఇది. వారిలో ఒకరుగా వున్న ఓ యువతి దృష్టికోణం నుంచి కథనం సాగుతుంది. పాశవిక ప్రవృత్తి కలిగిన పాలకులు, పాలితుల ప్రవృత్తిలో సైతం ఒకింత పాశవికత చొరబడేలా చేస్తారన్నది కథకురాలి ధ్వని. ఈ నవలను ‘చౌషెస్క్యూ హయాంలో బలైపోయిన సహచరుల స్మృతికి’ అంకితం చేశారు హెర్తా. చేదు నిజాలను చెప్పేందుకు హెర్తా ఎన్నడూ వెనకాడలేదు– అందుకే, స్వదేశంలో పరాయిజనంగా బతికిన రొమానియన్ జెర్మన్లు, జెర్మనీ నడిగడ్డపైనా అదే ‘హోదా’ సంపాదించుకోగలిగారని అనడానికి ఆమె జంకలేదు! 1947లో స్వాతంత్య్రంతో పాటే మనజాతికి సంక్రమించిన దేశవిభజన సందర్భంగా, పాకిస్తాన్ తరలి వెళ్ళిన అమాయక ముసల్మానులు అక్కడ ముహాజిర్ హోదానే పొందారు. మన దేశంలోనే మిగిలిపోయిన వాళ్ళు బావుకున్నది మాత్రమేముందని? ఇది ఓ అంతర్జాతీయ విషాద కావ్యం అనొచ్చునేమో!మందలపర్తి కిషోర్
పేరెంటింగ్ క్లాసులో చేరాలి..!
‘పిల్లల్ని కనడానికి ముందు పేరెంటింగ్ క్లాసులో చేరాలా?’ ‘తప్పనిసరి’ అంటున్నారు ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ స్కూల్ చైర్మన్, పర్యావరణవేత్త మేఘన ముసునూరి. ఇద్దరి కూతుళ్ల పెంపకంలో తను తీసుకున్న జాగ్రత్తలను ఆమె ఇలా వివరించారు...‘‘పెళ్లి కాగానే మావారి ఉద్యోగరీత్యా యూకే వెళ్లాం. పిల్లలను కనడానికి ముందు వాళ్ల పెంపకం పట్ల ఆందోళన ఉండేది. నేను చదువుకున్న చదువులో ఈ సబ్జెక్ట్ ఎక్కడా లేదు. అందుకే, పేరెంటింగ్ క్లాస్లకు వెళ్లి, పిల్లలను ఎలా చూసుకోవాలో నేర్చుకున్నాను. కిండర్గార్టెన్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. స్పెషల్ నీడ్స్ పిల్లలతో కలిసి వర్క్ చేశాను. ఆ నాలుగేళ్లలో ఎలాంటి పిల్లలు పుట్టినా, వారిని బాగా చూసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు ప్లాన్ చేసుకొని, పిల్లల్ని కన్నాను. ఇద్దరు కూతుళ్లు తీర్థ, బిల్వ. ఇండియాలో ఉన్నప్పుడు నా చిన్నతనంలోని ఎంజాయ్మెంట్ గుర్తుకు వచ్చింది. ఇవేవీ మా పిల్లలు అనుభవించడం లేదని, నేను, మా వారు ఒక నిర్ణయం తీసుకొని, ఇండియాకు వచ్చేశాం. స్కూల్ స్టార్ట్ చేశానుహైదరాబాద్లో ఇల్లు తీసుకొని, సాఫ్ట్వేర్ రంగంలో మా వారు స్థిరపడ్డాక నేను కొంత ఆలోచనలో పడ్డాను. అప్పటి వరకు నేర్చుకున్నదాన్ని అమలులో పెట్టాలని అనుకున్నాను. ‘సేవ్ వాటర్’ ఎన్జీవోను స్టార్ట్ చేశాను. నాతో పాటు నా పిల్లలు కూడా నా వెనకాలే తిరుగుతుండేవారు. ప్రతి ఆదివారం కాలనీ పిల్లలతో ‘సేవ్ నేచర్’ పేరుతో అవేర్నెస్ ప్రోగ్రామ్లు నిర్వహించేదానిని. పిల్లల చేత పెద్దవాళ్లకు ‘సేవ్ వాటర్’ గురించి చెప్పించేదాన్ని. మియాపూర్లో ‘ఫౌంటెన్హెడ్ గ్లోబల్’ కిండర్గార్టెన్ స్కూల్ స్టార్ట్ చేశాను. స్కూల్లో ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండేలా ప్లాన్ చేశాను. నా పిల్లలు కూడా నా స్కూల్లోనే చదువుకున్నారు.పిల్లలూ మొక్కలూ ఒకటే! స్కూల్లోనూ, ఇంట్లోనూ పిల్లలతో మమేకం అయి చేసే పనులు వారు ఎలా గమనిస్తుంటారో, నేర్చుకుంటారో నాకు కొన్నాళ్లకే అర్థం అవుతూ వచ్చింది. ఒక రోజు తొమ్మిదేళ్ల మా పెద్దమ్మాయి నా దగ్గరకు వచ్చి, క్యాన్సర్ పేషంట్స్ కోసం తన పొడవైన జుట్టు డొనేట్ చేస్తానని చెప్పింది. అక్కను చూసి చెల్లెలూ ఇస్తానంది. క్యాన్సర్ సెల్ గురించి చదివామని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని పిల్లలిద్దరూ చెప్పారు. ఓ రోజు మా చిన్నమ్మాయి ‘సమ్మర్లో ఎందుకింత వేడిగా ఉంటోంది’ అని అడిగింది. ‘మా చిన్నప్పుడు ఇంత వేడి లేదు. చెట్లు పెంచితే వేడి తగ్గుతుంది’ అని చెప్పాను. అప్పటి నుంచి పిల్లలిద్దరూ కాలనీలలో మొక్కలను పెంచడం, పంచడం మొదలుపెట్టారు. పంచే ప్రతి మొక్కకు మూడేళ్లు వచ్చేవరకు ‘మేం జాగ్రత్తగా పెంచుతాం’ అనే ప్రతిజ్ఞ పేపర్ రాయించుకొని, మరీ ఇచ్చేవారు. దాదాపు 60 వేల మొక్కలు పంచారు. ఇంట్లో పొదుపుగా సహజవనరులను వాడటం, ప్రాక్టీస్ చేయించడం వల్ల ఇవన్నీ పిల్లలకు అలవడ్డాయి. మొక్కలను ఎంత జాగ్రత్తగా పెంచితే నీడనిచ్చే వృక్షాలు అవుతాయో, పిల్లలూ అంతే!. పర్యావరణం గురించి నేర్పుతూ! నేను ఏం చెప్పినా ఎన్విరాన్మెంట్, నేచర్ గురించి చెప్పేదాన్ని. అది వారికి బాగా వంటపట్టింది. స్కూల్పిల్లలతో కలిసి మా ఏరియాలోని మీది కుంట చెరువు శుభ్రతకు కృషి చేశాం. మా పెద్దమ్మాయి చెరువు శుభ్రత కోసం తన పాతికలక్షల చెక్ డొనేట్ చేసింది. దీంతో మా చిన్నమ్మాయి వాళ్ల నాన్నతో కలిసి చెరువు చుట్టూ పార్క్ ఏరియా ఏర్పాటుకు కృషి చేసింది. కరోనా సమయంలో పిల్లలు ‘ఓజోన్ రన్’ చేశారు. ఆ తర్వాత కాలనీలలో 100 డేస్ క్లీనప్ సెషన్స్ నిర్వహించారు. ఇప్పుడు మా పెద్దమ్మాయి లండన్లో పబ్లిక్ హెల్త్పై ఎడ్యుకేషనల్ రీసెర్చ్ చేస్తోంది. చిన్నమ్మాయి బిల్వ హైదరాబాద్లోనే కార్బన్ టాక్సేషన్ కోర్సులో చేరింది. పిల్లల పెంపకంలో ప్రతి తరానికి ఫార్ములా మారుతుంటుంది. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. పర్ఫెక్ట్ చైల్డ్, పర్ఫెక్ట్ పేరెంట్ అంటూ ఉండరు. పేరెంట్ అవ్వాలనుకునే ముందు పేరెంటింగ్ క్లాసులు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే సరైన అవగాహనతో పిల్లలను పెంచగలం’’ అని వివరించారు ఈ పర్యావరణవేత్త. సొంతంగా ఎదిగేలా! మా పెద్దమ్మాయి తీర్థ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పాల్గొంది. పాతిక లక్షల రూపాయల బహుమతి తెచ్చుకుంది. చిన్నమ్మాయి నేను కూడా ఆ ప్రోగ్రామ్లో పాల్గొంటాను అంది. అప్పుడు తన ఏజ్ 9. అండర్ ఏజ్ వాళ్లకు అవకాశం లేదని చెప్పాను. దీంతో తను కూడా సంపాదిస్తానని టీచర్స్తో మాట్లాడి ఒక మెనూ రూపొందించి, స్కూల్లో ఒక ఫుడ్ కార్నర్ స్టార్ట్ చేసింది. డబ్బు గురించి కాదు వాళ్లకున్న ప్యాషన్ని పరిచయం చేయాలనుకుని, ఫుడ్ కార్నర్ ఏర్పాటుకు ఎంకరేజ్ చేశాను. ఆ సమయంలో కలినరీ లాంజ్లో పెద్ద పెద్ద షెఫ్స్కి హాండీటాక్స్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మా చిన్నమ్మాయి బిల్వను అక్కడ పరిచయం చేశారు. దీనికి బ్రిటిష్ హై కమిషన్ ‘యంగెస్ట్ ఫుడ్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ హైదరాబాద్’ అని ట్వీట్ చేశారు. పిల్లలు ఆడంబరాలకు పోకుండా పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాను. నిర్మలారెడ్డి(చదవండి: చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!)
