ఇక ‘1800’పై బీజేపీ గురి!
బీజేపీ.. ఇటీవల బిహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 202 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం కాగా, అందులో బీజేపీ 89 సీట్లతో దుమ్ములేపింది. ఇక మరో ఎన్డీఏ పక్షం జేడీయూ 85 సీట్లను సాధించి.. బీజేపీ కంటే వెనుకబడింది. దాంతో బిహార్లో బీజేపీ ప్రతిష్ట మరింత పెరిగింది. ఇదిలా ఉంచితే, 2004 నాటికి బీజేపీ ఓవరాల్ ఎమ్మెల్యేల సంఖ్య 1035 ఉండగా, నేటికి ఆ సంఖ్య మరింత ముందుకెళ్లింది. 2025 నాటికి బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 1654గా ఉంది. ఈ విషయాన్నే బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ హైలైట్ చేశారు. సోమవారం(నవంబర్ 17వ తేదీ) దేశవ్యాప్త అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎలా తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకెళుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. తాము ప్రస్తుతానికి సాధించిన సంఖ్య ఏదైతే ఉందో అది బీజేపీ రాజకీయ చరిత్రలో అత్యధికమన్నారు. మున్ముందు కూడా తమ పార్టీ వికాసం ఇలానే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. రాబోయే రెండేళ్లలో తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 1800కు చేరుతుందనే ధీమా వ్యక్తం చేశారు మాలవీయ.
ఇమ్మడి రవి అరెస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఐ-బొమ్మ నుంచి మరో మెసేజ్!
సాక్షి,హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను గందరగోళంలోకి నెట్టిన పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సినిమాలను పైరసీ చేస్తూ అటు సినీ పరిశ్రమకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరిన ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెనుక మరికొందరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.అందుకు ఊతం ఇచ్చేలా ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్ను విడుదల చేసింది. అందులో..‘మీరు ఇటీవల మా గురించి విని ఉండచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు. ఏదేమైనా, మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాము’ అని ఉంది. అరెస్టు అనంతరం, సీసీఎస్ పోలీసులు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్సైట్ను మూసేయించారు. అయినప్పటికీ ఇవాళ ఆ సైట్ నుంచి తాజా మెసేజ్ రావడంతో ఇమ్మడి రవితో పాటు మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Delhi Car Blast: ఎవరీ మేడమ్ X, మేడమ్ Z?
ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో హ్యుందయ్ ఐ20లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్కు.. భారత్లోని జైషే మహమ్మద్ నెట్వర్క్ స్థాపించేందుకు చేసే ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ఉగ్రవాది డాక్టర్ షాహిన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్లతో పాటు ఇతర ఉగ్రకుట్రకు సంబంధింత అంశాల్లో అనుమానాస్పద వ్యక్తులతో చేసిన చాటింగ్, అందుకు ఉపయోగించిన కోడ్ సైతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనతో పాటు జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నాయని ఆధారాలతో డాక్టర్ షాషిన్ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అధికారులు ఆమె కదలికలు, ఫోన్, ల్యాప్ట్యాప్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డాక్టర్ షాహిన్ ఫోన్ నుంచి సేకరించిన వాట్సప్లో కీలక ఆధారాల్ని వెలుగులోకి తెచ్చారు. మేడమ్ X,మేడమ్ Z వాటిల్లో మేడమ్ X,మేడమ్ Z పేరుతో సేవ్ చేసిన మహిళలతో షాషిన్ మాట్లాడినట్లు తేలింది. అదే సమయంలో ఈ రెండు నంబర్ల నుండి డాక్టర్ షాహీన్కు క్రమం తప్పకుండా కాల్స్, మెసేజ్లు వచ్చేవి. ఆ మెసేజ్లలో ‘మెడిసిన్’ అనే పదం ఎక్కువగా ఉపయోగించినట్లు,.. మెడిసిన్ అంటే పేలుడు పదార్థాలేనని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం ప్రకారం మెడిసిన్ అంటే వేరేదేమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఓ మెసేజ్లో మేడమ్ X నుంచి షాహిన్కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ‘ఆపరేషన్కు ఔషధం కొరత ఉండకూడదు’ అని ఉంది. ‘హమ్దర్ద్’ అంటే ఇంకొక మెసేజ్లో మేడమ్ జెడ్ ‘మేడమ్ సర్జన్, ఆపరేషన్ హమ్దర్ద్పై మరింత శ్రద్ధ పెట్టండి’అని పేర్కొనడం గమనార్హం.