‘జటాధర’ మూవీ రివ్యూ
టైటిల్: జటాధరనటీనటులు: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల,ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్ తదితరులునిర్మాతలు: ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హల్, నిఖిల్ నందాదర్శకత్వం: వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాసంగీతం: రాజీవ్ రాజ్విడుదల తేది: నవంబర్ 7, 2025కథేంటంటే..శివ(సుధీర్ బాబు) దెయ్యాలు ఉన్నాయని నమ్మని ఓ ఘోస్ట్ హంటర్. సైన్స్ని మాత్రమే నమ్ముతూ.. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరిగిన చోటికి వెళ్లి రీసెర్చ్ చేస్తుంటాడు. అతని తల్లిదండ్రులకు(ఝాన్సీ, రాజీవ్ కనకాల) ఈ విషయం తెలియదు. ఓ రోజు ప్రముఖ ఘోస్ట్ హంటర్ మణిశర్మ(అవసరాల శ్రీనివాస్) అసిస్టెంట్ అంకిత్ అనుమానాస్పదంగా మరణించడంతో.. శివ రుద్రారం అనే గ్రామానికి వెళ్తాడు. ఈ విషయం అతని తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతారు. ఆ గ్రామానికి వెళ్లకూడదంటూ శివ గతం గురించి చెబుతారు. శివ గతం ఏంటి? రుద్రారం గ్రామానికి, అతనికి ఉన్న సంబంధం ఏంటి? ధన పిశాచి(సోనాక్షి సిన్హా) ఆ గ్రామంలోనే ఎందుకు తిష్ట వేసింది? ధన పిశాచి వల్ల శివ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటి? తన పేరెంట్స్ ఆత్మలకు శాంతి కలిగించేందుకు శివ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. ఎలా ఉందంటే..నిధుల కోసం తవ్వకాలు.. వాటికి రక్షణగా క్షుద్రశక్తులు ఉండడం.. దెయ్యాలు అంటే నమ్మని హీరో అనుకోకుండా అక్కడికి వెళ్లడం.. ఫ్లాష్బ్యాక్లో ఆ ప్రాంతంతో హీరోకి సంబంధం ఉందనే విషయం తెలియడం.. చివరకు దైవశక్తి సహాయంతో హీరో క్షుద్రశక్తులను అంతం చేయడం.. మైథలాజికల్ జానర్లో వచ్చే హారర్ చిత్రాల నేపథ్యం దాదాపు ఇలాగే ఉంటుంది. అయితే ప్రేక్షకులను ఎంత మేరకు థ్రిల్కి గురిచేశారనేదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. కాస్త భయపెట్టి.. ప్లాష్బ్యాక్ స్టోరీని ఎమోషనల్గా తీర్చిదిద్దితే చాలు సినిమాని హిట్ చేస్తారు. జటాధరలో అది మిస్సయింది. ఇటు పూర్తిగా భయపెట్టనూ లేదు.. అటు ఎమోషనల్గానూ ఆకట్టుకోలేకపోయారు. కథలో కొత్తదనం ఎలాగూ లేదు.. కథనాన్ని అయినా కాస్త ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేయలేదు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా హైప్ ఇచ్చే సీన్ కనిపించదు. శివుడి ఎపిసోడ్ కూడా పూర్తిగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయారు. ఒకప్పుడు నిధులను ఎందుకు భూమిలో పాతిపెట్టేవారో వివరిస్తూ కథను ప్రారంభించారు దర్శకులు. ఆ నిధులకు రక్షణగా బంధనం వేసేవారని.. అందులో ధన పిశాచి బంధనం అతి భయంకరమైనదంటూ ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ఘోస్ట్ హంటర్గా హీరోని పరిచయం చేశారు. దెయ్యాలు లేవని ఎందుకు బలంగా నమ్ముతున్నాడో వివరిస్తూ ఓ ప్లాష్బ్యాక్ స్టోరీ చెప్పడం వరకు కథనం ఇంట్రెస్టింగానే అనిపిస్తుంది. ఆ తర్వాత కథనం చప్పగా సాగుతుంది. ఘోస్ట్ హంటర్గా హీరో చేసే విన్యాసాలు ఆకట్టుకోకపోగా.. సాగదీతగా అనిపిస్తాయి. మధ్యలో వచ్చే హీరోహీరోయిన్ల లవ్స్టోరీ సహనానికి పరీక్షగా మారుతుంది. ఫస్టాఫ్ మొత్తం కథనం అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మధ్యమధ్యలో వచ్చిన ధన పిశాచి ప్రేక్షకులను భయపెట్టలేకపోయింది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. కానీ ద్వితీయార్థంలో వచ్చే ప్లాష్బ్యాక్ స్టోరీ కూడా సాగదీసినట్లుగానే ఉంటుంది. ఒక్క సీన్లో చెప్పాల్సిన కథని ఐదారు సీన్లలో చెప్పినట్లుగా అనిపిస్తుంది. ధన పిశాచి ఎపిసోడ్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు. ఇక చివరిలో వచ్చిన శివుడి ఎపిసోడ్ కూడా ప్రేక్షకుడిలో జోష్ నింపలేకపోయింది. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని చెబుతూ శుభం కార్డు వేశారు. ఎవరెలా చేశారంటే.. సుధీర్ బాబు తన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉండడంతో ఆయన పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. దివ్య ఖోస్లా పాత్ర నిడివి తక్కువే ఉన్నా.. నటన పరంగా పర్వాలేదు. కానీ సుధీర్కి జోడీగా మాత్రం సెట్ కాలేదనే చెప్పాలి. నెగెటివ్ షేడ్ ఉన్న శోభ పాత్రలో శిల్పా శిరోద్కర్ ఒదిగిపోయింది. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా.. లుక్పరంగా భయంకరంగా ఉన్నా.. ప్రేక్షకుడిని భయపెట్టడంలో మాత్రం విఫలం అయింది. ఆమె పాత్రకు పెద్ద డైలాగులు కూడా లేవు. గట్టిగా నవ్వడం.. అరవడం తప్ప ఆమెకు సరైన డైలాగులే పడలేదు. రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్ విభాగం పనితీరు జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
మాజీ భార్య హసీన్ జహాతో (Hasin Jahan) విభేదాల కారణంగా టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) మరోసారి వార్తల్లోకెక్కాడు. తనకు లభిస్తున్న భరణం సరిపోవట్లేదని హసీన్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని (Supreme Court) ఆశ్రయించింది. హసీన్ పిటీషన్ను విచారించిన సుప్రీంకోర్టు షమీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందన తెలియజేయాలని ఆదేశించింది.కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు షమీ హసీన్కు రూ. 4 లక్షలు భరణంగా చెల్లిస్తున్నాడు. ఇందులో షమీ కూతురికి రూ. 2.5 లక్షలు, హసీన్కు రూ. 1.5 లక్షలు వెళ్తున్నాయి. అయితే ఈ మొత్తం సరిపోవట్లేదని హసీన్ షమీపై మరోసారి కోర్టుకెక్కింది. గతంలోనూ ఇదే విషయంలో ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హసీన్ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు లభించే భరణాన్ని రూ. 1.3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచారు. తాజాగా ఈ మొత్తం కూడా సరిపోవట్లేదని హసీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హసీన్ తరఫున న్యాయవాదులు శోభా గుప్తా, శ్రీరామ్ పరాకట్ వాదిస్తూ.. షమీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. నెలకు రూ. 1.08 కోటి ఖర్చు చేస్తున్నాడు. కానీ భార్య, కుమార్తెను పేదరికంలో వదిలేశాడు. షమీ ఆస్తుల నికర విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుంది. హసీన్కు స్వతంత్ర ఆదాయ వనరులేదు. ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో కూడా లేదని అన్నారు. షమీ తమ క్లయింట్కు ఇంకా రూ. 2.4 కోట్ల బకాయిలు చెల్లించేది ఉందని తెలిపారు. లాయర్ల వాదన విన్న తర్వాత కోర్టు హసీన్కు పరోక్షంగా చురకలంటించ్చినట్లు తెలుస్తుంది. నెలకు రూ. 4 లక్షల భరణం చాలా పెద్ద మొత్తం కదా అని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, షమీ-హసీన్ల వివాహం 2014లో జరిగింది. నాలుగేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. వీరిద్దరికి ఓ బిడ్డ జన్మించింది.ఆతర్వాత షమీ-జహా మధ్య విభేదాలు తలెత్తాయి. 2018లో హసీన్ షమీపై గృహ హింస, వేధింపుల కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో కోల్కతా హైకోర్టు రూ. 4 లక్షల భరణం హసీన్కు చెల్లించాలని షమీని ఆదేశించింది. చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?
బెట్టింగ్ యాప్స్ శిఖర్ ధావన్, రైనాపై సజ్జనార్ ఆగ్రహం
Betting App Case బెట్టింగ్ మహామ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లలో పాల్గొంటున్న సెలబ్రిటీలపై మండిపడ్డారు. వీళ్లేం సెలబ్రిటీలు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ నెట్టింట సంచలనంగా మారింది.ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో సజ్జనార్ స్పందించారు. #SayNoToBettingAppsవీళ్లేం సెలబ్రిటీలు?అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని… pic.twitter.com/GWJIvSK7uF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 7, 2025 (గుండెలు పగిలేలా ఏడ్చారు.. పోరాడి గెలిచారు!) ట్వీట్లో సజ్జనార్ ఏమన్నారంటే..వీళ్లేం సెలబ్రిటీలు?అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు?బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా?సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి.’’ అంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదీ చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్
బీఆర్ఎస్ జనార్దన్ రెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఉదయం ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుపుతోంది. మోతీ నగర్లోని ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో మర్రి జనార్థన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మర్రి జనార్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసులే నా ఇంట్లో డబ్బులు పెట్టించారు. పోలీసులే బ్యాగులను నా ఇంట్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. డైవర్షన్ కోసమే మా ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ రౌడీయిజం చేస్తోంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రౌడీయిజమా?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రౌడీయిజం చేస్తారని అనుకోలేదు’ అంటూ మండిపడ్డారు.ఇక, తాజాగా మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. దాదాపు ఐదు గంటల పాటు సోదాలు జరిపిన ఎన్నికల అధికారులు సోదాలపై పంచనామా రిపోర్ట్ సిద్ధం చేసి సంతకాలు తీసుకున్నారు. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్.. అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏసీలు కూడా పూర్తిగా ఓపెన్ చేసి చూశారు. ఓ లాకర్ ఉంటే వాటి తాళలు తెప్పించి మరీ సోదాలు జరిపారు. ఇంట్లో ఎలాంటి నగదు లభ్యం కాకపోవడం.. ఖాళీ చేతులతో వెనుదిరిగారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అయితే, ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రశ్నిస్తున్నారు. ఇక.. పోలీసుల సోదాల నేపథ్యంలో వారి ఇళ్ల వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ..మమ్మల్ని పోలీసులు బెదిరిస్తున్నారు. సోదాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారు. బహిరంగంగా రిగ్గింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఈసీ అధికారులతో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం
‘అందుకే.. సంజూను కాదని జితేశ్ శర్మను ఆడిస్తున్నారు’
అందరూ తెలుసుకోవాల్సిన EPFO కొత్త రూల్స్
‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం’
మోహన్ లాల్ ఫ్యాన్స్కు మళ్లీ నిరాశే.. ఆ సినిమా వాయిదా!
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక లోపం.. 500 విమానాలకు పైగా ఆలస్యం
షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఇక్కడ అవకాశాలు పుష్కలం.. పెట్టుబడులు పెట్టండి
హౌస్లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే!
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
భవిష్యత్తు బంగారు లోహం!
ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా పటేలా..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్
సాక్షి కార్టూన్ 05-11-2025
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్
ఒక్క బ్రెజిల్ మోడల్కే ఇస్తే ఎలాగయ్యా! మిగత దేశాల మోడల్స్ గొడవ చేస్తే ఎలా? వారికి కూడా ఇచ్చేయండి!
భారత్ మాట వినడం లేదని బెదిరించడానికి -వ్యాఖ్యలు చేసినట్లున్నారు
డైరెక్టర్కు బంపరాఫర్.. నీ సొంతింటి బాధ్యత నాదే: టాలీవుడ్ నిర్మాత
సూర్యాపేటలో సందడి చేసిన సినీ నటి అనసూయ (ఫొటోలు)
జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
సీఈసీ అధికారులతో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం
‘అందుకే.. సంజూను కాదని జితేశ్ శర్మను ఆడిస్తున్నారు’
అందరూ తెలుసుకోవాల్సిన EPFO కొత్త రూల్స్
‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం’
మోహన్ లాల్ ఫ్యాన్స్కు మళ్లీ నిరాశే.. ఆ సినిమా వాయిదా!