ఆఖరి మనిషి
గాఢాంధకారం. ఎటు చూసినా చీకటే. నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించనంత చీకటి అలుముకొని ఉంది. భూమి మీద ఆ రాత్రి– కాళరాత్రి కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శబ్దాల మధ్య నిశ్శబ్దంలా, అస్తిత్వం ముగిసిన తర్వాత మిగిలే శూన్యంలా భూమి కనిపిస్తోంది.ఇంతలో గాలి బలంగా వీచింది. కానీ ఆ గాలిలో జీవం లేదు. ఆ గాలి ఒకప్పుడు మానవులకు ఊపిరి పోసింది. కానీ, ఇప్పుడు జీవకోటి మొత్తం నాశనం అయి పుడమి అంతా బోసిపోయి కనిపిస్తోంది. ఆ సమయంలో ఒక కదలిక కనిపించింది. అందులో శబ్దం లేదు. అది అడుగుల చప్పుడూ కాదు. అది ఒక ఉనికి. భూమి కూడా గుర్తుపట్టని ఒక ఆకారం వస్తూ కనిపించింది. ఆమె ఆకాశం నుంచి దిగలేదు. భూమి లోతుల్లోనుంచి పైకి రాలేదు. ఆమె ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. కానీ ఈరోజు ఆమెను చూడగలిగే కళ్ళు లేవు.ఒకప్పుడు కోట్లాది హృదయాల్లో నిశ్శబ్దంగా నివసించిన ఆమె, ఈరోజు ఖాళీ ప్రపంచంలో తన ఉనికిని తానే మోస్తోంది. ఆమె అడుగులు నేలను తాకలేదు. కానీ ఈ ధరిత్రి ఆమెను చాలాకాలం భరించింది. ఆమె నడిచి వస్తుంటే నదులు పొంగినట్లు, అడవులు కదిలినట్లు, ఉరుములు ఉరుముతున్నట్లు, పర్వతాలు ఎగురుతున్నట్లు అనిపిస్తోంది. ప్రకృతి ఆమెను ఆహ్వానించలేదు. ఆమెను అడ్డుకోలేదు కూడా. ఆమెకు అడ్డుచెప్పేవారు ఈ భూమ్మీద ఎవ్వరూ లేరు. ఆమె నడుస్తోంది. శిథిలమైన నగరాల మధ్యగా, విరిగిన గాజు ముక్కల మీదుగా, శిథిలాల నిశ్శబ్దాన్ని దాటి ఆమె వస్తోంది. ఆమె ప్రతి అడుగులో రౌద్రం కనిపిస్తోంది.ఈ భూమ్మీద మొదటి మనిషి పుట్టిన క్షణం నుంచి చివరి మనిషి శ్వాస వరకు ఆమెకు నిద్ర లేదు. ఆమెకు కాలం అనే పరిమితి లేదు. ఒక పాత నగరం మధ్యలో ఆమె ఆగింది. అక్కడ ఒక నిశ్శబ్దం మధ్యలో చిన్న శబ్దం వినిపిస్తోంది. అది ఎవరిదో శ్వాస. అది బలహీనంగా ఉంది. అది ఆఖరి మనిషి శ్వాస. ఆమె కళ్ళు మూసుకుంది. అతని కోసం ఆమె వెతకాల్సిన అవసరం లేదు. జీవం తనను తానే బయట పెట్టుకుంటుంది. భయం ఎప్పుడూ దాక్కోలేదు. ఆమె మెల్లగా ఆ దిశగా నడిచింది. ఆమె అడుగులు వేగంగా లేవు. అవి ఎప్పుడూ తొందరపడవు. కానీ ఆమె అవి సమయానికి చేరవలసిన చోటుకి చేరుకుంటాయి.ఒకప్పుడు మనుషులు, పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు, అడవులతో కళకళ లాడుతూ ఉండే ధరిత్రి అంతా రుద్రభూమిని తలపిస్తోంది. ఆమె ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగింది. అంతటా నిశ్శబ్దం. సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆమెకు ఒక సవ్వడి వినిపించసాగింది. కొద్ది క్షణాల తరువాత అది గుండె సవ్వడిగా ఆమెకు అర్థమైంది. అది మనిషి శ్వాస. లబ్ డబ్మని వినిపిస్తున్న ఆ శబ్దం నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. అక్కడ కొద్ది దూరంలో ఉన్న కొండ పక్కన ఒక చిన్న ఇంట్లోంచి ఆ శబ్దం వస్తోంది. ఆమె ఆ శ్వాస వస్తున్న ఇంటి వైపు కదిలింది. ఇంటి మధ్యలో ఒక గోడ ఉంది. లోపల ఒక వ్యక్తి మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఆమెను చూడగానే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చున్నాడు. ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడవటం మొదలుపెట్టాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి ఎదురుగా నిలబడింది. అతను ఒక్కసారిగా తలెత్తి ఆమెని చూశాడు. అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ముఖం మీద చెమటలు మొదలయ్యాయి. పెదవులు వణకసాగాయి. దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. అయినా సరే ఓపిక తెచ్చుకొని ‘‘నువ్వెవరు?’’ అని అడిగాడు.అతని మాటలకు ఆమె నవ్వింది. ఆ నవ్వు ఆ గది అంతా ప్రతిధ్వనించసాగింది. ఆ నవ్వులో సత్యం వినిపిస్తోంది.‘‘నేనెవరో నీకు తెలియదా?’’ అని ఆమె అతని వైపు చూస్తూ అడిగింది.అతను భయంతో వెనక్కి జరిగి, ‘‘నా...కు ను...వ్వు ఎ...వ...రో... తెలియదు’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో.‘‘నేనెవరో తెలిసినా నువ్వు అబద్ధాలాడుతున్నావు. ఎందుకంటే నేను రావడం నీకు ఇష్టం లేదు. నీకే కాదు, ఏ జీవికీ ఇష్టం ఉండదు. నేనంటే మీకు భయం. అయినా సమయం వచ్చినప్పుడు నేను రాక తప్పదు. ఇది నగ్న సత్యం. ఈ సత్యాన్ని మీరు ఒప్పుకోరు. అందరూ వెళ్లిపోయారు. నువ్వు ఒక్కడివే మిగిలావు. నిన్ను కూడా తీసికెళ్ళిపోతే నా పనై పోతుంది. బయలుదేరు. సమయం మించిపోతోంది. ఇప్పటికే ఆలస్యం అయింది’’ అంది ఆమె కోపంగా.‘‘నేను నీతో రాను. నాకు ఇక్కడ బోలెడు పనులు వున్నాయి. నేను నీతో వస్తే అవన్నీ ఆగిపోతాయి. నేను తరువాత వస్తాను. అయినా నేను నీతో ఎందుకు రావాలి? నన్ను తీసికెళ్ళడానికి నువ్వు ఎవరు? నీకేం హక్కు వుంది?’’ అని అన్నాడు అతను గోడ దగ్గరకు వెళుతూ.అతని మాటలకు ఆమె కోపంగా అతనివైపు చూసింది. అంతే! గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె అతని వైపు వెళ్ళసాగింది. ఇప్పుడు ఆమె కళ్ళలో కోపం లేదు. దయ లేదు. జాలి అంతకన్నా లేదు. ఆమె కళ్ళల్లో ఏ భావం కనిపించటం లేదు.‘‘నేనెవరో నీకు తెలుసు. అయినా మీ మనుషులు మీ గోతిని మీరే తవ్వుకున్నారు. హాయిగా బతకమని మిమ్మల్నందరినీ ఇక్కడకు పంపిస్తే మీరు ఇక్కడ వినాశనాన్ని సృష్టించారు. యుద్ధాలు మొదలయ్యాయి. అణుబాంబులు, రసాయన ఆయుధాలతో మనిషి మనిషినే చంపడం ప్రారంభించాడు. అతను రాక్షసులతో పోరాడుతున్నానని అనుకున్నాడు. కానీ తన జాతిని తానే నాశనం చేస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. చివరకు తానే తన జాతి పాలిట రాక్షసుడయ్యాడు. మీ జాతితో పాటు ఇక్కడి ప్రకృతిని, జంతుజాలాన్ని, అడవుల్ని కూడా విధ్వంసం చేశాడు. అందుకే మీరు ఇక్కడుండే అర్హత కోల్పోయారు’’ అంటూ ఆమె అతని వైపు చేయి చాపింది.‘‘ఎవరో తప్పు చేస్తే దానికి మేమెలా కారణం అవుతాము. ఎవరు తప్పు చేస్తే వాళ్ళను శిక్షించాలి. అయినా అంత తప్పు మేమేం చేశాము? మేము ప్రకృతిని స్వంతం చేసుకోవాలని చూశాము. ఆమెతో కలిసి లేకపోయాము’’ అన్నాడు ఆ వ్యక్తి.ఆ మాటలు అంటూ ఉంటే అతని కళ్ళలో నీళ్లు మెరిశాయి. అప్పుడతనికి తమ జాతి చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. నిజం ఎప్పుడూ నిజమే. అది అబద్ధం ఎప్పటికీ కాదు. ‘Truth is rarely pure and never simple’’ (సత్యం అరుదుగా స్వచ్ఛమైనది, అదెప్పుడూ సులువైనది కాదు) అన్న ‘ఆస్కార్ వైల్డ్’ మాటలు అతనికి అప్పుడు గుర్తుకు వచ్చాయి.