మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test) చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గువాహటి వేదికగా తొలుత భారత బౌలర్లు తేలిపోగా.. బ్యాటర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు పెవిలియన్కు క్యూ కట్టారు. వెరసి ఈ మ్యాచ్లో టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సిన దుస్థితిలో నిలిచింది.అయితే, సఫారీ జట్టు కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) మాత్రం తాము బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. కాగా రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ వేదికపై టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.శతక్కొట్టిన ముత్తుస్వామి.. సెంచరీ మిస్ అయిన యాన్సెన్ప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (38), ర్యాన్ రికెల్టన్ (35) మెరుగైన ఆరంభం అందించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ తెంబా బవుమా (41) దానిని కొనసాగించారు. అయితే, ఊహించని రీతిలో సఫారీ స్పిన్నర్ సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy) బ్యాట్తో చెలరేగిపోయాడు.భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 206 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ముత్తుస్వామి శతకానికి తోడు... వికెట్ కీపర్ బ్యాటర్ కైలీ వెరెన్నె 45 పరుగులతో సత్తా చాటగా.. ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ 91 బంతుల్లోనే 93 పరుగులతో దుమ్ములేపాడు. మిగతా వారిలో టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.జైసూ హాఫ్ సెంచరీభారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (22) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్ మాత్రం సఫారీ బౌలర్ల ధాటికి తాళలేక కుప్పకూలింది.అంతా ఫెయిల్.. వాషీ ఒక్కడే..వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. యాన్సెన్ మంచి డెలివరీతో అతడిని పెవిలియన్కు పంపాడు.ఇక వాషీకి తోడుగా పట్టుదలగా క్రీజులో నిలబడ్డ కుల్దీప్ యాదవ్ (134 బంతుల్లో 19)ను కూడా వెనక్కి పంపిన యాన్సెన్.. బుమ్రా (5)ను కూడా అవుట్ చేసి టీమిండియా ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. తొలి ఇన్నింగ్స్లో 83.5 ఓవర్లలో టీమిండియా కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సైమన్ హార్మర్ మూడు, కేశవ్ మహరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో.. సౌతాఫ్రికా కంటే 288 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఇంత చెత్త బ్యాటింగ్ ఏంటయ్యా? అంటూ పంత్ సేనపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: IND vs SA: పంత్ను కాదని రాహుల్కు కెప్టెన్సీ.. కారణమిదే?
యూకే వీడిన లక్ష్మీ మిట్టల్: కారణం ఇదే..
మూడు దశాబ్దాలు బ్రిటన్లో ఉంటూ.. అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచిన ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ ఆ దేశానికి వీడ్కోలు పలికారు. 30ఏళ్లు యూకేలో ఉన్న ఈయన ఇప్పుడు ఆ దేశాన్ని ఎందుకు వీడారు?, దీనికి కారణం ఏమిటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే ఇప్పుడు ఈయన దేశాన్ని వీడటానికి ప్రధాన కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయాలే అని తెలుస్తోంది.ప్రస్తుతం లక్ష్మీ మిట్టల్ స్విట్జర్లాండ్లో నివసిస్తున్నారు. తరువాత తాను భవిష్యత్తును దుబాయ్లో గడిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే దుబాయ్లో ఒక భవనం ఉంది. అంతే కాకండా ఈయనకు ఐరోపా, అమెరికాలలో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. లండన్లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.లక్ష్మీ ఎన్ మిట్టల్1950 జూన్ 15న రాజస్థాన్లో పుట్టిన లక్ష్మీ నారాయణ్ మిట్టల్.. స్టీల్ ఇండస్ట్రీలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. సుమారు 24 బిలియన్ యూరోల విలువైన ఈ కంపెనీలు లక్ష్మీ ,మిట్టల్ కుటుంబం వాటా 40 శాతం వరకు ఉంది. 2021లో లక్ష్మి మిట్టల్ సీఈఓగ బాధ్యతలు వదులుకున్న తరువాత.. ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.భారతదేశంలో పుట్టిన లక్ష్మీ మిట్టల్ 1995లో తన కుటుంబంతో పాటు లండన్లో స్థిరపడ్డారు. 30 ఏళ్లుగా అక్కడే ఉన్న వీరు.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు కారణంగా.. స్విట్జర్లాండ్కు మకాం మార్చారు. ఈయన నెట్వర్త్ 22 బిలియన్ డాలర్లు.ఇదీ చదవండి: అంబానీ స్కూల్లో ఫీజులు అన్ని లక్షలా?
సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధం?!
నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. కర్ణాటక రాజకీయంలో బడా ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదేపదే చెబుతూ వచ్చిన ఆయన.. ఇవాళ సరికొత్తగా మాట్లాడడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను. ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. నేను మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని అన్నారాయన. నవంబర్ 20వ తేదీన నుంచి కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పవర్ షేరింగ్ ఫార్ములా ద్వారా సీఎం రేసులో ఉన్న సిద్దూ, డీకేశిలను చల్లార్చిందనే ప్రచారం ఒకటి ఉంది. రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే మద్దతుదారులు ఆయనకు సీఎంపగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా.. అనుభవాన్ని,సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. డీకే శివకుమార్కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్లంతా మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ను కలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతా వాళ్ల చేతుల్లోనే..కర్ణాటకలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ(పీసీసీ చీఫ్ మార్పు సహా) చేపట్టాలని సిద్ధరామయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం సీటు పంచాయితీ తేల్చిన తర్వాతే ఆ పని చేయాలంటూ డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. ‘‘నాలుగైదు నెలల కిందటే హైకమాండ్ నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తనకు గ్రీన్సిగ్నల్ లభించిందని.. అయితే రెండున్నరేళ్ల పాలన పూర్తి అయ్యేదాకా ఆగాలని భావించానని’’ సిద్ధరామయ్య ఇవాళ మీడియాకు తెలిపారు. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా(రెండున్నరేళ్ల తర్వాత సీఎం సీటు వదులకునేందుకు సిద్ధపడ్డారా?) అనేది ఒకటి ఉందా?.. అందుకు మీరు అంగీకరించారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. ఆయన వస్తేనే..కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్తో రీప్లేస్ చేయాలంటూ కొంత కాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. శనివారం సిద్ధూ వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే.. అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఖర్గే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ధర్మేంద్ర తొలి సినిమా పారితోషికం.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ శకం ముగిసింది. దిగ్గజ నటుడు, 300లకి పైగా చిత్రాల్లో నటించిన తన పేరు చిరస్థాయిగా లిఖించుకున్న ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. చివరిశ్వాస వరకు సినిమాల్లో నటించిన ఆయన.. అనారోగ్యంతో కన్నుమూశారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ లోకానికి తీవ్ర విషాదం మిగిల్చింది. షోలే మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న ధర్మేంద్ర ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు.ఈ నేపథ్యంలో ధర్మేంద్ర తొలి సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఆయన నటించిన మొదటి చిత్రమేది? అప్పట్లో ఎంత పారితోషికం అందుకున్నారని నెటిజన్స్తో పాటు అభిమానులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఆసక్తకరి విషయం బయటకొచ్చింది. ఆయన 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అర్జున్ హింగోరానీ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్లో బల్రాజ్ సాహ్ని, కుంకుమ్ సినీతారలు కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఆయీ మిలన్ కీ బేలా, ఆయే దిన్ బహార్ కే లాంటి చిత్రాల్లో కనిపించారు. ఫూల్ ఔర్ పత్తర్ అనే మూవీ ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. షోలే మూవీతో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు.అయితే ఆయన తన తొలి సినిమాకు తీసుకున్న వేతనం(పారితోషికం) కేవలం జీతం రూ.51 లేనని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సల్మాన్ ఖాన్ గేమ్ షో దస్ కా దమ్కు హాజరైనప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నారు. తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్తో ఈ షోలో కనిపించారు. ఈ గేమ్ షోలో రూ.లక్ష గెలుచుకున్న తర్వాత.. సల్మాన్ ఖాన్ ఆయన మొదటి రెమ్యునరేషన్ గురించి ప్రశ్న అడిగాడు. నాకు కెరీర్ మొదట్లో రూ.3500 నుంచి రూ.7 వేల వరకు వచ్చేదని అన్నారు. కానీ నా ఫస్ట్ సినిమాకు రూ.5 వేల పారితోషికం ఇస్తారని అనుకున్నానని తెలిపారు. తీరా సంతకం చేసేటప్పుడు చూస్తే కేవలం రూ.51 మాత్రమే ఉందని ధర్మేంద్ర వెల్లడించారు. ఆ డబ్బులతో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి మద్యం కొనుగోలు చేశానన్నారు. పోలీసులు పట్టుకుంటే నా కెరీర్ ముగిసిపోతుందని.. మందు తాగేటప్పుడు నా వేలిముద్రలు గ్లాస్పై పడకుండా రుమాలు పట్టుకుని తాగానని ధర్మేంద్ర పంచుకున్నారు.కాగా.. ధర్మేంద్ర తన కెరీర్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సీతా ఔర్ గీతా, షోలే, యాదోం కి బారాత్ వంటి చిత్రాల్లో ఆయన నటనను మరోస్థాయికి తీసుకెళ్లాయి. కొద్ది సమయంలోనే అత్యంత ధనిక నటులలో ఒకరిగా మారిపోయారు. 1970ల వరకు తన స్టార్డమ్తో పాటు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనతో హీ-మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఐకానిక్ బిరుదును సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్లో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు.
జోష్ రవి కుటుంబాన్ని పరామర్శించిన పూరి జగన్నాధ్ తనయుడు.. వీడియో వైరల్!
10వేల సంవత్సరాల తర్వాత బద్ధలై..
బ్యూటీఫుల్ శారీలో ప్రియాంక మోహన్.. జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ పోజులు!
పాపం రాహుల్!.. అంత దూకుడు ఎందుకు?.. కాస్త తగ్గు సిరాజ్!
పోస్టర్కు రూ.50 వేలు.. ఐబొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే విషయాలు
కాళ్ల పారాణి ఆరకముందే కాటికి!
వీరిద్దరి కాంబో సూపర్ హిట్.. మరోసారి గ్రీన్ సిగ్నల్!
భారత మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
YSRCPలో కొత్త నియామకాలు
వన్డేలకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?: మాజీ క్రికెటర్
Traffic Challans: సగం చలానా చెల్లిస్తే చాలు
బిగ్బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!
ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!
అందుకే సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పుకోవట్లేదు : చైతన్య జొన్నలగడ్డ
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది, అనుకూల మార్పులు
ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన 'రాజ్-కోటి' ఎలా విడిపోయారు..?
ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు
7,000 మంది ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ షాక్!
కెప్టెన్గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటన
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’!
ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్!
సాక్షి కార్టూన్ 22-11-2025
ఐదేళ్లూ సిద్ధరామయ్యనే కర్ణాటక సీఎం: డిప్యూటీ సీఎం శివకుమార్
ఇన్చార్జి కలెక్టరేనా..!