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక లోపం.. 500 విమానాలకు పైగా ఆలస్యం
షమీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఇక్కడ అవకాశాలు పుష్కలం.. పెట్టుబడులు పెట్టండి
హౌస్లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే!
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
భవిష్యత్తు బంగారు లోహం!
ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా పటేలా..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
నూయార్క్ మేయర్గా మమ్దానీ - ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
అంతలా విసిగించకు.. కావాలంటే నీకు మలిదశలో ఓటేస్తాలే!!
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్
సాక్షి కార్టూన్ 05-11-2025
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
ఒక్క బ్రెజిల్ మోడల్కే ఇస్తే ఎలాగయ్యా! మిగత దేశాల మోడల్స్ గొడవ చేస్తే ఎలా? వారికి కూడా ఇచ్చేయండి!
భారత్ మాట వినడం లేదని బెదిరించడానికి -వ్యాఖ్యలు చేసినట్లున్నారు
డైరెక్టర్కు బంపరాఫర్.. నీ సొంతింటి బాధ్యత నాదే: టాలీవుడ్ నిర్మాత
జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ
టీవీ5 మూర్తిపై కేసు
సినిమా
‘జటాధర’ మూవీ రివ్యూ
టైటిల్: జటాధరనటీనటులు: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల,ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్ తదితరులునిర్మాతలు: ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హల్, నిఖిల్ నందాదర్శకత్వం: వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాసంగీతం: రాజీవ్ రాజ్విడుదల తేది: నవంబర్ 7, 2025కథేంటంటే..శివ(సుధీర్ బాబు) దెయ్యాలు ఉన్నాయని నమ్మని ఓ ఘోస్ట్ హంటర్. సైన్స్ని మాత్రమే నమ్ముతూ.. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరిగిన చోటికి వెళ్లి రీసెర్చ్ చేస్తుంటాడు. అతని తల్లిదండ్రులకు(ఝాన్సీ, రాజీవ్ కనకాల) ఈ విషయం తెలియదు. ఓ రోజు ప్రముఖ ఘోస్ట్ హంటర్ మణిశర్మ(అవసరాల శ్రీనివాస్) అసిస్టెంట్ అంకిత్ అనుమానాస్పదంగా మరణించడంతో.. శివ రుద్రారం అనే గ్రామానికి వెళ్తాడు. ఈ విషయం అతని తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతారు. ఆ గ్రామానికి వెళ్లకూడదంటూ శివ గతం గురించి చెబుతారు. శివ గతం ఏంటి? రుద్రారం గ్రామానికి, అతనికి ఉన్న సంబంధం ఏంటి? ధన పిశాచి(సోనాక్షి సిన్హా) ఆ గ్రామంలోనే ఎందుకు తిష్ట వేసింది? ధన పిశాచి వల్ల శివ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటి? తన పేరెంట్స్ ఆత్మలకు శాంతి కలిగించేందుకు శివ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. ఎలా ఉందంటే..నిధుల కోసం తవ్వకాలు.. వాటికి రక్షణగా క్షుద్రశక్తులు ఉండడం.. దెయ్యాలు అంటే నమ్మని హీరో అనుకోకుండా అక్కడికి వెళ్లడం.. ఫ్లాష్బ్యాక్లో ఆ ప్రాంతంతో హీరోకి సంబంధం ఉందనే విషయం తెలియడం.. చివరకు దైవశక్తి సహాయంతో హీరో క్షుద్రశక్తులను అంతం చేయడం.. మైథలాజికల్ జానర్లో వచ్చే హారర్ చిత్రాల నేపథ్యం దాదాపు ఇలాగే ఉంటుంది. అయితే ప్రేక్షకులను ఎంత మేరకు థ్రిల్కి గురిచేశారనేదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. కాస్త భయపెట్టి.. ప్లాష్బ్యాక్ స్టోరీని ఎమోషనల్గా తీర్చిదిద్దితే చాలు సినిమాని హిట్ చేస్తారు. జటాధరలో అది మిస్సయింది. ఇటు పూర్తిగా భయపెట్టనూ లేదు.. అటు ఎమోషనల్గానూ ఆకట్టుకోలేకపోయారు. కథలో కొత్తదనం ఎలాగూ లేదు.. కథనాన్ని అయినా కాస్త ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేయలేదు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా హైప్ ఇచ్చే సీన్ కనిపించదు. శివుడి ఎపిసోడ్ కూడా పూర్తిగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయారు. ఒకప్పుడు నిధులను ఎందుకు భూమిలో పాతిపెట్టేవారో వివరిస్తూ కథను ప్రారంభించారు దర్శకులు. ఆ నిధులకు రక్షణగా బంధనం వేసేవారని.. అందులో ధన పిశాచి బంధనం అతి భయంకరమైనదంటూ ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ఘోస్ట్ హంటర్గా హీరోని పరిచయం చేశారు. దెయ్యాలు లేవని ఎందుకు బలంగా నమ్ముతున్నాడో వివరిస్తూ ఓ ప్లాష్బ్యాక్ స్టోరీ చెప్పడం వరకు కథనం ఇంట్రెస్టింగానే అనిపిస్తుంది. ఆ తర్వాత కథనం చప్పగా సాగుతుంది. ఘోస్ట్ హంటర్గా హీరో చేసే విన్యాసాలు ఆకట్టుకోకపోగా.. సాగదీతగా అనిపిస్తాయి. మధ్యలో వచ్చే హీరోహీరోయిన్ల లవ్స్టోరీ సహనానికి పరీక్షగా మారుతుంది. ఫస్టాఫ్ మొత్తం కథనం అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మధ్యమధ్యలో వచ్చిన ధన పిశాచి ప్రేక్షకులను భయపెట్టలేకపోయింది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. కానీ ద్వితీయార్థంలో వచ్చే ప్లాష్బ్యాక్ స్టోరీ కూడా సాగదీసినట్లుగానే ఉంటుంది. ఒక్క సీన్లో చెప్పాల్సిన కథని ఐదారు సీన్లలో చెప్పినట్లుగా అనిపిస్తుంది. ధన పిశాచి ఎపిసోడ్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు. ఇక చివరిలో వచ్చిన శివుడి ఎపిసోడ్ కూడా ప్రేక్షకుడిలో జోష్ నింపలేకపోయింది. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని చెబుతూ శుభం కార్డు వేశారు. ఎవరెలా చేశారంటే.. సుధీర్ బాబు తన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉండడంతో ఆయన పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. దివ్య ఖోస్లా పాత్ర నిడివి తక్కువే ఉన్నా.. నటన పరంగా పర్వాలేదు. కానీ సుధీర్కి జోడీగా మాత్రం సెట్ కాలేదనే చెప్పాలి. నెగెటివ్ షేడ్ ఉన్న శోభ పాత్రలో శిల్పా శిరోద్కర్ ఒదిగిపోయింది. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా.. లుక్పరంగా భయంకరంగా ఉన్నా.. ప్రేక్షకుడిని భయపెట్టడంలో మాత్రం విఫలం అయింది. ఆమె పాత్రకు పెద్ద డైలాగులు కూడా లేవు. గట్టిగా నవ్వడం.. అరవడం తప్ప ఆమెకు సరైన డైలాగులే పడలేదు. రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్ విభాగం పనితీరు జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి
సీరియల్ నటి దీప్తి మన్నె (Deepthi Manne) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు రోహన్తో పెళ్లిపీటలెక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో పెళ్లికూతురిగా ముస్తాబైన దీప్తి.. సిగ్గుపడుతూ మండపంలోకి నడిచింది. పంతులు మంత్రాలు చదువుతుండగా వధూవరులు ఇద్దరూ ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు దీప్తికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దీప్తి మన్నె బెంగళూరువాసి. మొదట్లో తన మాతృభాష కన్నడలో పలు సీరియల్స్ చేసింది. అలాగే సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తర్వాత తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. రాధమ్మ కూతురు, జగద్ధాత్రి, పద్మావతి వంటి పలు ధారావాహికల్లో నటించింది. తెలుగులో ఇక సెలవ్ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by 🌸Kedhar Dhathri🌸 (@kedhar_dhathri_xworld) చదవండి: తొడకొట్టిన చైల్డ్ ఆర్టిస్ట్.. విజయ్ దేవరకొండకు ఆర్డర్..
పొట్టి దుస్తులు వద్దని కన్నీళ్లు.. అనుష్క బర్త్డే స్పెషల్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ‘దేవసేన’కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్గా అనుష్క నటించిన 'ఘాటీ' కాస్త నిరాశపరిచింది. కానీ, 'కతనార్' అనే లేడీ ఓరియెంటేడ్ మలయాళ సినిమాతో త్వరలో రానుంది. నేడు అనుష్క 44వ పుట్టినరోజు జరుపుకుంటుంది.నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది. పొట్టి దుస్తులు వల్ల కన్నీళ్లు పెట్టుకున్న స్వీటీసినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే 20 ఏళ్లు పూర్తి చేసుకున్న దేవసేన... 2005 సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు వారికి పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా హోదా సంపాదించారు. పూరీ జగన్నాథ్ ‘సూపర్’లో నటించేందుకు హీరోయిన్ కోసం చూస్తున్న సమయంలో ఆయన స్నేహితుడు యోగా టీచర్గా పనిచేస్తున్న అనుష్క ఫోటో చూపించారు. అలా అనుష్కను పూరీ కలిశారు. సినిమా గురించి చర్చించిన తర్వాత ఆమె హైదరాబాద్కు రావడం ఆపై తొలి సినిమా ఛాన్స్ దక్కించుకున్నారు. కెమెరా ముందు పొట్టి దుస్తులు వేసుకుని మొదట నటించాలంటే ఆమె చాలా ఇబ్బంది పడింది. ఈ క్రమంలో తాను చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. అయితే, చాలా పట్టుదలతో వాటిని ముందుకు వెళ్లానని చెప్పింది. బిల్లా సినిమాలో ఆమె ఏకంగా బికినీ ధరించి అందరికీ షాకిచ్చింది. మొదటిసారి పూరీ జగన్నాథ్ను కలవడాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె పంచుకుంది. 2005లో తన జీవితాన్ని మార్చేసిన రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె చెప్పింది.సూపర్ చిత్రం తర్వాత ‘మహానంది’లో హీరో సుమంత్కు జోడిగా నటించింది అనుష్క. అయితే ఈ చిత్రం ద్వారా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. మాస్ మహారాజా , రాజమౌళి కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’తో అనుష్క్కు స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కొన్ని ప్లాపులు పడినప్పటికీ.. 2009లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’తో అనుష్క జీవితమే మారిపోయింది. ఆ సినిమాలో యువరాణి జేజమ్మగా అనుష్క అభినయానికి, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.పేరు ఎందుకు మార్చుకుందిఅనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి అని చాలామందికి తెలుసు.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనే పేరును మార్చుకుంది. అనుష్కకు స్వీటీ అని తన పిన్ని పెట్టింది. అయితే, ఆ పేరును అమ్మవాళ్లు ప్రతి సంవత్సరం మారుస్తాం అని మాటిస్తూ పోయారని పదో తరగతి తర్వాత జరిగిన ఒక సంఘటనను ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇంటర్లో అడ్మిషన్ అప్పుడు అప్లికేషన్లో స్వీటీ అని రాస్తే ముద్దు పేరు బావుంది.. కానీ, అసలు పేరు రాయాలని వారు అన్నారు. ఆ మయంలోనే పేరు మార్చాలని తమ తల్లిందడ్రులను కోరినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే, చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత సెట్లో ‘స్వీటీ’ అని పిలుస్తుంటే బాగోలేదని కొందరు సలహా ఇచ్చారట. దీంతో ఆమె తనకు తానే అనుష్క అని పేరు పెట్టుకుంది. అయితే, ఈ పేరు అందరికీ అలవాటు అయేందుకు సుమారు ఏడాది కాలం పట్టినట్లు ఆమె చెప్పంది.
నటికి అభ్యంతరకర ప్రశ్న.. తప్పులో కాలేసిన ఖుష్బూ!
