‘లిఫ్ట్’పై చంద్రబాబు డైవర్షన్!
సాక్షి, అమరావతి: చీకటి ఒప్పందాలతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీయడంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ కూటమి సర్కారు ఎల్లో మీడియాతో కలిసి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెర తీసింది. రాజధానిలో రెండో విడత భూసమీకరణపై గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ.. తొలి విడత భూములిచ్చిన రైతుల ఆక్రందనను ప్రస్తావించడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు సర్కారు విషప్రచారానికి దిగింది.రివర్ బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లో రాజధాని నిర్మిస్తున్నారని వైఎస్ జగన్ అంటే.. రివర్ బెడ్ (నదీ గర్భం)లో నిర్మిస్తున్నారని అన్నట్లుగా వక్రీకరిస్తూ, దూషణలకు దిగుతూ దుష్ప్రచారం చేస్తోంది. బేసిన్కు.. బెడ్కూ తేడా తెలియని మంత్రులు ఎల్లో మీడియాతో కలసి, రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేసిన విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఖండించకపోగా... ఎదురు దాడి, దుష్ప్రచారంఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపివేయించా..! పనులు ఆగాయో లేదో కావాలంటే చెక్ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం చంద్రబాబుగానీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుగానీ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తారనుకుంటే అది చేయలేదు. పైగా వారిద్దరి మాటలు వింటే.. ఆ ఎత్తిపోతల అవసరం లేదనడం చూస్తే.. రేవంత్రెడ్డితో చంద్రబాబుకు ఉన్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతౖకైనా దిగజారుతారు.. ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారన్నది మరోసారి నిరూపితమైందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారన్నది తేటతెల్లమవడంతో చంద్రబాబు సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాజధానిపై వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, ఎల్లో మీడియా డైవర్షన్ డ్రామాకు తెరతీశాయి. నిర్మాణ వ్యయానికి అంతెక్కడ..?విభజన తర్వాత అధికారం చేపట్టి, అమరావతిని రాజధానిగా ప్రకటించి.. 2014–19 మధ్య ఐదేళ్లలో అదే రాజధాని నిర్మాణం కోసం రూ.5,500 కోట్లు చంద్రబాబు సర్కార్ ఖర్చు చేసింది. కానీ.. ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం చేయలేదు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని.. ఆ ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడదని సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. కానీ.. ఇప్పుడు 19 నెలల్లోనే రూ.47 వేల కోట్ల రుణం రాజధాని కోసం తెచ్చారు. తొలి విడత తీసుకున్న 50 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు సర్కార్ డీపీఆర్ సమర్పించింది. రెండో విడతగా తీసుకుంటున్న భూముల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.లక్ష కోట్లు అవసరం.అంటే.. మొత్తమ్మీద రాజధాని నిర్మాణానికి ఏకంగా రూ.2 లక్షల కోట్లు అవసరం. ఇప్పటికే రూ.60 వేల కోట్లతో చేపట్టిన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ, పనుల్లో ఎక్కడా పురోగతి లేదు. రాజధాని పేరుతో అప్పులు తేవడం, పనుల అంచనా వ్యయాలు పెంచడం, కాంట్రాక్టర్లకు అప్పగించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్లు చెల్లించడం, కమీషన్లు వసూలు చేసుకోవడం మినహా నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి కన్పించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధానిలో వర్షం కురిస్తే ఆ నీరు కృష్ణాలోకి వెళ్లడం లేదనే నెపంతో ఇప్పటికే రూ.222 కోట్లతో ఉండవల్లి వద్ద కొండవీటివాగు వరద ఎత్తిపోతల నిర్మించారు. తాజాగా రూ.523 కోట్లతో ఉండవల్లి వద్ద రెండో ఎత్తిపోతలను చేపట్టారు.వరదను నియంత్రించడానికి మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు.. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే మంత్రులు, ఎల్లో మీడియా గగ్గోలు పెడుతున్నారు. ప్రజలకు నిజంగానే మేలు చేయాలన్న సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే రాజధాని నిర్మాణం ఎప్పుడో జరిగిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు కదా? ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఎందుకంత ఉలుకు? ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల విశాల ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి. అలాగే రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరగాలి. అదే విషయాన్ని వైఎస్ జగన్ చెప్పారు. రాజధాని రైతులకు అన్యాయం జరుగుతోందనే కదా వైఎస్ జగన్ చెప్పింది! ఇకనైనా రాజధాని రైతులకు న్యాయం చేయడంపై దృష్టి పెట్టండి.. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలపై ఇంకా భారం మోపడం ఆపాలని సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎల్లో మీడియాకు మేధావులు, రైతులు హితవు పలుకుతున్నారు.ఏడేళ్లలో ఏం చేశావ్ బాబూ..?రాజధాని నిర్మాణం కోసం టీడీపీ హయాంలో తొలి విడతగా 53 వేల ఎకరాలు సమీకరించారు. 2014–19 మధ్య ఐదేళ్లు.. ఇప్పుడు రెండేళ్లు వెరసి దాదాపు ఏడేళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కానీ..ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి రాకముందే రెండో విడత భూసమీకరణను ప్రభుత్వం ప్రారంభించడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను వాగులు, వంకలు, చెరువుల్లో ఇవ్వడం.. ఇప్పుడు రహదారుల నిర్మాణం పేరుతో నివాసం ఉంటున్న ఇళ్లను సైతం చంద్రబాబు ప్రభుత్వం గుంజుకోవడంపై రైతులు మానసికంగా కుంగిపోతున్నారు.ఇదే అంశంపై ఇటీవల రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన రామారావు అనే రైతు గుండె పగిలి మరణించారు. రెండో విడత భూసమీకరణ కోసం వడ్డమానులో నిర్వహించిన గ్రామసభలో ప్రభుత్వాన్ని రైతులు నిలదీశారు. తొలి విడతలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు.. ఇప్పుడు రెండో విడతలో భూములివ్వాలంటే, మూడేళ్లలోగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆవేదననే వైఎస్ జగన్ ప్రస్తావించారు.
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు,పుష్య మాసం, తిథి: బ.షష్ఠి ఉ.10.31 వరకు, తదుపరి సప్తమి,నక్షత్రం: ఉత్తర సా.5.16 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: రా.2.08 నుండి 3.49 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.49నుండి 9.34 వరకు తదుపరి ప.12.30 నుండి 1.14 వరకు, అమృత ఘడియలు: ఉ.9.47 నుండి 11.22 వరకు.సూర్యోదయం : 6.37సూర్యాస్తమయం : 5.37రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి. ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.వృషభం... ఆర్థిక వ్యవహారాలలో అసంతృప్తి. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో విభేదాలు. కొన్ని పనులు నిదానంగా కొనసాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మిథునం.... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం పరిస్థితి నెలకొంటుంది.కర్కాటకం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. కొన్ని బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. అనుకున్న పనుల్లో మరింత పురోగతి. వస్తు, వస్త్రలాభాలు. దైవచింతన.సింహం.... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. . వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడులు. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. ఒప్పందాలలో ఆటంకాలు..కన్య.... కొత్త పనులు చేపడతారు. మిత్రుల నుంచి అనుకూల సమాచారం. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.తుల.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో మార్పులు సంభవం.వృశ్చికం.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు అభివృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.ధనుస్సు... ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వాహనయోగం.మకరం.... సోదరులతో వివాదాలు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడనక సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.కుంభం.... శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.మీనం.. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కొన్ని వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
ఆరోగ్యానికి ‘అసలైన బ్రాండ్’..
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
సంక్రాంతి బాక్సాఫీస్: సర్ప్రైజ్ హిట్ కోసం ఎదురుచూపులు
సంక్రాంతి పండగ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఉత్సాహం. అందుకే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో దర్శక, నిర్మాతలు పండగకి వారి సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడతారు. గతంలో శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా, హనుమాన్ వంటి సినిమాలు తక్కువ అంచనాలతో వచ్చి భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఈ ఏడాది కూడా అలాంటి సర్ప్రైజ్ హిట్ ఏదైనా వస్తుందా అనే ఆసక్తి పెరిగింది. రాజాసాబ్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో థియేటర్లలోకి వచ్చి మంచి హైప్ సృష్టిస్తోంది. మన శంకరవరప్రసాద్ భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న మరో పెద్ద సినిమా. అనగనగా ఒక రాజు మోస్తరు అంచనాలతో వస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి తక్కువ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలు. శర్వానంద్ కెరీర్లో శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా మాత్రమే కాదు, ఒకే ఒక జీవితం కూడా సైలెంట్గా వచ్చి విజయాన్ని సాధించింది. అందుకే నారీ నారీ నడుమ మురారి సినిమాను తక్కువ అంచనా వేయడం సరికాదు. రవితేజ వరుస ఫ్లాపుల కారణంగా ఈసారి అంచనాలు తగ్గాయి. అయినప్పటికీ సంక్రాంతి బరిలో ఆయన సినిమా ఏదైనా మేజిక్ చేస్తుందేమో అనే ఆసక్తి ఉంది. ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు, మూడు మిడ్ రేంజ్ సినిమాలు కలిపి బాక్సాఫీస్ను రంజుగా మార్చాయి. రాజాసాబ్తో సంక్రాంతి సినిమా పండగ మొదలైంది. ఇంకో వారం రోజుల్లో ఎవరు నిజమైన సంక్రాంతి హీరో అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. మొత్తానికి 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేసు ప్రేక్షకులకు భలే ఆసక్తికరంగా మారింది. ఒక వైపు పెద్ద సినిమాలు తమ స్థాయిలో పోటీ పడుతుంటే, మరోవైపు చిన్న సినిమాలు సర్ప్రైజ్ హిట్ ఇవ్వగలవా అనే ఉత్కంఠను ప్రేక్షకులకు రేపాయి.
క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ...!
క్వార్టర్స్లో సింధు
ధనాధన్కు వేళాయె...
‘లిఫ్ట్’పై చంద్రబాబు డైవర్షన్!
మాది సంక్షేమ క్యాలెండర్..బాబుది అప్పుల క్యాలెండర్
వెన్నుపోటు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. నాడు మామకు.. నేడు సీమకు
ఆధార్ కొత్త మస్కట్ ‘ఉదయ్’
మహిళకు అబార్షన్ కోరుకునే హక్కుంది
‘ఉపాధి’ని దెబ్బతీస్తే సహించం: సీఎం రేవంత్
భూ దోపిడీ.. క్రెడిట్ చోరీ..
పడిపోయిన బంగారం, వెండి ధరలు
మీది మహర్జాతకమండీ.. ఎవరో చేసిన కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుంటారు!
హార్దిక్ పాండ్యా మహోగ్రరూపం
ఫ్రీ కదా.. పోయొద్దాం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు
ఇప్పటికే అప్పుల్లో, ప్రజలను నమ్మించి మోసం చేయడంలో నెంబర్.1 మనమే సార్!
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్'.. వీడియో వైరల్
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
వెనెజువెలా సంక్షోభం.. రంగంలోకి రష్యా
ఇవేం ధరలు బాబోయ్.. హ్యాట్రిక్ కొట్టేసిన పసిడి, వెండి
ముస్తాఫిజుర్ రహ్మాన్ సంచలన నిర్ణయం
ఈ రాశి వారికి వృత్తులు, వ్యాపారాలలో నూతనోత్సాహం
..స్వదేశీయుల్ని ఎలాగూ తొలగిస్తూనే ఉన్నాము!
మంత్రి గారు చెప్పింది.. ఇలా కాదనుకుంటా!!
..దాని దారి మళ్ళించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నార్సార్ శాస్త్రవేత్తలు!
ICC: అబ్బే అదేం లేదు!.. మా మాట విన్నారు!
బంగ్లాదేశ్కు భారీ షాక్
'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం
రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఆఫర్లు కూడా పోయాయి!
IND vs NZ: టీమిండియాకు శుభవార్త
క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ...!
క్వార్టర్స్లో సింధు
ధనాధన్కు వేళాయె...
‘లిఫ్ట్’పై చంద్రబాబు డైవర్షన్!
మాది సంక్షేమ క్యాలెండర్..బాబుది అప్పుల క్యాలెండర్
వెన్నుపోటు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. నాడు మామకు.. నేడు సీమకు
ఆధార్ కొత్త మస్కట్ ‘ఉదయ్’
మహిళకు అబార్షన్ కోరుకునే హక్కుంది
‘ఉపాధి’ని దెబ్బతీస్తే సహించం: సీఎం రేవంత్
భూ దోపిడీ.. క్రెడిట్ చోరీ..