అతని మాటలు ఆమెకు కోపాన్ని తెప్పించాయి. మీరేం తప్పు చేశారో మీకు తెలియదా? నేను చెప్పాలా? మీ కోసం ఆ దేవుడు ఈ అందమైన భూగోళాన్ని సృష్టించాడు. అది అగ్నిగోళంగా మొదలై, జలగోళంగా మారి, జీవకోటికి అనువుగా మారింది. ఈ భూమి మీద మొదటిసారిగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక సూక్ష్మకణం కదిలి జీవం పోసుకొని ప్రాణిగా మారింది. తరువాత అది జీవ పరిణామం చెందింది. విస్తరించింది. చివరకు మనిషిగా రూపుదిద్దుకుంది. అయితే మనిషి పుట్టుకనుంచే దారి తప్పాడు. ‘Nature is the source of all true knowledge’’ (సమస్త జ్ఞానానికీ ప్రకృతే మూలాధారం) అని మీ మనిషే అయిన లియోనార్డో డా విన్సీ చెప్పాడు. కానీ మీరు అతని మాటలను పెడచెవిన పెట్టారు. ప్రకృతి నుంచే జ్ఞానం పుట్టింది. కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే వినయం మనిషి కోల్పోయాడు. మనిషి గొప్ప పనులను చెయ్యగలడు. గొప్పగా ఆలోచించగలడు. సృష్టికి ప్రతిసృష్టిని చెయ్యగల నేర్పరి. అది అతని మహత్తు. అది అతని వరం. కానీ అదే అతని శాపమైంది. అతను అగ్నిని కనుగొన్నాడు. చక్రాన్ని సృష్టించాడు. భాషను కనిపెట్టాడు. లిపిని తయారు చేసుకున్నాడు. కానీ అతను తనను తాను దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు. ‘Knowledge is power, but wisdom is restraint.’’ (జ్ఞానం శక్తి, కాని వివేకం నియంత్రణ) జ్ఞానం అతనికి శక్తిని ఇచ్చింది కానీ, జ్ఞానం మీద నియంత్రణను అతను కోల్పోయాడు. అందువల్ల అదే అతని వినాశనానికి కారణభూతమైంది. ఈ భూమి మీద నాలుగు వందల కోట్ల సంవత్సరాల నిశ్శబ్ద తపస్సు తర్వాత జీవకోటి ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఈ ధరిత్రి అనేక జనన మరణాలను చూసింది. ‘The Earth does not belong to man; man belongs to the Earth.’’ (భూమి మనిషిది కాదు, మనిషి భూమికి చెందుతాడు) భూమి ఎవరికీ చెందదు. కానీ ఆ విషయాన్ని మీ మనుషులు గుర్తించలేకపోయారు. మట్టిలోంచి పుట్టిన మనిషి, మట్టిలో కలవాల్సిందే అన్న నగ్నసత్యం అతనికి ఎప్పుడూ అర్థం కాలేదు. ఫలితం– అడవులు నాశనం అయ్యాయి. నదులు ఎండిపోయాయి. పర్వతాలు తరిగిపోయాయి. తాను ప్రకృతిని జయిస్తున్నానని అనుకున్నాడు. ‘Man conquers nature only to discover he has conquered himself..’’ (మనిషి తనను తాను జయించానని కనుగొనడానికి ప్రకృతిని జయిస్తాడు) కానీ అది ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో అర్థం చేసుకోలేకపోయాడుప్రకృతిని జయించినట్టు అనిపించిన ప్రతి క్షణం, తనను తానే నాశనం చేసుకున్నాడు. ప్రకృతి ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. ఆమె హెచ్చరికలు మెల్లగా వస్తాయి. గాలి వేడెక్కింది. నీళ్లు విషపూరితం అయ్యాయి. జీవజాలం క్షీణించింది. కానీ పట్టించుకోలేదు. ‘We do not inherit the Earth from our ancestors’’ (భూమిని మనం మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందలేదు) కానీ భూమిని, దాని మీద వుండే ప్రకృతిని మీ మనుషులు తన స్వంత ఆస్తి అనుకున్నారు. దాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు.అందుకే అది మీ మీద కన్నెర్ర చేసింది. ఒక రోజు అది తన ప్రతాపాన్ని చూపింది. అందువల్ల అగ్ని వర్షాలు, ఆమ్ల వర్షాలు కురిశాయి. గాలి విషంలా మారింది. భూమి కంపించింది. మనిషి పరుగెత్తాడు. దాక్కున్నాడు. పోరాడాడు. కానీ ‘nature is not cruel, just unapologetically true to itself ’’ (ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తనకు తాను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తన స్వభావానికి కట్టుబడి ఉంటుంది) ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తన నిజ స్వరూపానికి కట్టుబడి ఉంటుంది. అది న్యాయానికి కట్టుబడి ఉంటుంది. ప్రకృతిని మీరు నాశనం చేయాలనుకున్నారు. కానీ చివరకు మీరే నాశనం అయ్యారు. అందుకే మీ జాతి అంతరించిపోయింది. చివరికి నువ్వొక్కడివే మిగిలావు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ భూమ్మీద మిగతా జీవరాశులు హాయిగా నివసిస్తున్నాయి. ఆంథ్రోపాలజీ ప్రకారం మీ మనుషులు వానర జాతి కుటుంబానికి చెందినవారు. కాలక్రమేణా మీరు ద్విపాదులయ్యారు. అటువంటి గొప్ప మానవుల్లో నువ్వు ఆఖరి మనిషివి. నిన్ను తీసికెళదామనే నేను ఇప్పుడు వచ్చాను. బయలుదేరు’’ అంది ఆమె.ఆమె మాటలకు అతను ఆశ్చర్యపోతూ, ‘‘నేను చచ్చినా రాను. ఇంతకీ నన్ను తీసికెళ్ళడానికి నువ్వెవరివి?’’ అని అడిగాడు ఆ ఆఖరి మనిషి.అతని మాటలకు ఆమె నవ్వుతూ ‘‘ఇంకా నన్ను పోల్చుకోలేదా? నేను మీ జాతిని సర్వనాశనం చెయ్యడానికి ఆ ప్రకృతి పంపించిన మృత్యుదేవతను’’ అంటూ తన చెయ్యిని అతని వైపు తిప్పింది. వెంటనే ఆ చేయి అతని వైపు కదల సాగింది. అతను స్పృహ తప్పి పడిపోతున్నాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. స్పర్శ ఆగిపోతున్నట్లు భావన కలుగుతోంది. అతను కొద్ది క్షణాలకు అచేతనుడయ్యాడు. వెంటనే అతను మేల్కొన్నాడు. అతను బయటకు వెళ్లి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. అతను చాలాసేపు పరిగెత్తిన తరువాత అలసిపోవడం వల్ల బాగా దాహం వేసి ఒక చెట్టు కిందకు చేరాడు. కానీ అక్కడ నవ్వుతూ అదే మృత్యుదేవత కనిపించింది.‘‘ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎంత దూరం వెళతావు. నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీ వెంటే ఉంటాను. నీ మృత్యువు ఎప్పుడూ నీ నీడలా నీ వెంటే ఉంటుంది. అటువంటి నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా చేతులు కబంధుడిలా చాలా పెద్దవి’’ అంది ఆమె నవ్వుతూ.అప్పుడు అతను ‘‘దయచేసి నన్ను వదిలెయ్యి. నేను కూడా చనిపోతే ఈ భూమ్మీద మనిషి అన్నవాడి ఆనవాలు లేకుండా పోతుంది. ‘I am the Last Man! ... No king, no lord, no slave, no master; but aman, alone in the world!’’ (నేను ఆఖరి మనిషిని!... రాజును కాదు, ప్రభువును కాదు, బానిసను కాదు, యజమానిని కాదు; కేవలం మనిషిని, ఈ ప్రపంచంలో ఏకాకిని) అనీ అతను వేడుకున్నాడు.అప్పుడు మృత్యువు నవ్వింది.’ You were never meant to last forever’’ (ఎల్లకాలం మనుగడ సాగించడానికి నువ్వు లేవు) మీ జాతి తన పరిమితిని దాటి వెళ్లింది. ఇక మిమ్మల్ని ఉపేక్షించే ప్రశ్నే లేదు’’ అంది అతని దగ్గరకు వస్తూ. ‘‘అమ్మా! దయచేసి నా దగ్గరకు రావద్దు. మేము తప్పు చేశాము. అంత మాత్రాన మా జాతి ఉనికి లేకుండా చేస్తావా? ఇది న్యాయమా చెప్పు?’’ అని ఆమెకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు.క్షణం తరువాత ఆమె చేయి అతన్ని తాకింది. ఆ స్పర్శ చలిగా లేదు, వేడిగా లేదు; అతనికి స్పర్శ తెలియటం లేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడతనికి భయం పోయింది. అహంకారం కరిగిపోయింది. మృత్యువు అతనిని తాకింది. ఆఖరి మనిషి చరిత్ర పుటల్లో చివరి పంక్తిగా మిగిలిపోయాడు. గాలి మళ్లీ స్వచ్ఛమైంది. వర్షం మళ్లీ మృదువుగా కురిసింది. ప్రకృతి మళ్లీ మొదలైంది. మనిషి లేకుండా కూడా ఆమె సంపూర్ణమే. ‘All the world's a stage, and all the men and women merely players.’’ (ప్రపంచమంతా నాటకరంగం. స్త్రీ పురుషులంతా నటీనటులు) అని విలియం షేక్స్పియర్ చెప్పాడు. కానీ భూమ్మీద మనిషి ఆడే నాటకంలో మనిషి పాత్ర ముగిసింది. కానీ వేదిక ఇంకా ఉంది. నిశ్శబ్దం. ఆ చెట్టు కింద గాలి కూడా ఊపిరి బిగబట్టి నిలిచినట్టుంది.ఆఖరి మనిషి ఆమె ముందు అచేతనుడై పడివున్నాడు. ఆ రాత్రి ఒక మనిషి చనిపోలేదు, ఒక జాతి కథ ముగిసింది. మనిషి శాశ్వతం కాదు. మనిషి తన మూలాన్ని మరచిపోయిన క్షణమే అతని వినాశనం ప్రారంభమైంది. మనిషి ఆలోచించాడు. ఆ ఆలోచన అతనికి శక్తి ఇచ్చింది. కానీ ఆ శక్తి అతని మితిమీరిన ఆకాంక్షలకు ఆయుధమైంది. ఆకాశాన్ని తాకాడు, సముద్ర గర్భాన్ని చీల్చాడు. కానీ, తన అంతర్ముఖంలో ఉన్న లోపలి అంతరాత్మను మాత్రం జయించలేకపోయాడు. మనిషికి జ్ఞానం పెరిగింది, వివేకం తగ్గింది.కొద్ది క్షణాల తరువాత ఆమె ఒక పుస్తకం తీసి అందులో ఆఖరి మనిషి అన్న వాక్యం దగ్గర ఒక ఇంటూ మార్కు పెట్టింది. ఇప్పుడు ఆ పుస్తకం నిండా ఎర్రటి ఇంటూ మార్కులే. అది ఆ పుస్తకం చివరి పేజీ.గన్నవరపు నరసింహ మూర్తి
అంతర్జాతీయం
సడిలేని సూపర్సానిక్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అరుదైన ఘనత సృష్టించింది. విమానయాన రంగంలో ఒక నూతన శకంలోకి అడుగుపెట్టింది. తక్కువ శబ్దంతో వేగంగా దూసుకెళ్లే మొట్టమొదటి సూపర్సానిక్ విమానం ‘ఎక్స్–59’ని అభివృద్ధి చేసింది. జూన్ 5న జరిగిన ప్రయోగంలో ఈ విమానం తొలిసారిగా ధ్వని అవరోధాన్ని విజయవంతంగా అధిగమించింది. భవిష్యత్తులో విమాన ప్రయాణాల్లో ఒక చరిత్రాత్మక మార్పునకు నాంది పలికింది. సాంప్రదాయ సూపర్సానిక్ విమానాలు చెవులు చిల్లులు పడే భారీ శబ్దంతో దూసుకెళ్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సున్నితమైన శబ్దంతో ప్రయాణించే విమానాన్ని తయారు చేయడానికి నాసా ‘క్వెస్ట్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. విమానయానంలో ఇదొక గొప్ప ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 30 అడుగుల ముందు భాగం.. పైభాగంలో ఇంజిన్ గాలిలో ఒక వస్తువు నెమ్మదిగా కదులుతూ ఉంటే.. ఆ మార్గంలో దానికి ఎదురయ్యే గాలి అణువులకు పక్కకు తప్పుకోవడానికి తగిన సమయం ఉంటుంది. అందుకే తక్కువ ధ్వని వెలువడుతుంది. ధ్వని వేగంతో దూసుకెళ్లే సూపర్సానిక్ విమానం విషయంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే దాని మార్గంలో అడ్డొచ్చే గాలి అణువులకు పక్కకు తప్పించుకోవడానికి తగినంత సమయం ఉండదు. అవి ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. ఇది అధిక పీడనాన్ని సృష్టిస్తుంది. శక్తివంతమైన షాక్వేవ్ కారణంగా భరించలేని శబ్దం వెలువడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నాసా ఇంజనీర్లు సూపర్సానిక్ ఫ్లైట్ డిజైన్ను మార్చారు. ఎక్స్–59 విమానాన్ని పొడవైన ఆకారంతో రూపొందించారు. దీని ముందు భాగం ముక్కు ఆకారంలో దాదాపు 30 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన నిర్మాణం గాలి పీడన తరంగాలు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా నిరోధిస్తుంది. విమానం గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు భారీ ప్రకంపనకు బదులుగా విడివిడిగా ఉండే చిన్న, బలహీనమైన తరంగాల శ్రేణిని సృష్టిస్తుంది. అది ఒక మృదువైన ధ్వనిలా వినిపిస్తుంది. ఇంట్లో గాలికి కిటికీ కొట్టుకున్న శబ్దం లాంటిది వినొచ్చు. అంతేకాకుండా ఎక్స్–59లోని ఇంజిన్ను విమానం పైభాగంలో అమర్చారు. ఇది శబ్దాన్ని నేలపై మనుషుల నుంచి దూరంగా మళ్లిస్తుంది. ఈ పరిశోధన సత్ఫలితాలు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో విమానాన్ని మాక్ 1.4 వేగానికి.. అంటే గంటకు సుమారు 925 మైళ్ల (1,488 కిలోమీటర్ల) వేగానికి చేర్చడానికి నాసా సైంటిస్టుల బృందం సిద్ధమవుతోంది. వేగం, నిశ్శబ్దం రెండూ కలిసి ఉండే ప్రపంచానికి మనల్ని దగ్గర చేయడానికి కృషి చేస్తోంది. గంటకు 713 మైళ్ల వేగం ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే విమానాన్ని సూపర్సానిక్ ఫ్లైట్ అంటారు. వీటి నుంచి వెలువడే భారీ శబ్దమే ఈ విమానాలకు ప్రతికూలంగా మారింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటిపై నిషేధం విధించాయి. తమ గగనతలంపై ఇలాంటి విమానాల ప్రయాణానికి అనుమతి ఇవ్వడం లేదు. ఒక విమానం ధ్వని తరంగాల వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు.. అది ఒక పీడన తరంగాన్ని సృష్టిస్తుంది. అది ఉరుములాగా నేలను ఢీకొంటుంది. ఈ పరిస్థితిని మార్చడానికే ఎక్స్–59ని రూపొందించారు. పెద్ద శబ్దానికి బదులుగా, దూరంగా కారు తలుపు మూసుకునే శబ్దం కంటే తక్కువ శబ్దంతో కూడిన మృదువైన చప్పుడును సృష్టించడమే ఈ విమానం లక్ష్యం. కాలిఫోరి్నయాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఈ విమానాన్ని పరీక్షించారు. ఇది ‘మాక్ 1.1’గరిష్ట వేగాన్ని అందుకుంది. ధ్వని వేగం కంటే 1.1 రెట్ల వేగంతో ప్రయాణించడాన్ని మాక్ 1.1 అంటారు. అంటే గంటకు 713 మైళ్లు(1,147 కిలోమీటర్లు) అని చెప్పుకోవచ్చు. ఈ వేగాన్ని విజయవంతంగా అందుకోవడం ద్వారా ఎక్స్–59 విమానం ఉద్దేశించిన విధంగానే పనిచేస్తోందని తేలింది. అయితే శబ్దం మాత్రం ఎక్కువగా వెలువడలేదు. ఇందులోని రహస్యం అంతా విమానం డిజైన్లోనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్
కారుపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పులు.. పసికందు మృతి