చెత్త అమ్ముకునేవాడిని.. 9వ తరగతిదాకే చదువుకున్నా!
ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు
నటుడిగా 50 ఏళ్లు.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన మోహన్ బాబు (ఫొటోలు)
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఓటీటీలో రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. కొత్త సీజన్ టీజర్ రిలీజ్
చలిలో వెచ్చని టీ తాగుతున్న స్టార్ హీరోలు (ఫోటోలు)
జోష్ రవి కుటుంబాన్ని పరామర్శించిన పూరి జగన్నాధ్ తనయుడు.. వీడియో వైరల్!
10వేల సంవత్సరాల తర్వాత బద్ధలై..
బ్యూటీఫుల్ శారీలో ప్రియాంక మోహన్.. జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ పోజులు!
పాపం రాహుల్!.. అంత దూకుడు ఎందుకు?.. కాస్త తగ్గు సిరాజ్!
పోస్టర్కు రూ.50 వేలు.. ఐబొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే విషయాలు
కాళ్ల పారాణి ఆరకముందే కాటికి!
వీరిద్దరి కాంబో సూపర్ హిట్.. మరోసారి గ్రీన్ సిగ్నల్!
భారత మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
YSRCPలో కొత్త నియామకాలు
వన్డేలకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?: మాజీ క్రికెటర్
Traffic Challans: సగం చలానా చెల్లిస్తే చాలు
బిగ్బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!
ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!
అందుకే సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పుకోవట్లేదు : చైతన్య జొన్నలగడ్డ
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది, అనుకూల మార్పులు
ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన 'రాజ్-కోటి' ఎలా విడిపోయారు..?
ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు
7,000 మంది ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ షాక్!
కెప్టెన్గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటన
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’!
ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్!
సాక్షి కార్టూన్ 22-11-2025
ఐదేళ్లూ సిద్ధరామయ్యనే కర్ణాటక సీఎం: డిప్యూటీ సీఎం శివకుమార్
ఇన్చార్జి కలెక్టరేనా..!
చెత్త అమ్ముకునేవాడిని.. 9వ తరగతిదాకే చదువుకున్నా!
ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఓటీటీలో రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. కొత్త సీజన్ టీజర్ రిలీజ్
డోంట్ వర్రీ సార్! అవి మీ దగ్గరకు రావడానికి భయపడతాయ్లేండి!!
రాకెట్లా దూసుకెళ్లిన బంగారం, వెండి రేట్లు..
ఫొటోలు
రైతును గాలికొదిలి.. చంద్రబాబు దొంగజపం!
బండరాయిపై యాంకర్ రష్మీ మార్నింగ్ వైబ్స్.. ఫోటోలు
తిరుచానూరులో వైభవంగా రథోత్సవం
Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర జీవితంలో స్పెషల్ (ఫొటోలు)
బిజినెస్మ్యాన్ కుమార్తె పెళ్లి.. స్పెషల్ అట్రాక్షన్గా రామ్ చరణ్ (ఫొటోలు)
చలిలో వెచ్చని టీ తాగుతున్న స్టార్ హీరోలు (ఫోటోలు)
రెడ్ శారీలో అందాలు చూపిస్తున్న బిగ్ బాస్ ఫేమ్ అశ్వినీ శ్రీ (ఫొటోలు)
ఉత్సాహంగా ‘విశాఖ తరంగ్’ (ఫొటోలు)
రాప్తాడులో జననేతకు బ్రహ్మరథం (ఫొటోలు)
నటుడిగా 50 ఏళ్లు.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన మోహన్ బాబు (ఫొటోలు)
సినిమా
దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్
ఈ మధ్యే అల్లు అర్జున్ ఫ్యామిలీ దుబాయి ట్రిప్ వేశారు. తన కూతురు అర్హ పుట్టినరోజు వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు ఫొటోలేం బయటకు రాలేదు. ఇప్పుడు బన్నీ భార్య స్నేహ తన సోషల్ మీడియాలో ఆయా ఫొటోలని షేర్ చేశారు. తన బేబీ గర్ల్కి తొమ్మిదేళ్లు నిండాయని చెబుతూ దుబాయి ట్రిప్ ఫొటోలని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)అయితే బన్నీ ఫ్యామిలీ దుబాయిలోనే ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణముంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. పలు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దుబాయిలో కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబంతో పాటు బన్నీ.. దుబాయి వెళ్లాడు. స్నేహతో పాటు పిల్లలు అయాన్, అర్హ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయాడు.అల్లు అర్జున్-అట్లీ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన 'డ్యూడ్'కి సంగీతమందించింది ఇతడే. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజయ్యే అవకాశముందని అంటున్నారు. 'పుష్ప'తో పాన్ ఇండియా లెవల్లో అలరించిన బన్నీ.. ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్గా పెట్టుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
వంద ఎకరాల ఫామ్ హౌస్.. లగ్జరీ కార్లు.. ధర్మేంద్ర ఆస్తులివే!
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇవాళ కన్నుమూశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా దశబ్దాలుగా చెరగని ముద్రవేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్తో పాటు సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయన కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే మూవీతో తన సినీ ప్రస్థాన ప్రారంభమైంది. ఆ తర్వాత 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. అంతేకాకుండా రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు.అయితే ఇవాళ ధర్మేంద్ర మరణించడంతో ఆయన ఆస్తులపై చర్చ మొదలైంది. తన కెరీర్లో ఎన్ని ఆస్తులు కూడబెట్టరనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఓవరాల్గా చూస్తే ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.335 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం హీరోగానే కాదు.. తన కెరీర్లో హోటల్, అతిథ్యరంగంలో బిజినెస్ చేశారు. 2015లో న్యూఢిల్లీలో తన మొదటి రెస్టారెంట్ గరం ధరం ధాబాను ప్రారంభించారు. ఆ తర్వాత 2022లో, కర్నాల్ హైవేలో హీ మ్యాన్ అనే రెస్టారెంట్ ప్రారంభించారు.లోనావాలాలో 100 ఎకరాల ఫామ్హౌస్పుణె సమీపంలోని లోనావాలాలోని అతని 100 ఎకరాల ఫామ్హౌస్ కూడా ఉంది. ఆయన తన కుటుంబంతో ముంబయి నుంచి ఈ ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. ఈ ఫామ్హౌస్లో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ధర్మేంద్ర రూ. 17 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఆయన పేరిట ఉన్నాయి. రూ. 88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమితో పాటు రూ. 52 లక్షల విలువైన వ్యవసాయేతర ప్లాట్స్ ఉన్నాయి. ఫామ్హౌస్ సమీపంలోని 12 ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్ను అభివృద్ధి చేశారు.లగ్జరీ కార్లు..లగ్జరీ కార్లు అంటే ధర్మేంద్రకు చాలా ఇష్టం. ఆయన మొదట వింటేజ్ ఫియట్ అనే కారును కొన్నారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 85.74 లక్షలు), మెర్సిడెస్-బెంజ్ (రూ. 98.11 లక్షలు)ను కొనుగోలు చేశాడు. అంతేకాకుండా 1983లో ధర్మేంద్ర విజేత ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించారు. తన బ్యానర్లోనే కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్లను బాలీవుడ్కు పరిచయం చేశాడు. 1983లో బేతాబ్తో సన్నీ, 1995లో బర్సాత్తో బాబీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తన మనవడు కరణ్ డియోల్ పాల్ పాల్ దిల్ కే పాస్ అనే మూవీతో 2019లో అరంగేట్రం చేశాడు. అలా తనతో పాటు భారతీయ సినిమాపై కుటుంబ వారసత్వం శాశ్వతంగా ఉండేలా ప్రోత్సహించారు ధర్మేంద్ర.
అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'పైరసీ' అనే భూతంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఎప్పటినుంచో దీని గురించి అందరికీ తెలుసు. కానీ 'ఐ బొమ్మ' సైట్ నిర్వహకుడు రవి అరెస్ట్ కావడంతో మరోసారి చర్చకు కారణమైంది. సామాన్యులు చాలామంది రవికే తమ సపోర్ట్ అని అంటున్నారు. దానికి కారణాలు బోలెడు. నిర్మాతలు ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచేస్తున్నారని, దానికి తోడు థియేటర్లలోనూ పార్కింగ్, తినుబండరాల ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు మరో సమస్య కూడా చేరినట్లు కనిపిస్తుంది.గత శుక్రవారం 'ద ఫ్యామిలీ మ్యాన్' అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్, అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఓకే ఓకే అనిపించుకుంది. అయితే 50 నిమిషాలుండే ప్రతి ఎపిసోడ్లోనూ నాలుగైదు యాడ్స్ వస్తున్నాయని, దీంతో సిరీస్ చూడాలంటే చిరాకు వస్తుందని చాలామంది యూజర్స్.. సోషల్ మీడియాలో తన అసహనం బయటపెడుతున్నారు. యాడ్స్ భరిస్తూ కొందరు చూస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం నిర్ధాక్షిణ్యంగా ఈ కారణం వల్లే పైరసీ సైట్లో సిరీస్ చూశానని, అందులో ఒక్క యాడ్ కూడా రాలేదని పోస్టులు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)కొన్నేళ్ల క్రితం జనాలు యూట్యూబ్లో వీడియోలు, సినిమాలు చూసేవారు. విపరీతమైన యాడ్స్ రావడంతో.. వాళ్లలో చాలామంది ఓటీటీలకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అమెజాన్, హాట్స్టార్ లాంటి ఓటీటీల్లోనూ యాడ్స్ వస్తున్నాయి. దీంతో డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాసరే ఈ యాడ్స్ గోలేంట్రా బాబు అని చిరాకు పడుతున్నారు. మరీ 40-50 నిమిషాల ఎపిసోడ్కి 4-5 యాడ్స్ రావడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది ఇలానే జరిగితే ఓటీటీల్లోనూ జనాలు సినిమాలు చూడటం తగ్గించేయడం గ్యారంటీ. అప్పుడు కూడా నష్టపోయేది నిర్మాతలే.ఓటీటీలు వచ్చిన తర్వాత కొంతమేర పైరసీ తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు డబ్బుల కోసం వాళ్లు కూడా యాడ్స్ వేస్తున్నారు. ఇలాంటి అత్యాశ.. మరిన్ని పైరసీ సైట్ల పెంచి పోషించేందుకు కారణమయ్యే అవకాశాలే ఎక్కువ. అమెజాన్ ప్రైమ్ వీడియోనే తీసుకుంటే.. కొన్ని సినిమాల్ని నేరుగా రిలీజ్ చేస్తారు. కొన్నింటిని మాత్రం రెంటల్ బేసిస్(అద్దె విధానం) అని చెప్పి మళ్లీ కొంత డబ్బు చెల్లిస్తేనే చూడటం కుదురుతుందని అంటారు. చాలా ఛానెల్స్ చూపిస్తారు. మళ్లీ వాటిల్లో సినిమాలు చూడాలి అంటే సెపరేట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటారు. ఇవన్నీ గత కొన్నిరోజుల నుంచి ఉన్నప్పటికీ.. తాజాగా 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ వల్ల మరోసారి వెలుగులోకి వచ్చాయి. (ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)
హీరో అవుతానంటే కమెడియన్ అన్నారు: శివకార్తికేయన్
ఇప్పుడున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని, వాటిని దాటుకుంటూ వచ్చినవాళ్లే! వారిలో తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు.సినిమాల్లోకి వస్తావా?టీవీలో పనిచేసినప్పుడు ఓసారి దర్శకనిర్మాత కేఎస్.సినిశ్ ఆఫీస్కు వెళ్లాను. ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్? అన్నాడు. అప్పుడు నేను 'వేట్టయి మన్నన్' మూవీలో చిన్న కామెడీ రోల్ చేస్తున్నా.. హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు. కానీ, పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను.కామెడీ పాత్రలే సెట్టు!ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్? అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్.. అలాంటి పాత్రలు ట్రై చేయ్ అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ఏ.. నేను ఎందుకు హీరో కాకూడదు? అని అడిగాను. అందుకాయన ఓ డ్యాన్సర్ని చూపించి అతడు హీరో కాగలడేమోకానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు. తర్వాత అదంతా నేను మర్చిపోయాను కానీ, సినిశ్ మర్చిపోలేదు. నేను మర్చిపోయా.. కానీ!నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్ చేసి.. నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అని అడిగాడు. అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను. తర్వాత ఎప్పుడూ దానిగురించే మాట్లాడనేలేదు. బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో! అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.చదవండి: నా ముఖం చూస్తేనే లవ్ ఫెయిల్యూర్: ధనుష్
క్రీడలు
ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్పై మండిపడ్డ కుంబ్లే
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవాల్సిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తప్పుడు షాట్ సెలక్షన్తో మూల్యం చెల్లించాడు. క్రీజులో కుదురుకుంటాడని అనుకునే లోపే.. వికెట్ పారేసుకుని పెవిలియన్ చేరాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించాడు.గువాహటి వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శనివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు టీమిండియా ధీటుగా బదులు ఇవ్వలేకపోయింది.దారుణంగా విఫలంసఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ అర్ధ శతకం (58)తో రాణించగా.. కేఎల్ రాహుల్ 22 పరుగులు చేయగలిగాడు. సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) ఇలా వచ్చి అలా వెళ్లారు.పంత్ తొందరపాటు.. రివ్యూ కూడా వేస్ట్ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 48 పరుగులతో భారత టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. టెయిలెండర్ 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేయగలిగాడు. దీంతో భారత్ కనీసం 200 పరుగుల మార్కు దాటగలిగింది. నిజానికి పంత్ అనవసరపు షాట్కు యత్నించి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది.భారత ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసిన పంత్.. యాన్సెన్ బౌలింగ్లో స్లాగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్ కీపర్ కైలీ వెరెన్నె చేతుల్లో పడింది.అప్పటికీ తన తప్పును గుర్తించని పంత్.. రివ్యూకి వెళ్లి మరీ ప్రతికూల ఫలితం చవిచూశాడు. అనవసరంగా రివ్యూ కూడా వృథా చేశాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పంత్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘ఈరోజుల్లో బ్యాటర్లంతా.. ‘నా సహజశైలిలోనే ఆడతా’ అని చెబుతూ ఉంటారు.ఇలా ఎవరైనా చేస్తారా?కానీ దాని కంటే పరిస్థితులను అర్థం చేసుకుని... దానికి తగ్గట్టుగా ఆడటం అత్యంత ముఖ్యం. ప్రత్యర్థి జట్టు కోణంలో.. పంత్ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. అంత ఎక్కువగా మ్యాచ్ చేజారిపోతుందనే భయం ఉంటుంది. పంత్ ఉన్నంత సేపు సౌతాఫ్రికా బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు.అతడిని త్వరగా అవుట్ చేయాలని భావిస్తారు. ఏ కాస్త అవకాశం దొరికినా పంత్ మ్యాచ్ను లాగేసుకుంటాడని వారికి తెలుసు. కానీ పంత్ ఏం చేశాడు?.. కనీసం పది బంతులు ఎదుర్కొనే వరకైననా ఆగలేకపోయాడు. అందుకు తగ్గ మూల్యం చెల్లించాడు’’ అని కుంబ్లే స్టార్ స్పోర్ట్స్ షోలో పంత్ షాట్ సెలక్షన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్
పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసిన మంధాన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. వన్డే ప్రపంచకప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో బ్యాటర్గా, వైస్ కెప్టెన్గా తన వంతు పాత్ర పోషించిన ఈ మహారాష్ట్ర అమ్మాయి.. ఆ వెనువెంటనే మరో శుభవార్త పంచుకుంది.నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..తన చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే స్మృతి మంధాన ధ్రువీకరించింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. సహచర ఆటగాళ్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యదవ్లతో కలిసి తన ఎంగేజ్మెంట్ విషయాన్ని రీల్ ద్వారా రివీల్ చేసింది.అనంతరం పలాష్.. భారత్ విశ్వవిజేతగా నిలిచిన డీవై పాటిల్ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని స్మృతికి ప్రపోజ్ చేశాడు. ఈ రెండు వీడియోలను తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది మంధాన. అయితే, ప్రస్తుతం వాటిని స్మృతి మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో..కాగా స్మృతి- పలాష్ పెళ్లి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట ఉత్సాహంగా గడిపింది. అయితే, ఆదివారం వీరి వివాహం జరగడానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.ఆ వీడియోలన్నీ డిలీట్ చేసిన మంధానఆ వెంటనే పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో ఆస్పత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ప్రీవెడ్డింగ్ మూమెంట్స్ను స్మృతి మంధాన సోషల్ మీడియా నుంచి తీసివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంధాన తండ్రి ఇంకా ఆస్పత్రిలోనే ఉండగా.. పలాష్ మాత్రం డిశ్చార్జ్ అయ్యాడు.కాగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్మృతి మళ్లీ తన ఎంగేజ్మెంట్ రివీల్, ప్రపోజల్ వీడియోలు షేర్ చేస్తుందని అభిమానులు అంటున్నారు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యానే వాటిని తాత్కాలికంగా హైడ్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. స్మృతి- పలాష్ లాంటి చూడచక్కని జంటకు ఎవరి దిష్టి తగలవద్దని.. త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్
చరిత్ర సృష్టించిన యాన్సెన్.. పట్టు బిగించిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్లో అర్ధ శతకం బాదడంతో పాటు.. ఆరు వికెట్లు తీసిన తొలి ప్రొటిస్ ఆటగాడిగా నిలిచాడు. గువాహటి టెస్టు సందర్భంగా యాన్సెన్ ఈ ఘనత సాధించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC)లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా భారత్ పర్యటనకు వచ్చింది. కోల్కతా వేదికగా తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు.. రెండో టెస్టులోనూ పట్టు బిగించారు.సెంచరీ.. జస్ట్ మిస్బర్సపరా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది సౌతాఫ్రికా. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్ అయింది. ఇందులో టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy), మార్కో యాన్సెన్లది కీలక పాత్ర. ముత్తుస్వామి శతకం (109)తో సత్తా చాటగా.. యాన్సెన్ (91 బంతుల్లో 93) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ఆరు వికెట్లు పడగొట్టిఇక ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తో చెలరేగిన యాన్సెన్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో బంతితోనూ దుమ్ములేపాడు. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.అదే విధంగా.. కుల్దీప్ యాదవ్ (19), జస్ప్రీత్ బుమ్రా (5)లను వెనక్కి పంపి.. భారత జట్టు ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. ఇలా మొత్తంగా ఆరు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు యాన్సెన్.ఈ క్రమంలోనే పాతికేళ్ల యాన్సెన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్లో అర్ధ శతకం చేయడంతో పాటు.. ఒకే ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు కూల్చిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. భారత్లో టెస్టు మ్యాచ్లో అత్యుత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన విదేశీ లెఫ్టార్మ్ పేసర్ల జాబితాలోనూ యాన్సెన్ చేరాడు.పట్టు బిగించిన సౌతాఫ్రికాటీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీలు.. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించారు.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తామే రెండో ఇన్నింగ్స్ మొదలుపెడతామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా మూడో రోజు ముగిసేసరికి సౌతాఫ్రికా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్లో ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా (IND vs SA Tests) ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. కోల్కతా వేదికగా తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గువాహటిలో భారత బౌలర్ల వైఫల్యం కారణంగా సఫారీలు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించారు.అయితే, ఇదే వేదికపై భారత బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ఫలితంగా కేవలం 201 పరుగులకే టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్తో గౌతీ చేస్తున్న ప్రయోగాలపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సైతం గంభీర్ (Gautam Gambhir)ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను కోల్కతా టెస్టులో ఊహించని విధంగా.. మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపింది నాయకత్వ బృందం. అంతేకాదు ఆ మ్యాచ్లో వాషీతో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేయించారు. ఇక రెండో టెస్టులో అతడిని ఏకంగా ఎనిమిదో స్థానానికి డిమోట్ చేశారు.అసలు సెన్స్ ఉందా?ఈ పరిణామాలపై కామెంటేటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అసలు సెన్స్ ఉందా?.. ఈ ఆలోచనా విధానమేమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచి సెలక్టర్ల తీరు, తుదిజట్టు కూర్పు గురించి నాకేమీ అంతుపట్టడం లేదు.కోల్కతాలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. అలాంటపుడు మీరు కావాలనకుంటే స్పెషలిస్టు బ్యాటర్ను ఆడించాల్సింది. అలా కాకుండా వాషీని మూడో స్థానంలో పంపడం దేనికి? ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?కోల్కతా టెస్టులో వాషీని వన్డౌన్లో ఆడించిన యాజమాన్యం.. గువాహటిలో కనీసం నాలుగో స్థానంలోనైనా ఆడించాల్సింది. కానీ ఇక్కడ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు పంపారు. మరీ అంత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు అతడు అర్హుడు కాదు. అతడి విషయంలో ఇంకాస్త మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని రవిశాస్త్రి గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారీ ఆధిక్యంలో సఫారీ జట్టుకాగా టీమిండియాతో రెండో టెస్టులో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి.. సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ (288) కలుపుకొని.. భారత్ కంటే ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. వాషీ తొలి టెస్టులో 29, 31 పరుగులు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 48 పరుగులతో రాణించాడు. చదవండి: Prithvi Shaw: కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన
న్యూస్ పాడ్కాస్ట్
ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచిందెక్కడ?... ఏపీ సీఎం చంద్రబాబుపై ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు విడుదల, జీవో జారీ చేసిన ప్రభుత్వం
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?... సీఎం చంద్రబాబు
ఉప్పొంగిన అభిమానం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం
మనమంతా సాయి మార్గంలో నడుద్దాం... శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
బిజినెస్
యూకే వీడిన లక్ష్మీ మిట్టల్: కారణం ఇదే..