పడిపోయిన బంగారం, వెండి ధరలు
మీది మహర్జాతకమండీ.. ఎవరో చేసిన కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుంటారు!
హార్దిక్ పాండ్యా మహోగ్రరూపం
ఫ్రీ కదా.. పోయొద్దాం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు
ఇప్పటికే అప్పుల్లో, ప్రజలను నమ్మించి మోసం చేయడంలో నెంబర్.1 మనమే సార్!
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్'.. వీడియో వైరల్
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
వెనెజువెలా సంక్షోభం.. రంగంలోకి రష్యా
ఇవేం ధరలు బాబోయ్.. హ్యాట్రిక్ కొట్టేసిన పసిడి, వెండి
ముస్తాఫిజుర్ రహ్మాన్ సంచలన నిర్ణయం
ఈ రాశి వారికి వృత్తులు, వ్యాపారాలలో నూతనోత్సాహం
..స్వదేశీయుల్ని ఎలాగూ తొలగిస్తూనే ఉన్నాము!
మంత్రి గారు చెప్పింది.. ఇలా కాదనుకుంటా!!
..దాని దారి మళ్ళించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నార్సార్ శాస్త్రవేత్తలు!
ICC: అబ్బే అదేం లేదు!.. మా మాట విన్నారు!
బంగ్లాదేశ్కు భారీ షాక్
'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం
రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఆఫర్లు కూడా పోయాయి!
IND vs NZ: టీమిండియాకు శుభవార్త
ఫొటోలు
'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్లో ఫోటోలు
'అనగనగా ఒక రాజు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సెలబ్రిటీలు (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)
చంద్రబాబుది విలన్ క్యారెక్టర్.. ఆధారాలతో ఏకిపారేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
కన్నడ 'మార్క్'తో సెన్సేషన్..క్వీన్ ఆఫ్ ‘మార్క్’గా దీప్శిఖ చంద్రన్ (ఫొటోలు)
Yash Birthday : యశ్ అసలు పేరేంటో తెలుసా? (ఫోటోలు)
తెలంగాణలో మొదలైన ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
'మన శంకర వరప్రసాద్గారు' ప్రీరిలీజ్లో చిరంజీవి ,వెంకీ సందడి (ఫొటోలు)
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
సినిమా
ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్లో ఉద్రిక్తత..!
ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. తెలంగాణలో ప్రీమియర్ షోస్కు అనుమతులు లేకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మీడియా కోసం విమల్ థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ప్రెస్ షోను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనతో విమల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈనెల 8న ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. కానీ ఏపీలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో కేవలం మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.విమల్ థియేటర్ లోకి దూసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ తెలంగాణ లో ప్రీమియర్ షోస్ లేకపోయినా... థియేటర్ కి వచ్చిన అభిమానులుమీడియా కోసం విమల్ లో ప్రత్యేక షో ఏర్పాటుఅభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం తో మీడియా షో తాత్కాలికంగా నిలిపివేత#TheRajasaaab #Prabhas #RajaSaab pic.twitter.com/9Eg9nu8BLF— Anji Shette (@AnjiShette) January 8, 2026
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ది రాజాసాబ్ వచ్చేశాడు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రీమియర్స్తో ఫ్యాన్స్ ముందుకొచ్చేశాడు. ఏపీలో ది రాజాసాబ్ ప్రీమియర్స్తో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. ఈ మూవీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.ది రాజాసాబ్లో ప్రభాస్ నటన అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంజయ్ దత్ ఎంట్రీ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందని ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.హీరోయిన్ రిద్ది కుమార్ దాదాపు 5 నిమిషాల పాటు కనిపిస్తుందని.. నిధి అగర్వాల్ మొదటి 30 నిమిషాల తర్వాతే ఎంట్రీ ఇచ్చిందని పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి లుక్, నటన అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్ ఎంట్రీ ఆలస్యమైనా అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్లో చివరి 30 నిమిషాల్లో కనిపించిన మాళవిక ఫైట్ సీన్లో అదరగొట్టేసిందని అంటున్నారు. #TheRajaSaab – First Half Review— STORY – #RajaSaab is about the hero’s journey in search of his grandfather.— #Prabhas’ performance is good. Each reaction he gives works well.Prabhas’ intro scene is superb.— #RiddhiKumar appears for about 5 minutes so far. Her look is… pic.twitter.com/Mj8iHpZbc9— Movie Tamil (@_MovieTamil) January 8, 2026 Musk changed like ❤️ button to celebrate 🔥🔥🔥 the release of #TheRajaasaab #TheRajaSaab #Prabhas𓃵 @prabhas pic.twitter.com/OmVMnJVyWS— R A J (@dune1411) January 8, 2026
అతనెవరో నాకు తెలియదు.. అనసూయ అదిరిపోయే కౌంటర్
నటడు శివాజీ ఒక వేదికపై మాట్లాడుతూ హీరోయిన్ల దుస్తుల గురించి కామెంట్ చేశారు. అవి సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు కౌంటర్గా యాంకర్, నటి అనసూయ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎవరూ చెప్పాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఏమీ చిన్నపిల్లలం కాదని తెలిపారు. తమ పరిధితో పాటు హక్కులు కూడా తెలుసన్నారు. 'మా ఇష్టానికి మమ్మల్ని బతకనీయండి.' అంటూ శివాజీ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆమెపై నెట్టింటి భారీ ట్రోలింగ్ జరిగింది. బూతులతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆమె ఎక్కడా తగ్గలేదు. తిరిగి అదే రేంజ్లో సమాధానం చెప్పారు.కొద్దిరోజులుగా అనసూయ అభిమాన సంఘం పేరుతో కొందరు మీడియా వేదికగా డిబెట్లలో పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఆమె వివరణ ఇచ్చారు. తాజాగా తన అభిమానులతో మాట్లాడేందుకు ఆమై లైవ్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ చెప్పుకునే వ్యక్తిపై కామెంట్ చేశారు. ఫ్యాన్స్ అనే పదం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నా పేరుతో కొన్ని సోషల్మీడియా పేజీలు, సంఘాలు ఉన్నా.. వారు నన్ను కలిసినప్పుడు మంచిగానే మాట్లాడుతాను. నిజాయితీగా ఉన్నవారితో టచ్లో కూడా ఉంటాను. నాపై కొందరు చాలా కష్టపడి రీల్స్ చేస్తారు.. వాటిని నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాపేరు చెప్పుకుని తెరపైకి వచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతని మాటలను నేను ఏకీభవించను. అతను ఎలా వచ్చారో నాకు తెలియదు. ఈ చర్చలో పాల్గొన్న వారు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్లు ఎప్పుడూ కూడా నన్ను కలవలేదు. నా పేరు ఉపయోగించుకుని వారు బతుకుతున్నారు.' అంటూ అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ డిబేట్స్లలో పాల్గొంటున్న వ్యక్తిపై ఆమె కామెంట్ చేశారు.
తెలంగాణలో 'ది రాజాసాబ్' ఫ్యాన్స్కు నిరాశ..
తెలంగాణలో 'ది రాజా సాబ్' అభిమానులకు నిరాశ ఎదురైంది. జనవరి 8న రాత్రి ప్రీమియర్స్ షోలు ఉంటాయని ఎదురుచూసిన ఫ్యాన్స్ బాధతో థియేటర్స్ నుంచి వెనుతిరుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో షో పడింది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని ప్రభాస్ అభిమానులు భగ్గుమంటున్నారు.'ది రాజా సాబ్' సినిమాకు ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే టికెట్ ధరల పెంపునకు ఛాన్స్ ఇచ్చారు. కానీ, తెలంగాణలో టికెట్ ధరలు, షోల అనుమతిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇప్పటికీ బుక్ మై షోలో బుకింగ్ మొదలు కాలేదు. కొన్ని గంటల్లోనే సినిమా విడుదల కావాల్సి ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా టికెట్ల విక్రయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ప్రతి సినిమాకు ఇలాగే చివరివరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అంటున్నారు.కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?టికెట్ ధరల పెంపు కోసం ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టులో వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
క్రీడలు
మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటు.. రంజీ క్రికెటర్ హఠాన్మరణం
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిజోరంకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కె. లాల్రెమ్రుటా (38) గుండె పోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం ధ్రువీకరించింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్కు సమీపంలోని సిహ్ముయ్లో సెకండ్ డివిజన్ స్క్రీనింగ్ టోర్నమెంట్ జరుగుతోంది.ఈ టోర్నీలో వెంగ్నువాయ్ రైడర్స్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించిన లాల్రెమ్రుటా.. గురువారం చాన్పుయ్ క్రికెట్ క్లబ్తో మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లాల్రెమ్రుటా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లాల్రెమ్రుటా మృతి పట్ల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది."లాల్రెమ్రుటా రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్లలో మిజోరంకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఏడు మ్యాచ్లు ఆడాడు. రాష్ట్ర స్ధాయిలో కూడా చాలా మ్యాచ్లలో తన ప్రతిభను చాటుకున్నాడు.మిజోరం ఒక గొప్ప క్రికెటర్ను కోల్పోయింది. లాల్రెమ్రుటా కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము" అని సీఏఎం ఒక ప్రకటనలో పేర్కొంది. మిజోరం క్రీడా శాఖా మంత్రి లాల్గింగ్లోవాహ్మర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.చదవండి: IPL 2026: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఫామ్లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఫామ్లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ఎట్టుకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 208 పరుగుల లక్ష్య చేధనలో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.తొలుత ఆచితూచి ఆడిన వెంకటేష్.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు యశ్ దూబే(40), త్రిపురేష్(36) రాణించారు. ఫలితంగా లక్ష్యాన్ని ఎంపీ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 23.2 ఓవర్లలో చేధించింది.అంతకుముందు బ్యాటింగ్ చేసిన కర్ణాటక 47.4 ఓవర్లలో కేవలం 207 పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్ పేసర్ శివాంగ్ కుమార్ 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక పతనాన్ని శాసించాడు. కర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్ మయాక్ అగర్వాల్(49) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఆర్సీబీకి గుడ్ న్యూస్..ఐపీఎల్-2026లో వెంకటేశ్ అయ్యర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రూ. 7 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత అతడు తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుస మ్యాచ్లలో తక్కువ స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు అయ్యర్ తన బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు అయ్యర్ తన ఫామ్ను తిరిగి అందుకోవడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్-2025లో సీజన్లో వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ తరపున దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని కేకేఆర్ వేలంలోకి విడిచిపెట్టింది.చదవండి: VHT 2025-26: చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్.. సచిన్కు కూడా సాధ్యం కాలేదు
ఏంటి తమ్ముడూ ఇది!.. సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఫిక్స్!