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని హెబ్రాన్లో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఏడు నెలల పసికందు మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.బెత్లెహెమ్ యూనివర్శిటీలో లెక్చరర్గా పనిచేస్తున్న తండ్రి ఫహద్ అబు హైకల్ మీడియాతో మాట్లాడుతూ ఒక బుల్లెట్ మొదట తన చేతికి తగిలి.. ఆ తర్వాత వెనుక సీట్లో తల్లితో కలిసి కూర్చున్న తన కుమారుడికి తగిలిందని చెప్పారు. సైనికుడు నన్ను ఆగమని సైగ చేశారు. నేను కారును పూర్తిగా ఆపి, స్టీరింగ్ వీల్పై నా చేతులు పైకెత్తాను. ఆ వెంటనే వారు వాహనంపై కాల్పులు జరిపారని ఆయన తెలిపారు.కాల్పులు జరిగిన సమయంలో తాము తమ 11 ఏళ్ల కుమారుడు, తల్లితో కలిసి ప్రయాణిస్తున్నట్లు అబు హైకల్ చెప్పారు. కారులో ఉన్నవారిని గుర్తించడంలో సైనికులు పొరపాటు పడి ఉంటారనే వాదనను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఆ సైనికుడు నాకు కేవలం 10 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతను నన్ను, నా భార్యను, పిల్లలను చూశాడు. కారు కిటికీలకు నల్లటి గ్లాసులు లేవు. అది పట్టపగలు కావడం వల్ల అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారులో కుటుంబం ప్రయాణం చేస్తుందని ఆవ్యక్తికి తెలియదా?’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సమీక్షిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకువస్తోందని భావించి సైనికులు కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపినట్లు 'ది గార్డియన్' పేర్కొంది. మిలిటరీ సమాచారం ప్రకారం.. సైనికులు ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకురావడాన్ని గమనించారు.. అందులోని ఓ సైనికుడు ఆ వాహనంపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు పాలస్తీనియన్లు గాయపడ్డారు.వారిని వైద్య చికిత్స కోసం తరలించామని ఐడీఎఫ్ తెలిపింది. ఏదైనా తప్పు జరిగి ఉంటే.. సంబంధం లేని వ్యక్తులకు జరిగిన నష్టానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని ఐడీఎఫ్ పేర్కొంది. ప్రాథమిక మిలిటరీ విచారణలో గాయపడిన వారు ఎలాంటి శత్రుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోని సాధారణ పౌరులుగా తేలింది. బాధ్యులను శిక్షించాలని తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, సంబంధిత సైనికుడిని బాధ్యుడిని చేయాలని అబు హైకల్ డిమాండ్ చేశారు.
అమెరికాకు ఆ భయం పట్టుకుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలను తీవ్రస్థాయికి చేరుకున్నాయా? అమెరికా- ఇజ్రాయెల్ మధ్య అసలేం జరుగుతోంది?. ఇరాన్ యుద్ధం.. వాషింగ్టన్- టెల్ అవీవ్ మధ్య చిచ్చురాజేసిందా?.. అంతర్జాతీయ మీడియా కథనాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన అమెరికా ప్రతినిధుల బృందం.. అక్కడ గూఢచర్యం భయాలతో బర్నర్ ఫోన్లను ఉపయోగించినట్లు కథనాలు వెలువడ్డాయి.ఇజ్రాయెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి ముప్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్బీసీ న్యూస్ కథనం ప్రకారం.. మధ్యప్రాచ్యంపై ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలు, ఉన్నతాధికారుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే ఆందోళనలతో యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ అంతర్గత నివేదికను విడుదల చేసింది. డీఐఏ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఏడు పేజీల నివేదికతో పాటు ఇజ్రాయెల్ గూఢచర్య కార్యకలాపాలను వివరించే ఒక చార్ట్ కూడా ఉంది.ఇజ్రాయెల్కు ఉన్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ , టెక్నికల్ సర్వైలెన్స్(సాంకేతిక నిఘా) సామర్థ్యాలు క్రిటికల్ స్థాయికి చేరుకున్నాయని ఈ నివేదిక తేల్చింది. అమెరికా రక్షణ శాఖలో ఆందోళనలు పెరగడానికి కారణమైన కొన్ని నిర్దిష్ట సంఘటనలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఇరాన్, ప్రాంతీయ భద్రతాంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న సమయంలో.. అమెరికా నిర్ణయాలను ముందే తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందనే అనుమానాలు వాషింగ్టన్లో బలపడుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధికారులపై తాము నిఘా పెడుతున్నామనే వార్తలను తోసిపుచ్చింది.ఇజ్రాయెల్ అమెరికా ప్రభుత్వ అధికారులపై గానీ.. అక్కడి సంస్థలపై గానీ ఎలాంటి సమాచారాన్ని సేకరించదు. మా నిఘా వ్యవస్థలు కేవలం శత్రువులను లక్ష్యంగా చేసుకుంటాయి. మిత్రదేశాలను కాదు. దీనికి విరుద్ధంగా వచ్చే వార్తలన్నీ అవాస్తవాలు, రాజకీయ ప్రేరేపితమైనవిగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి కొట్టిపారేశారు.మరోవైపు, పెంటగాన్ దీనిపై స్పందించడానికి నిరాకరించగా.. వైట్ హౌస్ అధికారి ఒకరు ఈ ఆరోపణలను ఖండిస్తూ.. ఈ కథనం పూర్తిగా అవాస్తవం, సరైన అవగాహన లేని వ్యక్తుల సమాచారం ఆధారంగా ఈ కథనాలు సృష్టించారన్నారు. గత ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య విభేదాలు వచ్చిన తరుణంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.ట్రంప్ టెహ్రాన్తో దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మొగ్గు చూపుతుండగా.. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ ఏ ఒప్పందాన్ని గౌరవించదని.. మరింత కఠినమైన సైనిక చర్యలే సరైనవని వాదిస్తోంది. ఈ విషయమై ఇటీవల ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని.. ఆ తర్వాత ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా అధికారులు అధికారిక పర్యటనల నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు అదనపు భద్రతా జాగ్రత్తలు తీసుకుంటారని ప్రస్తుత, మాజీ అధికారులు గుర్తుచేశారు. ఇందులో భాగంగా బర్నర్ ఫోన్లు (తాత్కాలిక ఫోన్లు), తాత్కాలిక కంప్యూటర్లు, కఠినమైన కమ్యూనికేషన్ నిబంధనలను పాటిస్తారు. ఇజ్రాయెల్ పర్యటనల్లో అమెరికా ఇప్పటికే అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. సమాచారాన్ని దూకుడుగా సేకరించడంలో ఇజ్రాయెల్ దిట్ట అని అందరికీ తెలిసిందేనంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు.అమెరికా, ఇజ్రాయెల్లు దశాబ్దాలుగా ఇంటెలిజెన్స్ రంగంలో సహకరించుకుంటూ అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఇరాన్ విషయంలో తలెత్తిన విభేదాల సమయంలో ఇజ్రాయెల్ నిఘా పెడుతోందనే అనుమానాలు మిత్ర దేశాల మధ్య నమ్మకాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విమానంలో లగేజీ గొడవ, పోలీసు చేయి కొరికేసింది