మలయాళ నటి గౌరీకిషన్ (Gouri G Kishan)కు చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ అదర్స్. ఈ తమిళ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న ఆమెను ఓ జర్నలిస్టు అవమానకరమైన ప్రశ్నతో ఇబ్బందిపెట్టాడు. మీ బరువెంత? అని అడిగాడు. అది విని షాకైన గౌరీ కిషన్.. నా బరువుతో మీకేం అవసరం? ఇది చాలా చెత్త ప్రశ్న.. ఇలా అడగడం బాడీ షేమింగే అవుతుంది అని మండిపడింది. అది బాడీ షేమింగ్ కాదని జర్నలిస్ట్ వాదించాడు. అలా వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది.హీరోను అడగ్గలరా?ఈ వ్యవహారంపై సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ఘాటుగా స్పందించింది. జర్నలిజం విలువలు కోల్పోతోంది. కొందరు జర్నలిజాన్ని తప్పుగా వాడుతున్నారు. ఒకమ్మాయి బరువు గురించి వారికెందుకు? హీరోయిన్ను సూటిగా అడిగినప్పుడు మరి హీరో బరువు గురించి ఎందుకు అడగలేదు? ఇది నిజంగా సిగ్గుచేటు. యువ నటి గౌరీని ఈ విషయంలో అభినందించాల్సిందే! అభ్యంతరకర ప్రశ్న అడిగిన వ్యక్తికి అక్కడే ఇచ్చిపడేసింది. మీ ఇంట్లోవాళ్లను అడిగితే ఓకేనా?మేము ఎదురుతిరిగి మీ కుటుంబంలోని స్త్రీల గురించి అలాంటి చెత్త ప్రశ్నలు అడిగితే మీకు ఓకేనా? ముందు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.. గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అని ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ ఓ చిన్న పొరపాటు చేసింది. నటి గౌరీకిషన్ పేరుకు బదులుగా గౌరీ శంకర్ అని హ్యాష్ట్యాగ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు, మేడమ్, ఆమె గౌరీ శంకర్ కాదు.. గౌరీ కిషన్ అని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Dhanya Rajendran (@dhanyarajendran) Journalism has lost its ground. The so called journos take journalism to the gutters. How much a woman weighs is none of their business. And asking the hero about it?? What a shame! Kudos to the young #GowriShankar who stood her ground and gave it back. Are the same men ok if…— KhushbuSundar (@khushsundar) November 7, 2025చదవండి: ప్రెస్మీట్లో ఇదేం ప్రశ్న.. ఫైర్ అయిన నటి
న్యూస్ పాడ్కాస్ట్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా
క్రీడలు
టీమిండియా పేసర్ల విజృంభణ.. కుప్పకూలిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో (India A vs South Africa A) భారత-ఏ జట్టు పేసర్లు చెలరేగిపోయారు. ప్రసిద్ద్ కృష్ణ 3, సిరాజ్, ఆకాశ్దీప్ తలో 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. వీరి ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 47.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబే కూడా తలో వికెట్ తీశారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ అకెర్మన్ విధ్వంసకర శతకంతో ఒంటిపోరాటం చేశాడు. సహచరులు సహకరించకపోయినా ఒక్కడే నిలబడి 200 పరుగుల మార్కును దాటించాడు. కేవలం 118 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అకెర్మన్ కాకుండా సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో జోర్డన్ హెర్మన్ (26), సుబ్రాయన్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో సీనియన్ టీమ్ కెప్టెన్ టెంబా బవుమా సహా నలుగురు డకౌట్లయ్యారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ జురెల్ (132) వీరోచిత శతకంతో టీమిండియా పరువు కాపాడాడు. 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జురెల్.. టెయిలెండర్లు కుల్దీప్ (20), సిరాజ్ (15) సహకారంతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో సీనియర్లు కేఎల్ రాహుల్ (19), సాయి సుదర్శన్ (17), అభిమన్యు ఈశ్వరన్ (0), దేవదత్ పడిక్కల్ (5), రిషబ్ పంత్ (24) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కు 34 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే అభిమన్యు ఈశ్వరన్ వికెట్ కోల్పోయింది. ఈశ్వరన్ వరుసగా రెండో ఇన్నింగ్స్లో కూడా డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్ (4), సాయి సుదర్శన్ క్రీజ్లో ఉన్నారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్-ఏ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా జరుగుతుంది.చదవండి: Hong Kong Sixes 2025: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. హ్యాట్రిక్ సహా..!
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. హ్యాట్రిక్ సహా..!
హాంగ్ కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) సరికొత్త రికార్డు నమోదైంది. నేపాల్ పేసర్ రషీద్ ఖాన్ (Rashid Khan).. ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (నవంబర్ 7) జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ సహా టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.🚨Hat-trick Alert🚨 A Rashid Khan you didn’t see coming 👀The Nepal pacer pulls off a sensational hat-trick vs Afghanistan in the #HongKongSixes 🎯 pic.twitter.com/X9NcP2dcAT— FanCode (@FanCode) November 7, 2025ఈ మ్యాచ్లో రషీద్ వరుస బంతుల్లో ఆఫ్ఘన్ బ్యాటర్లు సెదిఖుల్లా పచ్చా, షారాఫుద్దీన్ అష్రఫ్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్ను ఔట్ చేశాడు. తన కోటా 2 ఓవర్లలో మొత్తం 4 వికెట్లు తీసి కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రషీద్కు ముందు ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు శ్రీలంక బౌలర్ కంగనిగే తరిండు (2-0-33-4) పేరిట ఉండేవి.తాజా మ్యాచ్లో రషీద్ ఖాన్ చెలరేగినా నేపాల్ పరాజయంపాలవడం కొసమెరుపు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఓపెనర్లు కరీమ్ జనత్ (10 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), గుల్బదిన్ నైబ్ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు), నాలుగో నంబర్ ఆటగాడు ఫర్మానుల్లా సఫీ (9 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.టోర్నీ రూల్స్ ప్రకారం ఆరుగురు ఆటగాళ్లలో ఐదుగురు ఔటైనా ఓవర్లు మిగిలి ఉండే ఒక్కరే బ్యాటింగ్ కొనసాగించవచ్చు. ఈ మ్యాచ్లో అదే జరిగింది. రషీద్ ఖాన్ ఐదో ఓవర్ మొదటి మూడు బంతులకు హ్యాట్రిక్ వికెట్లు తీసినా.. ఫర్మానుల్లా సఫీ ఒక్కడే ఇన్నింగ్స్ను కొనసాగించాడు. ఒక్కడు కావడంతో అతడు చెలరేగి ఆడాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్కు కూడా సుడిగాలి ఆరంభం లభించింది. ఓపెనర్, కెప్టెన్ అయిన సందీప్ జోరా కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. సందీప్ క్రీజ్లో ఉన్నంత వరకు గెలుపు దిశగా పయనించిన నేపాల్, ఆతర్వాత నిదానించింది. అంతిమంగా నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులకే పరిమితమై 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: Hong Kong Sixes 2025: పాకిస్తాన్పై భారత్ విజయం
పాకిస్తాన్పై భారత్ విజయం.. అక్కడ కూడా భంగపాటే..!
హాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాకిస్తాన్పై భారత్ డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాంగ్ కాక్ వేదికగా ఇవాళ (నవంబర్ 7) జరిగిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆఖర్లో కెప్టెన్ దినేశ్ కార్తిక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సైతం బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్లో స్టువర్ట్ బిన్ని 4, మిథున్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ముహమ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ ఓ వికెట్ తీశారు.అనంతరం పాక్ 87 పరుగుల లక్ష్య ఛేదనకు దిగగా వరుణుడు అడ్డు పడ్డాడు. వారి స్కోర్ 41/1 (3 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ను విజేతగా ప్రకటించారు.మ్యాచ్ ముగిసే సమయానికి ఖ్వాజా నఫే (18 నాటౌట్), అబ్దుల్ సమద్ (16 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. మాజ్ సదాఖత్ (7) ఔటయ్యాడు. సదాఖత్ వికెట్ స్టువర్ట్ బిన్నికి దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో కువైట్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8న జరుగుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 6:40 గంటలకు మొదలవుతోంది. కాగా, క్రికెట్లో పాకిస్తాన్పై భారత్ గెలవడం ఇటీవలికాలంలో ఇది ఐదోసారి. పహల్గాం ఉదంతం తర్వాత భారత సీనియర్ పురుషుల జట్టు పాక్ను ఆసియా కప్-2025లో మూడు సార్లు ఓడించింది. అనంతరం భారత సీనియర్ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్లో పాక్ను చిత్తు చేసింది. తాజాగా సూపర్ సిక్సస్ టోర్నీలోనూ పాక్కు భారత్ చేతిలో భంగపాటు ఎదురైంది.చదవండి: పాకిస్తాన్ కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్..
పాకిస్తాన్ కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్..
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ కోసం తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పాకిస్తాన్ షాహీన్స్ జట్టు కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ ఎంపికయ్యాడు. ఇర్ఫాన్ ఖాన్ ఇప్పటికే పేలవ ఫామ్ కారణంగా పాక్ సీనియర్ జట్టులో చోటు కోల్పోయాడు.ఇర్ఫాన్ చివరగా ఈ ఏడాది మార్చిలో పాక్ తరపున ఆడాడు. అప్పటి నుంచి అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఈ ఆల్రౌండర్ తన సత్తాను నిరూపించుకునేందుకు పీసీబీ మరొక అవకాశం ఇచ్చింది. ఇక ఈ జట్టులో అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ నయీమ్, ఉబైద్ షా యువ ఆటగాళ్లకు పీసీబీ సెలక్టర్లు చోటు ఇచ్చారు. పాక్ పేస్ బౌలర్ నసీమ్ షా సోదరుడు అయిన ఉబైద్ షా దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. పీఎస్ఎల్-2025లోనూ సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు ఆసియా కప్నకు ఎంపిక చేశారు . అదేవిధంగా ఈ టోర్నీలో పాకిస్తాన్ షాహీన్స్ స్పిన్ బౌలింగ్ విభాగాన్ని సుఫియాన్ మోఖిమ్ లీడ్ చేయనున్నాడు. సుఫియాన్ ప్రస్తుతం పాక్ టీ20 జట్టులో కీలక స్పిన్నర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?కాగా ఈ టోర్నీలో పాకిస్తాన్ షాహీన్స్ జట్టు ఇండియా-ఎ, ఒమన్, యూఎఈలతో పాటు గ్రూప్-బిలో ఉంది. ఈ టోర్నీ ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లో ఒమన్-పాక్ జట్లు తలపడనున్నాయి. అనంతరం నవంబర్ 16న చిరకాల ప్రత్యర్ధులు పాక్-భారత్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఇండియా కెప్టెన్గా జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు.పాక్ జట్టుముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ (కెప్టెన్), అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, మాజ్ సదాకత్, మహ్మద్ ఫైక్, ముహమ్మద్ ఘాజీ ఘోరి, మహ్మద్ నయీమ్, మహ్మద్ సల్మాన్, మహ్మద్ షాజాద్, ముబాసిర్ ఖాన్, సాద్ మసూద్, షాహిద్ అజీజ్, సుఫియాన్ మొకిమ్, ఉబైద్ షారైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత A జట్టు: ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్) (వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్కుమార్ వైశాక్, యుద్ద్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ
బిజినెస్
ఇల్లు కొనడానికి ఈఎంఐ: టెకీ సలహా..
ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది చాలామంది కల. ఈ కల నెరవేర్చుకోవడానికి.. లోన్ తీసుకోవడం లేదా ఇతరుల దగ్గర అప్పు చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఆర్ధిక ఇబ్బందులను కలిగిస్తాయని, హోమ్ లోన్ తీసుకుంటే వచ్చే సమస్యలు.. ఎలా ఉంటాయో ఒక టెకీ తన అబుభవాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.రూ.53 లక్షల లోన్ తీర్చడానికి తనకు ఆరు సంవత్సరాల కాలం పట్టిందని రెడ్దిట్ పోస్టులో వెల్లడించారు. అంతే కాకుండా నెలవారీ ఈఎంఐ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ఒత్తిడిని కలిగిస్తుందో కూడా పేర్కొన్నాడు.2019లో రూ. 53 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాను. 2025 నవంబర్ చివరి నాటికి లోన్ క్లియర్ చేసాను. అంటే ఈ లోన్ చెల్లించడానికి 6 సంవత్సరాల సమయం పట్టింది. ఎవరూ హోమ్ లోన్ తీసుకోవద్దని.. ఈ సందర్భంగా ఆ టెకీ సలహా ఇచ్చాడు. ఎందుకంటే అతిగా ఆలోచించేవారు.. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.రూ.14 లక్షలు వడ్డీతో..జర్మనీలోని ఒక ఆటోమోటివ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కారణంగా.. లోన్ తొందరగా క్లియర్ చేయగలిగాను. నేను తీసుకున్న రూ. 53 లక్షల లోనుకు.. రూ.14 లక్షలు వడ్డీతో కలిపి.. మొత్తం రూ.67 లక్షలు చెల్లించాను. విదేశాల్లో ఉద్యోగం చేయడం.. లోన్ చెల్లించడంలో చాలా సహాయపడింది.ఇల్లు కొనడం మొదట్లో భావోద్వేగంగా ఉంటుంది, కానీ నిర్వహణ సమస్యలు ఎక్కువైనప్పుడు.. భావోద్వేగం భారమవుతోంది. 'ఇంటిని సొంతం చేసుకోవడం అంటే.. దాని సమస్యలను కూడా సొంతం చేసుకోవడమే' అని ఆ టెకీ పేర్కొన్నాడు. నేను లోన్ తీసుకుని కొనుగోలు చేసిన ఇల్లు విలువ.. ఇప్పుడు కోటి రూపాయలు. కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ దాదాపు ఖాళీ అని పేర్కొన్నాడు.హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయంటే.. ఇది వ్యక్తులను మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మరింత డబ్బు ఆదా చేసేలా ప్రేరేపిస్తుందని ఆ టెకీ పేర్కొన్నాడు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ అభినందిస్తున్నారు.ఇదీ చదవండి: 39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్!
మహిళలకు ‘ఉద్యోగిని’ భరోసా.. దరఖాస్తు విధానం..
భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. స్వయం ఉపాధి సాధించాలనుకుంటున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం ‘ఉద్యోగిని’ పథకం ద్వారా అండగా నిలుస్తోంది. దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆర్థికంగా స్థిరపడేలా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు వడ్డీ లేని రుణాలు లేదా తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నారు. దాంతోపాటు రుణాల చెల్లింపులో సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు.. దరఖాస్తు విధానం.. వడ్డీ.. వంటి వివరాలు చూద్దాం.‘ఉద్యోగిని’ పథకం వివరాలు‘ఉద్యోగిని’ అనేది కేంద్ర ప్రభుత్వం (కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో) అమలు చేస్తున్న పథకం. ఇది మహిళలు సొంతంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.ఎవరు అర్హులు?దరఖాస్తుదారు మహిళ వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సాధారణంగా రూ.2,00,000 మించకూడదు.కొన్ని వర్గాల మహిళలకు (ఉదా: వితంతువులు, వికలాంగులు, దళిత మహిళలు) ఈ వార్షిక ఆదాయ పరిమితి వర్తించదు.దరఖాస్తుదారు ఇంతకుముందు ఏ ఆర్థిక సంస్థ నుంచి తీసుకున్న రుణాలకూ ఎగవేతదారుగా (Defaulter) ఉండకూడదు.కొన్ని రాష్ట్రాల్లో (ఉదా: కర్ణాటక) ఆ రాష్ట్ర శాశ్వత నివాసితులై ఉండాలి. పథకం అమలు తీరు రాష్ట్రాల వారీగా స్వల్పంగా మారవచ్చు.లోన్ ఎంత వరకు ఇస్తారు?ఈ పథకం కింద మహిళలు గరిష్టంగా రూ.3,00,000 వరకు రుణం పొందవచ్చు. ఈ రుణానికి మహిళలు ఎలాంటి సెక్యూరిటీ/ హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు.లోన్ను ఎప్పటిలోపు తీర్చేయాలి?సాధారణంగా ఈ లోన్ తిరిగి చెల్లించడానికి బ్యాంకులు 3 నుంచి 7 సంవత్సరాల వరకు సమయాన్ని ఇస్తాయి. ఇది తీసుకున్న లోన్ మొత్తం, వ్యాపార స్వరూపం, బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.దరఖాస్తు విధానంఉద్యోగిని పథకాన్ని కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్లు అందిస్తాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయా సంస్థల వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడాలి.దరఖాస్తుదారులు తమకు దగ్గరలోని పైన పేర్కొన్న బ్యాంకు శాఖను సందర్శించాలి.దరఖాస్తు పత్రాన్ని నింపి, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి.రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో లేదా ఆన్లైన్ పోర్టల్లో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.వడ్డీ వివరాలు..షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (Disabled), వితంతువులు (Widows) వంటి ప్రత్యేక వర్గాలకు చెందిన మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు. లోన్ మొత్తంలో 50% వరకు సబ్సిడీ (గరిష్టంగా దాదాపు రూ.90,000 వరకు) లభిస్తుంది. అంటే కొంత లోన్ను ప్రభుత్వమే భరిస్తుంది.ఇతర వర్గాల మహిళలకు..జనరల్, ఓబీసీ మహిళలకు వడ్డీ 10% నుంచి 12% మధ్య ఉంటుంది. ఈ వడ్డీ రేటు బ్యాంకు, ఈ పథకం రాష్ట్ర వాటా అమలును బట్టి స్వల్పంగా మారవచ్చు. వీరికి కూడా లోన్ మొత్తంలో 30% వరకు సబ్సిడీ లభిస్తుంది.కావాల్సిన పత్రాలుపూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్ఆధార్ కార్డుపుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంచిరునామా ధ్రువీకరణ పత్రంకుటుంబ వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రంకుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)బీపీఎల్ కార్డు (ఉంటే)పాస్పోర్ట్ సైజు ఫోటోలుఏ వ్యాపారానికి దరఖాస్తు చేస్తున్నారో దాని ప్రణాళిక (Business Plan)ఎలాంటి బిజినెస్ ఐడియాలు ఉండాలి?ఈ పథకం ద్వారా దాదాపు 88 రకాల చిన్న వ్యాపారాలకు రుణాలు అందిస్తున్నారు.ఉదాహరణకు:అగరబత్తీలు/కొవ్వొత్తుల తయారీబేకరీ, క్యాంటీన్, కేటరింగ్ సేవలుగాజుల తయారీబ్యూటీ పార్లర్వంట నూనెల వ్యాపారంపండ్లు, కూరగాయల అమ్మకంచేనేత/వస్త్రాలపై ఎంబ్రాయిడరీ పనులుపాలు/డెయిరీ ఉత్పత్తుల యూనిట్పాపడ్/జామ్/జెల్లీ తయారీపుస్తకాలు/నోట్బుక్స్ తయారీక్లీనింగ్ పౌడర్, కాఫీ, టీ పౌడర్ తయారీ మొదలైనవి.ఈ వ్యాపారాలకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.ఇదీ చదవండి: రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా?
మస్క్ సారథ్యంలోని కంపెనీ ఐపీఓకి రానుందా?
ఎలాన్ మస్క్ తన రాకెట్ తయారీ సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)ను పబ్లిక్ కంపెనీగా మార్చబోతున్నట్లు హింట్ ఇచ్చారు. టెస్లా 2025 వాటాదారుల సమావేశంలో ఆయన చేసిన ప్రకటన వల్ల స్పేస్ఎక్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) వచ్చే అవకాశం ఉంటుందని కొందరు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.టెస్లా (Tesla) 2025 వాటాదారుల సమావేశంలో మాట్లాడుతూ మస్క్ స్పేస్ఎక్స్ ఐపీఓ గురించి వ్యాఖ్యలు చేశారు. ‘టెస్లా వాటాదారులు స్పేస్ఎక్స్ వృద్ధిలో పాల్గొనడానికి ఏదైనా మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాను. అది చాలా మేలు చేస్తుంది. స్పేస్ఎక్స్ కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాల్లో పాలుపంచుకోవడానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే ఇతర కంపెనీల్లో స్టాక్స్ కలిగి ఉన్న మద్దతుదారులు స్పేస్ఎక్స్ స్టాక్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, ఏ సమయంలో అది జరుగుతుందో కచ్చితంగా చెప్పలేను. అయితే ఏదో ఒక సమయంలో మాత్రం స్పేస్ఎక్స్ పబ్లిక్ కంపెనీగా మారాలి’ అని అన్నారు.ఈ వ్యాఖ్యలు ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల్లో ఒకటైన స్పేస్ఎక్స్ భవిష్యత్తుపై, సాధారణ ప్రజలు పెట్టుబడి పెట్టే అవకాశంపై ఊహాగానాలకు దారితీశాయి.స్పేస్ఎక్స్2002లో ఎలాన్ మస్క్ దీన్ని స్థాపించారు. స్పేస్ఎక్స్ (స్పేస్ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్ప్) టెక్సాస్లోని బ్రౌన్స్ విల్లేలో ఉన్న స్టార్ బేస్లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. లో-ఎర్త్ ఆర్బిట్ నుంచి అంతరిక్ష నౌకను విజయవంతంగా తిరిగి భూమిపైకి తెచ్చిన సంస్థగా గుర్తింపు పొందింది.ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అంతరిక్ష నౌక (డ్రాగన్ 2)ను విజయవంతంగా డాక్ చేసింది.స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లు పునర్వినియోగానికి వీలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా?
ప్రపంచ కుబేరుడి ఆనంద తాండవం!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరింత సంపన్నుడవుతున్నాడు. కంపెనీ సీఈవోగా ఎలాన్ మస్క్కు దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన గరిష్ట వేతన ప్యాకేజీకి టెస్లా వాటాదారులు ఆమోదించారు. టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని కంపెనీ బోర్డు ప్రకటించబడింది. ఆమోదం అనంతరం వేదికపైకి వెళ్లిన మస్క్ కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్ ‘ఆప్టిమస్’తో కలిసి నృత్యం చేస్తూ ఈ విజయాన్ని జరుపుకున్నారు.ఈ ఘట్టం టెస్లా (Tesla) భవిష్యత్తు రోబోటిక్స్, కృత్రిమ మేధస్సుతో (AI) ఎంత బలంగా ముడిపడి ఉందో సూచిస్తోంది. మస్క్ ప్రకారం.. ఆప్టిమస్ భవిష్యత్తులో తయారీ, సరఫరాలు, వ్యక్తిగత సహాయక సేవల వరకు విస్తరించగలదు. “ఇతర కంపెనీల వాటాదారుల సమావేశాలు బోరింగ్గా ఉంటాయ. కానీ మనవి ఎప్పుడూ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. దీన్ని చూడండి.. ఇది అద్భుతం!” అంటూ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. టెస్లా ఇప్పుడు “కేవలం కార్ల కంపెనీ కాదు.. రోబోటిక్స్, AI ఆధారిత కొత్త యుగానికి నాంది” అని ప్రకటించారు.Tesla’s Optimus robots outperformed their fellow robot, Elon in dancing 😂pic.twitter.com/hLBnvZSPuL— SMX 🇺🇸 (@iam_smx) November 6, 2025సాటిలేని వేతన ప్యాకేజీప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాని 1 ట్రిలియన్ డాలర్ల వరకూ వేతన ప్యాకేజీని అందుకునే అవకాశాన్ని టెస్లా వాటాదారులు ఎలాన్ మస్క్కు కల్పించారు. వచ్చే 10 సంవత్సరాల్లో మస్క్ 878 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా స్టాక్ను సంపాదించే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం కంపెనీ నిర్దిష్ట మైలురాళ్లను చేరుకున్నప్పుడు మాత్రమే అమలులోకి వస్తుంది.గరిష్ట వేతన ప్యాకేజీ అందుకోవాలంటే మస్క్ సాధించాల్సిన లక్ష్యాలు.. 2 కోట్ల వాహనాలు, 10 లక్షల రోబోటాక్సీలు, 10 లక్షల హ్యూమనాయిడ్ రోబోట్ల విక్రయాలు సాధించాలి. సుమారు 400 బిలియన్ డాలర్ల స్థూల లాభాన్ని కంపెనీకి ఆర్జించిపెట్టాలి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే, టెస్లా ప్రస్తుత 1.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కనీసం 8.5 ట్రిలియన్ డాలర్ల వరకు తీసుకెళ్లాలి.నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ వంటి కొంతమంది ప్రధాన పెట్టుబడిదారులు ఈ ప్యాకేజీకి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, టెస్లా బోర్డు దీన్ని మస్క్ను కంపెనీకి కట్టిపడేయడానికి అవసరమైన ప్రోత్సాహంగా భావించింది. బోర్డు అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రణాళిక టెస్లా వాటాదారులకు కూడా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
ఫ్యామిలీ
మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!