మూడు దశాబ్దాలు బ్రిటన్లో ఉంటూ.. అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచిన ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ ఆ దేశానికి వీడ్కోలు పలికారు. 30ఏళ్లు యూకేలో ఉన్న ఈయన ఇప్పుడు ఆ దేశాన్ని ఎందుకు వీడారు?, దీనికి కారణం ఏమిటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే ఇప్పుడు ఈయన దేశాన్ని వీడటానికి ప్రధాన కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయాలే అని తెలుస్తోంది.ప్రస్తుతం లక్ష్మీ మిట్టల్ స్విట్జర్లాండ్లో నివసిస్తున్నారు. తరువాత తాను భవిష్యత్తును దుబాయ్లో గడిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే దుబాయ్లో ఒక భవనం ఉంది. అంతే కాకండా ఈయనకు ఐరోపా, అమెరికాలలో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. లండన్లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.లక్ష్మీ ఎన్ మిట్టల్1950 జూన్ 15న రాజస్థాన్లో పుట్టిన లక్ష్మీ నారాయణ్ మిట్టల్.. స్టీల్ ఇండస్ట్రీలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. సుమారు 24 బిలియన్ యూరోల విలువైన ఈ కంపెనీలు లక్ష్మీ ,మిట్టల్ కుటుంబం వాటా 40 శాతం వరకు ఉంది. 2021లో లక్ష్మి మిట్టల్ సీఈఓగ బాధ్యతలు వదులుకున్న తరువాత.. ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.భారతదేశంలో పుట్టిన లక్ష్మీ మిట్టల్ 1995లో తన కుటుంబంతో పాటు లండన్లో స్థిరపడ్డారు. 30 ఏళ్లుగా అక్కడే ఉన్న వీరు.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు కారణంగా.. స్విట్జర్లాండ్కు మకాం మార్చారు. ఈయన నెట్వర్త్ 22 బిలియన్ డాలర్లు.ఇదీ చదవండి: అంబానీ స్కూల్లో ఫీజులు అన్ని లక్షలా?
వ్యవసాయ ఆదాయం.. పన్ను భారం లెక్కింపు
గత రెండు వారాలుగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. మూడో వారం ముచ్చటగా వ్యవసాయ ఆదాయం వల్ల పన్ను భారం ఎలా లెక్కించాలో ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ కాలమ్లో చెప్పిన ఉదాహరణలలో ప్రస్తావించిన వ్యవసాయ ఆదాయం, చట్టప్రకారం నిర్దేశించిన రూల్స్ను బట్టి లెక్కించినదిగా అనుకోండి. కేవలం వ్యవసాయ ఆదాయమే ఉంటే.. ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం పూర్తిగా వ్యవసాయం నుంచే వచ్చి, ఇతరత్రా ఆదాయమేమీ లేదనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్నుభారం ఏర్పడదు. నూటికి నూరుపాళ్లు మినహాయింపే. దీని ప్రకారం చాలా మంది చిన్నకారు/సన్నకారు రైతులకు ఇన్కంట్యాక్స్ పడదు. కేవలం వ్యవసాయేతర ఆదాయం ఉండి, వ్యవసాయం మీద ఆదాయం లేకపోతే.. సవ్యసాచి అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. అతను రెసిడెంటు అయి ఉండి, వ్యాపారం కలిగి ఉన్న వ్యక్తి అనుకుందాం. సాధారణంగా ట్యాక్సబుల్ ఇన్కం రూ. 14,00,000. 2025–26 ఆరి్థక సంవత్సరానికి ఈ వ్యక్తి కొత్త పద్ధతిని ఫాలో అయితే, శ్లాబులు/రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 90,000 ఉంటుంది. విద్యా సుంకం అదనం. ఇదే సవ్యసాచికి రూ. 9,00,000 వ్యవసాయం మీద ఆదాయంగా వస్తోంది. ఇది కాకుండా పైన చెప్పిన రూ. 14,00,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు పన్ను ఎలా లెక్కించాలంటే..A. వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం రూ. 23,00,000. దీనిపై పన్ను= రూ. 2,90,000B. వ్యవసాయ ఆదాయం, బేసిక్ లిమిట్ మాత్రమే కలిపితే మొత్తం ఆదాయం రూ.13,00,000. దీనికి సంబంధించి రిబేటు = రూ. 75,000 ఇప్పుడు (A) నుంచి (B)ని తీసివేస్తే, అంటే రూ. 2,90,000 నుంచి రిబేటు రూ. 75,000 తీసివేస్తే కట్టాల్సిన పన్ను భారం రూ. 2,15,000గా ఉంటుంది. దీనికి విద్యా సుంకం అదనం.ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం..మొత్తం వ్యవసాయేతరం మీద ఆదాయం వచి్చందనుకోండి, రూ. 2,90,000 పన్ను కట్టాలి. రూ. 2,90,000 ఎక్కువగా భావించి, ఇందులో కొంత ఆదాయం, అంటే రూ. 9,00,000 వ్యవసాయం అని అన్నాం అనుకోండి. రూల్సు ప్రకారం ఆధారాలన్నీ ఉన్నాయనుకుంటే, రూ. 75,000 రిబేటు వస్తుంది. ఈ మేరకు పన్ను భారం తగ్గుతుంది. అందరూ కేవలం రూ. 14,00,000 మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది, వ్యవసాయ ఆదాయం మీద మినహాయింపు వస్తుందని అనుకుంటారు. ఈ ఊహ అబద్ధం. నిజం కాదు. ఇక్కడో వల, మెలిక ఉన్నాయి. ఈ రెండింటి మీద ఆదాయాన్ని కలిపి స్థూల పన్ను భారాన్ని లెక్కిస్తారు. (రూ. 14,00,000 + 9,00,000)బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపి పన్ను లెక్కిస్తారు (రూ. 4,00,000 + రూ. 9,00,000)చెల్లించాల్సిన పన్ను (5) – (6)దీనికి విద్యా సుంకం అదనంరూ. 9,00,000 వ్యవసాయ ఆదాయం కలపడంతో శ్లాబు మారుతుంది. పెద్ద శ్లాబులోకి వెళ్తారు.బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపితే అది తక్కువ / లేదా చిన్న శ్లాబులో ఉంటుంది. పై శ్లాబుకి వెళ్లడం వల్ల పన్ను భారం పెరుగుతుంది.రూ. 9,00,000 మీద అదనంగా రూ. 1,25,000 కట్టాల్సి వస్తోంది. వాస్తవానికి పన్ను భారమే ఉండదనుకుంటే, అది ఏకంగా రూ. 1,25,000కు పెరిగింది. మరో కేసు. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. జీతం రూ. 8,00,000, వ్యవసాయం మీద ఆదాయం రూ. 4,00,000. పాత పద్ధతిని ఎంచుకుని, పన్ను లెక్కిస్తే రూ. 1,72,500 అవుతుంది. అందులో నుంచి రూ. 42,500 రిబేటు తీసివేయగా రూ. 1,30,000 చెల్లించాలి. విద్యా సుంకం అదనం.కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా, ఇలా కలపడాన్ని పార్షియల్ ఇంటిగ్రేషన్ ( partial integration) అంటారు. దీని వల్ల పన్ను భారం పెరుగుతుంది.అయితే, వ్యవసాయ ఆదాయం కలపడం వల్ల, వ్యవసాయేతర ఆదాయం పెద్ద శ్లాబులోకి వెళ్లింది. ఆ మేరకు పన్ను భారం పెరిగింది. కానీ, రిబేటు ఇవ్వడం వల్ల పన్ను భారం తగ్గుతుంది.పన్ను భారాల పంపిణీ న్యాయబద్ధంగా ఉండేలా, పన్ను విధింపులో సమానత్వాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దీన్ని భావించాలి. ఏదైతేనేం, వ్యవసాయ ఆదాయాన్ని ఒక ట్యాక్స్ ప్లానింగ్ మార్గంగా భావించి, పన్ను ఎగవేత వైపు వెళ్లేవారికి ఇదొక హెచ్చరిక.
రెస్టారెంట్ బిల్లుపై డిస్కౌంట్.. పేటీఎం బాస్పై జోకులు
సాధారణంగా మధ్యతరగతివారికి డిస్కౌంట్లు అంటే మోజు ఎక్కువ. ఎక్కడ ఏది కొనాలన్నా మొదట డిస్కౌంట్ ఎంత వస్తుందా అని ఆలోచిస్తారు. కానీ సంపన్నులు కూడా వీటికి అతీతులు కాదని కొందరు నిరూపిస్తున్నారు.పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తాజాగా ఓ రెస్టారెంట్ బిల్లుపై భారీ తగ్గింపు పొందిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్త వైరల్గా మారి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. బిలియనీర్లు కూడా డిస్కౌంట్ల కోసం చూస్తారనే అంశంపై నెటిజన్లు చమత్కారాలు చేయడం మొదలుపెట్టారు.ఢిల్లీ విమానాశ్రయంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఉన్న ది గ్రేట్ కబాబ్ ఫ్యాక్టరీలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు విందు జరుపుకొన్న విజయ్ శేఖర్ శర్మ.. డిన్నర్ బిల్లు రూ. 40,828 వచ్చినట్లు తెలిపారు. అయితే ఈజీడైనర్లోని ఆఫర్లు, కూపన్లు ఉపయోగించి బిల్లును రూ. 24,733కి తగ్గించగలిగారు. మొత్తం రూ. 16,095 ఆదా కావడం ఆయనను ఆశ్చర్యపరచింది.ఈ బిల్లు స్క్రీన్షాట్ను తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన “ఇది ఊహించని పుట్టినరోజు గిఫ్ట్లా అనిపించింది” అంటూ ఈజీడైనర్, దాని వ్యవస్థాపకుడు కపిల్ చోప్రాకు ధన్యవాదాలు తెలిపారు. 35% రెస్టారెంట్ డిస్కౌంట్ రూ. 14,290 తో పాటు రూ. 2,000 అమెరికన్ ఎక్స్ప్రెస్ కూపన్ కూడా వర్తించడంతో ఈ భారీ తగ్గింపు వచ్చింది.నెటిజన్ల స్పందనలువిజయ్ శేఖర్ శర్మ పోస్ట్ వైరల్ కావడంతో, డిస్కౌంట్ను ఆయన వాడుకోవడంపై సోషల్ మీడియా యూజర్లు జోకులు పేలుస్తున్నారు. “మాకు కూడా ‘కపిల్ చోప్రా లాంటి స్నేహితులు’ ఉంటే బాగుండేది” అని కొందరు సరదాగా చెప్పారు. “బిలియనీర్లు డిస్కౌంట్ చూసి ఇలా ఎంజాయ్ చేస్తే… మనం మాత్రం రెస్టారెంట్లలో రూ. 20 సర్వీస్ ఛార్జీ కోసం వాగ్వాదం చేస్తాం” అని మరో కామెంట్ వైరల్ అయింది. “పేటీఎం క్యాష్బ్యాక్ కర్మ తిరిగి వస్తోంది” అని ఒకరు వ్యాఖ్యానించారు. “మీరు బిలియనీర్ కాదా? బిలియనీర్లు కూడా డిస్కౌంట్లను ఇష్టపడతారా?” అంటూ మరొకరు ప్రశ్నించారు.It is too good to be true that a ₹40k restaurant bill becomes ₹24 k just because you have friend like @KapilChopra72 ‘s awesome and incredible @eazydiner ! 😄Thank you EazyDiner , it is always awesome discounts on food 🤗🙏🏼 pic.twitter.com/XthhbM4NXM— Vijay Shekhar Sharma (@vijayshekhar) November 22, 2025
అప్పు ఎంత చేయొచ్చు..? తెలిసినవారు అధిక సంపన్నులు!