విమాన ప్రయాణాల్లో ప్రయాణికులకు చాలా టెన్షన్ ఉంటుంది. విమానంలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లవచ్చు అనే సందేహాలు మొదలు, సయానికి సెక్యూరిటీ చెకప్ ముగించుకుని గేట్లోకి వెళ్లడం, లగేజీ నిర్దేశించిన బరువులో ఉందా లేదా చూసుకోవడం దాకా చాలా తతంగమే ఉంటుంది. ముఖ్యంగా పరిమితి కంటే లగేజీ బరువు కాస్త ఎక్కువైనా ప్యాసెంజర్లకు చుక్కలే. అదనపు చార్జీల (Excess baggage fee) మోత మోగుతుంది. ఇక్కడే చాలా వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అర్జెంటీనాలోని ఒక విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎక్స్ట్రా లగేజీ ఫీజుకు సంబంధించిన హైడ్రామా ఊహించని రేంజ్కి చేరింది.అసలేం జరిగింది?‘మిర్రర్ యూకే’ కథనం ప్రకారం.. అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్ (Buenos Aires) లో గ ‘జార్జ్ న్యూబెరీ ఎయిర్పార్క్’ లో జెట్స్మార్ట్ (JetSmart) విమానంలో ఈ సంఘటన జరిగింది. కొర్డోబాకు వెళ్లాల్సిన ఆ విమానం ఎక్కేందుకు ఒక మహిళా ప్రయాణికురాలు వచ్చింది. అయితే, ఆమె పరిమితికి మించి క్యాబిన్ లగేజీని తీసుకురావడంతో, దానికి అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ సిబ్బంది కోరారు. దానికి ఆమె నిరాకరించడంతో బోర్డింగ్ గేట్ వద్ద వివాదం మొదలైంది.గేట్ వద్ద గొడవ జరుగుతున్నప్పటికీ, ఆమె సిబ్బంది కళ్లుగప్పి ‘ఫ్లైట్ JA 3104’ లోపలికి వెళ్ళిపోయింది. ప్రామాణిక బోర్డింగ్ నియమాలను ఉల్లంఘించి ఆమె విమానం ఎక్కేసిందని గ్రహించిన సిబ్బంది, వెంటనే భద్రతా సిబ్బందిని ఎలర్ట్ చేశారు.నిజానికి బోర్డింగ్ గేట్ వద్దే ముగిసిపోవాల్సిన ఈ గొడవ, ఆమె విమానం లోపలికి వెళ్లడంతో మరింత వివాదాస్పందగా మారింది. అప్పటికే ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చుని, విమానం టేకాఫ్కు సిద్ధమవుతోంది. ఆ సమయంలో పోలీసులు విమానంలోకి ప్రవేశించి, ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఆ మహిళ ఒక్కసారిగా ఒక మహిళా పోలీస్ అధికారిణి కుడి చేతిపై గట్టిగా కొరికింది. ఈ ఊహించని ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడుతీవ్ర ఘర్షణ తర్వాత ఎయిర్పోర్ట్ పోలీసుల ఎట్టకేలకు ఆమెను నియంత్రించి, విమానం నుండి కిందకు దించేశారు. దీనిపై అర్జెంటీనా 'నేషనల్ క్రిమినల్ అండ్ కరక్షనల్ ఫెడరల్ కోర్ట్ నెం. 3' ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. గాయపడిన మహిళా అధికారిణి, షిఫ్ట్ సూపర్వైజర్, జెట్స్మార్ట్ విమాన సిబ్బంది నుండి దర్యాప్తు అధికారులు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ప్రస్తుతం కోర్టు ఈ కేసును పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన?
జాతీయం
నేడే ఇండియా జనబంధన్
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తమ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో ‘ఇండియా జనబంధన్’ పేరిట కూటమి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి 23 పార్టీల నేతలు హాజరు కాబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. తమ కూటమిలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఐక్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. కొన్ని పార్టీలు అనివార్య కారణాల వల్ల ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకాలేమని తెలియజేశాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జనబంధన్’ భేటీ ప్రారంభమవుతుందని, 23 పార్టీల నాయకులు పాల్గొనబోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని స్పష్టంచేశారు. ఉమ్మడి లక్ష్యం, స్పష్టమైన ఉద్దేశంతో ఈ సమావేశం జరుగనుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. అనేక పార్టీలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశి్చమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, సీపీఎం పార్టీ తదితరులు సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు సైతం భేటీకి వస్తున్నట్లు వార్తలొచ్చాయి . కూటమిలో రచ్చరచ్చ 2029లో జరిగే లోక్సభ ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. సోమవారం నాటి భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. కూటమిలో కొన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు దిగజారిన నేపథ్యంలో సమావేశం జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ భేటీకి తాము హాజరు కావడంలోని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని, పదవుల కోసం తమిళగ వెట్రి కళగంతో చేతులు కలిపిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కేరళలో వామపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ తదితరులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణల పట్ల సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి సమావేశానికి సీపీఎం నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ హాజరు కానున్నట్లు సమాచారం. ఐక్యతపై అనుమానాలు: బీజేపీ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడం చూస్తే ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. ఆ కూటమిలో విభేదాలు నానాటికీ పెరుగుతున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. బేబీ రాసిన లేఖ కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టిందని ఆయన చెప్పారు. విపక్ష కూటమికి ఒక లక్ష్యం, దార్శనికత లేవని ఆరోపించారు. కేవలం గందరగోళం, అనుమానాలు, ఆరోపణలు, పదవుల కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కూటమిలోని పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో పరస్పరం తలపడుతున్నాయని, ఇక ఐక్యత ఎక్కడుందని ప్రశ్నించారు.ప్రతిపక్షాల మధ్యసమన్వయం కోసమే..ఇండియా కూటమిలో కీలక పార్టీలైన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్లు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ప్రతిపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా ‘ఇండియా జనబంధన్’ సమావేశాన్ని పరిగణిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కొంతకాలంగా ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉంటోంది. గతంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి సమావేశమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం గురించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.కేజ్రీవాల్తో మమత భేటీ భేటీ కోసం మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన ఆప్ చీఫ్తో టీఎంసీ చీఫ్ మమత భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం ఆతీ్మయంగా జరిగిందని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలతోపాటు తదుపరి కార్యాచరణపై వారిద్దరూ విస్తృతంగా చర్చించుకున్నారని వెల్లడించాయి. ఈ సందర్భంగా మమతా బెనర్జీ వెంట ఆమె మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ వచ్చారు.
ఆరంకెల జీతమున్నా బైక్ రైడర్గా..