భారత క్రికెట్లోకి దూసుకువచ్చిన సరికొత్త సంచలనం పేరు వైభవ్ సూర్యవంశీ. తోటి పిల్లలంతా స్కూల్ చదువుతో బిజీగా ఉంటే.. అతడు మాత్రం అద్భుత బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. పద్నాలుగేళ్ల వయసుకే ఇప్పటికే ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు చేసి మరో ‘మాస్టర్ బ్లాస్టర్’గా నీరాజనాలు అందుకుంటున్నాడు.దూకుడైన ఆటకు మారుపేరైన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్-19 జట్టు కెప్టెన్గానూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేశాడు. ఆఖరి వన్డేలో విధ్వంసకర శతకం బాది.. మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.సెంచరీల మోతచెన్నై వేదికగా 2024లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు (104)తో యూత్ టెస్టులో శతక్కట్టిన వైభవ్.. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్(101)పై సెంచరీ సాధించాడు. గతేడాది ఇంగ్లండ్ గడ్డ మీద యూత్ వన్డేలో శతకం (143) నమోదు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్... ఆస్ట్రేలియాలో యూత్ టెస్టులోనూ (113) శతక్కొట్టాడు.ఇక ఇండియా-ఎ తరఫున దోహా వేదికగా యూఏఈపై టీ20 సెంచరీ (144) సాధించిన వైభవ్ సూర్యవంశీ.. తన సొంతజట్టు బిహార్ తరఫున దేశీ క్రికెట్లో మహారాష్ట్రపై టీ20 శతకం (108*) సాధించాడు. అనంతరం దుబాయ్లో యూఏఈ అండర్-19 జట్టుతో యూత్ వన్డేలో (171)లోనూ శతక్కొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్పై (190) భారీ శతకం సాధించాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడో యూత్ వన్డేలో 127 పరుగులతో సత్తా చాటాడు.ఆరు దేశాల్లో ఆరు సెంచరీలుఇలా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఖతార్, యూఏఈ, సౌతాఫ్రికా దేశాల్లో సెంచరీలు చేసి.. తాను ఎక్కడైనా బ్యాట్ ఝులిపించగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్ టీమిండియాలో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. ‘‘171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74)... గత ముప్పై రోజులుగా దేశీ, అండర్-19 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన స్కోర్లు ఇవి.ఏంటి తమ్ముడూ ఇది!ఇదంతా ఏంటి తమ్ముడు?... శాంపిల్ చూపించావా? మున్ముందు ఇంతకంటే గొప్పగా చెలరేగిపోతావా?.. 14 ఏళ్ల వయసున్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడంటే నమ్మబుద్ధికావడమే లేదు. అతడి ఆటను వర్ణించేందుకు మాటలు రావడం లేదు.సంజూ శాంసన్ స్థానంలోఅండర్-19 వరల్డ్కప్-2026లో అతడు షోటాపర్ కాబోతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్.. రాజస్తాన్ రాయల్స్లో సంజూ శాంసన్ స్థానంలో పూర్తి స్థాయి ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నాడు. వచ్చే నాలుగు నెలలు మనకు వైభవ్ జాతరే!అతడి పట్టుదల, టెంపర్మెంట్, పరుగుల దాహం.. మనకు సరికొత్త అనుభూతి పంచబోతోంది’’ అంటూ అశూ.. వైభవ్ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ ఓపెనర్గా సంజూ స్థానాన్ని ఈ చిచ్చరపిడుగు భర్తీ చేస్తాడని అంచనా వేశాడు. కాగా సంజూ శాంసన్ను రాజస్తాన్.. చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేసిన విషయం తెలిసిందే.ఓపెనింగ్ స్థానానికి ఎసరుఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకు వేసి.. భారత టీ20 జట్టులోనూ సంజూ ఓపెనింగ్ స్థానానికి వైభవ్ ఎసరుపెట్టబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటితేనే సంజూ స్థానం పదిలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ అన్నీ కలిసివచ్చి ఈ ఏడాదే గనుక వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడితే.. క్రికెట్ దేవుడు, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. సచిన్ పదహారేళ్లకు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తే.. వైభవ్ పద్నాలుగు- పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. కాగా బిహార్లో 2011, మార్చి 27న వైభవ్ సూర్యవంశీ జన్మించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్కు షాక్.. ఒక్క పరుగు తేడాతో..
శ్రీలంక మాస్టర్ మైండ్.. వరల్డ్కప్ విన్నింగ్ కోచ్తో ఒప్పందం
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటింగ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్ను ఎస్ఎల్సీ నియమించింది. టీ20 వరల్డ్కప్ టోర్నీకి శ్రీలంక జట్టును సన్నద్దం చేసేందుకు విక్రమ్ రాథోర్ను కన్సల్టెన్సీ ప్రాతిపదికన బ్యాటింగ్ కోచ్గా నియమించాము అని లంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.రాథోర్ జనవరి 18న లంకతో జట్టుతో కలవనున్నాడు. ప్రపంచ కప్ ముగిసే వరకు జట్టుతోనే ఉండనున్నాడు. విక్రమ్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. . 2019 సెప్టెంబర్ నుంచి 2024 జూలై వరకు భారత బ్యాటింగ్ కోచ్గా చేశారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలోఅతడు కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ లెవల్ 3 కోచ్గా కొనసాగాడు.అతడు ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీడ్ అసిస్టెంట్ కోచ్గా కూడా పనిచేస్తున్నాడు. కాగా శ్రీలంక ఇప్పటికే భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రామకృష్ణన్ శ్రీధర్ను తమ ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. రాథోర్ భారత బ్యాటింగ్ కోచ్గా ఉన్న సమయంలోనే ఫీల్డింగ్ కోచ్గా శ్రీధర్ పనిచేశాడు.శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ లక్ష్యంగా భారత కోచింగ్ అనుభవాన్ని ఉపయోంచుకుంటుంది. అదేవిధంగా లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ కూడా ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్గా సేవలందించనున్నాడు. కాగా ఈ పొట్టి ప్రపంచకప్కు శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. శ్రీలంక తమ లీగ్ మ్యాచ్లన్నింటని స్వదేశంలోనే ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు శాపనార్థాలు... సరైన అనుమతులు లేకుండా లిఫ్ట్ ప్రారంభించారంటూ పోలవరం సాక్షిగా అక్కసు వెళ్లగక్కిన ఏపీ సీఎం
సీమ జల ద్రోహి చంద్రబాబు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలి. రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
సీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్దేశించిన సమాచారాన్ని ఇవ్వని చంద్రబాబు సర్కార్
రాయలసీమకు సైంధవుడు చంద్రబాబే... ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపివేసి మరణ శాసనం
వెనెజువెలాపై అమెరికా భీకర దాడులు... దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకొని న్యూయార్క్కు తరలించిన అమెరికా సేనలు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సూపర్ సిక్స్ మోసాల ఖరీదు ఒక లక్ష 42 వేల కోట్ల రూపాయల పైమాటే...కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ ప్రజల డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో అత్యంత అధ్వానంగా మారిన ‘108’ నెట్వర్క్ నిర్వహణ... అంబులెన్స్ సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
2026కు ఘన స్వాగతం పలికిన విశ్వమానవాళి... ఆనందోత్సాహాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు
ఆంధ్రప్రదేశ్లో ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని నీరుగార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో బాదుడే బాదుడు...ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం...
బిజినెస్
ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!
సంక్రాంతి పండుగ వచ్చేసింది. నగరాల్లో ఉండేవారంతా దాదాపు ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ సమయంలో ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ఒక శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలుపై 3 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం వివరంగా ఇక్కడ..రైల్వన్ యాప్ (RailOne) ద్వారా బుక్ చేసుకున్న అన్రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ మీద 3 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డిజిటల్ చెల్లింపు మోడ్లను ఉపయోగించి RailOne యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్రిజర్వ్డ్ టిక్కెట్లపై మాత్రమే తగ్గింపు పొందవచ్చు.రైల్వన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా➤గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఈ సూపర్ యాప్ ‘Railone’ను డౌన్లోడ్ చేయాలి.➤యాప్ వినియోగదారుల లొకేషన్ను డిఫాల్డ్గా రీడ్ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి.➤యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత లాగిన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, గెస్ట్ అనే ఆప్షన్లు వస్తాయి.➤కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేస్తే.. రైల్ కనెక్ట్, యూటీఎస్ అని రెండు ఆప్షన్లు డిస్ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్ కనెక్ట్ యాప్లో లాగిన్ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్ కావొచ్చు. లేదంటే ➤కొత్తంగా వివరాలు ఎంటర్ చేసి సైనప్ చేయాల్సి ఉంటుంది.➤సైనప్ కోసం మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేయాల్సి.➤మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్, యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.➤ఓటీపీ, ఎంపిన్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్ వెరిఫికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ లేదా డివైజ్ లాగిన్ వివరాలు ఇవ్వాలి.మూడు శాతం డిస్కౌంట్ కోసం..👉🏻ఇప్పటికే మీరు ఇన్స్టాల్ చేసుకున్న RailOne యాప్.. లాగిన్ అవ్వాలి. 👉🏻ప్రాథమిక వివరాలు (పేరు, ఇతర వివరాలు) నమోదు చేసుకోవాలి.👉🏻అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కోసం ఎంపికను సెలక్ట్ చేసుకుని.. ప్రయాణ తేదీని, మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారా ఆ స్టేషన్ను సెలక్ట్ చేసుకోవాలి. 👉🏻డిజిటల్ మోడ్ (యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసినప్పుడు మాత్రం మీకు డిస్కౌంట్ లభిస్తుంది.👉🏻చెల్లింపు పూర్తయిన తరువాత.. టికెట్ యాప్లోనే జనరేట్ అవుతుంది. ప్రయాణ సమయంలో టికెట్ తనిఖీల కోసం దాన్ని మీ ఫోన్లో చూపించవచ్చు.రైల్వన్ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.
ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్
బీఎస్ఈ ఎక్స్ఛేంజ్లోని బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 2026 డిసెంబర్ నాటికి 93,918 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ క్లయింట్ అసోసియేట్స్ అంచనా వేసింది. అంటే సెన్సెక్స్ ప్రస్తుత స్థాయి (84,961)తో పోలిస్తే 11% పెరిగే వీలుందని అభిప్రాయపడింది.‘‘దేశీయ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. కార్పొరేట్ ఆదాయాల అవుట్లుక్ మెరుగ్గానే ఉన్నాయి. అయితే షేర్ల వాల్యుయేషన్లు అధికంగా ఉండటం, అంతర్జాతీయ అనిశి్చతుల కారణంగా ఇన్వెస్టర్లు ‘క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి’ వ్యూహాన్ని అనుసరించవచ్చు. దీంతో ఈ ఏడాది భారతీయ మార్కెట్ విస్తృత స్థాయి ర్యాలీలకు స్వస్తి పలికి.., ఎంపిక చేసుకున్న, ఫండమెంటల్ ఆధారిత అవకాశాల దిశగా అడుగులు వేయోచ్చు’’ అని సంస్థ రీసెర్చ్ హెడ్ నితిన్ అగర్వాల్ తెలిపారు.రిస్క్ అంచనాలను మెరుగుపరుచుకుంటూ.., సరైన డైవర్సిఫికేషన్ విధానాలను అనుసరిస్తే ధీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు ప్రధాన వనరులుగా కొనసాగుతాయని అగర్వాల్ పేర్కొన్నారు.ఇంకా 2026కి సంబంధించిన క్లయింట్ అసోసియేట్స్ వార్షిక ఈక్విటీ అంచనా నివేదికలో.... పోర్ట్ఫోలియో వైవిద్యీకరణలో బంగారం, వెండి కీలకం. డాలర్ బలహీనత, భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాల్లో మార్పుల కారణంగా గతేడాదిలో విలువైన లోహాలు భారీ రాబడులు ఇచ్చాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం డిమాండి పెరిగి, వ్యూహాత్మక పెట్టుబడి సాధనగా పసిడి ప్రాధాన్యం మరింత పెరిగింది. అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు, అమెరికా–చైనా ఉద్రిక్తతలు, వెండిని కూడా కీలక లోహంగా గుర్తించే చర్చల నేపథ్యంలో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్ వృద్ధి అవుట్లుక్ మెరుగ్గానే ఉంది. బలమైన డిమాండ్, తయారీ–సేవల రంగ విస్తరణ, స్థిరమైన జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదవ్వొచ్చు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఆఫీస్ మార్కెట్ అదుర్స్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఆఫీస్ మార్కెట్ 2025లో బలమైన వృద్ధిని నమోదు చేసింది. నగరంలో వార్షిక కార్యాలయ లీజింగ్ 11.4 మిలియన్ చదరపు అడుగులకు చేరి, చరిత్రలో రెండవ అత్యధిక స్థాయిని సాధించింది. అదే సమయంలో 2025 ద్వితీయార్ధంలో లగ్జరీ గృహాల అమ్మకాలు మొత్తం విక్రయాలలో 71 శాతంగా నమోదయ్యాయి.ఈ వృద్ధికి ప్రధాన కారణం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణ. హైదరాబాద్లో కొత్త జీసీసీలు 40 శాతం పెరిగి, భారత్లో రెండవ అత్యంత డిమాండ్ ఉన్న నగరంగా నిలిపాయి. దక్షిణ భారతదేశంలో బెంగళూరు ముందంజలో ఉన్నప్పటికీ, జీసీసీల ద్వారా కార్యాలయ స్థల వృద్ధిలో హైదరాబాద్ బెంగళూరును (33%) అధిగమించింది. ప్రస్తుతం నగరంలోని మొత్తం లీజింగ్ కార్యకలాపాల్లో జీసీసీల వాటా సుమారు 50 శాతం.గోల్డ్మన్ సాచ్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, సర్వీస్నౌ వంటి గ్లోబల్ సంస్థలు భారీ లావాదేవీలతో హైదరాబాద్ను హై-వాల్యూ కార్యకలాపాల కోసం కీలక కేంద్రంగా నిలిపాయి. ఈ డిమాండ్ వల్ల హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో కార్యాలయ అద్దెలు నెలకు 10 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.77కు చేరాయి.నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, రూ.కోటి పైబడిన ఇళ్లు ఇప్పుడు మార్కెట్ను నడుపుతున్నాయి. ఇవి మొత్తం లావాదేవీ విలువలో దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2025లో రెసిడెన్షియల్ అమ్మకాలు 4 శాతం పెరిగి 38,403 యూనిట్లకు చేరగా, బెంగళూరులో వృద్ధి స్థిరంగా ఉంది. హైదరాబాద్లో సగటు ఆస్తి ధరలు 13 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.6,721కు చేరాయి. కొత్త సరఫరా పరిమితంగా ఉండటంతో అమ్ముడుపోని ఇన్వెంటరీ 2 శాతం తగ్గింది.రూ.2–5 కోట్ల సెగ్మెంట్లో అమ్మకాలు 22 శాతానికి పెరిగాయి. రూ.10–20 కోట్ల అల్ట్రా-లగ్జరీ గృహాలు కేవలం 1.1 త్రైమాసికాల్లోనే అమ్ముడవుతున్నాయి. దీనికి విరుద్ధంగా, రూ.50 లక్షల లోపు గృహాల వాటా 4 శాతానికి పడిపోయింది.కోకాపేట, గచ్చిబౌలి, తెల్లాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలు లగ్జరీ హౌసింగ్కు కేంద్రాలుగా మారాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, బెంగళూరుతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, టీఎస్ ఐపాస్ వంటి ప్రభుత్వ చర్యలు హైదరాబాద్ను హై-గ్రోత్ రియల్ ఎస్టేట్ మార్కెట్గా నిలిపాయి.