"అప్పులేని వాడే అధిక సంపన్నుడు" అన్నాడు కవి వేమన. కానీ ఆధునిక అవసరాలు అనివార్యమైన నేటి రోజుల్లో "అప్పు ఎంత చేయొచ్చో తెలిసినవారు అధిక సంపన్నులు" అంటున్నారు ఆర్థిక నిపుణులు. పేదవారి నుంచి సంపన్నుల వరకూ అప్పు చేయనిదే పూట గడవదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వారు ఏదో ఒక రూపంలో అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇక సగటు మధ్యతరగతి జీవితంలో అప్పు నిత్యకృత్యమే.నిత్యవసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో అప్పుల తిప్పలు తప్పడం లేదు. అయితే జీవన శైలిలో మార్పుల కారణంగా కొన్ని అప్పులు అనవరంగా వచ్చి మీద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి రుణ బాధ్యతలను మరింత దగ్గరగా పర్యవేక్షించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అస్సలు అప్పు లేకుండా ఉండటం మంచిదే. అయితే, కొన్నిసార్లు ముఖ్యంగా ఇల్లు, వాహనాల కొనుగోలు లేదా ఉన్నత విద్య వంటి వాటి కోసం అప్పు ఆచరణాత్మక అవసరం.తు.చ.తప్పకూడని అప్పు సూత్రంఆర్థికంగా ఆరోగ్యంగా ఉండటానికి, నిపుణులు ఒక క్లిష్టమైన నియమాన్ని నొక్కి చెబుతారు. అదే ఒక నెలలో ఈఎంఐలు (EMI), చేబదుళ్లు వంటివాటి కోసం వెళ్లే మొత్తం ఒక వ్యక్తి స్థూల నెలవారీ ఆదాయంలో 36 శాతానికి మించకూడదు. రుణం-ఆదాయ నిష్పత్తి అని పిలిచే ఈ పరిమితిని తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని కొలవడానికి బ్యాంకులు విస్తృతంగా ఉపయోగిస్తాయి. అప్పు దీన్ని మించితే రుణగ్రహీత బడ్జెట్ ను ఒత్తిడి చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.ముఖ్యంగా యువతకు..ఈ అప్పు సూత్రం యువతకు ముఖ్యమైంది. సులభమైన క్రెడిట్ ఆప్షన్లు, ఒక్క స్క్రీన్ ట్యాప్తో అందుబాటులో ఉన్న తక్షణ రుణాలతో నిండిన ఆర్థిక దృశ్యంలోకి దేశ యువత ప్రవేశిస్తున్నారు. సామాజిక ఒత్తిళ్లు, ఆన్ లైన్ షాపింగ్, దూకుడు మార్కెటింగ్ తరచుగా ఆదాయానికి మించి ఖర్చు చేయిస్తుంటాయి. ఫలితంగా, చాలా మంది యువ సంపాదనాపరులు జీవితం ప్రారంభంలోనే అధిక వడ్డీ రుణాల ఉచ్చులో పడతారు. వయసు 20, 30ల ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన రుణ అలవాట్లను అలవరచుకోవడం దీర్ఘకాలికంగా సంపద సృష్టిని గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?అప్పునకు దూరంగా ఉండటానికి మార్గాలుమీ మొదటి ఉద్యోగం ప్రారంభం నుంచే ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని ట్రాక్ చేయండి. ఆదాయం పెరిగినప్పటికీ, ఈఎంఐలు మీ స్థూల జీతంలో 36% మించకుండా చూసుకోండి.లైఫ్ స్టైల్ అప్ గ్రేడ్ చేయడానికి ముందు అత్యవసర నిధిని నిర్మించుకోండి.యువత తరచుగా ఖర్చు చేయడానికి అనుకూలంగా పొదుపును దాటవేస్తారు. సంక్షోభ సమయంలో ఎక్కువ రుణాలు తీసుకోకుండా ఉండటానికి ఈ ఎమెర్జెన్సీ ఫండ్ అవసరం.క్రెడిట్ కార్డులు లేదా ఇప్పుడు కొని తర్వాత చెల్లించే యాప్ల ద్వారా హఠాత్తు కొనుగోళ్లను నివారించండి. బై-నౌ-పే-లేటర్ సర్వీసులు యువ వినియోగదారులలో ప్రాచుర్యం పొందాయి. కానీ ఊహించని రుణ ఉచ్చులను సృష్టించగలవు.విద్యా రుణాలను తెలివిగా ఎంచుకోండి. సైన్ అప్ చేయడానికి ముందు వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే ఎంపికలు, మారటోరియం కాలాలను పోల్చి చూసుకోండి.బడ్జెట్ను రూపొందించుకోవడం అలవాటు చేసుకోండి. కొన్ని యాప్లు ఖర్చులను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. ఒక సాధారణ నెలవారీ బడ్జెట్ అధిక ఖర్చును నిరోధిస్తుంది. పొదుపును ప్రోత్సహిస్తుంది.అధిక వడ్డీ రుణంపై దృష్టి పెట్టండి. వడ్డీని నివారించడానికి మొదట క్రెడిట్ కార్డు బకాయిలను క్లియర్ చేయండిఅదనపు ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోండి. ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైమ్ వర్క్ లేదా డిజిటల్ గిగ్ లు ఆరోగ్యకరమైన రుణ-ఆదాయ నిష్పత్తిని నిర్వహించడంలో సహాయపడతాయి.ప్రతిదానికీ ఫైనాన్స్ చేయడానికి బదులుగా పెద్ద కొనుగోళ్లను ప్లాన్ చేయండి. అది బైక్, ఫోన్ లేదా విహారం అయినా. మొదట పొదుపు చేయడం ఈఎంఐలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
ఫ్యామిలీ
మనసే ప్రశాంతి నిలయం
ఆధునిక ప్రపంచంలో ప్రతి వ్యక్తి శాంతిని పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అయితే కేవలం ఆధ్యాత్మిక సూత్రాల ద్వారానో లేదా మార్కెట్ నుండి వస్తువుగానో ప్రశాంతత పొందలేము. అలాగే గ్రంథాల జ్ఞానం ద్వారా లేదా జీవితంలో ఉన్నత స్థానం ద్వారా కూడా దానిని పొందలేము. ‘నాకు ప్రశాంతత కావాలి’ అని పరితపించేవారు ముందుగా ‘నేను, నాకు, నాది’ అనే స్వార్థాన్ని విడనాడాలని, అలాగే, ‘ఇది ఎలాగైనా నా సొంతం కావాల్సిందే’ అనే దురాశను తొలగించుకోవాలి. అప్పుడే అన్ని అశాంతులూ తొలగి మానసిక ప్రశాంతత చేకూరుతుందంటారు భగవాన్ సత్యసాయి బాబా.నిష్కామ కర్మ ఆచరిస్తూ, ఆధ్యాత్మిక ధర్మాలను పాటిస్తూ, జ్ఞాన చక్షువులతో అందరిలో, అన్నింటిలో ఆ దైవాన్ని దర్శించడమే అసలైన వేదాంతం అంటారు సాయి. భగవాన్ చెప్పిన ‘అందరినీ ప్రేమించు అందరినీ సేవించు’ అనే ఒక్క మహా వాక్యం అందరి జీవితాలను ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే మహాబోధ. మోక్షానికి దగ్గర చేసే మార్గం. ‘ప్రచారం, ఆర్భాటం, ప్రదర్శన కోసం చేసే సేవ మీ కీర్తిప్రతిష్ఠలు పెంచవచ్చునేమో కానీ అది సమాజానికి మంచి సందేశాన్ని, స్ఫూర్తిని ఇవ్వలేదు’ అన్నది సత్యసాయి బోధల సారం. ‘మనలో సేవాభావం ఉంటే, అది వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. ఉన్నతమైన గుణసంపదను ఇస్తుంది’ అని భగవాన్ తన విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులకు బోధించేవారు.దృఢమైన భక్తి, నియమ పాలన, కర్తవ్య శీలత, యుక్తాయుక్త విచక్షణ, సాధించి తీరాలనే సంకల్పం... ఈ అయిదూ విజయానికి చేరువ చేసే సోపానాలని బాబా బోధించేవారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, విలువలు పాటించే ప్రతి మనిషీ దైవ సమానుడేనన్నది సత్యసాయి సందేశం. – డి.వి.ఆర్.
శబరిమలలో వర్చువల్ ఆన్లైన్ బుకింగ్ సంఖ్య మళ్లీ పెంపు
సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో రేపటివరకు (24వ తేదీ) తక్షణ దర్శనానికి అనుమతించే బుకింగ్ సంఖ్యను 5 వేలుగా పరిమితం చేయాలని కేరళ హైకోర్టు ముందుగా ఆదేశించింది. దీనిపై దేవస్వం బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు, పరిస్థితులను బట్టి తక్షణ బుకింగ్ సంఖ్యను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీన్ని అనుసరించి నిన్నటి నుంచి వర్చువల్ బుకింగ్ సంఖ్య పెంచింది. ప్రస్తుతం ఒక నిమిషానికి 85 మంది భక్తులు వరకు 18వ మెట్టుకు ఎక్కడానికి అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది దేవస్వం బోర్డు.(చదవండి: శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం)
వివాహాల్లో సరికొత్త లగ్జరీ ట్రెండ్..! హ్యాంగోవర్ రాకుండా..