బెంగళూరు: గ్రామాల్లో వేలల్లో జీతాలొస్తే చాలు ఎంతో హాయిగా అన్ని సౌకర్యాలతో జీవిస్తారు. మరి బెంగళూరు వంటి మహానగరంలో ఆరంకెల జీతమొచ్చినా కొందరు కుటుంబ ఆర్థిక భద్రతపై బాగా ఆలోచిస్తారని ఒకతను నిరూపించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆరంకెల జీతమొస్తున్నాసరే వారాంతాల్లో ర్యాపిడో బైక్ ట్యాక్సీ రైడర్గా పనులు చేస్తుంటానని ఒకతను చెప్పిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇటీవల బెంగళూరులోని బన్నేరఘట్ట అనే ప్రాంతంలో షాబాజ్ అనే వ్యక్తి మరో చోటుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్చేశాడు. వెళ్తూ మార్గమధ్యంలో రైడర్తో మాట్లాడాడు. ఆ సంభాషణ తాలూకు వివరాలను షాబాజ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నాడు. ‘‘ రైడర్ నన్ను మీరేం చేస్తారు అని అడిగాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని గొప్పగా చెప్పా. నువ్వేం చేస్తావని 35 ఏళ్ల ఆ రైడర్ను అడిగా. అతను చెప్పిన సమాధానం విని ఆలోచనలో పడ్డా. తను కూడా సాఫ్ట్వేర్ డెవలపర్గా ఒక పెద్ద బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాడు. ఆరంకెల జీతం వస్తోంది అతనికి. మరి రైడర్గా ఎందుకు చేస్తున్నావని అడిగా. వారాంతాల్లో మాత్రమే ఈ పని చేస్తాడట’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘నాకు పెళ్లయింది. మాకొక చిన్నారి. ముగ్గురం ఈ మహానగరంలో వాళ్లను ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని ఉద్దేశంతోనే అదనపు ఆదాయం కోసం ఈ పార్ట్టైం జాబ్ చేస్తున్నా’’ అని చెప్పడంతో ఆలోచనలో పడ్డానని షాబాజ్ చెప్పాడు. ఈ పోస్ట్లు స్పందనలు వెల్లువెత్తాయి. భారత్లోని బెంగళూరు వంటి నగరాల్లో ఇంటి అద్దెలు, ద్రవ్యోల్బణం, పిల్లల ఫీజులతో వేతనజీవుల వెతలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ ఉదంతం తేటతెల్లంచేస్తోందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఆరంకెల జీతమొచ్చే ఉద్యోగులు భిన్నమైన బైక్ రైడ్ వృత్తిని ఎంచుకోకుండా సాఫ్ట్వేర్ రంగంలోనే కొత్త కోర్సులు, మెళకువలు నేర్చుకుని ఆ రంగంలో మరింత పైకి ఎదిగి ఆదాయాన్ని రెట్టింపుచేసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.
విష వాయువులు పీల్చి నలుగురి మృతి
సూరత్: గుజరాత్లోని సూరత్లో ఆదివారం సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే పని చేస్తున్న నలుగురు కార్మికులు విష వాయువులు పీల్చి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో... నిర్వహణ పనుల సమయంలో భద్రతా నిబంధనలు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఈ ఘటన అశ్విని కుమార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నగలను శుభ్రపరిచే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఈ సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్తుంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ట్యాంక్ను ప్రతి 2 నెలలకు ఒకసారి శుభ్రం చేస్తారు.డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్-1) అలోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం శుభ్రపరిచే పనిలో భాగంగా ఒక సూపర్వైజర్, ముగ్గురు కార్మికులు ట్యాంక్లోకి దిగారు. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే నలుగురూ కుప్పకూలిపోయారు. మూసివేసిన ఆ ప్రదేశంలో విష వాయువు ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్వాస ఆడకపోవడమే వారు మృతిచెందడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని, అయితే కచ్చితమైన కారణం పోస్టుమార్టం పరీక్ష తర్వాత తెలుస్తుందని తెలిపారు.కార్మికుల వద్ద భద్రతా పరికరాలు ఎక్కడ? ట్యాంక్లోకి దిగే ముందు సూపర్వైజర్ అగ్నిమాపక శాఖను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం, పనులు నిర్వహించే సమయంలో కార్మికుల వద్ద అవసరమైన భద్రతా పరికరాలు గానీ, రక్షణ సామగ్రి గానీ లేవు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. నలుగురు కార్మికులను ట్యాంక్ నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమా? అనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా విధానాలు అమలు చేశారా లేదా తెలుసుకునేందుకు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు. బాధ్యులు ఎవరో గుర్తించనున్నారు.
నీట్ పరీక్ష భద్రత కోసం ఎన్టీఏ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల జూన్ 21న జరగనున్న నీట్ యూజీ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఏటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తరలించేందుకు భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించుతోంది. ఈ వివరాలను NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. దీంతో ఒక పరీక్ష కోసం విమానాల్ని వాడిన ఎగ్జామ్గా నీట్ రికార్డు సృష్టించనుంది.నీట్పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో అభిషేక్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షల పారదర్శకతను, భద్రతను కాపాడటానికి ఈసారి మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్స్ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అభిషేక్ సింగ్ మాట్లాడుతూ "పరీక్షా ప్రక్రియ సమగ్రతను, భద్రతను కాపాడటానికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రశ్నపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళాన్ని ఉపయోగిస్తున్నాము" అని అన్నారు.కాగా వైమానిక దళ అంశంపై ఇటీవలే మాట్లాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ జూన్ నెలలో ఉండే వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రశ్నపత్రాలను సురక్షితంగా, సకాలంలో చేరవేసేందుకు వైమానిక దళ సహాయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే కేవలం ప్రశ్నాపత్రాల కోసం మాత్రమే వైమానిక దళం సహాయం తీసుకుంటామని భద్రత కోసం మరే సాయం తీసుకోమని స్పష్టం చేశారు.గత మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల రద్దు చేస్తున్నట్లు మే 12న ఎన్టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 21న దేశవ్యాప్తంగా తిరిగి పరీక్ష నిర్వహించనున్నారు.
ఎన్ఆర్ఐ
కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై అమెరికా దాడులు చేసింది.
అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు)
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం.
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ఎన్నారై రాపోలు నందు..!
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ చిత్ర పరిశ్రమలో వేలాది మంది అవకాశాల కోసం తిరుగుతుంటారు. చాలా మందిలోని కళ కేవలం కలగానే మిగిలిపోతుంది. కానీ, డ్యాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అతడికి లక్షలాది మంది అభిమానులు దొరికారు. సినిమాపై ఉన్న మక్కువే అతడికి అవకాశాలు వెతుక్కుంటూ తెచ్చింది. కోలీవుడ్లో హీరోగా అరంగేట్రం చేసిన జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందిన ప్రవాస భారతీయుడు నందు రాపోలుపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..పాలకుర్తి టౌన్: ఎన్నారై రాపోలు నందు బాల్యం మొత్తం పాలకుర్తి పరిసర ప్రాంతంలోనే గడిచింది. ఉద్యోగ రీత్యా ఆయన సింగపూర్లో సెటిలయ్యారు. అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసూ్తనే తెలుగు ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన నందు సరదాగా రీల్స్ చేయడం ప్రారంభించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న తన బంధువు సురేఖ నున్నతో కలిసి చేసిన వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇద్దరూ వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ, ఒకే పాటలో హీరోహీరోయిన్ పాత్రలను విభజించుకుని, ఎక్కడా తేడా తెలియకుండా సింక్ చేస్తూ చేసిన వీడియోస్ బాగా పాపులరయ్యాయి. వారు చేసిన 25 రీల్స్లో 20 వీడియోలు ఒక మిలియన్ (10 లక్షలు) వ్యూస్ దాటాయి. నందు ఆత్మవిశ్వాసంతో కూడిన డాన్స్, సినిమాపై ఆయనకున్న ప్రేమ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. నిర్మాత కోన వెంకట్ సైతం నందు చేసిన ఒక రీల్ను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో నందుకు మంచి గుర్తింపు వచ్చింది. కోలీవుడ్ హీరోగా..నందు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హీరో పాత్రకు ఎంపిక చేశారు. మలేషియా, తమిళనాడులో చిత్రీకరించిన ‘13/13 లక్కీ నన్’ చిత్రంలో నందు లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు, సింగపూర్, అమెరికా, మలేషియాలో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, నందు 2014 నుంచి సింగపూర్లో తెలుగు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. స్థానిక పంపిణీదారులతో కలిసి ఇప్పటివరకు 25కు పైగా సినిమాలు విడుదల చేశారు. సరదాగా చేసిన రీల్స్తో హీరోగా అవకాశం..కోవిడ్ సమయంలో సరదాగా చేసిన రీల్స్ నా జీవితాన్నే మార్చేస్తాయని అస్సలు ఊహించలేదు. ఐటీ ఉద్యోగం చేసూ్తనే నటనపై అభిరుచిని కొనసాగించాను. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపే నాకు కోలీవుడ్లో హీరో అవకాశం తెచ్చింది. ఉద్యోగం నా జీవనాధారం. సినిమాలు నా ఫ్యాషన్, ప్రేక్షకుల ప్రేమతో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది.– రాపోలు నందు, సింగపూర్
క్రైమ్
విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం
హుబ్లీ: విద్యాను బోధించే గురువు స్థానం అత్యున్నతమైనదని భారత సంప్రదాయాలు చాటి చెబుతున్నాయి. అయితే విద్యా బోధన చేసే గురువే విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన ఘటన కర్ణాటక విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇక్కడి శాస్యశాస్త్రం విభాగం ఫ్రొఫెసర్ దేవరాజ సంగుదొరై విజయపురకు చెందిన అదే వి«భాగంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిపారు. ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. వీరిద్దరి ప్రేమ గొడవ తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె పీహెచ్డీని సంగంలోనే ఆపేసి ఇంటికి తిరిగి తీసుకెళ్లి పోయారు. కొన్ని రోజుల తర్వాత విజయపురకు చెందిన విద్యార్థి తన వద్దకు పీహెచ్డీ చేయడానికి రాగా గతంలో మధ్యలోనే పీహెచ్డీని ఆపేసి వెళ్లిన విద్యారి్థని తిరిగి కళాశాలకు తీసుకొని వస్తే నీ పీహెచ్డీ పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తానని ఆంక్షలు పెట్టారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థి ఈ విషయంపై వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ప్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
భర్తను కాదని.. కాలేజీ ఫ్రెండ్తో వివాహేతర సంబంధం..!