‘వెండి పని’ పడదాం.. ‘సిల్వర్ సెక్యూరిటీ’ అవసరం
విలువైన లోహంగానే కాకుండా పారిశ్రామిక అవసరాలకు కూడా కీలకంగా ఉంటున్న వెండి ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెట్టాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. విదేశాల నుంచి దీర్ఘకాలికంగా సరఫరా, దేశీయంగా రిఫైనింగ్..రీసైక్లింగ్ సామర్థ్యాలను పెంచుకోవడంపై ఫోకస్ చేయాలని పేర్కొంది.కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడకుండా మరిన్ని ప్రాంతాల నుంచి వెండిని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఫినిష్డ్ సిల్వర్ దిగుమతులను తగ్గించుకోవాలని తెలిపింది. ఖనిజం నుంచి వెండిని ప్రాసెస్ చేసే ప్రక్రియపై భారత్ పట్టు సాధించాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.అంతర్జాతీయంగా వెండి ఖనిజ మార్కెట్ 6.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, చైనా అత్యధికంగా ఏటా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువ చేసే ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్నారు. దేశీయంగా దాన్ని శుద్ధి చేశాక, ఎల్రక్టానిక్స్, మెడికల్ డివైజ్లు, సోలార్ ప్యానెళ్లలో ఉపయోగించేందుకు వీలుగా, అధిక విలువ చేసే వెండి రూపంలో దాన్ని ఎగుమతి చేస్తోందని శ్రీవాస్తవ చెప్పారు.భారత్ దానికి విరుద్ధంగా 2024లో 6.4 బిలియన్ డాలర్ల విలువ చేసే రిఫైన్డ్ వెండిని దిగుమతి చేసుకుందని, గ్లోబల్ ట్రేడ్లో ఇది 21.4 శాతమని వివరించారు. ఆ విధంగా ప్రాసెసర్గా కంటే ఫినిష్డ్ సిల్వర్కి అతి పెద్ద వినియోగదారుగా భారత్ నిల్చిందన్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా మరింత విలువ జోడించేందుకు ఖనిజ దశ నుంచి వెండిని ప్రాసెస్ చేసే ప్రక్రియపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీవాస్తవ వివరించారు. 9 బిలియన్ డాలర్లకు దిగుమతులు.. 2025 ఆర్థిక సంవత్సరంలో 4.83 బిలియన్ డాలర్ల వెండి ఉత్పత్తులు దిగుమతి చేసుకున్న భారత్ 478.4 మిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేసిందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక 2025 జనవరి–నవంబర్ మధ్య కాలంలో 8.5 బిలియన్ డాలర్ల విలువ చేసే వెండిని దిగుమతి చేసుకోగా, పూర్తి సంవత్సరానికి ఇది 9.2 బిలియన్ డాలర్లకు చేరనుందని తెలిపారు.2024తో పోలిస్తే ఇది 44 శాతం అధికమని వివరించారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇంధన భద్రత తరహాలోనే వెండి భద్రతను సాధించడం కూడా కీలకంగా మారిందని వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా వెండికి నెలకొన్న డిమాండ్లో 55–60 శాతం వాటా ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్ పరికరాలు మొదలైన పారిశ్రామిక విభాగాల నుంచి ఉంటోంది.గత రెండు దశాబ్దాలుగా వెండి ఖనిజం, కాన్సెంట్రేట్ల వాణిజ్యం 2000లో 0.1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024లో 6.27 బిలియన్ డాలర్లకు చేరింది. శుద్ధి చేసిన వెండి వ్యాపారం (కడ్డీలు, తీగలు మొదలైనవి) 2000లో 4.06 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024లో 31.42 బిలియన్ డాలర్లకు చేరింది.
ఫ్యామిలీ
భారత ఆర్మీ ఆఫీసర్గా సెక్యూరిటీ గార్డ్ కుమార్తె ..!
ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోతేనేం.. ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనే కలను కనొచ్చు, నిజం చేసుకోవచ్చు. అందుకు పరిమితులు అనేవి ఎన్నటికి అడ్డంకి కావు అని నిరూపించింది ఓ సెక్యూరిటీ గార్డు కుమార్తె. పైగా చిన్న వయసులోనే భారత ఆర్మీ ఆఫీసర్ అయ్యి.. అరుదైన రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయిగా నిలిచింది. ఎవరా ఆ అమ్మాయి..? ఏమా కథ..? చకచక చదివేయండి మరి...ఆ అమ్మాయే మణిపూర్లోని సేనాపతి జిల్లాలోని రాలూనామీ గ్రామానికి చెందిన ఎనోని. ఆమె మాఓ నాగా అనే గిరిజన తెగకు చెందింది. ఈ తెగకు చెందిన ప్రజలు మణిపూర్, నాగాలాండ్ అంతటా ఉంటారు. ఇక ఎనోని తండ్రి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. తన తండ్రి జీతంపైనే ఆరుగురు పిల్లలు చదువు, పోషణ చూసుకోవాల్సి ఉండేది. ఎనోని ఆ ఆరుగురిలో ఆఖరి అమ్మాయి. అయితే ఆమె తల్లిదండ్రులు ఇంట్లో ఎంతటి దారిద్యం తాండవించినా..వారి చదువుల విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా తమకు చేతనైంనతలో చదివించే యత్నమే చేశారు. ఇక ఎనోని ఆర్మీ వైపుకి ఎలా వచ్చిందంటే..ఎమనిదో తరగతి నుంచే మొదలు..నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో మహిళలు ఎక్కువగా పాల్గొనడానికి అనుమతించబడిన సమయంలోనే ఎనోనికి భారత సైన్యంలో చేరాలనే ఆకాంక్ష ఉంది. సాయుధ దళాల క్రమశిక్షణ, యూనిఫాం అంటే మహా ఇష్టం. ఆ యునిఫాంని ఎప్పుడు ధరిస్తానా అని అనుకునేది. ఆమె పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఎన్సీసీలో చేరింది.తర్వాత NCC సీనియర్ వింగ్ శిక్షణను కొనసాగించడానికి ఢిల్లీకి వెళ్లింది. ఒక మారుమూల గ్రామానికి చెందిన యువతికి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన అడుగు. ప్రతి అడుగు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది..అయినా తన సంకల్ప బలాన్ని వదులుకునేది కాదు. తండ్రి లాఠీ తనకు ఖడ్గంగా ..కఠినమైన శిక్షణ సమయంలో అలసట లేదా విసుగు వచ్చినప్పుడల్లా.. ఎనోని తన తండ్రి త్యాగాలను గుర్తు చేసుకుంటూ..ముందుకు నడిచేది. అతను చేతిలో లాఠీతో చల్లని రాత్రులలో కాపలాగా నిలబడి ఉండగా..తాను ఏదో ఒక రోజు కత్తిని చేత ధరించి భారతీయ సైనిక అధికారిగా భుజాలపై నక్షత్రాలు ధరించాలనే ఆశతో అవిశ్రాంతంగా శిక్షణ తీసుకుంది. ముందు ఇండియన్ మిలటరీ అకాడమీ(ఐఎంఏ)లో కఠినమైన శిక్షణలో విజయం సాధించింది. ఆ తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మాత్రం కాస్త ఒత్తిడికి గురైంది. ఎందుకంటే ఇక్కడ అత్యంత కఠినమైన శిక్షణ ఉంటుంది. శారీరకంగా, మానసికంగా భావోద్వేగపరంగా కఠినమైన శిక్షణను పూర్తి చేయడం అత్యంత కష్టతరం. అయినప్పటికీ ఎనోని అద్వితియంగా పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకుని.. చివరికి అధికారిక యూనిఫాం ధరించి డ్రిల్ స్క్వేర్పై కవాతు చేస్తూ..అనుకున్న లక్ష్యాన్ని సాధించా అంటూ ఒక విధమైన ఉద్విగ్నానికి గురయ్యేది. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు ఒక చరిత్రగా మారింది. ఎందుకంటే తన మావో నాగ కమ్యూనిటీ నుంచి అధికారణిగా భారత ఆర్మీ నయూనిఫాం ధరించిన తొలి మహిళ ఆమె. అలాగే ఈశాన్య భారతదేశం నుంచి ఆర్మీకి నాయకత్వం వహించిన తొలి తొలి మహిళ కూడా ఎనోనినే కావడం విశేషం.(చదవండి: ధైర్యానికి కేరాఫ్ ఆమె..! ఏకంగా 24 దేశాలు..)
శబరిమలలో మరో చోరీ.. ఏకంగా రూ. 16 లక్షలు..
సాక్షి, పథనంతిట్ట: శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతుండగా మరో చోరీ వెలుగు చూసింది. ఈసారి ‘ఆదియ శిష్టం నెయ్యి’ (నెయ్యాభిషేకం నైవేద్యం నుంచి మిగిలిపోయిన నెయ్యి) అమ్మకంలో అక్రమాలు బయటపడ్డాయి. సాధారణంగా నెయ్యభిషేకానికి అవకాశం లేని యాత్రికులు ఈ ఆదియ శిష్టం నెయ్యిని కొనుగోలు చేస్తారు. దీనిని వంద మిల్లీలీటర్ల పౌచ్లలో విక్రయిస్తారు. దీని ధర ప్యాకెట్కు రూ. 100. దేవస్వం విజిలెన్స్ దర్యాప్తులో సుమారు రూ. 16 లక్షల విలువైన 16 వేల నెయ్యి ప్యాకెట్లు మాయమైనట్లు తేలింది. సాధారణంగా ఆలయ ప్రత్యేక అధికారి స్టాక్ని స్వీకరించి సంబంధిత కౌంటర్లకు అమ్మకానికి అప్పగిస్తారు. అయితే అందుకున్న ప్యాకెట్లకు చెల్లించాల్సిన మొత్తం దేవస్వం ఖాతాకు జమ అవ్వలేదని విజిలెన్స్ తనిఖీలో బయటపడింది. ప్రస్తుతం మండల సీజన్లో అమ్ముడైన నెయ్యి ప్యాకెట్లకు, వచ్చిన ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉండటంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి నెయ్యి పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. దేవస్వం బోర్డు పరిధిలోని వివిధ దేవాలయాల పూజారులకు ఈ కౌంటర్లలో విధులు అప్పగిస్తారు. అయితే అమ్మకానికి జారీ చేసేవి, విక్రయం అయినవి, మిగిలిన స్టాక్ వంటి వివరాలు రిజస్టర్లో సరిగా నమోదు కాలేదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతేడాది కూడా ఇలాంటి అవతవకలే జరిగాయన వెల్లడైంది. కానీ వాటిని తరుచుగా అకౌంటింగ్ లోపాలుగా తోసిపుచ్చుతుండటం గమనార్హం. ఈ నెయ్యి ప్యాకెట్ల పంపిణికి సంబంధించి సరైన రిజిస్టర్లు లేకపోవడంతోనే ఇలా తరుచుగా అవతవకలు జరుగుతున్నాయనే వాదనలు గట్టిగా వినిపిస్తునన్నాయి. ఓ పక్క విజిలెన్స్ దర్యాప్తు జరుపుతున్నప్పటికీ అధికారిక స్థాయిలో ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా పరిష్కరించుకునే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బిజు మాట్లాడుతూ..తమ దృష్టికి ఈ విషయం రాగానే విజిలెన్స్కు సమాచారం అందించాం. దయ చేసి నిజం బయటకు రానివ్వండి లేదంటే ఎవ్వరికి రక్షణ లేకుండా పోతుందని అన్నారు. (చదవండి: శబరిమలలో ఫుల్రష్..! దర్శనం కోసం బారులు తీరిన భక్త జనసంద్రం..)