మా పెళ్లయి ఆరు సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు. మాది అన్యోన్య దాంపత్యమే. అయితే. ఇటీవలే ఆయనకు ఒకావిడతో పరిచయం అయింది. అప్పటినుంచి నన్నూ, పిల్లలనీ పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావడం, వెళ్లడం.... అదేమని అడిగితే, నా ఇష్టం అని సమాధానం చెబుతారు. నామీద ఎంతో ఇష్టంతో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా నాతో ఉన్నాయన ఈ మధ్య నాకు క్రమేపీ దూరమై మరో మహిళకు దగ్గరవుతున్నారు. మా బంధువులు ఇది తెలుసుకుని ఆయనకు ఆమె మందుపెట్టి తనవైపు తిప్పుకున్నదని, అందుకే ఆమె వ్యామోహంలో పడిపోయి ఉంటాడని చెబితే రెండుసార్లు మందు కూడా కక్కించాం. అయినా ఆయనలో ఎలాంటి మార్పూ రాలేదు. మళ్లీ ఇంకోసారి మందు కక్కించమంటున్నారు. అసలు నిజంగా ఒక వ్యక్తిని మందుపెట్టి ఇలా లోబరచుకోవడం జరుగుతుందా? మేము ఎన్నిసార్లు కక్కించాలి?– స్వరాజ్యలక్ష్మి, తణుకుమందుపెట్టడం, మందు కక్కించడం రెండూ ఫార్సే! అనాదిగా మనలో నాటుకు΄ోయిన మూఢనమ్మకాలకు ఇది నిదర్శనం తప్ప వీటిలో ఏమాత్రం నిజం లేదు. విషప్రయోగం చే సి, ఒక వ్యక్తిని హత్య చేయవచ్చేమోగాని, ఒక వ్యక్తిని లొంగదీసుకోవడానికి మనసు మార్చి మరొకరివైపు మళ్లించడానికి మందులంటూ ఏమీ లేవు. ఉండవు. మనకున్న కొన్ని నమ్మకాల వల్ల మందు పెట్టడం, మంత్రం వేయడం, చేతబడి చేయించడం లాంటివి ఉన్నాయని మన పూర్వీకులు మనకు నూరి΄ోశారు. ఈ మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని మందు పెట్టే వారు కొందరు, ఆ పెట్టిన మందును కక్కించే స్పెషలిస్టులు కొందరూ తయారయ్యారు. ఎప్పుడో కొన్ని రోజుల కిందట పెట్టిన మందులు మాకులూ ఇన్నాళ్లు కడుపులో ఉందే అవకాశమే లేదు. అది జీర్ణమైనా అవాలి లేదా విరేచనం ద్వారా రెండు రోజుల్లో బయటపడాలే తప్ప అన్నేసి రోజులు అలాగే లోపల అంటిపెట్టుకుని΄ోయే అవకాశమే లేదు. శాస్త్రీయమైన ఇలాంటి నిజాలు తెలియక చాలామంది అవన్నీ నిజమని మీలాగా అ΄ోహపడుతుంటారు. ఇప్పటికయినా మీరు ఆ పెట్టని మందును కక్కించే ప్రయత్నాలు విరమించి, మీ ఆయన ఎందుకలా మూడోవ్యక్తి వైపు ఆకర్షితులవుతున్నారో ఆలోచించండి. మీలో నచ్చనిది, ఆవిడలో నచ్చినది ఏదైనా ఉందేమో మీకు మీరుగా ఆలోచించండి లేదా ఓర్పుగా నేర్పుగా ఆయన నుంచి తెలుసుకుని నిదానంగా ఆయనను మళ్లీ మీవైపు తిప్పుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మీలో ఎలాంటి నెగటివ్స్ లేకపోయినా, కొందరు మగవారు మనస్తత్వరీత్యా ఇలా ఇతరులవైపు ఆకర్షితులవుతారు. అదే నిజమైతే, మీరు ఇద్దరూ కలిసి మానసిక నిపుణులను సంప్రదిస్తే, వారు మరింత లోతుగా పరిశీలించి ఇరువురికీ కౌన్సెలింగ్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.( మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి:
అడవి – ఆమె
చిన్నప్పుడు ‘అనగనగా ఒక అడవి ఉంది’ లాంటి కథలు మాత్రమే కాదు... అడవులు పర్యావరణానికి ఎంత ప్రాణప్రదమో చెప్పే కథలెన్నో విన్నది రీటా. కట్ చేస్తే... రీటా బెనర్జీ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్. ‘అదిగో...అడవి మాట్లాడుతోంది వినండి’ అంటాయి ఆమె చిత్రాలు. గ్రీన్ ఆస్కార్ (పాండా అవార్డ్)లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది.రీటా బెనర్జీకి అడవి చిరకాల నేస్తం. వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్గా మూడు దశాబ్దాల ప్రయాణంలో అడవితో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. అడవి లోతుపాతులు తెలిసిన సూక్ష్మగ్రాహి. ది టర్టిల్ డైరీస్, ది వైల్డ్ మీట్ ట్రయల్, ది అమూర్ ఫాల్కన్ స్టోరీ, ఏ షాల్ టు డైఫర్... మొదలైన చిత్రాలలో అడవి సూక్ష్మరూపం నుంచి విశ్వరూపం వరకు చూపించింది.ఎ షాల్ టు డై ఫర్టిబెటన్ జింకకు ముప్పు పొంచి ఉంది. ఈ జింక ఉన్నిని కోసి షాతుష్ శాలువాలు నేస్తారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. షాతుష్ శాలువాల వ్యాపారం నిషేధించినప్పటికీ చాటుమాటుగా జరుగుతూనే ఉంది. వైల్డ్లైఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ కశ్మీర్లోయలో నిర్వహించిన సర్వేలో షాతుష్ శాలువాల తయారీలో 14,293 మంది వరకు పాల్గొంటున్నారని తేలింది. జమ్మూ కశ్మీర్ వణ్య్రపాణుల సంరక్షణ చట్టంలోని లొసుగులు ఉపయోగించుకొని అక్రమంగా షాతుష్ శాలువాలు నేస్తున్నారు. ఈ అక్రమాలు ఎందుకు కొనసాగుతున్నాయి అనేదాని గురించి ‘ఎ షాల్ టు డై ఫర్’ చిత్రాన్ని తీసింది రీటా బెనర్జీ.పర్యావరణం, వన్య్రపాణుల చిత్రాలకు సంబంధించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సీఎంఎస్లో ఈ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో టెక్నికల్ ఎక్స్లెన్స్ అవార్డ్ గెలుచుకుంది.శక్తిమంతమై దృశ్యభాషపంచ్ డైలాగ్లకు కాదు ‘పవర్ ఆఫ్ విజువల్ వొకాబులరీ’కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది రీటా. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రొఫెసర్లు. ప్రకృతి ప్రేమికులు. చిన్న వయసు నుంచి పర్యావరణ హిత విషయాలను పిల్లలకు చెబుతుండేవారు. ప్రమాదంలో ఉన్న పాములను రక్షించేవాడు తండ్రి. వారి ఇంటి వెలుపల ఉన్న గుల్మొహర్ చెట్టుకు పక్షిగూళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. కాలేజీ రోజుల్లో రీటాకు పాత ఆగ్ఫా అనలాగ్ కెమెరాను బహుమతిగా ఇచ్చాడు తండ్రి. ఆ కెమెరా తనకు కొత్తదారిని చూపించింది. ఫిల్మ్మేకింగ్లోకి రావడానికి ఆ పాత కెమెరా తొలి మెట్టు అయింది. డిగ్రీ పూర్తయిన తరువాత ‘రివర్బ్యాంక్ స్టూడియోస్’లో చేరింది. ప్రముఖ పర్యావరణవేత్త మైక్ పాండే నడుపుతున్న స్టూడియో అది.కెమెరా లెన్స్లో నుంచి ప్రతిసారీ రీటాకు కొత్త ప్రపంచం కనిపించేది.గ్రీన్హబ్ నెట్వర్క్అస్సాంలోని తేజ్పూర్లో ‘గ్రీన్హబ్ నెట్వర్క్’ ప్రారంభించిన రీటా, ఈశాన్య భారతంలోని మారుమూల గ్రామాల యువత పర్యావరణ అంశాలను డాక్యుమెంట్ చేసేలా తీర్చిదిద్దింది. ‘అడవి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి ఫిల్మ్మేకింగ్ ఉపకరిస్తుంది. చెట్టు నుంచి పుట్ట వరకు ప్రతిదీ అడవికి తమ వంతుగా సహాయపడుతుంది. అవి అడవితో పాటు వృద్ధి చెందుతాయి. ఈ సమష్టి వృద్ధి అందమైనది. ఎన్నో విషయాలు నేర్చుకోదగినది’ అంటుంది రీటా.అరుణాచల్ప్రదేశ్లోని నైషీ తెగ ప్రజలకు జంతువులతో అనుబంధం ఉన్నప్పటికీ, మాంసం కోసం వాటిని వేటాడుతారు. వాటి ఈకలు, ఎముకలను అమ్ముకుంటారు. ఇలాంటి విషయాలెన్నో ‘ది వైల్డ్ మీట్ ట్రయల్’ చిత్రం ద్వారా చూపించింది రీటా. ఈ చిత్రం పాండా అవార్డ్ గెలుచుకుంది. ‘వేట అనేది పరిశ్రమ స్థాయికి చేరి రాష్ట్రాల సరిహద్దులను దాటింది. వన్య ప్రాణులకు వేట ఎలా ముప్పుగా మారిందో మా చిత్రం ద్వారా చూపాం’ అంటుంది రీటా.నేషనల్ జాగ్రఫిక్ అశోకా అవార్డ్, సీఎంఎస్ పృథ్వీరత్న అవార్డ్, ఆర్బీఎస్ ఎర్త్ హీరోలాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు మూడు గ్రీన్ ఆస్కార్ అవార్డ్లు అందుకుంది రీటా బెనర్జీ.వెలగాలి ఆశాదీపాలుఏమాత్రం ఇక ఆశ లేదు అని మనం ఆగిపోతే నిజంగానే ఏమీ జరగదు. ఆశాదీపాలు వెలిగితేనే ఆ వెలుగులో సమస్యలకు పరిష్కారాలు చూపే కొత్త దారులు కనిపిస్తాయి. ఒక లక్ష్యం అంటూ ఏర్పాటు చేసుకొని పనిచేస్తుంటే ఎక్కడో ఒకచోట తప్పకుండా ఫలితం దక్కుతుంది. అపనమ్మకాలతో కాకుండా ఏదీ చేసినా గట్టి విశ్వాసంతో చేయాలి. సమస్యలలాగే వాటి పరిష్కారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే ఆ పరిష్కారాల వైపు మనం దృష్టి పెడుతున్నామా లేదా అనేది అసలు సమస్య. ఉదాహరణకు... తీ ర్రపాంతాలలో నివసించే ప్రజల మాట మనం నిజంగా వింటున్నామా? వారితో కలిసి పనిచేస్తున్నామా? ఆ అనుభవాల నేపథ్యంలో సరిౖయెన నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలి.– రీటా బెనర్జీ
సరిగమల్లో నవ మాసాలు
స్త్రీ గర్భం దాల్చాక శిశు జననం వరకూ ఎన్నో ఆనంద ఘడియలు, అన్నే ఆందోళనలు. తల్లి ఆరోగ్యమూ, బిడ్డ ఆరోగ్యమూ కాపాడుకోవాలి. తల్లితో లోపలి బిడ్డ బంధం బలపడాలి. ఇవన్నీ సంగీతం వల్ల సాధ్యమవుతాయంటోంది చెన్నైకి చెందిన మ్యూజిక్ టీచర్ దివ్యలక్ష్మి. గర్భం దాల్చిన తల్లులకు శాస్త్రీయ సంగీతం నేర్పేందుకు దివ్య తయారు చేసిన ఆరు నెలల కోర్సుకు కాబోయే తల్లులు సరిగమలతో బదులిస్తున్నారు. వివరాలు...దివ్యలక్ష్మి కమలాకన్నన్కు ఈ ఐడియా తన కూతురిని చూశాక వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చదివి ఆ తర్వాత బాల్యం నుంచి నేర్చుకుంటున్న కర్నాటక సంగీతంలోనే తన జీవితాన్ని నిమగ్నం చేయాలని నిశ్చయించుకున్న దివ్య లక్ష్మి మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి సంగీతంలో పట్టా తీసుకుంది. ఆ తర్వాత సౌత్ చెన్నైలో ఆమె ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇవ్వడమే కాక అక్కడి కిల్పార్క్ గార్డెన్లో ‘ఆరోహణ’ పేరుతో సంగీత పాఠశాల నెలకొల్పింది. కర్నాటక, హిందూస్తాని, ఇన్స్ట్రుమెంటల్ సంగీతాలలో ఇక్కడ శిక్షణ ఇస్తూ గుర్తింపు పొందిన దివ్యలక్ష్మి లాక్డౌన్ రావడంతో డీలా పడింది. ఇన్స్టిట్యూట్ మూసేసింది. ఆ సమయానికి ఆమె గర్భంతో ఉంది. ఇంట్లో తనే సంగీత సాధన చేస్తూ వెళ్లింది.కుమార్తె ఆరోహి పుట్టాక ఆ పాప ఒకటిన్నర సంవత్సరాల వయసుకే విపరీతంగా జ్ఞాపకశక్తి ప్రదర్శించడం దివ్యలక్ష్మికి ఆశ్చర్యం కలిగించింది. మూడున్నరేళ్లు వచ్చేసరికి ఆరోహి వయొలిన్ చేత పట్టుకుని సరిగమలు పలికించడం ఇంకా సంతోషపెట్టింది. ఆరోహి తన కడుపులో ఉన్నప్పుడు తాను సాధన చేసిన శాస్త్రీయ సంగీతం పాప తెలివితేటల ఎదుగుదలకు ఉపయోగపడిందని దివ్యలక్ష్మికి అనిపించింది. గర్భవతులకు శాస్త్రీయ సంగీతం నేర్పిస్తే, వారు డెలివరీ అయ్యేంత వరకు శాస్త్రీయ సంగీతం వింటూ ఉంటే పుట్టబోయే బిడ్డకు అన్ని విధాలా ఉపయోగమని అర్థం చేసుకుంది. ఈ విషయాన్ని మరింతగా నిర్థారించుకోవాలని నిశ్చయించుకుంది.మ్యూజిక్ థెరపీకొన్ని అధ్యయనాల ప్రకారం మ్యూజిక్ థెరపీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి, గుండె స్పందనలకు బాగా పని చేస్తుందని నిర్థారితమైంది. సంగీతం గర్భిణుల్లో ఉండే యాంగ్జయిటీ, లో–బీపీ వంటి సమస్యలను దూరం చేయగలదని స్వీయ పరిశీలన ద్వారా అర్థం చేసుకున్న దివ్యలక్ష్మి తమ కాలనీలో ఉన్న నలుగురైదుగురు గర్భవతులకు ప్రయోగాత్మకంగా శాస్త్రీయ సంగీతం నేర్పించసాగింది. వారికి ఆ పాఠాలు ఆహ్లాదం కలిగించడమే కాదు ప్రసవాలు కూడా కాంప్లికేషన్స్ ఎదురవకుండా జరిగాయి. దాంతో ఆరునెలల కోర్సు తయారు చేసిన దివ్యలక్ష్మి మళ్లీ సంగీత పాఠశాల తెరిచి ఇప్పుడు గర్భిణులకు సంగీత పాఠాలు చెబుతోంది.ఆమె దగ్గర నేర్చుకోలేకపోయినా, ఉన్నచోట నేర్చుకోలేకపోయినా, గర్భిణులు తరచూ ఆహ్లాదపరిచే సంగీతం వినడం, మంచి పాటలు హమ్ చేసుకుంటూ ప్రశాంతంగా గడపడం వల్ల మాత్రం కచ్చితంగా మేలు జరుగుతుంది.నాదమే వైద్యం‘సంగీతంలో నాదం ఉంటుంది. ఆ నాదం గర్భిణీ స్త్రీ శరీరంలోని నీటిలో అనునాదం పుట్టిస్తుంది. ఆమె ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడమే కాకుండా పిండస్థ శిశువు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాదు... ఇలా సంగీత పాఠాల కోసం వచ్చే గర్భిణుల మధ్య ఒక స్నేహం ఏర్పడి ఒకరికొకరు అన్నట్టుగా ఉండటంతో ఆందోళనలు పూర్తిగా పోతాయి’ అంటోంది దివ్యలక్ష్మి.
మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చారిత్రాత్మక విజయం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆది నుంచి చురుకైన ఉపన్యాసాలు, పదునైన విమర్శలతో దూసుకుపోయిన మామ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన ఈ విజయం వెనుక ప్రముఖంగా నిలిచింది ఎవరో తెలుసా?జోహ్రాన్ మమ్దానీ భార్య కళాకారిణి, యానిమేటర్, రైటర్ రమా దువాజీ (Rama Duwaji). భర్త విజయంలో తన వంతు ప్రచారంలో కీలక భూమిక నిర్వహించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయపదంగా మారిందని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనతాను ఎక్కువగా వెలుగులోకి రాకుండానే రమా దువాజీ నిశ్శబ్దంగా తెర వెనుక ఉంటూనే భర్త విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్ విలక్షణమైన ప్రచార గుర్తింపు, సోషల్ మీడియా ఉనికిని రూపొందించడంలో తన ఘనతను చాటుకున్నారు. ఎన్నికల రోజు వరకు జరిగే చర్చలు, ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండేవారు.. అలాగే మేయర్ రేసు గురించి ఆన్లైన్లో అరుదుగా పోస్ట్ చేసేవారు. అయితే మమ్దానీ ఆశ్చర్యకరమైన ప్రాథమిక విజయం తర్వాత జూన్లో ఆమె ఎన్నికలకు సంబంధించిన ఏకైక సోషల్ మీడియా పోస్ట్ విశేషంగా నిలిచింది. “ఇంతకంటే గర్వం కారణం ఏముంటుంది.” ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. చదవండి: పనస కాయ చిప్స్తో ఏడాదికి రూ. 12 లక్షలుతాజాగా మంగళవారం నాటి ఓటింగ్ సమయంలో మమ్దానీ తన ఓటు వేసే క్రమంలో భర్తకు అండగా నిలిచారు. ది డైలీ షోలో కనిపించినప్పుడు భర్త పక్కనే కొండంత అండగా ఉండటంతోపాటు, క్వీన్స్లోని ఫారెస్ట్ హిల్స్ స్టేడియంలో ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, సెనేటర్ బెర్నీ సాండర్స్తో కలిసి మమ్దానీ తన చివరి ర్యాలీ ప్రసంగం సమయంలో కూడా 10వేల మంది మద్దతుదారులతో పాటు ఆమె కూడా కనిపించింది. దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్-అమెరికన్ ఆర్టిస్ట్ దువాజీ. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్కు వెళ్లినా ఆమె డల్లాస్లో పెరిగారు. దుబాయ్లో చదివారు. ఆమె అనేక జర్నల్స్ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి మమ్దానీ ఎన్నికైనపుడు 2021లో దువాజీ, మమ్దానీ డేటింగ్ యాప్ హింజ్లో కలుసుకున్నారు. వారి మొదటి డేట్ బ్రూక్లిన్లోని యెమెన్ కేఫ్ అయిన క్వాహ్వా హౌస్లో జరిగింది. మమ్దానీ తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు. గత డిసెంబర్లో దుబాయ్లో వేడుకలు జరుపుకున్న తర్వాత, ఫిబ్రవరిలో లోయర్ మాన్హట్టన్లోని ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్, ఇలస్ట్రేషన్ వర్క్స్తో నిండి ఉంటాయి. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్త పరిచే అనేక రచనలు కూడా చూడొచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మెడ్రన్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం.
ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో నటి దివి (ఫొటోలు)
Kamal Haasan: బార్బర్ షాపులో పనిచేసి.. విశ్వనటుడిగా ఎదిగి.. (ఫోటోలు)
చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)
'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్ ఈవెంట్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)
కాంత ట్రైలర్ లాంచ్.. ఒకే వేదికపై దుల్కర్, రానా (ఫోటోలు)
ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)
#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)
విష్ణు విశాల్ ’ఆర్యన్‘ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
అంతర్జాతీయం
‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్
న్యూఢిల్లీ: హార్యానా ‘ఓట్ చోరీ’ ఆరోపణల సందర్భంగా రాహుల్ గాంధీ చూపిన ఫొటోపై బ్రెజిలియన్ మోడల్ లారెస్సా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఈ మోడల్ ఫొటోతో ఏకంగా 22 పేర్లు నమోదై ఉన్నాయని రాహుల్ గాంధీ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ఎన్నికల జాబితాలో ఓ బ్రెజిలియన్ మోడల్ ఫొటో ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో లారెస్సా ఎక్స్ వేదికపై స్పందించారు. రాహుల్ ఆరోపణలపై బ్రెజిలియన్ మోడల్ లారిస్సా స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని అన్నారు. తన వాదనను ఆమె ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్టు చేస్తూ వివరించారు. భారతదేశంలో ఎన్నికల ప్రయోజనాల కోసం తన చిత్రాన్ని దుర్వినియోగం చేయడంపై ఆమె ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె పోర్చుగీస్ భాషలో మాట్లాడుతూ ‘గైస్, నేను మీకు ఒక జోక్ చెబుతాను... ఇది చాలా విచ్రితమైనది.. వారు నా పాత ఫొటోను ఉపయోగించారు. అది నా చిన్నప్పటిది. భారతదేశంలో ఓటు వేయడానికి నా ఫొటోను వాడారు. ఒకరితో ఒకరు పోరాడేందుకు నన్ను భారతీయురాలిగా చిత్రీకరించారు. ఎంత పిచ్చి పనో చూడండి’ అని అన్నారు. The name of the Brazilian Model seen in @RahulGandhi's press conference is Larissa. Here's her reaction after her old photograph went viral. pic.twitter.com/K4xSibA2OP— Mohammed Zubair (@zoo_bear) November 5, 2025ఈ వీడియోలో లారిస్సా.. ఒక రిపోర్టర్ ఇన్స్టాగ్రామ్లో తనను భారతదేశ ఎన్నికల్లో ఓటు వేయడం గురించి అడిగారని వెల్లడించారు. ఇదేవిధంగా తన స్నేహితుడొకరు ఇదే ఫొటోను పంపారన్నారు. ఇది ‘నమ్మశక్యం కానిది’, ‘వింతైనది’ అని ఆమె పేర్కొన్నారు. కాగా బ్రెజిలియన్ మోడల్ లారిస్సా పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. LIVE: #VoteChori Press Conference - The H Files https://t.co/IXFaH9fEfr— Rahul Gandhi (@RahulGandhi) November 5, 2025ఇది కూడా చదవండి: ‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్ సరికొత్త వాదన
‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్ సరికొత్త వాదన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్-పాక్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చానంటూ పాడినపాటే పాడారు. అలాగే భారత్-పాకిస్తాన్ వివాదంలో ఏడు విమానాలు కూలిపోయాయనే నిరాధార వాదనను మళ్లీ వినిపించారు. అయితే ఈసారి విమానాల సంఖ్యను పెంచడం విశేషం. ఆ రెండు అణ్వాయుధ దేశాలతో తాము వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని బెదిరించిన తర్వాతనే అవి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయని ట్రంప్ అన్నారు.మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడిన ట్రంప్ తాను.. భారత్- పాక్ మధ్య శాంతి నెలకొనేందుకు మధ్యవర్తిత్వం వహించానని మరోమారు అన్నారు. ‘నాడు నేను భారత్- పాకిస్తాన్లతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నాను. ఇంతలో ఒక వార్తాపత్రిక మొదటి పేజీలో.. వారు యుద్ధానికి దిగుతున్నారని చదివాను. ఏడు విమానాలు తగలబడ్డాయి. ఎనిమిదవది చాలావరకూ ధ్వంసం అయ్యింది. మొత్తం ఎనిమిది విమానాలు కాలిపోయాయి..’ అవి రెండూ అణ్వాయుధ దేశాలు. ‘మీరు శాంతికి అంగీకరిస్తే తప్ప నేను మీతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోను’ అని నేను వారికి చెప్పాను’ అని ట్రంప్ అన్నారు.అయితే ఢిల్లీ- ఇస్లామాబాద్లు యుద్ధం ముప్పును వ్యతిరేకించాయి. ఈ ఘర్షణకు వాణిజ్య ఒప్పందాలతో సంబంధం లేదని తెలిపాయని ట్రంప్ పేర్కొన్నారు. వెంటనే తాను స్పందిస్తూ ‘మీరు అణ్వాయుధ శక్తులు. నేను మీతో వ్యాపారం చేయడం లేదు. మీరు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినప్పుడు మేము మీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవడం లేదు’ అని స్పష్టం చేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ మర్నాడే ఆ రెండు దేశాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయని తనకు ఫోన్ వచ్చిందని ట్రంప్ తెలిపారు. దీంతో తాను వారితో ‘ధన్యవాదాలు.. వాణిజ్యం చేద్దాం’ అని చెప్పానన్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదనను భారత్ తిరస్కరించింది. పాకిస్తాన్ కమాండర్లు ఈ దాడిని ఆపాలంటూ భారత సైన్యాన్ని వేడుకున్న దరిమిలా, మే 10న కాల్పుల విరమణ జరిగిందని భారత్ స్పష్టం చేసింది. అయితే ట్రంప్.. అమెరికా మధ్యవర్తిత్వ చర్చల తర్వాతనే భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇప్పటివరకూ 60 సార్లు చెప్పారని చేశారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పౌరులను దారుణంగా హతమార్చిన దరిమిలా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.ఇది కూడా చదవండి: ‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ
చర్చలు విఫలమైతే యుద్ధమే: పాక్ రక్షణ మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి మాటల దాడికి దిగారు. ఆఫ్ఘనిస్థాన్తో శాంతి చర్చల నేపథ్యంలో ఖవాజా రెచ్చిపోయారు. తమ ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయంటూ ఆప్ఘన్ తాలిబన్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చర్చలు విఫలమైతే తాలిబాన్లతో యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య నేడు తుర్కియోలో చివరి దశలో కీలకమైన శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జియో టీవీతో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లతో చర్చలు విఫలమైతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. మాకు చాలా ఎంపికలు ఉన్నాయి. మమ్మల్ని టార్గెట్ చేయాలని చూస్తే మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. ప్రత్యక్షంగా మేము యుద్ధంలోకి దిగాల్సి వస్తుంది. ఇలా జరగదని నేను కోరుకుంటున్నా. తాలిబాన్ ప్రభుత్వం సరిహద్దు దాడులను ఆపడానికి దృఢమైన చర్యలు తీసుకునే వరకు ఆఫ్ఘనిస్థాన్తో సంబంధాలు సాధారణ స్థితికి తిరిగి రావు. నేను మొత్తం ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని నిందించడం లేదు’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ ఆండ్రాబీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సానుకూల ఫలితం కోసం ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొంటూనే ఉంటుంది అని ఆయన నొక్కిచెప్పారు. కానీ, ఆఫ్ఘనిస్థాన్ తన భూభాగం నుండి ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంపై చర్చలు ఆధారపడి ఉంటాయని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి రౌండ్ చర్చలు అక్టోబర్ 18-19 తేదీలలో దోహాలో జరిగాయి. తరువాత అక్టోబర్ 25 నుండి ఇస్తాంబుల్లో రెండవ రౌండ్ చర్చలు జరిపారు. తాజాగా మరోసారి చర్చలు జరిపేందుకు రెండు దేశాలు సిద్ధమయ్యాయి. అయితే, కాబూల్ తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కి వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలనే పాకిస్తాన్ డిమాండ్లపై ఆఫ్ఘనిస్థాన్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలమవుతున్నాయి.
‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ అత్యంత ఉత్సాహంలో ఉన్నారు. తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో మేయర్గా తాను భవిష్యత్లో చేపట్టబోయే కార్యకలాపాలను ఒక వీడియో ద్వారా వివరించారు. తాను ఇప్పటివరకూ ప్రచారంపై పెట్టిన దృష్టిని ఇకపై పాలనవైపు మళ్లిస్తానని పేర్కొన్నారు.సమర్థవంతమైన పాలనను అందించేందుకు, అందుకు అనుగుణమైన బృందాన్ని ఏర్పాటు చేయనున్నానని, శ్రేష్ఠత, సమగ్రత, నూతన మార్గాలతో సమస్యలను పరిష్కారం దశగా అడుగులు వేయనున్నానని తెలిపారు. న్యూయార్క్ అసెంబ్లీలో క్వీన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మమ్దానీ అతి పిన్న వయస్కుడైన మేయర్గా గుర్తింపు పొందారు. తన విజయం దరిమిలా మమ్దానీ ‘ఎక్స్’ ఖాతాలో ‘2025, జనవరి ఒకటిన నేను మేయర్గా మీ ముందు ఉంటాను. నూతన సంవత్పర వేళ ఈ నగరానికి కొత్త యుగం రాబోతోంది. మంచి ట్రాక్ రికార్డులు కలిగిన ప్రభుత్వశాఖల అనుభవజ్ఞులు, విధాన నిపుణులు, నైపుణ్యం కలిగిన శ్రామికులు నగరాన్ని మెరుగుపరచడానికి ముందు వరుసలో ఉంటారంటూ’ తన ప్రభుత్వ పాలనా తీరును మమ్దానీ వివరించారు. Thank you, New York City. Together we made history.Now let’s get to work. https://t.co/G7F2sbda74 pic.twitter.com/GQABMqJHgn— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) November 5, 2025తన పాలనతో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని మమ్దానీ ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా మమ్దానీ విజయం దేశంలోని డెమొక్రాట్లకు ఆనందాన్ని అందించింది. మరోవైపు పార్టీలో ధైర్యాన్ని పెంచింది, 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్కు హెచ్చరికగా మారింది. తన ప్రచారంలో మమ్దానీ శ్రామిక వర్గానికి పలు హామీలిచ్చారు. చిన్నారులకు ఉచిత వైద్యం, ఉచిత బస్సు రవాణా, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాల ఏర్పాటు తదితర హామీలను ఆయన ప్రజలకు ఇచ్చారు. మమ్దానీ తన సోషలిస్ట్ ఆదర్శాలు, ముస్లిం గుర్తింపు కారణంగా అధ్యక్షుడు ట్రంప్ నుండి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మమ్దానీ.. న్యూయార్క్ మేయర్గా విజయం సాధించి వాటిని తిప్పికొట్టారు. ఇది కూడా చదవండి: పాక్ మద్దతు.. భారత్లో మరో ఉగ్రదాడి?
జాతీయం
ఐజీఐఏలో సాంకేతిక లోపం.. 100కు పైగా విమానాలు ఆలస్యం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐఏ)లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో 100 కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని విమానయాన సంస్థలు తెలిపాయి. ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)వ్యవస్థలో సాంకేతిక సమస్యల కారణంగా, ఐజీఐఏలో విమానయాన కార్యకలాపాలు ఆలస్యం అవుతున్నాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక సిబ్బంది వారి భాగస్వాములతో చురుకుగా పనిచేస్తున్నారు. తాజా అప్డేట్ల కోసం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలతో టచ్లో ఉండాలని సూచించాయి. Delhi Airport issues a statement - "Due to a technical issue with the Air Traffic Control (ATC) system, flight operations at IGIA are experiencing delays. Their team is actively working with all stakeholders including DIAL to resolve it at the earliest. Passengers are advised to… pic.twitter.com/RZgYFTFatQ— ANI (@ANI) November 7, 2025ఢిల్లీ విమానాశ్రయంలో ప్రతిరోజూ 1,500కు పైగా విమానాల రాకపోకలు కొనసాగుతుంటాయి. తాజాగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వాటికవే విమాన ప్రణాళికలను నిర్వహించలేకపోతున్నాయి. ఆటో ట్రాక్ సిస్టమ్ (ఏఎంఎస్)కు సమాచారాన్ని అందించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఎఎంఎస్ఎస్)లో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇది విమానయాన ప్రణాళికలను అందిస్తుందని విమాన సంస్థలు పీటీఐకి తెలిపాయి. సిస్టమ్ సమస్యలు కొనసాగుతున్నందున, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అందుబాటులో ఉన్న డేటాతో విమాన ప్రణాళికలను మాన్యువల్గా సిద్ధం చేస్తున్నారు. ఇది కొంతమేరకు సమయం తీసుకునే ప్రక్రియ కావడంతో పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి.‘ఎయిర్ ఇండియా’ తన ప్రయాణికులకు సలహా జారీ చేస్తూ ‘ఢిల్లీలోని ఏటీసీ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య .. అన్ని విమానయాన సంస్థల విమాన కార్యకలాపాలను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమానాల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుందని’ తెలియజేసింది. ఇదేవిధంగా విమానయాన సంస్థలు ‘ ఇండిగో’, ‘స్పైస్జెట్’లు కూడా తమ ప్రయాణికులకు సలహా జారీ చేశాయి.
‘ఆ బీజేపీ నేతలు ఓటు దొంగలు’?: ‘ఆప్’ ఆరోపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నినదించిన ‘ఓట్ చోరీ’ ఇప్పడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లోనూ వినిపిస్తోంది. పలువురు బీజేపీ నేతలు అటు ఢిల్లీలో, ఇటు బీహార్లో.. రెండు చోట్లా ఓటు వేశారని ‘ఆప్’ ఆరోపించింది. ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కలకలానికి కారణంగా నిలిచింది. అయితే సదరు బీజేపీ నేతలు ‘ఆప్’ ఆరోపణలను ఖండిస్తూ, వివరణ ఇచ్చుకున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజాగా భారతీయ జనతా పార్టీ నేతలు ‘ఓటు దొంగతనం’ చేశారని ఆరోపించింది. వారంతా ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లోనూ, ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లనూ ఓటు వేశారని ఆరోపించింది. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాలలో నకిలీని నిరోధించేందుకు ఉద్దేశించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) డ్రైవ్ ఉన్నప్పటికీ ఇలా జరిగిందని ‘ఆప్’ పేర్కొంది. ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా, ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా అధ్యక్షుడు సంతోష్ ఓఝా, పార్టీ కార్యకర్త నాగేంద్ర కుమార్.. ఈ ముగ్గురూ ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో ఓటు వేశారని ఆరోపించారు.‘రివిజన్’ తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో కొత్తగా ఏ ఓటరూ నమోదు కాలేదని ఎన్నికల సంఘం తెలిపిందని, అయితే ఈ నేతలు బీహార్లో ఓటు ఎలా వేయగలిగారు? దీనిని చూస్తుంటే, దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం ఏ స్థాయిలో జరుగుతున్నదో ఊహించుకోవచ్చని భరద్వాజ్ అన్నారు. దీనిపై ఢిల్లీ బీజేపీ యూనిట్ వ్యాఖ్యానించకపోయినా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా వివరణ ఇచ్చుకున్నారు. తన ఓటును ఢిల్లీ నుండి తన స్వగ్రామమైన బీహార్లోని మన్సీర్పూర్ (బెగుసరాయ్)కి మార్చినట్లు ఆయన తెలిపారు. కాగా ‘ఆప్’ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఇంతవరకూ స్పందించలేదు.ఇది కూడా చదవండి: Srinagar: భారీ ఉగ్రదాడి విఫలం
Srinagar: భారీ ఉగ్రదాడి విఫలం
శ్రీనగర్: భారీ ఉగ్రదాడి కుట్రను జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. దీంతో దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీనగర్ పోలీసులు కోనఖాన్లోని మమతా చౌక్ సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తున్న సాయుధులైన ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు.‘ఇండియా టీవీ’ తెలిపిన వివరాల ప్రకారం సాధారణ వాహన తనిఖీల సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ లేని ఒక నల్లని రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిల్ పోలీసులలో అనుమానాలను రేకెత్తించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపాలంటూ సిగ్నల్ ఇవ్వగానే, రైడర్తో పాటు మరో ఇద్దరు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు అనుమానితులను షా ముతైబ్, కమ్రాన్ హసన్ షా,మొహమ్మద్ నదీమ్గా గుర్తించారు. వీరంతా ఖన్యార్లోని కావా మొహల్లాలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి ఒక కంట్రీ-మేడ్ పిస్టల్, తొమ్మిది లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. వారు ఒక ప్రణాళిక ప్రకారం ఉగ్రదాడులకు పాల్పడేవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఖన్యార్ పోలీస్ స్టేషన్లో వీరిపై ఆయుధ చట్టం, యూఏపీఏ అండ్ మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముగ్గురూ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఉగ్ర దాడికి కుట్ర పన్నారని తేలింది. అనుమానితుల నెట్వర్క్ను కనుగొనేందుకు పోలీసు అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనగర్ పోలీసుల అప్రమత్తత కారణంగా భారీ ఉగ్రదాడి తప్పిందని ఉన్నతాధికారులు తెలిపారు. భారత భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దరిమిలా కొంతకాలం వెనుకకు తగ్గిన ఉగ్రవాదులు.. ఇప్పుడు తిరిగి సంఘటితం అవుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.ఇది కూడా చదవండి: పని ఒత్తిడి: 10 మందిని చంపిన నర్స్
ప్రియుడిపై పగ.. పోలీసులతో ఐటీ ఉద్యోగిని ఆటలు
సాక్షి, బనశంకరి: ప్రేమ విఫలం కావడంతో ప్రియుడి పగ పెంచుకున్న ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రేమ విఫలమైన బాధ ఆమెను వెంటాడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి పేరుతో బాంబు బెదిరింపులకు పాల్పడింది. విమానాశ్రయాలు, బడులు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలను తరుచూ బెదిరిస్తున్న ఆ యువతిని పోలీసులు అరెస్టు చేశారు.వివరాలను సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్సింగ్ మీడియాకు వెల్లడించారు. రెని జోషిల్డా బెంగళూరులో రోబోటిక్స్ ఇంజినీర్గా పనిచేసేది. సహోద్యోగితో ప్రేమ విఫలం కావడం.. అతను మరో యువతిని పెళ్లాడాడు. దీంతో అతనిపై పగ పెంచుకుంది. ప్రియుడి పేరుతో నకిలీ ఈ–మెయిల్స్, వాట్సాప్ అకౌంట్లు సృష్టించి.. వాటి ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్లోని స్కూళ్లు, కాలేజీలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు పంపించేది.అహ్మదాబాద్లో నరేంద్రమోదీ క్రికెట్ ప్రాంగణంతో పాటు బెంగళూరులోని ఆరు విద్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు గతంలో హెచ్చరించింది. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి తన ప్రియుడు కారణమంటూ ఈ–మెయిల్ పంపింది. ప్రియుడి పేరిట బెదిరిస్తే.. అతడిని అరెస్టు చేస్తారనేది ఆమె ప్లాన్. ఇలా జూన్ 14న బెంగళూరు వాసులను హడలెత్తించింది. ఆ కేసు విచారణ ఉత్తర విభాగం సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టారు. ఆరు పాఠశాలలకు బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆమె ప్రాథమిక విచారణలో అంగీకరించిందని కమిషనర్ వివరించారు. దీంతో, దర్యాప్తు మొదలుపెట్టిన గుజరాత్ పోలీసులు.. విచారణ జరిపి రెని జోషిల్డాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అహ్మదాబాద్ జైలు నుంచి వారెంట్పై బెంగళూరుకు తెస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు ఆమెను విచారిస్తున్నామని వెల్లడించారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు.