పెళ్లిళ్లలో అతిథులను కట్టిపడేసేలా ఆతిథ్యం ఇవ్వడం గురించి విని ఉంటారు గానీ ఇలాంటిది విని ఉండరు. ఏకంగా పెళ్లికి వెళ్లగానే అక్కడ కాస్త ఎక్కువ తిని, తాగి అలసిపోతాం కామన్. అలా అలసిపోయి హ్యాంగోవర్కి గురికాకుండా ఉండేలా అక్కడే ట్రీట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లగ్జరీ ట్రెండ్ హవా వివాహాల్లో హైలెట్గా నిలవనుంది. వామ్మో ఇదేంటి ఆఖరికి వచ్చిన అతిథుల ఆరోగ్యం బాగోగుల కూడా అంటే తడిసిమోపుడవుతుందా కదా అంటారా..! అయినా సరే డోంట్ కేర్ అంటూ ..ఈ ట్రెండ్కే సై అంటోంది యువత.అలాంటి ట్రెండ్ న్యూడిల్లీలోని రాజౌరి గార్డెన్లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన హెయిర్ క్లినిక్ కయాన్ ఆ పెళ్లికి వచ్చేసిన అతిధులకు ఐవీ బార్(క్లినిక్ మాదిరి సౌకర్యం) ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan) IV బార్ అంటే..విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ వంటి వాటిని నేరుగా సిరల్లోకి ఎక్కించేందుకు (IV ఇన్ఫ్యూషన్) వీలు కల్పించే ఒక క్లినిక్ లేదా సౌకర్యం. ఇది ఎందుకంటే పెళ్లికి విచ్చేసిన అతిధులు అక్కడ వడ్డించే భోజనం, ఆల్కహాల్ ఎక్కువగా లాగించేసి ఉత్సాహంతో ఆడిపాడి సందడి చేస్తారు. దాంతో కాసేపటికే అలిసిపోయి హ్యాంగోవర్ లేదా తలనొప్పితో బాధపడుతుంటారు. అలా ఇబ్బంది పడకూడదని ఈ ఐవీ బార్లు ఏర్పాటు చేస్తున్నారట. వీటి సాయంతో తలనొప్పి లేదా హ్యాంగోవర్తో ఇబ్బందిపడే వాళ్లకు ఈ గ్లూటాతియోన్ షాట్లను అందిస్తారు. దీని వల్ల రీహ్రైడ్రైట్ అయ్యి..యాక్టివ్గా మారతారట. అలాగే పెళ్లిళ్లలో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారని ప్రస్తుతం ఈ ట్రెండ్ని ఎక్కువగా ఫాలోఅవుతున్నారట. సదరు కయాన్ బృందానికి హ్యాంగోవర్ రాకుండా ఉండేలా చేయలేమని, కేవలం నిర్వహిస్తామని క్లియర్గా స్పష్టం చేసింది. పాపం ఆ పెళ్లిలో సర్వీస్ అందిస్తున్న ఐవీబార్ కయాన్ బృందానికి ఇప్పటికీ వందలకొద్ది ప్రశ్నలు వచ్చాయట ఆ హ్యంగోవర్ సమస్యపై. తాము ఆల్కహాల్ తాగొద్దు అని సలహ ఇవ్వలేం గానీ దానివల్ల వచ్చే హ్యాంగోవర్ని తగ్గించే ప్రయత్నం చేయగలమని సమాధానం చెప్పడం విశేషం. అంతేకాదండోయ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లుబాటు అయ్యే హెల్త్ ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఐవీ బార్ బృందాన్నే ఏర్పాటు చేస్తున్నారట. అంటే డీ హైడ్రేషన్ బారిన పడకుండా పెళ్లిళ్లల్లో సేవలు కూడా అందించేస్తున్నారన్నమాట. ఆఖరికి హైడ్రేషన్ సేవ కూడా వచ్చేస్తోందన్నమాట. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడమా? లేక అతిథుల పట్ల కేరింగ్నా తెలియని కన్ఫ్యూజన్ అంటూ కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan)(చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!)
ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!
ఈ భూమ్మీద ఉండే ప్రతి జీవి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని విచిత్రమైన జీవులు మనం రోజూ చూసే జీవుల మాదిరిగా ఉండి, అత్యంత విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఎలుక మాదిరి ఈ మార్సుపియల్. ఇది చూడటానికి అచ్చం ఎలుకను పోలి ఉంటుంది. దీనికున్న ప్రత్యేక లక్షణాలు గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి అవేంటో చకచక చూసేద్దామా..!.ఆ జీవి పేరు ఆంథెకనస్. ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే చిన్న ఎలుక లాంటి మార్సుపియల్. వీటిని పెద్ద పాదాల మార్సుపియల్స్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇవి ఎలుకలు మాత్రం కాదట. వీటిలో అత్యంత విలక్షణమైనది సంతానోత్పత్తి కాలం. సంవత్సరానికి రెండు నుంచి మూడు వారాలు మాత్రమే ఉండే ఈ సంతానోత్పత్తి కాలంలో మగ ఆంథెకనస్ కోసం తీవ్రంగా అన్వేషిస్తుందట. అయితే ఈ మగ మార్సుపియల్ ఆడ మార్సుపియల్లతో ఏకంగా 14 గంటల వరకు సంభోగం చేస్తుందట. అందుకోసం మగ మార్సుపియల్లు నిద్రను సైతం పక్కనపెట్టేస్తాయట. దాంతో వాటి శరీరంలో టెస్టోస్టెరాన్, ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు అమాంతం పెరిపోతాయి. దాంతో వాటి అంతర్గత అవయవాల పనితీరు దెబ్బతిని, రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా మగ ఆంథెకినేసులు ఏడాది వయసు కూడా రాకమునుపే చనిపోతాయట. అలాగే ఈ ఆడ ఆంథెకినేసులు పునరుత్పత్తి వ్యవస్థ సైతం ఇతర జీవుల కంటే భిన్నంగా ఉంటుందట. అచ్చం కంగారుల మాదిరిగా పూర్తి స్థాయి బొడ్డు సంచి ఉండదట. కేవలం చర్మ సంచి మాత్రమే ఉంటుందట. గర్భధారణ కాలం దాదాపు 25 నుంచి 35 రోజులు. ఆ తర్వాత అపరిపక్వ పిల్లలను అనేక వారాల పాటు తల్లి శరీరాన్ని అంటిపెట్టుకుని పెరుగుతాయట. వీటికి బీటిల్స్, సాలెపురుగులు, స్లగ్స్, వంటి కీటకాలు ఆహారం, ఒక్కోసారి చిన్న చిన్న సరీసృపాలను కూడా వేటాడతాయట. ఇవి టార్పోర్ అనే ప్రత్యేకమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయట. అంటే.. శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటుని తగ్గించి శక్తిని ఆదా చేసేలా ఒక రకమైన లోతైన నిద్రలాంటిది ఈ టార్పోర్. ఇక వీటి తోకలు వాటి శరీరం కంటే చాలా పొడవుగా ఉండి, మందపాటి బూడిద లేదా గోధుమ వర్ణం బొచ్చుని కలిగి ఉంటాయి.(చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!))
అంతర్జాతీయం
యూఎస్ శాంతి ప్రణాళికపై జెనీవాలో చర్చలు
జెనీవా: రష్యా దురాక్రమణకు పుల్స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షభవనం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యర్మాక్ ఎక్స్లో వెల్లడించారు. ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందం పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ను అవి కోరుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ కూడా పాలుపంచుకున్నారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొనే దిశగా అమెరికా బృందంతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని యర్మాక్ తెలిపారు. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఇప్పటికే కనీసం డజను సార్లు తిరస్కరించిన రష్యా డిమాండ్లనే ఈ ఒప్పందంతో ఆమోదించాల్సి రావడం జెలెన్స్కీకి మింగుడు పడటం లేదు. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగానికి ఎంతో కీలకమైన డోన్బాస్ను రష్యాకు వదిలేయడం, సైన్యాన్ని పరిమితం చేసుకోవడం వంటివి ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి తుది ప్రతిపాదనలు కావని, ఎలాగైనా యుద్ధాన్ని ఆపడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. అయితే, గురువారం కల్లా ఒక స్పష్టతకు రావాలని ఆయన శనివారం ఉక్రెయిన్కు గడువు విధించారు. కాగా, నల్ల సముద్రంపై ఉక్రెయిన్ స్వేచ్ఛగా ధాన్యం రవాణా చేసేందుకు ఉద్దేశించిన గత ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేలా రష్యా అధ్యక్షుడు పుతిన్తో సోమవారం మాట్లాడుతానని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు.
ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిందే
జోహన్నెస్బర్గ్: ఆధునిక యుగంలో అవసరాల సృష్టించుకున్న కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా సరే మానవ కేంద్రీకృతగా ఉండాలి తప్ప ఆర్థిక కేంద్రీకృతంగా ఉండరాదని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేర్వేరు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు. టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలని సూచించారు. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలని తెలిపారు. ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నామని వివరించారు. స్పేస్ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో ఐఏ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఏఐ వాడకంలో జవాబుదారీతనం కృత్రిమ మేధ అనేది ప్రపంచ అభివృద్ధి, మానవాళి బాగుకోసం ఉపయోగపడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. దుర్వినియోగం చేస్తే భారీ నష్టం జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకోవడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పారు. డీప్ఫేక్, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐని విచ్చలవిడిగా వాడుకోవడానికి వీల్లేకుండా పారదర్శకత కోసం పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఏఐ డిజైన్లోని భద్రతాపరమైన ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ వ్యవస్థలు మానవ జీవితాన్ని, భద్రతను, ప్రజా విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంటాయని గుర్తుచేశారు. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ వాడకానికి పెద్దపీట వేయాలన్నారు. ఇందులో జవాబుదారీతనం ఉండాలన్నారు. కృత్రిమ మేధ మానవ శక్తి సామర్థ్యాలను పెంచే మాట వాస్తవమే అయినప్పటికీ అంతిమ నిర్ణయం తీసుకొనే బాధ్యత మనుషులపైనే ఉండాలని తేలి్చచెప్పారు. ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల వాడకం నుంచి క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయాణం ఆరంభించాలని, శిలాజేతర ఇంధనాల వినియోగం పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. క్లీన్ ఎనర్జీ కోసం రీసైక్లింగ్ను మరింత వేగవంతం చేయాలని, సప్లై చైన్పై ఒత్తిడి తగ్గించాలని, అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, వినియోగం విషయంలో ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని చెప్పారు. క్లీన్ ఎనర్జీ సహా కీలక రంగాల్లో సహకారం కోసం జీ20 దేశాల శాటిలైట్ డేటాను అందరూ సులువుగా ఉపయోగించుకొనేలా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ‘జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యాన్ని’మోదీ ప్రతిపాదించారు. వ్యవసాయం, మత్స్య సంపద, విపత్తుల నిర్వహణకు జీ20 దేశాలు తమ ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని కోరారు. ఆధుని కాలంలో ప్రకృతి విపత్తులు మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయని, కోట్లాది మంది ప్రభావితమయ్యారని తెలిపారు. అందుకే విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రపంచదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తేలిచెప్పారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదని, అందుకోసం ఉమ్మడి కృషి అవసరమని ఉద్ఘాటించారు. విపత్తుల సన్నద్ధత, సుస్థిర వ్యవసాయం, ప్రజారోగ్యం, పౌష్టికాహారం వంటి అంశాలను అనుసంధానించాలని, దీనిపై సమగ్ర వ్యూహాలు రూపొందించాలని జీ20 దేశాలకు నరేంద్రమోదీ సూచించారు. ఇండియాలో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్, సెకండ్–లైఫ్ బ్యాటరీస్తోపాటు సంబంధిత రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం ‘జీ20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులేటరీ కార్యక్రమం’ప్రారంభించాలని ప్రతిపాదించారు. ప్రమాదంలో ఆహార భద్రత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని, ప్రజలకు పోషకాహారం అందడం లేదని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే వాతావరణ మార్పుల నియంత్రణపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి ఇండియాలో అతిపెద్ద ఆహార భద్రత, పోషకాహార కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా, పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రజలకు పౌష్టికాహారం అందించడానికి తృణ ధాన్యాల సాగు, విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
ఇక్కడ సూర్యుడికి 64 రోజుల సెలవు
చలి, దట్టమైన చీకటి, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు.. ఊహించడానికే భయంకరంగా ఉన్న ఈ వాతావరణాన్ని ఒక నగరం సగర్వంగా స్వాగతిస్తోంది. అమెరికాలోని అత్యంత ఉత్తరాన ఉన్న చిన్న పట్టణం, ఉట్కియాగ్విక్, అలాస్కా, 2025లో తన చివరి సూర్యాస్తమయాన్ని చూసింది. సరిగ్గా నవంబర్ 19వ తేదీ బుధవారం.. ఈ ప్రాంతంలో సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఇక ఈ ప్రాంత వాసులు మళ్లీ సూర్యుడిని చూడాలంటే, 64 సుదీర్ఘ రాత్రులు గడిచిపోవాల్సిందే! అవును. ఈ పట్టణం ఇప్పుడు తన వార్షిక ’ధ్రువరాత్రి’ లోకి ప్రవేశించింది, ఇది జనవరి 22, 2026 వరకు కొనసాగుతుంది. భూమి వంపు వల్లే ఈ అద్భుతం ఇంత సుదీర్ఘమైన చీకటికి కారణం గ్రహాంతర సంబంధమో, గ్రహశకలమో కాదు. ఇది కేవలం భూమి అక్షం వంపు ఆర్కిటిక్ సర్కిల్పై ఉట్కియాగ్విక్ ఉన్న స్థానం వల్ల జరిగే సహజ పరిణామం. ధ్రువ ప్రాంతాలలో ఏడాదిలో కొన్ని నెలలు సూర్యుడు హోరిజోన్ కిందే ఉండిపోతాడు.పూర్తి చీకటి కాదు.. నిజానికి, 64 రోజుల పాటు అంతులేని చీకటి అంటే భయమేస్తుంది. కానీ ఈ ప్రాంతం పూర్తిగా అంధకారంలో మునిగిపోదు. సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా ఉదయానికి ముందు కనిపించే లేత నీలిరంగు కాంతి కొన్ని గంటల పాటు ఉట్కియాగ్విక్ను వెలిగిస్తుంది. దీనిని సివిల్ ట్వైలైట్ అంటారు. ఈ కాంతి వల్లే స్థానికులు తమ దైనందిన కార్యకలాపాలను పూర్తి చేయగలుగుతారు. దీనికి తోడు, అద్భుతమైన ’అరోరా బోరియాలిస్’ లేదా నార్తర్న్ లైట్స్ కూడా ఈ చీకటి రాత్రులలో అద్భుతమైన వెలుగును అందిస్తాయి.ఉష్ణోగ్రతల పతనం సూర్యరశ్మి లేకపోవడం అంటే, పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి. సూర్యరశ్మి ద్వారా లభించే సహజ ఉష్ణోగ్రత లేకపోవడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు అతి తక్కువకు పడిపోతాయి. ఈ సుదీర్ఘ చీకటి కాలం నుంచే పోలార్ వోర్టెక్స్ అనే భారీ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఇది అత్యంత శీతల గాలిని కలిగి ఉంటుంది. ఈ పోలార్ వోర్టెక్స్ ఒక్కోసారి దక్షిణ దిశగా కదులుతూ.. అమెరికాలోని ఇతర రాష్ట్రాలపై కూడా చలి ప్రభావాన్ని చూపుతుంది.84 రోజులు అంతులేని వెలుగు!ఉట్కియాగ్విక్ కేవలం సుదీర్ఘ చీకటికి మాత్రమే కాదు, అద్భుతమైన వైరుధ్యానికి కూడా నిదర్శనం. శీతాకాలంలో 64 రోజులు చీకటి ఉంటే, వేసవిలో పరిస్థితి పూర్తిగా తిరగబడుతుంది. ఇక్కడ దాదాపు మూడు నెలల పాటు.. అంటే సుమారు 84 రోజులు నిరంతరాయంగా పగటి వెలుతురు ఉంటుంది. ఈ విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఇక్కడి 4,400 మంది నివాసితులు పెద్ద సవాల్ను స్వీకరించారు.వేసవిలో, అమెరికాలోని అత్యంత ఉత్తరాన ఉన్న బారో హై స్కూల్ ఫుట్బాల్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. భూమి అక్షం వంపు మానవ జీవితాలపై ఎంత లోతైన ప్రభావాన్ని చూపుతుందో, ఆర్కిటిక్లో జీవనం ఎంత అద్భుతమైన అనుకూలతను కలిగి ఉంటుందో ఈ ధ్రువ రాత్రి నిరూపిస్తోంది. జనవరి 22, 2026న సూర్యుడు తిరిగి ఉదయించే ఆ క్షణం కోసం ఉట్కియాగ్విక్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.-సాక్షి, నేషనల్ డెస్క్
భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం
జోహన్నెస్బర్గ్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం ఇకపై ఎంతమా త్రం ఐచ్ఛికం కాదని.. అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిందేనని అన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ఆదివారం ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. నేడు ప్రపంచ దేశాల మధ్య విభజనలు, అడ్డుగోడలు కనిపిస్తున్న తరుణంలో తమ కూటమి ఐక్యత, సహకారం, మానవతా సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఐబీఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు నిర్వహించాలని మోదీ ప్రతిపాదించారు. ఉగ్రవా దంపై పోరాటంలో సహకారం పెంచుకోవాలని కోరారు. ఉగ్రవాదం వంటి కీలకమైన అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని తేల్చిచెప్పారు. ఐబీఎస్ఏ సదస్సులో మోదీతోపాటు దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా పాల్గొన్నా రు. మానవ కేంద్రిత అభివృద్ధిలో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. యూపీఐ, కోవిన్ లాంటి ఆరోగ్య వేదికలు, సైబర్ సెక్యూరిటీ నిబంధనలు, మహిళల సారథ్యంలోని టెక్నాలజీ కార్యక్రమాలను పంచుకోవడానికి ‘ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్’ ఏర్పాటు చేసుకుందామని మోదీ ప్రతిపాదించారు. 40 దేశాల్లో విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, సోలార్ విద్యుత్ వంటి కార్యక్రమాల కోసం ఐబీఎస్ఏ నిధులు అందజేస్తున్నందుకు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. వాతావరణ మార్పులను తట్టుకొని పంటల దిగుబడి సాధించే విధానాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. తృణధా న్యాలు, ప్రకృతి వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, సంప్రదాయ ఔషధాలు, ఆరోగ్య భద్రత వంటి విషయాల్లో మూడు దేశాల మధ్య పరస్పర సహకారానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.వివిధ దేశాల అధినేతలతో సమావేశం ప్రధాని మోదీ ఆదివారం జోహన్నెస్బర్గ్లో బిజిబిజీగా గడిపారు. వరుసగా సమావేశాల్లో పాల్గొన్నారు. కెనడా ప్రధాని కార్నీ, జపాన్ ప్రధాని తకాయిచీ, ఇటలీ జార్జియో మెలోనీ, జమైకా ప్రధాని హోల్నెస్, నెదర్లాండ్స్ ప్రధాని డిక్ స్కూఫ్తో మోదీ సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, కీలక రంగాల్లో పరస్పర సహకారంపై వారితో చర్చించారు. ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జివాతోనూ మోదీ భేటీ అయ్యారు. మోదీ ఆదివారం దక్షిణాఫ్రికా పర్యటన పూర్తిచేసుకొని స్వదేశానికి బయలుదేరారు. రమఫోసాతో మోదీ భేటీ జీ20 సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, మైనింగ్, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ, ఆహార భద్రత వంటి రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. భారత్–దక్షిణాఫ్రికా సంబంధాల్లో పురోగతిని సమీక్షించారు. జీ20 కూటమికి విజయవంతంగా సారథ్యం వహిస్తున్నందుకు రమఫొసాకు మోదీ అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఇండియా–దక్షిణాఫ్రికా మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. జీ20 సదస్సు నిర్వహించడానికి మద్దతు ఇచ్చినందుకు మోదీకి రమఫోసా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తమకు కష్టమైన పని అప్పగించారని చెప్పారు. ఈ పని చేయలేక బహుశా పారిపోయి ఉండేవాళ్లం కావొచ్చు అని రమఫోసా వ్యాఖ్యానించడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. జీ20 సదస్సుకు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో భారత్ను చూసి నేర్చుకున్నామని ఆయన చెప్పారు. ఆరు దేశాల అతిథులు వీరే.. 1. భూటాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లియోన్పో నార్బు త్షెరింగ్, ఆయన భార్య ల్హాదెన్ లోటే.2. కెన్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్తా కూమ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుసాన్ నజోకి ఎన్డుంగు.3. మలేషియా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ టాన్ శ్రీ దాతుక్ నళిని పద్మనాథన్, ఆయన భార్య పసుపతి శివప్రకాశం.4. మారిషస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీబీ రెహనా ముంగ్లి, ఆయన కుమార్తె రిబెక్కా హన్నా బీబీ గుల్బుల్. 5. నేపాల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ మాన్ సింగ్ రౌత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సప్నాప్రధాన్ మల్లా, ఆయన భార్య అశోక్ బహదూర్ మల్లా. నేపాల్ న్యాయ శాఖ మంత్రి అనిల్ కుమార్ సిన్హా. భార్య ఉర్సిలా సిన్హా. 6. శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.పద్మన్ సురసేన, భార్య సెపాలికా సురసేన. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్. తురైరాజా, భార్య శశికళ తురైరాజా. మరో న్యాయమూర్తి జస్టిస్ ఏహెచ్ ఎండీ నవాజ్ దంపతులు.