ధైర్యానికి కేరాఫ్ ఆమె..! ఏకంగా 24 దేశాలు..
అనారోగ్యం అంటే ఎవ్వరైనా హడలిపోతాం. ఎలా బయటపడతాం అనే బెంగ వచ్చేస్తుంది. దీనికి తోడు విధి పెట్టే భయంకరమైన పరీక్షలకు అల్లాడిపోతుంటాం. అలాంటి వాటన్నింటిని జయించి..ఎందరికో మార్గదర్శకురాలిగా మారారు మినాతి బోర్ఠాకూర్. కేన్సర్కి గట్టి కౌంటిరిచ్చేలా సాగుతున్నా ఆమె ప్రయాణం ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తి కూడా.అసోంలోని గువాహటికి చెందిన మినాతి బోర్ఠాకూర్కి చిన్న వయసులోనే పెళ్లి, ముగ్గురు పిల్లలు. అయితే ఆ ముగ్గురి పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ బాధ తట్టుకోవడం అంత సులభం కాలేదామెకు. దాన్నుంచి బయటపడేందుకు చదువుపై ధ్యాస పెట్టారామె. అలా చదువుకున్న కాటన్ కాలేజ్లోనే ప్రొఫెసర్గా చేసి ఫిలాసఫీ విభాగానికి హెడ్ స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో ఎన్నో రిసెర్చ్ పేపర్లు రాస్తుండేవారు. అయితే ఒకరోజు ఉన్నటుండి కడుపునొప్పి రావడం మొదలైంది. మొదట్లో సాధరమైనదిగా కొట్టిపారేసింది. కానీ రాను రాను తీవ్రమై తట్టుకోలేని స్టేజ్కి వచ్చేశారు. దాంతో కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లగా..కేన్సర్ అని తేలింది. అది కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్కి పాకింది. అసలు బతకడమే కష్టమన్నారు వైద్యులు. అయితే భర్త బిహారి బోర్ఠాకూర్ ఆమె చేత కేన్సర్ జయించిన వారి జీవితాల పుస్తకాలను చదివించేవారు. వాళ్ల స్ఫూర్తితో పట్టుదలగా ట్రీట్మెంట్ తీసుకుని..కేన్సర్ని నుంచి బయటపడ్డారు. అయితే మినాతికి కేన్సర్ నుంచి బయటపడటం ఎంత కష్టమో తెలుసు, అందుకనే ఉద్యోగం కొనసాగిస్తూనే కేన్సర్ బాధితులకు ఉచితంగా కౌన్సిలింగ్ వంటి ఇతర సామాలు అందిచడం మొదలుపెట్టారామె. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్, మెడిటేషన్ సెంటర్నీ ఏర్పాటు చేశారు. అలాగే తన కేన్సర్ చికిత్స అనుభవాలను ‘మోర్ ఒషూకోర్ ఎబోసర్: ఎజోన్ క్యాన్సర్ రోగిర్ ఒబిగోటా’ అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. మరోసారి కేన్సర్ తిరగబెట్టడంతో..2009... అనారోగ్యానికి గురైన భర్తకి సేవలు చేస్తున్నారు మినాతి. విపరీతమైన నడుము నొప్పి. పరీక్ష చేయించుకుంటే మళ్లీ కేన్సర్ తిరగబెట్టిందన్నారు వైద్యులు. ఈసారి పెల్విక్, వెన్నెముక ప్రాంతాల్లో వచ్చింది. అయితే మినాతి అస్సలు భయపడలేదు. కానీ ఆమె భర్త తీవ్ర ఆందోళనకు లోనయ్యి గుండెపోటుతో మరణించారు. వ్యాధి కన్నా విధి పెట్టిన క్షోభకు అల్లాడిపోయారామె. దాంతో మినాతి తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు. అప్పుడు తనలాంటి వాళ్ల గురించి ఆలోచించడం ప్రారంబించాక..ఆమెలో తెలియని ఆరాటం, తపన మొదలయ్యాయి. అలాగ మళ్లీ కేన్సర్పై పోరాడేందుకు రెడీ అయ్యారు మినాతి. అయితే ఈసారి కూడా మినాతినే కేన్సర్పై గెలిచారు. ఇక ఈసారి కేన్సర్ జర్నీని కూడా ‘కొలిజా కైతే బిందిలే జి చోరాయే గాన్ గాయే’ అనే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. అంతేగాదు కేన్సర్ బాధితులకు అండగా ఉండేలా.. డైట్, న్యూట్రిషన్, ప్రాణాయామం, ధైర్యంగా సమస్యతో పోరాడటం... ఇలా ఎన్నో అంశాల్లో అవగాహన కల్పించడం ప్రారంభించారు. ఆమె సేవలు భారత్కే పరిమితం కాలేదు. శ్రీలంక, అమెరికా, ఆస్ట్రేలియాతో సహా మొత్తం 24 దేశాలకు విస్తరించారు. పైగా ఆమె శరీరాన్ని గుహవాటి మెడికల్ కాలేజ్కి కేన్సర్ పరిశోధనలకు రాసిచ్చారామె. అంతేకాదండోయ్ ఆమె పుస్తకాలు కూడా ఎన్నో భాషల్లోకి తర్జుమా అయ్యి ఎందరో కేన్సర్ భాధితుల్లో అపారమైన ధైర్యాన్ని నింపుతున్నాయి. 79 ఏళ్ల వయసుకి చేరినా.. మినాతి కేన్సర్ సహాయ సేవ కార్యక్రమాలను ఆపలేదు. ఇంకా చేతనైనంతగా ఏదో చేయాలనే ఆమె ఆరాటం ఆకాంక్ష అజరామరం, స్ఫూర్తి కూడా..! View this post on Instagram A post shared by 🧿 Snayusneham Physio🧿 (@snayusneham_physio) (చదవండి: ఏడేళ్ల వయసుకే.. ఏడు ఖండాలు..! అమెరికన్ బుడ్డోడి ఘనత)
ఏడేళ్ల వయసుకే.. ఏడు ఖండాలు..!
పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఈ చిన్నారి చిన్న వయసుకే అత్యంత అరుదైన ఘనత సృష్టించాడు. నిండా పట్టుమని పదేళ్లు కుడా లేవు. ఏకంగా ఏడు ఖండాలు చుట్టేశాడు అమెరికన్ బుడ్డోడు వైల్డర్ మెక్గ్రా. జస్ట్ ఏడేళ్లకే అంటార్కిటికాతో సహా ఏడు ఖండాలు చుట్టొచ్చి.. అరుదైన ఘనతను సాధించాడు. అంటే ఈ చిన్నారి ప్రయాణం శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమైందని తెలుస్తోంది. అతడి సాహసయాత్రలను తల్లిదండ్రులు జోర్డి లిప్పే మెక్గ్రా, రాస్ మెక్గ్రాలు నమోదు చేశారు. ఏడు ఖండాలను చుట్టొచ్చే చిన్నారిగా తమ కుమారుడిని పెంచలేదని చెబుతున్నారు అతడి తల్లిందండ్రులు. తమకు పర్యాటనలంటే మహాఇష్టమని, ఆ నేపథ్యంలోనే తాము నచ్చిన ప్రదేశాలకు పర్యటిస్తున్నామని ఆ కుటుంబం చెబుతోంది. ఇక తమ కుమారుడు వైల్డర్ జర్నీ ఎనిమిది వారాల వయసులో పోర్చుగల్ పర్యటనతో ప్రారంభమైందని, తర్వాత అతడి రెండో పుట్టినరోజు ముందు కరేబియన్, కెనడా, మెక్కికోలను సదర్శించినట్లు వెల్లడించాడు తండ్రి రాస్. అతను పెద్దయ్యాక యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వరకు వెళ్లడం జరిగిందని అన్నాడు. అయితే తాము దక్షిణ అమెరికా పర్యటనకు ముందు తమ బిడ్డ ఐదు ఖండాలు సందర్శించాడని గుర్తించాం అని చెప్పుకొచ్చాడు తండ్రి రాస్. దాంతో అప్పుడే తమకు వైల్డర్ ఈ ఖండాల జాబితాను పూర్తి చేస్తే ఎలా ఉంటుది అనే ఊహ వచ్చిందని, అందుకు అనుగుణంగా ట్రిప్లు ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు పేరెంట్స్. అలా ఈ కుటుంబం సాహసయాత్ర కాస్తా అంటార్కిటిక్ ఖండానికి చేరుకుంది. ఆ విధంగా తమ బిడ్డ వైల్డర్ ఈ ఖండంలో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కులలో ఒకడిగా నిలిచాడని ఆనందంగా చెబుతున్నారు. అంతేగాదు ఈ అంటార్కిటక్ పర్యటనలో తన భార్య జోర్డికి అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైల్డర్ తండ్రి రాస్. ఎందుకంటే ఆమె ఈ అంటార్కిటికా ఖండంలో గర్భవతిగా(వైల్డర్ కడుపులో ఉండగా) అడుగు పెట్టిందట. అంటే జోర్డీ డెలివరీ అయ్యాక తన బిడ్డతో కలిసి మరోసారి అంటార్కిటికాకు వచ్చారామె. కాగా, ఆ కుటుంబం ఈ పర్యటనలు కేవలం గమ్యస్థానాలు లేదా రికార్డుల కోసం మాత్రం కాదని, ఆయా విభిన్న సంస్కృతులను అనుభవించడం, మరుపురాని జ్ఞాపకాలను పొందుపర్చుకోవడం అని చెబుతుండటం విశేషం. ఈ టూర్ల వల్ల వైల్డర్కి సహనంగా ఉండటం అలవడిందని చెబుతున్నారు తల్లిదండ్రులు. అయితే ఆ ఫ్యామిలీ విజయవంతంగా ఏడు ఖండాలు చుట్టేసినా..ఇక్కడ నుంచి ప్రశాంతమైన ప్రయాణాలపై దృష్టి సారించనున్నాం అని చెబుతుండటం విశేషం. ఇక ఇప్పుడే వెళ్లే టూర్లన్ని తమ బిడ్డకు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని వెళ్లేలా జర్నీ ప్లాన్ చేయనున్నాం అని నవ్వుతూ చెబుతున్నారు వైల్డర్ తల్లిదండ్రులు.(చదవండి: భార్య కేన్సర్ చికిత్సకు నిధులుగా..50 టన్నుల చిలగడ దుంపలు!)
అంతర్జాతీయం
456 సంచుల్లో బయటపడ్డ మృతదేహాలు!
మరో ఆరునెలల్లో.. ప్రపంచం చూపు మొత్తం అటు వైపే ఉండబోతోంది. వేలాది మందితో అక్కడ కోలాహలం కనిపించనుంది. వీవీఐపీల రాక నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈలోపు.. సంచుల్లో వందల సంఖ్యలో మృతదేహాలు బయటపడ్డాయన్న విషయం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ పరిణామాల చోటు చేసుకుంటోంది ఎక్కడో కాదు.. మరో ఆరు నెలల్లో ఫుట్బాల్ సంబురం ఫిఫా వరల్డ్ కప్ జరగబోయే మెక్సికోలోని ఓ స్టేడియం దగ్గర్లో. జలిస్కో స్టేట్ గ్వాడలజారా(Guadalajara) ఎస్టాడియో అక్రోన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శవాల సంచులు బయటపడుతున్నాయి. స్టేడియం నిర్మాణ పనుల నేపథ్యంలో.. ఈ విషయం బయటకు రావడంతో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే.. ఇవేం ఒక్కసారిగా బయటపడ్డవేం కాదు. 2022 నుంచి గతేడాది డిసెంబర్ మొదటి వారంలోపు.. మొత్తం 456 మృతదేహాల అవశేషాలను అదీ సంచుల్లోనే గుర్తించారు. స్టేడియానికి 10 నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న లాస్ అగుజాస్, జపోపాన్, ట్లాక్వేపాక్ ప్రాంతాల్లో ఇవి బయటపడ్డాయి. ఇందులో ఒక్క లాస్ అగుజాస్ ప్రాంతంలోనే 290 సంచులు బయటపడ్డాయట!. 2025 నాటికి మెక్సికోలో 1,30,000 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. జలిస్కో రాష్ట్రం అదృశ్యాల సంఖ్యలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. అయితే.. లోకల్ ఏజెన్సీల ప్రకారం ఈ అవశేషాలు నేర గుంపులు (కార్టెల్స్) చేసిన పనేనట. అందునా మెక్సికోలోనే అత్యంత శక్తివంతమైన న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) కారణంగానే ఈ మిస్సింగ్లు, హత్యలు జరిగినవని అంచనా వేస్తున్నారు.2026 వరల్డ్ కప్ వేదికగా ఉన్న మెక్సికోలోని ఎస్టాడియో అక్రోన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 456 సంచుల్లో మానవ అవశేషాలు బయటపడటం.. అక్కడి భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వ్యవహారం అధికారుల స్పందన మరోలా ఉంది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంటున్నారు. స్టేడియం పరిసరాల్లో ఇప్పటికే ఉన్నవి కాకుండా.. అదనంగా 3,000 సీసీ కెమెరాలు, ఆర్మర్డ్ వాహనాలు, మెటల్ డిటెక్టర్లు, నేషనల్ గార్డ్ బలగాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్టాడియో అక్రోన్ స్టేడియం 2026 వరల్డ్ కప్లో నాలుగు గ్రూప్ మ్యాచ్లు నిర్వహించనుంది. మెక్సికో రెండో గ్రూప్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. అయితే సంచుల్లో మృతదేహాలు బయటపడిన ఈ పరిస్థితుల్లో ఇక్కడ వరల్డ్ కప్ నిర్వహించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామానికి దారి తీస్తుందో చూడాలి.