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది.
క్రైమ్
ప్రియుడు చెబితే.. కెమెరా పెట్టాను
సాక్షి, హోసూరు: కర్ణాటకలోని హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్ కంపెనీ మహిళా సిబ్బంది ఉండే హాస్టల్లోని బాత్రూంలో రహస్య కెమెరా ఎపిసోడ్లో సంచలన విషయం బయటకు వచ్చింది. తన ప్రియుడు చెబితేనే బాత్రూంలో తాను సీక్రెట్ కెమెరా అమర్చినట్టు నిందితురాలు చెబుతోంది. ఇక, ఈ ఘటనలో కెమెరా అమర్చిన ఉద్యోగినిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. హోసూరు సమీపంలోని నాగమంగలం వద్ద టాటా ఎలక్ట్రానిక్ పరిశ్రమలో 20 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా కార్మికుల కోసం హాస్టల్ వసతి కల్పించింది. ఉద్దనపల్లి సమీపంలో ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 6 వేల మందికి పైగా మహిళా కార్మికులు హాస్టళ్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ హాస్టల్లోని బాత్రూంలో ఒడిశాకు చెందిన నీలాకుమారి గుప్తా (23) అనే కార్మికురాలు రహస్య కెమెరా ఏర్పాటు చేసి ఇతర మహిళల వీడియోలను రికార్డు చేసి తన ప్రియుడు సంతోష్కి పంపిస్తోంది.బెంగళూరులో అరెస్టు చేసి..అతడు వాటిని ఇంటర్నెట్లో పోస్టు చేయసాగాడు. తమ స్నానాల వీడియోలు వైరల్ అయినట్లు తెలిసి వేలాది మంది మహిళలు పరిశ్రమ యంత్రాంగం దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదు. దీంతో మంగళవారం రాత్రి నుంచి హాస్టల్ ముందు ధర్నా చేయసాగారు. పలువురు నేతలు మహిళలకు మద్దతు తెలిపారు. ఉద్దనపల్లి పోలీసులు దర్యాప్తు జరిపి నిందితురాలు నీలాకుమారి గుప్తాని అరెస్ట్ చేశారు. ప్రియుడు సంతోష్కుమార్ సూచనల మేరకు రహస్య కెమెరా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపింది. బెంగళూరులో దాగి ఉన్న నిందితున్ని గురువారం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇతడు కూడా ఒడిశా వాసి కాగా బెంగళూరులో పనిచేసుకునేవాడు. వారిద్దరినీ తీవ్ర విచారణ జరుపుతున్నారు. తమ వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని, హాస్టళ్లలో భద్రత కల్పించాలని మహిళా సిబ్బంది డిమాండ్ చేశారు.
పూజిత ఆత్మహత్యాయత్నం.. ఫోన్లో మాట్లాడింది ఎవరు?
సాక్షి, ఘట్కేసర్: ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఓ ప్రైవేటు కళాశాలలో బీస్సీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. కళాశాల యాజమాన్యం, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన మల్లి పూజిత పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో ఉంటూ ఘట్కేసర్ మున్సిపాలిటీ అవుషాపూర్ నీలిమా నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది.ఆమెకు జ్వరంగా ఉండడంతో స్నేహితులతో కలిసి ఆటోలో కళాశాలకు వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. చాలాసేపు ఫోన్లో మాట్లాడిన అనంతరం మూడో అంతస్తు రెయిలింగ్పై ఫోన్ పెట్టి కిందికి దూకింది. గమనించిన స్నేహితులు కళాశాల సిబ్బందితో కలిసి జోడిమెట్లలోని నీలిమా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలు పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఆమె స్నేహి తులను అడిగి తెలుసుకున్నారు.జర్వం రావడంతో మాత్ర వేసుకొని కళాశాలకు ఆటోలో వచ్చిందని వారు తెలిపారు. పూజిత తన ఫోన్ స్టేటస్లో బుధవారం సాయంత్రం ‘ద ఎండ్’ అని పెట్టుకుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూజిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూజిత ఆత్మహత్యా యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫోన్లో ఎవరితో మాట్లాడింది, మరేదైనా కారణం ఉందా? కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో విద్యార్థినిపై అధ్యాపకుడి వేధింపులు
నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థినిపై గెస్ట్ లెక్చరర్ వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఈ కళాశాలలో రెండేళ్లుగా మండల కేంద్రమైన గొలుగొండకు చెందిన కోనా నారాయణరావు గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తూ జనసేన పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. పార్టీ పదవి కోసం ఈయన పేరును ఇటీవల స్థానిక నాయకత్వం సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది. అయితే, ఇటీవలే డిగ్రీ ఫస్టియర్లో చేరిన ఓ విద్యార్థినిని నారాయణరావు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. నిజానికి.. వివాహితుడైన నారాయణరావుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.తాను గతంలో ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని, ఆమె అచ్చు నీలాగే ఉంటుందని అతను ఆ విద్యార్థినికి చెప్పుకొచ్చాడు. నువ్వు అంగీకరిస్తే నిన్ను చదివించి అన్ని విధాలా చూసుకుంటానంటూ లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ విద్యార్థిని ఈ విషయాన్ని సహచర విద్యార్థులకు చెప్పింది. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకుల వరకు వెళ్లడంతో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగి కళాశాల ముందు బైఠాయించారు. ఆ అధ్యాపకుడిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతవరకు తరగతులకు హాజరుకాబోమని భీష్మించారు.భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని ప్రిన్సిపాల్ ఎస్.రాజు, ఇతర అధ్యాపకులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తప్పును సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థినులను కోరారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. దీంతో చేసేదిలేక ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నారాయణరావుతో రాజీనామా చేయించారు. నారాయణరావు గతంలో యలమంచిలి, అరకులలో కూడా పనిచేశాడు. అక్కడ కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు తెలిసింది.
ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే... భవనంపై నుంచి దూకేశా
శ్రీకాకుళం క్రైమ్: ‘నేను బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి, రెండు కాళ్లు విరిగి నా చదువు అర్ధంతరంగా ఆగిపోవడానికి ప్రిన్సిపాల్ సీపాన లలిత కారణం’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కసూ్తర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో రెండు నెలల కిందట ఆత్మహత్యకు ప్రయత్నించిన దళిత విద్యార్థిని తెలిపింది. కులం పేరుతో తనను, తన తల్లిని ప్రిన్సిపాల్ తీవ్రంగా దూషించడం వల్లే చనిపోవాలని ప్రయత్నించానని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థిని గురువారం మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను తెలియజేసింది. ‘మీరు ఎస్సీ వాళ్లు అసహ్యంగా ఉంటారు. మీ ఎస్సీ కాలనీలో నుంచి రావాలంటే చాలా చిరాకుగా ఉంటుంది.ఇప్పుడు మీరు మా హాస్టల్లో జాయిన్ అయ్యారు. మీ పక్కన నిల్చోవాలంటే చాలా అసహ్యం. మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా? నీవు కూడా వెళ్తావా? మీరు ఎందుకింత మురికిగా ఉన్నారు. మీ అమ్మ తప్పుడు మనిషి కదా? నువ్వు అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నావు. పీజీటీ మేడమ్స్ ఏమైనా నీకు తప్పుడు పనులు నేర్పిస్తున్నారా?’ అని ఎస్వో(ప్రిని్సపాల్) మేడమ్ తరచూ వేధించేవారు అని విద్యార్థిని ఆవేదన వ్యక్తంచేసింది. అంతేకాకుండా తనపై తన తల్లిపై పలు తప్పుడు వదంతులు వ్యాప్తిచేశారని తెలిపింది. ఏఎన్ఎం, అటెండర్, అకౌంటెంట్ సర్ కూడా వేధించారు.ఇలా తరచూ అసభ్య మాటలతో వేధించడం వల్లే అందరూ పడుకున్నాక బిల్డింగ్పై నుంచి దూకేశానని తెలిపింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న తనవద్దకు ఏపీసీ సర్, ప్రిని్సపాల్ మేడమ్ వచ్చి బెదిరించారని, అందువల్లే అప్పుడు కాలుజారి పడిపోయినట్లు పోలీసులకు తప్పుగా చెప్పానని వివరించింది. రెండు నెలలుగా రిమ్స్లో చికిత్స పొందుతున్నానని, కుడి కాలికి ఆరు ఆపరేషన్లు అయ్యాయని, ఎడమ కాలికి పిండికట్టు కట్టారని, పట్టించుకునే నాథుడే లేరని ఆ విద్యార్థిని వాపోయింది.న్యాయం చేస్తామని తప్పించుకున్నారు: విద్యార్థిని తల్లితన భర్త చనిపోయాక కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నానని బాలిక తల్లి లక్ష్మి తెలిపారు. తన కుమార్తెను ఆరో తరగతి నుంచి కేజీబీవీలోనే చదివించానని చెప్పారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న తన కుమార్తె వద్దకు తాను లేని సమయంలో ప్రిన్సిపాల్ లలిత, ఏపీసీ వచ్చి తప్పుగా స్టేట్మెంట్ ఇప్పించారని పేర్కొన్నారు. ఆ రోజు వారిని ప్రశ్నిస్తే న్యాయం చేస్తామని చెప్పి తప్పించుకున్నారని తెలిపారు.ఇప్పటి వరకు వారి నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి సాయం అందలేదన్నారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై గత నెల 25న శక్తి యాప్లో, పది రోజుల క్రితం పొందూరు పోలీస్స్టేషన్లో, గత నెల 15న నేషనల్ చైల్డ్ పోర్టల్లో ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.
వీడియోలు
విద్యార్థినికి జనసేన నాయకుడు నారాయణరావు వేధింపులు
జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ.. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు
Asifabad District: ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం
దేశవ్యాప్తంగా 1,800 విమానాలు రద్దు
నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్
Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు
విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు
Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు
జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే
KSR Live Show: క్రెడిట్ దొంగ