జాతీయం
పెళ్లి మండపానికి సమీపంలో.. ట్రక్కు ఢీకొని వరుడు మృతి
బాగ్పత్: ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో పెళ్లి వేడుక విషాదకరంగా మారింది. కొద్దిసేపటిలో జరిగే వివాహానికి సిద్ధమవుతున్న వరుడు సుబోధ్ కుమార్ (25) అకాల మృత్యువు బారిన పడ్డాడు. అప్పటివరకూ ఆనందోత్సాహాలతో కళకళలాడిన పెళ్లి వేదికపై విషాదం తాండవించింది. పిచోక్రా గ్రామానికి చెందిన సుబోధ్ కుమార్ బంధువులతో సహా ఆదివారం రాత్రి సరూర్పూర్ కలాన్ గ్రామానికి వాహనంలో బయలుదేరాడు.కొద్దిసేపటికి సుబోధ్కు అస్వస్థతగా అనిపించి, వాంతి చేసుకునేందుకు వాహనం నుంచి దిగి రోడ్డు పక్కకు వెళ్లాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబోధ్ రోడ్డు పక్కన వాంతులు చేసుకుంటున్న సమయంలో ఎదురుగా అత్యంత వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అతన్ని ఢీకొని కొన్ని మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన సుబోధ్ను హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే సుబోధ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వరుడిని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజ్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన బినౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ట్రక్ డ్రైవర్ను గుర్తించేందుకు అధికారులు హైవేతో పాటు సమీప ప్రాంతాలలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.ఇది కూడా చదవండి: 25న అయోధ్యలో మరో ఉత్సవం.. ప్రధాని మోదీ హాజరు
25న అయోధ్యలో మరో ఉత్సవం.. ప్రధాని మోదీ హాజరు
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం.. నవంబరు 25(మంగళవారం)న మరో ముఖ్య ఘట్టానికి వేదిక కానుంది. ఆరోజున ఆలయ శిఖరంపై ధ్వజారోహణ (పవిత్ర జెండాను ఎగురవేసే) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి అయినందుకు గుర్తుగా జరిగే ఈ వేడుక కోసం ఆలయంతో పాటు పట్టణమంతా ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.ప్రధాని మోదీ చేతుల మీదుగా శుభ ముహూర్తంలో పవిత్రమైన ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. మంగళవారం ఉదయం 11.52 నుండి మధ్యాహ్నం 12.35 గంటల మధ్య శుభ ముహూర్తంలో ఈ వేడుక జరగనుంది. ఇదే సమయంలో హెలికాప్టర్ల నుంచి ఆలయ శిఖరంపై పూలను జల్లేందుకు ఏర్పాట్లు చేశారు. 21 మంది వేద ఆచార్యులు, శంఖం పట్టిన స్వచ్ఛంద సేవకుల నడుమ ప్రధాని మోదీ ఈ పవిత్ర జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రధాని మోదీతో పాటు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.2024 జనవరిలో రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రధాన ఆలయ నిర్మాణ పనులు దశలవారీగా జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే ఈ చారిత్రక వేడుకకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఏడువేల మంది అతిథులను ఆహ్వానించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బృందాలను ఆహ్వానించింది. అలాగే ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. అతిథులంతా ఈ వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: దడ పుట్టించిన కాబూల్ విమానం
టాయిలెట్లో వీడియో రికార్డింగ్.. వ్యక్తి అరెస్టు
చెన్నై: బాత్రూం, టాయిలెట్లో సెల్ఫోన్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల వీడియోలను తీసిన టీ దుకాణం యజమానిని అరెస్టు చేశారు. వివరాలు.. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని రాసిపురం సమీపం ఆండకలూర్ గేట్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కాంప్లెక్స్లో ఒక టీ దుకాణం ఉంది. ఐదు రూపాయలకే టీ అమ్ముతూండటంతో ఈ దుకాణం దగ్గర రద్దీ ఎక్కువ. వెన్నండూరుకు చెందిన నాగరాజ్ (27) ఇక్కడ టీ చేస్తూంటాడు.నాగరాజ్ టాయిలెట్కు వెళ్లి తన సెల్ఫోన్ వీడియో ఆన్ చేసి వచ్చాడు. ఆ తర్వాత టాయిలెట్కు వెళ్లిన ఒక మహిళ దృశ్యాలు ఆ వీడియో రికార్డ్ అయిందని తెలుసుకుని దిగ్భ్రాంతి చెంది కేకలు వేసింది. అక్కడున్న వారు వెళ్లి తనిఖీ చేసి సెల్ఫోన్ తీసుకున్నారు. వారు ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సెల్ ఫోన్ను స్వాదీనం చేసుకున్న నాగరాజ్పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ లో అనేక అశ్లీల చిత్రాలు ఉన్నట్లు తేలింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
తమిళనాడు టెంకాసి జిల్లాలో ఈరోజు (సోమవారం) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మదురై నుంచి శేంకొట్టైకి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, టెంకాసి నుంచి కోవిల్పట్టి వైపు వెళ్తున్న మరో బస్సు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి.రెండు బస్సులు ఢీకొన్న తీవ్రత కారణంగా ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు భారీ రక్షణ చర్యలు చేపట్టారు.ప్రాథమిక దర్యాప్తులో మదురై-శేంకొట్టై మార్గంలో వెళ్లిన ‘కీసర్’ అనే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. డ్రైవర్ అత్యధిక వేగంతో నడపడం వల్ల ప్రమాదం జరిగిందని సమాచారం.ప్రమాదంలో గాయపడిన 28 మంది సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎన్ఆర్ఐ
శ్రీ శ్రీ రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి.
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి
ముగ్గురు కళాశాల డ్రాపౌట్లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్జోస్లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్లో టాప్ మెంబర్స్గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది.
క్రైమ్
పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్
Dentist Suicide case ముంబై: హత్యారోపణల కింద మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే (Pankaja Munde) ముఖ్య సన్నిహితుడిని పోలీసలు అరెస్టు చేయడం కలకలం రేపింది. పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జేని ముంబైలోని వర్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య గౌరీ గార్జే ఆత్మహత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. అనంత్ భార్య గౌరీ శనివారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే భర్త ఆమెపై వేధింపులకు పాల్పడి, తీవ్రంగా హింసించాడని, అవి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్న గౌరీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. గార్జేకు వివాహేతర సంబంధం ఉందని మరొక మహిళతో మొబైల్ ఫోన్లో చాట్ చేస్తుండగా పట్టుబట్టాడని, దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్-కెమెరా పోస్ట్మార్టం ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున వర్లీ పోలీసులు గార్జేను అరెస్టు చేసి, కోర్టులో హాజరపర్చారు.గౌరీ ప్రభుత్వ కెఇఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు. అనంత్, గౌరీ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండే సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే పెళ్లి అయ్యి ఇంకా ఏడాది కూడా నిండకుండానే ఆమె బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స
ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం
ఉత్తరఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలోని నరేంద్రనగర్ ప్రాంతం సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో బోల్తాపడింది. ఈఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో ఐదుగురు మృతి చెందగా మిగిలిన 13 మందికి తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం కుంజాపురి ఆలయానికి సమీపంలో ఉంటుంది. కాగా బస్సుప్రమాద ఘటనపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తననుతీవ్రంగా కలిచివేసిందన్నారు. గాయాలైన ప్రయాణికులను వెంటనే జిల్లాయంత్రాంగం స్థానిక ఆసుపత్రులకు తరిలించిందని తీవ్రంగా గాయపడ్డవారిని రిషికేష్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.
టాయిలెట్లో వీడియో రికార్డింగ్.. వ్యక్తి అరెస్టు
చెన్నై: బాత్రూం, టాయిలెట్లో సెల్ఫోన్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల వీడియోలను తీసిన టీ దుకాణం యజమానిని అరెస్టు చేశారు. వివరాలు.. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని రాసిపురం సమీపం ఆండకలూర్ గేట్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కాంప్లెక్స్లో ఒక టీ దుకాణం ఉంది. ఐదు రూపాయలకే టీ అమ్ముతూండటంతో ఈ దుకాణం దగ్గర రద్దీ ఎక్కువ. వెన్నండూరుకు చెందిన నాగరాజ్ (27) ఇక్కడ టీ చేస్తూంటాడు.నాగరాజ్ టాయిలెట్కు వెళ్లి తన సెల్ఫోన్ వీడియో ఆన్ చేసి వచ్చాడు. ఆ తర్వాత టాయిలెట్కు వెళ్లిన ఒక మహిళ దృశ్యాలు ఆ వీడియో రికార్డ్ అయిందని తెలుసుకుని దిగ్భ్రాంతి చెంది కేకలు వేసింది. అక్కడున్న వారు వెళ్లి తనిఖీ చేసి సెల్ఫోన్ తీసుకున్నారు. వారు ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సెల్ ఫోన్ను స్వాదీనం చేసుకున్న నాగరాజ్పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ లో అనేక అశ్లీల చిత్రాలు ఉన్నట్లు తేలింది.
మంటకలిసిపోతున్న బంధుత్వాలు
సూర్యాపేట జిల్లా: మునగాల మండలం బరాఖత్గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య నెలకొన్న భూవివాదంలో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపారు. వివరాలు.. బరాఖత్గూడేనికి చెందిన దొంతిరెడ్డి కళావతికి కుమారుడు ఉపేందర్రెడ్డి, కుమార్తె రెణబోతు జ్యోతి ఉన్నారు. ఉపేందర్రెడ్డి, జ్యోతి మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. జ్యోతి బరాఖత్గూడెంలో తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి కౌలుకు ఇచ్చింది. జ్యోతి తన భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆదివారం బరాఖత్గూడేనికి వచ్చి కౌలు రైతుతో కలసి వరి పంటను కోయిస్తుండగా.. అక్కడకు చేరుకున్న కళావతి, ఉపేందర్రెడ్డి వరికోత యంత్రాన్ని ఆపారు. అడ్డుకోవడానికి వెళ్లిన జ్యోతి, ఆమె భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలపై ఉపేందర్రెడ్డి దాడి చేశాడు. అంతేకాక జ్యోతి ఇద్దరు కుమార్తెల పట్ల ఉపేందర్రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘర్షణలో గాయపడిన జ్యోతి, ఇద్దరు కుమార్తెలు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కళావతి, ఉపేందర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వీడియోలు
CJIగా పదవీ విరమణ చేసిన వెంటనే అధికారిక సౌకర్యాలకు గుడైబై
Revanth Reddy: అదొక్కటే మన తలరాతను మార్చేది వేరే ఆప్షన్ లేదు..
Uttarakhand: కుంజాపురి సమీపంలో లోయలో బస్సు బోల్తా
నాంపల్లి కోర్టుకు ఐబొమ్మ రవి
ESI ఆస్పత్రిలో ప్రమాదం.. స్లాబ్ పెచ్చులు ఊడి..
ధర్మేంద్ర మృతిపై జగన్ దిగ్భ్రాంతి
చంద్రబాబుకు బిగ్ షాక్ కోటి సంతకాల సేకరణలో టీడీపీ
Hindupur: చేతులెత్తి మొక్కుతా క్షమించు మద్యం వ్యాపారితో CI సంచలన ఆడియో
Kaile Anil Kumar: 7 లక్షల మందికి అన్నదాత కట్ రైతును చిత్రహింస పెడుతున్నారు
Shaik Muneer: కూటమి ప్రభుత్వ తీరుపై ముస్లిం జేఏసీ నేతల ఆగ్రహం