రూ. 63.01 కోట్ల కొకైన్ : ఇద్దరు భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్
భారత్కు చెందిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లను డ్రగ్స్ కేసులో అమెరికాలోని ఇండియానా పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 63.01 కోట్ల విలువైన 309 పౌండ్ల కొకైన్ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఇది లక్షకు పైగా (1,13,000)అమెరికన్లను చంపేంత ప్రమాదకరమని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ట్రిసియా మెక్లాఫ్లిన్ తెలిపారు.గురుప్రీత్ సింగ్ (25) జస్వీర్ సింగ్ (30) అమెరికాలోని ఇండియానాలో అదుపులోకి తీసుకున్నారు. వీకెండ్ హైవే తనిఖీల్లో అనుమానాస్పందగా ప్రయాణిస్తున్న వీరి వాహనాంలో కొకైన్ తరలిస్తున్నట్టు గమనించి స్నిఫర్ డాగ్ యూనిట్ అధికారులను అప్రమత్తం చేశారు. కోర్టు రికార్డుల ప్రకారం, "ట్రక్కు సెమీ-ట్రక్కు స్లీపర్ బెర్త్లో దుప్పటితో కప్పిన అట్టపెట్టెల్లో 140 కిలోల కొకైన్ను పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేసి పుట్నం కౌంటీ జైలుకు తరలించారు. నిందితులు మాదకద్రవ్యాలను విక్రయించారన్ననేరారోపణలు ఎదుర్కొంటున్నారని, బహిష్కరణ చర్యలు తీసుకుంటామని ఇండియానా రాష్ట్ర పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!అయితే నిందితులు దీన్ని ఖండించారు. ట్రక్కు లోపల ఏముందో తమకు తెలియదని, తమ ట్రక్కింగ్ కంపెనీ ట్రక్కును రిచ్మండ్లోని ఒక భారతీయ రెస్టారెంట్కు తీసుకెళ్లి లోడ్ కోసం వేచి ఉండమని ఆదేశించిందని చెప్పారు. గురుప్రీత్ సింగ్ 2023, మార్చి 11న అరిజోనా నుండి అక్రమంగా యుఎస్లోకి ప్రవేశించగా, జస్వీర్ సింగ్ 2017 ,మార్చి 21న కాలిఫోర్నియా నుండి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడని అధికారులు పేర్కొంటున్నారు. వీరిద్దరికీ కాలిఫోర్నియా వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్లను మంజూరు చేసింది. మరోవైపు కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో చోరీ కేసులో జస్వీర్ను గత నెలలో అరెస్టు చేశారు.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్
మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్
అమెరికాలో వలసదారులపై జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ దారుణానికి ఒడిగట్టాడు. ఒక మహిళను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. మిన్నియాపాలిస్లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారంమిన్నెసోటాలోని మిన్నియాపాలిస్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్కు వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమానికి దిగారు. నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, కారులో కూర్చున్న మహిళ తలపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.Ice agent shoots woman who tried to flee 😳 pic.twitter.com/fJ1X2XDMhC— RTN (@RTNToronto) January 7, 2026 ఇమ్మిగ్రేషన్ అమలు సమయంలో అధికారులను అడ్డుకోడంతో కాల్పులు జరిపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఘర్షణ సమయంలో మహిళపై కాల్పులు జరిగాయని DHS ప్రతినిధి ట్రిసియా మెక్లాఫ్లిన్ తెలిపారు. అల్లర్లకు, రెనీ గుడ్కు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తల్లి డోనా గాంగర్ విచారం వ్యక్తం చేసింది. తన కుమార్తె ఎంతో దయగల, గొప్ప మనిషి, ప్రజలంటే ప్రేమగల ఆమెను అన్యాయంగా కాల్చి చంపారని తల్లి వాపోయింది. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్, హింస సర్వసాధారణంగా మారింది అని చెప్పడానికి మరో స్పష్టమైన ఉదాహరణ అని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు బ్రియాన్ హెంఫిల్ వ్యాఖ్యానించారు. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం అంటూ ఆగ్రహం పెల్లుబుకింది. వందలాది మంది నిరసనలకు దిగారు. మిన్నియాపాలిస్ నగర కౌన్సిల్లోని మెజారిటీ సభ్యులు రెనీ మరణానికి కారణమైన ఏజెంట్ను అరెస్టు చేసి, విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ICE తమ నగరాన్ని విడిచి పెట్టాలంటున్నారు. అధికారుల భిన్నవాదనలుఈ సంఘటనల గురించి ఫెడరల్ , స్థానిక అధికారులు చాలా భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కారును ఆపి బయటికి రావాలని ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా ఏజెంట్పై ఎదురుదాడికి దిగి, ICE అధికారిని ఢీకొట్టడానికి ప్రయత్నించినందున మహిళను కాల్చి చంపామని అంటున్నారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు జరుగుతోంది2020లో ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో పట్టభద్రురాలైంది గుడ్. ఆమె కవయిత్రి కూడా. ప్రస్తుతం రెనీ నికోల్ గుడ్ తన భాగస్వామితో మిన్నియాపాలిస్లో నివసిస్తోంది.కాగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత వలసదారుల ఆంక్షలు, దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది.ఇదీ చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్ఐ
పాక్లో హమాస్ - లష్కరే భేటీ.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో ముందు వరుసలో ఉందనే పేరుపొందిన పాకిస్తాన్ గడ్డపై తాజాగా మరో ప్రమాదకర పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హమాస్, లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ల మధ్య జరిగిన భేటీ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది.పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూపు, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే ఉగ్రవాదులు తమ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడిన ఈ కూటమి భవిష్యత్తులో అంతర్జాతీయ భద్రతకు పెను సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లోని గుజ్రన్ వాలాలో లష్కరే తోయిబాకు చెందిన ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (పీఎంఎంఎల్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నజీ జహీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లష్కరే కమాండర్ రషీద్ అలీ సంధుతో ఆయన సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి రావడంతో ఈ ఉగ్ర ముఠాల మధ్య ఉన్న సంబంధాలు బహిర్గతమయ్యాయి. Senior Hamas commander attended Lashkar terrorist function as Chief guest in Gujranwala, PakistanIsrael will be watching this 😎 pic.twitter.com/kuTKF0zHpP— Megh Updates 🚨™ (@MeghUpdates) January 7, 2026హమాస్ నేత నజీ జహీర్కు పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు ఈనాటికి కావు.. 2025, ఫిబ్రవరిలో పహల్గాం ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు ఆయన పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించి, లష్కరే, జైషే మొహమ్మద్ కమాండర్లతో కలిసి భారత వ్యతిరేక ర్యాలీలో ప్రసంగించారు. అంతకుముందు 2024 జనవరిలో కరాచీ ప్రెస్ క్లబ్లో ప్రసంగించారు. ఇస్లామాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి సన్మానం కూడా అందుకున్నారు. ఈ ఉగ్ర ముఠాల ఐక్యత మరింతగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయం
బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!
బిచ్చగాళ్లు, వారి సంపద గురించి చాలానే విన్నాం. బిచ్చగాళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ఖరీదైన ఇళ్లలో జీవించే వారి గురించి గతంలో అనేక కథనాలు చూశాం. కానీ ఇదొక బిచ్చగాని విషాద గాథ. కేరళలోని అలప్పు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 50 ఏళ్ళ బెగ్గర్ వద్ద లభించిన నోట్ల కట్టలు చూసి అంతా అయ్యో అనుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.ఆహారం కోసం కేరళలోని అలెప్పూ వీధుల్లో అడుక్కునే బిచ్చగాడి వద్ద విదేశీ కరెన్సీతో సహా ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు లభ్యం కావడంతో స్థానికులు, అధికారులు ఆశ్చర్య పోయారు. ఈ నగదులో రద్దైన రూ.2,000 నోట్లు కూడా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసింది. చారుమూట్ , సమీప ప్రాంతాలలో ఇతను అందరికీ సుపరిచితుడే. సోమవారం సాయంత్రం స్కూటర్పై వెళ్తుండగా ఒక వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రికార్డుల ప్రకారం అతను తనను తాను అనిల్ కిషోర్గా పరిచయం చేసుకుని, స్థానిక చిరునామా ఒకటి ఇచ్చాడు. తలకి తీవ్రమైన గాయాలయ్యాయని ప్రత్యేక చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ వారి మాటల్ని అతను పట్టించుకోలేదు. మంగళవారం ఉదయానికి, అతని మృతదేహం కడతిన్నల్ ప్రాంతంలోని ఒక దుకాణం వెలుపల కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపి, అతని సమీపంలో దొరికిన వస్తువులను పరిశీలించగా డబ్బుల విషయం వెలుగు చేసింది.డబ్బు కట్టలుఅతని దగ్గర ఉన్న డబ్బాను స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో పోలీస్ స్టేషన్లో తెరిచి, అధికారులే ఆశ్చర్యపోయారు. దాని లోపల ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేసి, టేప్తో చుట్టబడిన డబ్బు కట్టలు ఉన్నాయి. మొత్తం నగదు రూ.4.5 లక్షలకు పైగా ఉంది. ఆ నోట్లలో రద్దు చేయబడిన రూ.2,000 నోట్లు ,సౌదీ రియాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్అతను భిక్షాటనపైనే జీవించేవాడని, తరచుగా ఆహారం కొనడానికి చిన్న మొత్తంలో డబ్బు అడిగేవాడని స్థానికులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, అదీ విదేశీ కరెన్సీ ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఏమీ లేని వ్యక్తిగా జీవించే వ్యక్తి దగ్గర ఇంత మొత్తం ఉండటం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసిందని ఒక పంచాయతీ సభ్యుడుపేర్కొన్నాడు.కాగా అతడు తమ బంధువు అనిచెప్పి, మృతదేహం లేదా డబ్బు కోసం ఇంతవరకూ ఎవరూరాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో చట్ట ప్రకారం నగదును కోర్టుకు అప్పగిస్తారు. దర్యాప్తు అధికారులు ఇప్పుడు కిషోర్ నేపథ్యాన్ని ఆ డబ్బు అతనికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఇదీ చదవండి: పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?
మా పనిని అడ్డుకుని.. కీలక ఆధారాల్ని లాక్కెళ్లారు
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తీవ్ర ఆరోపణలకు దిగింది. ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం జరిపిన తనిఖీల సందర్భంగా తమతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెబుతోంది. అంతేకాదు.. తాము రికవరీ చేసిన ఆధారాలను పట్టుకుపోయారని ఆరోపిస్తోంది. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోల్కతా సహా దేశంలోని ఐప్యాక్కు చెందిన పలు చోట్ల ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం వద్ద సోదాలు జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కడికి సీఎం మమతా బెనర్జీ సీపీ మనోజ్ బెనర్జీతో కలిసి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే కాసేపటి తర్వాత జైన్ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె చేతిలో.. ఓ ల్యాప్ట్యాప్, మొబైల్ ఫోన్, పలు డాక్యుమెంట్లతో కూడిన గ్రీన్ ఫైల్ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె మీడియాతో.. బెంగాల్ ఎలక్షన్స్ నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ తమను లక్ష్యంగా చేసుకుందని.. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని ఆమె మండిపడ్డారు కూడా. అయితే ఆమె ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. పక్కా ఆధారాలతోనే ఈ తనిఖీలు నిర్వహించాం. ఎక్కడా కూడా ఏ పార్టీ కార్యాలయాన్ని టచ్ చేయలేదు. ఏ ఎన్నికలతోనూ మాకు సంబంధం లేదు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే ఈ తనిఖీలు. అంతా చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాం అని ఈడీ ప్రకటించింది. అలాగే.. ఆ సమయంలో ఆమె తమ నుంచి బలవంతంగా పత్రాలను, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను లాక్కున్నారని ఆరోపించింది. అంతేకాదు.. ఈ పరిణామంపై ఈడీ కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. తమ విధులకు ఆటంకం కలిగించారని, ఆధారాలను తీసుకెళ్లారని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోపు.. నేటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ సోదాలు రాజ్యాంగవిరుద్ధం. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారు. మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్డిస్క్ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు అని దీదీ మండిపడ్డారు. అయితే మమతా బెనర్జీ చేసింది ఈడీ దాడుల్లో జోక్యం చేసుకోవడమేనని ప్రతిపక్ష బీజేపీ మండిపడుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఆమె ప్రవర్తన అనైతికం అన్నారు.