అక్రమ సంబంధం మోజుతో ఓ తల్లి ఎవరూ చేయరాని అకృత్యానికి పాల్పడింది. ప్రియునితో వెళ్లిపోయిన తల్లి.. ఆ తరువాత కూతురిని కడతేర్చింది. ఈ దారుణం బెంగళూరు కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బాలిక హత్యపై భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ పై తండ్రి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ప్రవీణ్, బెంగళూరువాసి ప్రియాంకకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియాంక కాలేజీ ప్రియుడు మోహన్తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీని గురించి భర్త ప్రశ్నించగా, ప్రియాంక విడాకులు కావాలని పట్టుబట్టింది. చివరకు కుమార్తెలతో వెళ్లిపోయింది. హఠాత్తుగా బాలిక మృతి.. మార్చి 24న చిన్న కూతురు ఆకస్మాత్తుగా మరణించింది. ఏమైందని భర్త వెళ్లి ప్రియాంకను అడగ్గా, బిర్యానీ తింటూ చనిపోయిందని ఒకసారి, ఐస్ క్రీమ్ ఇచ్చి, ఏసీ వేసి కారులోనే పడుకోబెడితో మరణించిందని మరోసారి చెప్పింది. బాలిక నల్లగా ఉందని తరచూ తల్లి సతాయించేదని తెలిసింది. కుమార్తెను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియుడు మోహన్ను అరెస్టు చేయగా, ఇంతలో తల్లి పరారైంది. - బెంగళూరు
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రియుడు నిత్యం వేధిస్తుండటంతో ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొల్లి దుర్గ(23) నానక్రాంగూడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో టెలీకాలర్గా పని చేస్తోంది. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన సాయి కుమార్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులనుంచి ఇద్దరూ కేశవ్నగర్లో ఉంటున్నారు. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సాయి కుమార్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగుతూ సాయికుమార్ గొడవకు దిగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ ఐదో అంతస్తుపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సిటిజన్ హస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దుర్గ తల్లి దుబాయ్కి వెళ్లింది. మేనమామ దేవరంపల్లి రవి కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాయి కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు.
‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’
పరకాల: ల్యాబ్ టెక్నీషియన్ షరిఫోద్దీన్ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. రోడ్డు ప్రమాదం కాదు.. హత్య అని తేల్చిన పోలీసులు నిందితుడు టీస్టాల్ నిర్వాహకుడు జట్టబోయిన సందీప్(31)ను అరెస్ట్ చేశారు. షరిఫోద్దీన్ భార్యతో నిందితుడికి ఉన్న వివాహేతర సంబంధం వ్యవహారమే ఈ హత్యకు దారి తీసినట్లు పరకాల ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఈ హత్య కేసు వివరాలు వెల్లడించారు. పరకాలలోని ఓ ఇంట్లో ల్యాబ్టెక్నీషియన్ ఎండీ షరిఫోద్దీన్ అద్దెకు ఉంటున్నాడు. హనుమకొండలోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. రోజూ డ్యూటీకి వెళ్లే సమయంలో తన భార్యకు టిఫిన్ ఇచ్చిరావాలని సమీపంలోని టీ స్టాల్ నిర్వాహకుడు సందీప్కు చెప్పేవాడు. సందీప్ రోజూ వెళ్లి టిఫిన్లు ఇచ్చే క్రమంలో అతడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరికి తను చెప్పకపోయినా సందీప్ ఇంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్న షరీఫొద్దీన్ ఈ నెల2న ఉదయం అతడి దగ్గరికి వెళ్లి ఈ రోజు నీతో మాట్లాడే పని ఉందని, డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పాడు. తమ వివాహేతర సంబంధం తెలిసిపోయిందని గ్రహించిన సందీప్ అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం షరిఫోద్దీన్ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే సందీప్ వేరేవ్యక్తి ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ చేసి వెల్లంపల్లి రోడ్డులోని ఓ బ్రిక్స్ షెడ్డు వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి బయల్దేరిన షరీఫోద్దీన్ మార్గమధ్యలో ఓ వైన్స్ వద్ద రెండు బీర్లు కొనుక్కొని వెళ్లగా ఇద్దరు కలిసి తాగారు. మళ్లీ అతనే వెళ్లి ఇంకో రెండు బీర్లను తీసుకురాగా వాటిని తాగుతూ ‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’ అంటూ సందీప్పై షరీఫోద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్ పక్కనే ఉన్న కర్రతో షరీఫోద్దీన్ తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని అతడి వాహనంపైనే అడ్డుగా పెట్టుకొని రోడ్డు మీదికి తీసుకొచ్చి ఎవరూ లేని సమయంలో పడేసి వెళ్లిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న షర్ట్ను తన ఇంటి పక్కనున్న బాత్రూం వెనుకాల కాల్చిపడేశాడు. మిగతా దుస్తులను పిండిన దుస్తుల్లో కలిపి హత్య వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేశాడు. మృతుడి సోదరుడు రజాక్ ఇది హత్యగా అనుమానిస్తూ విచారణ చేయాలని ఫిర్యాదు చేయడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. సందీప్ ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసును వేగవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ క్రాంతికుమార్, ఎస్ఐలు రమేశ్, పవన్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
వీడియోలు
APకి నైరుతి రుతుపవనాలు.. జోరుగా వానలు
చేప ప్రసాదం షురూ.. హైదరాబాద్ కు పోటెత్తిన జనం
నందూస్ ఫ్యామిలీ మాస్టర్ ప్లాన్.. అసలు నిజం ఇదేనా?
బాబు.. లోకేష్.. పవన్ నో అపాయింట్మెంట్.. అందుకే జగన్ ను కలిసాం
పెద్దిలో జాన్వీ సీన్లు కట్..! సారీ చెప్పిన బుచ్చిబాబు..
నందుతో ఫోన్ లో... షాకింగ్ నిజాలు బయటపెట్టిన జైపాల్ రెడ్డి!
యువతుల ద్వారా కస్టమర్లకు వల వేస్తున్న పబ్ యాజమాన్యం
సారం లేని సారా కథలు.. ఎల్లో మీడియా అధిపతులకు కోరుకున్న ఉపకారాలు
ఎంపీని ఉరికించి కారును నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తులు
చల్లబడిన తెలుగు రాష్ట్రాలు