కుక్కల కంటే పిలుల్ని పెంచుకోండి
సాక్షి, ఢిల్లీ: వీధి కుక్కల కేసు విచారణ ఇవాళ ఎటు నుంచి ఎటో పోయింది. ఈ కేసు విచారణ సందర్భంగా గురువారం సుప్రీం కోర్టులో పిల్లుల ప్రస్తావన కూడా వచ్చింది. అలాగే వీధుల్లోని అన్ని కుక్కలను తరలించమని తాము ఆదేశించలేదని.. కేవలం సంస్థలు, కార్యాలయాల నుండి మాత్రమే తరలించమన్నామని స్పష్టం చేసింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. ‘‘కుక్కలను పెంచుకునే కంటే పిల్లుల్ని పెంచుకోండి. ఎలుకల్ని నియంత్రించడంలో పిల్లులు సహాయ పడుతాయి. కాబట్టి కుక్కలను పెంచే కంటే పిల్లులను పెంచుకోవడానికి ప్రోత్సహించాలి’’ అని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అలాగే.. వీధి కుక్కల తొలగింపు విషయంలో నియమాలను పాటించాల్సిందేనని మరోమారు స్పష్టం చేసింది.విచారణలో భాగంగా.. పట్టణాల్లో జంతువుల నియంత్రణ అంశంపై వాదిస్తూ సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్(యానిమల వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ తరఫున) కుక్కల అంశంతో పాటు ఎలుకలు, పిల్లుల గురించి ప్రస్తావించారు. కుక్కలు లేకపోతే ఎలుకలు, కోతుల సమస్య పెరుగుతుందని వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సందీప్ మెహతా.. కుక్కలు, పిల్లులు పరస్పరం శత్రువులు. పిల్లులు, ఎలుకలు బద్ధ శత్రువులు. వీధుల్లో కుక్కల సంఖ్య తగ్గితే.. పిల్లుల సంఖ్య పెరుగుతుంది. అప్పుడవి ఎలుకలను తింటాయి కదా” అని జస్టిస్ మెహతా సరదాగా వ్యాఖ్యానించారు. వీధి కుక్కల దాడుల వ్యవహారంలో సుప్రీం కోర్టు సుమోటో విచారణ కొనసాగుతోంది. సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్ వాదిస్తూ.. ఏబీసీ (Animal Birth Control) నియమాలు అమలు చేయడం.. స్టెరిలైజేషన్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టడం.. సరైందని వాదించారు. పెద్ద సంఖ్యలో కుక్కలను షెల్టర్లలో ఉంచితే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు.సీనియర్ అడ్వకేట్ కృష్ణన్ వేణుగోపాల్ వాదిస్తూ.. దేశవ్యాప్తంగా ABC అమలు చేయడానికి రూ.1,600 కోట్లు అవసరమని, ఐదు మంత్రిత్వ శాఖలు కలసి పని చేయాలని సూచించారు. అయితే.. ప్రస్తుతం కేవలం 66 ABC కేంద్రాలు మాత్రమే ఉన్నాయని.. దేశవ్యాప్తంగా 5.2 కోట్ల వీధికుక్కలన్నాయనే అంచనాలున్నాయని, అదే సమయంలో వెటర్నరీ డాక్టర్లకు పెద్ద స్థాయిలో శిక్షణ అవసరమని పేర్కొన్నారు.బీజేపీ నేత విజయ్ గోయల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ABC నియమాలు కుక్కల జనాభాను తగ్గించడానికి రూపొందించబడ్డాయని చెప్పారు. హింసాత్మక కుక్క(violent dog) అనే పదానికి నిర్వచనం స్పష్టంగా లేదని, ఢిల్లీలో ఒకే కుక్క వరుసగా ముగ్గురిని కరిచిన ఉదాహరణను చూపించారు. తమ హెల్ప్లైన్కు ఇప్పటివరకు 20,000 పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.కోర్టు ఆందోళనదేశవ్యాప్తంగా కుక్కల దాడులు పెరుగుతున్నాయి అని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. - మున్సిపల్ సంస్థలు, స్థానిక సంస్థలు ABC నియమాలను సరిగా అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొంది. వీధుల్లో జంతువుల ఉనికి రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతోందని గమనించినట్లు తెలిపింది. తదుపరి వాదనలు రేపు కూడా జరగనున్నాయి.
బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్ఐ
లక్నో : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో దారుణ ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక పోలీసు అధికారి ఒక యూట్యూబర్ ఉండటం మరింత ఆందోళన రేపింది.బాధిత బాలిక పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం కాన్పూర్లోని సచెండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూట్యూబర్ శివబరన్ అరెస్ట్ చేశారు. సబ్-ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్ మౌర్య పరారీలో ఉన్నాడు.ఏం జరిగిందంటే..7వ తరగతి చదువు మానేసిన మైనర్ బాలిక సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు తన ఇంటి నుండి బయటకు వెళ్ళగా, మహీంద్రా స్కార్పియోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.అనంతరం సచెండిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాహనంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమెపై లైంగిక దాడి జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఇంటి బయట వదిలి వెళ్లారు. బాధితురాలి సోదరుడు అర్ధరాత్రి సమయంలోఆమెను గమనించి 112కు డయల్ చేసి పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.నిందితులలో ఒకరు పోలీసని చెప్పడంతో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాలిక సోదరుడు ఆరోపించాడు. ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాతే కేసు నమోదు చేశారని, అంతేకాకుండా ఫిర్యాదులో నిందితుల పేర్లను మొదటగా చేర్చలేదని పేర్కొన్నాడు.బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) దినేష్ త్రిపాఠి తెలిపారు. జర్నలిస్టును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, పోలీసు కానిస్టేబుల్ను గుర్తించి విచారణ పూర్తయిన తర్వాత అతడిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు. కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశామని, విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.పరారీలో ఉన్న SIని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని మరో పోలీసు అధికారి రఘుబీర్ లాల్ విలేకరులకు తెలిపారు.
ఎన్ఆర్ఐ
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో ఓరుగల్లు ఆడబిడ్డ
సాక్షి ప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత సౌత్ ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె 2011 నుంచి సౌత్ ఆస్ట్రేలియా లిబరల్ పార్టీకి బలమైన మద్దతురాలిగా ఉన్నారు. 2023లో టోరెన్స్ ఎస్ఈసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అక్కడి తెలుగు వారందరినీ ఐక్యపరచి తెలుగు సంప్రదాయాన్ని చాటుతున్నారు. మార్చి 18న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తెలుగు వారి సత్తా చాటుతామంటున్నారు. 2022లో క్లెమ్ జిగ్ వార్డు కౌన్సిలర్గా ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు.
క్వీన్స్ కామన్ వెల్త్ వ్యాసరచన పోటీలో విజేతగా తెలుగమ్మాయి..!
వసుధైవకుటుంబకమ్ అనే సార్వజనీన సార్వకాలిక దృక్పథం.. ప్రపంచ సాహిత్యంలో వలసవాద ధోరణుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ అల్లాడిన ప్రపంచవ్యాప్తంగా ఉండే దీనప్రజానీకానికి మద్దతు తెలిపే కవిత్వ ధోరణి.. ఇలాటి పెద్దపెద్ద విషయాలు ఒక చిన్నారి కవితలలో కనపడటం మామూలు విషయం కానేకాదు. సింగపూర్లో క్రెసెంట్ గర్ల్స్ స్కూల్ నుంచి సెకండరీ 2 విద్యార్థిని అయిన ఆచంట లక్ష్మీ మనోజ్ఞ ఇలాటి గొప్ప అద్భుతాన్నే చేసి చూపించింది. పూవు పుట్టగానే పరిమళిస్తున్న చందంగా చదువుతో పాటు సంగీత సాహిత్యాలు పియానో వాదన, నృత్యం ఇలా బహువిధాలుగా తన ప్రజ్ఞను వికసింపజేసుకుంటున్న మనోజ్ఞ ఈ సంవత్సరం రాయల్ కామన్వెల్త్ సొసైటీ (RCS), పాఠశాలల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ రచనల పోటీ అయిన 'ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC) 2025' విజేతలలో ఒకరిగా ఎంపిక అవడం విశేషం. ఈమె తన కవిత్వం ద్వారా, విశ్వమానవాళికి సంబంధించిన సంవేదనలతో తాదాత్మ్యాన్ని పొందుతుంది. వారి జీవితాలలో నిండిన దైనందిన భావావేశాల లయలను తన కవితలద్వారా స్పృశిస్తుంది. పియానో పట్టుకోని వేళలను ప్రపంచ పౌరుల సుఖదుఃఖాలను ప్రతిబింబించే కవితలను అల్లడానికి సమయాన్ని వినియోగిస్తుంది. పిన్న వయస్కురాలైనప్పటికీ ఈమె కవితా ధోరణులలో ఎలిజబెత్ లిమ్ మరియు ఆన్ లియాంగ్ వంటి రచయితలచే పొందిన ప్రభావాలున్నాయి.మనోజ్ఞ రాసిన, బహుమతి గెలుచుకున్న 'ఇండియా టు మారిషస్' అనే కవిత, తన తల్లి నుంచి వేరు చేయబడి, భారతదేశంలోని తన ఇంటి నుండి మారిషస్లోని ఒక ఎన్క్లోజర్కు తరలించబడిన ఒక చిన్న కోతి కథను చెబుతుంది. భారతదేశంలో జన్మించినా ఆరు నెలల వయస్సులో సింగపూర్కు వెళ్లి అక్కడ శాశ్వత నివాసం చేసే కుటుంబానికి చెందిన మనోజ్ఞ, ఈ పోటీకోసం ఎన్నుకునే ఇతివృత్తంగా - 'అవర్ కామన్వెల్త్ జర్నీ'కి సంబంధించి భారతదేశం గురించి రాయాలనుకుంది.ఆమెకు భారతదేశం, మారిషస్లను కలిపే బానిస కార్మిక వ్యాపారం గురించి అవగాహన ఉంది. దానితో ఆ దేశాల మధ్య మార్గం గురించి, అలాగే మన భారతదేశం నుండి మారిషస్కు వచ్చిన వారి అనుభవాల గురించి పరిశోధించడం ప్రారంభించింది. కార్మికులతో పాటు అన్యదేశ వన్యజీవులతో కూడా వలస వ్యాపారం చేస్తున్నారని తెలుసుకొని వేదనపడ్డది. ఆ విషయమే కోతికి సంబంధించిన ప్రతీకాత్మక దృష్టికోణం నుండి రాయడానికి ఆమెకు ప్రేరణగా మారింది. ఆమె బహుమతి పొందిన కవితలో భారతదేశం నుంచి మారిషస్కు దాని దయనీయమైన ప్రయాణాన్ని వర్ణిస్తూ, మరియు తల్లిచెంత, స్వంత భూమిలో లభించే ఆత్మీయమైన వాతావరణం హఠాత్తుగా కోల్పోయి, పరాయి చోటున బందీయై పలుబాధలు పడుతూ తిరిగి తల్లి ప్రేమను ఆశిస్తూ అది లభించక పడే తపన...జాలికొలిపే తీరులో దాని ఆర్ద్రమైన కోరికను తన తల్లికి స్వగతంగా విన్నవించుకునే -పసికోతి ద్వారా చెప్పబడిన హృదయవిదారకమైన ఒక ఘటనకు చెందిన కవిత ఇది.. బందిఖానాలో ఉన్నప్పుడు , స్వానుభవాలపట్ల గమనిక..తను పొందిన తీపి అనుభవాలకూ.. ప్రస్తుతం అనుభవించే మనోవేదనకూ మధ్య జరిగే సంఘర్షణను ప్రతి ఒక్కరి హృదయాలను తాకేటట్టు వర్ణించే మనోహరమైన కవిత ఇది. ఈ కవితను రాయడానికి భూమికగా - ఇండియానుండి సింగపూర్కు వచ్చి, ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని, తన మరియు తన సోదరి కోసం వారిదైన నూతన జీవితాన్ని ఏర్పరచుకున్న తీరుతెన్నులను గురించి తన తల్లిదండ్రులు చెప్పిన సంగతులు తనకు స్ఫూర్తినిచ్చాయని మనోజ్ఞ చెప్తుంది. ఇలాటి గంభీరమైన, ప్రభావశీలమైన కవితా రచనతోనే ప్రతిష్టాత్మకమైన క్వీన్స్ కామన్వెల్త్ వ్యాసరచన పోటీలో తను రన్నరప్గా ఎంపికైంది. ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరిగింది. తన కుటుంబ సభ్యులు ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్న, సోదరి శ్రీ మేఘనల సమక్షంలో చిరంజీవి మనోజ్ఞ ఈ అవార్డును హర్ మెజెస్టీ క్వీన్ కెమిల్లా నుంచి అందుకుంది.(చదవండి: మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు)
విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ - 2025” సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, అవసరమైన సామగ్రి పంపిణీ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు రెండు వారాల పాటు పలు జిల్లాల్లో నిర్వహించారు.హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్గొండ, మెదక్ సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించి, బెంచీలు, యూనిఫామ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు అందజేశారు. పాఠశాలల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల పునర్నిర్మాణం కూడా చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్ను కూడా నిర్వహించారు. వృద్ధుల కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్యారం బోర్డు ఛాంపియన్షిప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ మహా సేవా కార్యక్రమాలను టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెడ్డి నాయకత్వంలో టీటీఏ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, ఫౌండర్ డా. పైళ్ళ మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పటలోల్ల, అడ్వైజరీ సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, పూర్వ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల, ఇండియా కోఆర్డినేటర్ డా. ద్వారకానాథ రెడ్డి, ఇండియా సేవా డేస్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి బీరాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యుల మార్గదర్శకత్వం ఈ భారీ సేవా కార్యక్రమాలకు తోడ్పడింది.అమెరికా నుండి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీఏ టీమ్ సభ్యులకు, ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీఏ మహాసభలు “టీటీఏ మెగా కన్వెన్షన్ - 2026” జూలై 17–19, 2026లో షార్లెట్, నార్త్కరోలైనాలో జరుగనున్నట్లు టీటీఏ నాయకులు వెల్లడించారు
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్టాపిక్గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారడమే గాకా ఆ అంశం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్నారై పోస్ట్)
క్రైమ్
బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్ఐ
లక్నో : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో దారుణ ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక పోలీసు అధికారి ఒక యూట్యూబర్ ఉండటం మరింత ఆందోళన రేపింది.బాధిత బాలిక పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం కాన్పూర్లోని సచెండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూట్యూబర్ శివబరన్ అరెస్ట్ చేశారు. సబ్-ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్ మౌర్య పరారీలో ఉన్నాడు.ఏం జరిగిందంటే..7వ తరగతి చదువు మానేసిన మైనర్ బాలిక సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు తన ఇంటి నుండి బయటకు వెళ్ళగా, మహీంద్రా స్కార్పియోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.అనంతరం సచెండిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాహనంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమెపై లైంగిక దాడి జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఇంటి బయట వదిలి వెళ్లారు. బాధితురాలి సోదరుడు అర్ధరాత్రి సమయంలోఆమెను గమనించి 112కు డయల్ చేసి పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.నిందితులలో ఒకరు పోలీసని చెప్పడంతో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాలిక సోదరుడు ఆరోపించాడు. ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాతే కేసు నమోదు చేశారని, అంతేకాకుండా ఫిర్యాదులో నిందితుల పేర్లను మొదటగా చేర్చలేదని పేర్కొన్నాడు.బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) దినేష్ త్రిపాఠి తెలిపారు. జర్నలిస్టును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, పోలీసు కానిస్టేబుల్ను గుర్తించి విచారణ పూర్తయిన తర్వాత అతడిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు. కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశామని, విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.పరారీలో ఉన్న SIని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని మరో పోలీసు అధికారి రఘుబీర్ లాల్ విలేకరులకు తెలిపారు.
క్రికెటర్.. నాకంటే 12 ఏళ్లు పెద్దది కావడంతో..
చిత్తూరు అర్బన్/ గంగాధరనెల్లూరు: ఇద్దరు విభిన్న ప్రతిభావంతుల మధ్య చిగురించిన ప్రేమ చివరకు విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలు తనకన్నా పెద్దది కావడం.. ఆమెను వదిలించుకునే క్రమంలో ప్రియుడు కిరాతకంగా మారిపోయాడు. ఆమెను నిర్ధాక్షిణ్యంగా హత్య చేసి నీవానదిలో పడేశాడు. చిత్తూరులో నమోదైన అదృశ్యం కేసు హత్యగా పలుపు తిరిగింది. బుధవారం ప్రియురాలి మృతదేహాన్ని గంగాధర నెల్లూరులోని నీవానదిలో గుర్తించారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి.. గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని గిరింపేట బాలజీ కాలనీకి చెందిన కవిత విభిన్న ప్రతిభావంతురాలు. కాణిపాకం ఆలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిస్తున్నారు. గత నెల 31వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లిన కవిత సాయంత్రం వరకు రాకపోవడంతో ఆమె తమ్ముడు చిట్టిబాబు అన్ని చోట్లా వెదికాడు. జనవరి 1వ తేదీన చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. 2వ తేదీన కేసు నమోదు చేశారు.ప్రియుడే హంతకుడు?చిత్తూరులోని మిట్టూరు ఎస్బీఐలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజరుగా విభిన్న ప్రతిభావంతుడు గణేష్(26) పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కవిత, గణేష్ మధ్య పరిచయం పెరిగింది. ఈ పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసినట్లు తెలుస్తోంది. తనకన్నా కవిత వయస్సులో 12 ఏళ్లు పెద్దది కావడంతో.. ఆమెను వదిలించుకోవడానికి గణేష్ ఈ దారుణానికి ఒడిగట్టిట్లు సమాచారం.పెళ్లి చేసుకుంటానని నమ్మించి చంపేశాడు!కవితను పెళ్లి చేసుకుంటామని చెప్పిన గణేష్.. ఆమెను గత నెల 31న ఆటోలో గంగాధరనెల్లూరులోని ఠాణా వద్దకు రప్పించాడు. కొద్దిసేపు తరువాత గణేష్, కవిత మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. తీరా పెళ్లి చేసుకుంటామని నమ్మించి, తన మూడు చక్రాల స్కూటర్లో కవితను ముందర కూర్చోబెట్టుకుని ఆమె తలను వాహనంపై ఉన్న ఓ ఇనుపరాడ్కు బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో కవిత చనిపోవడంతో.. గంగాధరనెల్లూరు బ్రిడ్జిపై నుంచి ఆమెను నీవానదిలోకి తోసేసి వెళ్లిపోయాడు. పోలీసులు గణేష్ను పలుమార్లు స్టేషన్కు పిలిపించి విచారించినా, తాను కూడా ఆమెను వెతుకుతున్నట్లు తప్పుదారి పట్టించాడు. బుధవారం సాయంత్రం నీవానదిలో పడి ఉన్న కవిత మృతదేహాన్ని గుర్తించిన ఆమె సోదరుడు చిట్టిబాబు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన గణేష్.. కవితను వాడుకుని వదిలించుకోవడానికే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.క్రికెటర్..బ్యాంక్ ఉద్యోగివిభిన్న ప్రతిభావంతుడైన గణేష్ జాతీయ స్థాయిలో క్రికెటర్గా రాణించి క్రీడా కోటాలో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. బలిష్టంగా ఉన్న ఇతను కవిత మృతదేహాన్ని అవలీలగా నదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.పోలీసుల వైఫల్యమే కారణంపోలీసుల వైఫల్యం వల్లే కవిత హత్య జరిగిందని.. దీనికి చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్సీపీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన దుయ్యబట్టారు.మా నిర్లక్ష్యం లేదుసీఐ స్పందిస్తూ.. ‘సెల్ టవర్ల లొకేషన్లతో అడవుల్లో, బావులు, చెరువుల వద్ద కవితను వెదికాము. మూడు రాత్రులు మావాళ్లు, నేను నిద్రకూడా పోలేదు. ఆమె కుటుంబ సభ్యులు వాయిస్ మెసేజ్ మాకు ముందుగా ఇచ్చి ఉంటే కేసు త్వరగా ఛేదించేవాళ్లం. ఇందులో మా నిర్లక్ష్యం ఎక్కడాలేదు..’ అని నెట్టికంటయ్య పేర్కొన్నారు.
గదిలో బంధించి.. యువతిపై 12 మంది అత్యాచారం!
బెంగుళూరు: మంగళూరులో అమానుష ఘటన జరిగింది. యువతి తండ్రి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కామాంధులు బాధితురాలిని లోబర్చుకొని కామవంఛతీర్చుకున్నారు. రెండు రోజులు నరకం అనుభవించిన యువతి కామాంధుల బారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. చిక్కమగళూరు జిల్లా బీరూరు గ్రామానికి చెందిన తల్లిలేని బిడ్డ తన బంధువుల ఇంటిలో ఉంటూ పీయూసీ వరకు చదివింది. అనంతరం తండ్రి వద్దకు వచ్చింది. గతనెలలో తన అవ్వ ఇంటికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉంది. మంగళూరుకు చెందిన భరత్శెట్టి అనే వ్యక్తి యువతి తండ్రి వద్దకు వెళ్లి స్నేహంగా ఉండేవాడు. మంగళూరులో తమకు ఇల్లు ఉందని, మీరిద్దరూ వస్తే ఆశ్రయం కల్పిస్తామని చెప్పడంతో యువతి, ఆమెతండ్రి, యువతి అవ్వ కలిసి భరత్శెట్టి వెంట వెళ్లారు. అక్కడ భరత్శెట్టి ఆ యువతి తండ్రిని మభ్య పెట్టి డబ్బు ఇచ్చాడు. అనంతరం యువతిని ఒక ఇంటిలో ఉంచి కొంతమంది విటులను పంపించాడు. రెండు రోజులపాటు కామాంధులు ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని యువతి వేడుకున్నా కనికరించలేదు. భరత్శెట్టికి డబ్బులు ఇచ్చామని చెప్పి లైంగికదాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు యువతి తప్పించుకొని వచ్చి దక్షిణకన్నడ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళూరుకు వెళ్లి భరత్శెట్టితోపాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. యువతి తండ్రి, అవ్వపై కూడా కేసు నమోదు చేశారు.
యువతి తల్లికి ప్రేమోన్మాది నిప్పు..
కర్ణాటక: ఓ మహిళ ఆమె కూతురితో పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమోన్మాది పెట్రోలు చల్లి నిప్పంటించడంతో మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. బాధితురాలు గీత (42) విక్టోరియా ఆసుపత్రిలో గత 20 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ మంగళవారం రాత్రి చనిపోయింది. వివరాలు.. గీతా బసవేశ్వరనగర బోవికాలనీలో కిరాణా షాపును నడుపుతోంది. అక్కడే ప్రేమోన్మాది ముత్తు టీస్టాల్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంతో గీత కుమార్తె (19)ను ముత్తు ప్రేమించాడు. ఆమెతో తనకు వివాహం చేయాలని గీతను కోరేవాడు, ఇందుకు ఆమె నిరాకరించేది. కోపోద్రిక్తుడైన అతడు.. గీత ఇంట్లో ఉండగా పెట్రోలు చల్లి నిప్పు అంటించి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన గీత ఆస్పత్రిలో మరణించింది. స్థానిక పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు.
వీడియోలు
అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాలు
మేడారం జాతరకు కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు
YSRCP తరపున తిరిగితే చంపేస్తాం
సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
పుష్ప 2 ను వెనక్కి నెట్టి దూసుకుపోతున్న దురంధర్..
Visakha: నకిలీ ఆయుర్వేద మెడిసిన్ ముఠా అరెస్ట్
Special Report: 20 TMC నీటితో ఏం చేయొచ్చో తెలుసా..?
Kasu Mahesh: YS జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
కోల్కతాలో ఈడీ VS సీఎం మమతా బెనర్జీ
Telangana Maoist: అంతా ఖాళీ.. దామోదర్ ఎక్కడ..?