‘ఆపరేషన్ హమ్దర్ద్’ అనేది మహిళా ఉగ్రవాదులను నియమించేందుకు రూపొందించిన ప్రణాళికగా గుర్తించారు. ‘హమ్దర్ద్’ అంటే ఉర్దూలో సానుభూతి పరులని సమాచారం. డాక్టర్ షాషీన్ లక్నోలోని లాల్ బాగ్ నివాసి. పాకిస్తాన్కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి నాయకత్వం వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. 2001లో పార్లమెంటుపై దాడి, 2019లో పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ ఈ ముఠాను నడిపినట్టు సమాచారం.కాగా, షాహీన్ గతంలో కాన్పూర్ మెడికల్ కాలేజ్లో ఫార్మకాలజీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. అనంతరం ఆమె కన్నౌజ్ మెడికల్ కాలేజీకు బదిలీ అయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటనలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్కు గంటల ముందు ఉమర్ మహ్మద్ హ్యూందయ్ ఐ20 కారులో ఆత్మాహుతి చేసుకున్నాడు.
'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?
సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో పైరసీ ఒకటి. థియేటర్లలో కొత్త మూవీ ఇలా రిలీజైన వెంటనే అలా పైరసీ సైట్లలోకి వచ్చేంత టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో ప్రతిసారి హీరోలు, నిర్మాతలు, దర్శకులు లబోదిబోమంటూనే ఉన్నారు. చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు ఇప్పుడు చిన్న ఉపశమనం లభించింది. అదే 'ఐ బొమ్మ' సైట్ని క్లోజ్ చేయడం. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఈ సైట్ ప్రధాన సుత్రధారిని ఈ మధ్యే పట్టుకున్న పోలీసులు.. అతడితోనే దగ్గరుండి మరీ సైట్ పూర్తి క్లోజ్ చేయించారు. ఇక్కడితో సమస్య తీరిపోయిందా అంటే అస్సలు కాదు.పైరసీ అనేది బలమైన వేళ్లతో భూమిలో గట్టిగా పాతుకుపోయిన మహావృక్షం లాంటిది. దీనిలో 'ఐ బొమ్మ' అనేది కేవలం ఓ కొమ్మ మాత్రమే. ఈ సైట్ రన్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న రవిని పోలీసులు పట్టుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ ఒక్క సైట్ మూసేసినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటివి బయట వందల్లో ఉన్నాయి. దీనిలానే వాటిని కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసుకుంటూ రావాలి. దేశంలోని పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం తలుచుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ 'ఐ బొమ్మ'పై పెట్టినంత దృష్టి మిగతా వాటిపైనా రాబోయే రోజుల్లో ఏ మేరకు పెడతారో చూడాలి.ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్పైరసీ సైట్స్ అనే కాదు గూగుల్ లాంటి వెబ్ సైట్లలో ప్లే స్టోర్స్లో దొరకని, వందల సంఖ్యలో ధ్రువీకరించని యాప్స్ APK ఫైల్స్ పేరిట జనాలకు అందుబాటులో ఉన్నాయి. కాస్తోకూస్తో చదువుకున్నోళ్లకు వీటి గురించి తెలుసు. చెప్పాలంటే చదువుకోని వాడు.. తనకు తెలిసిన ఒకటో రెండో సైట్లలో మాత్రమే పైరసీ సినిమాల్ని చూస్తాడు. చదువుకున్నోళ్లు మాత్రం విచ్చలవిడిగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయా వెబ్సైట్లని దగ్గరుండి నడిపించేవాళ్లు మన దేశస్థులు కావొచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ మన పోలీసులు ప్రయత్నించినా సరే దొరుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితి.కాబట్టి పైరసీ సమస్యతో పాటు ఇండస్ట్రీలోని మిగతా సమస్యలపై కూడా సినీ పెద్దలు కచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టికెట్ రేట్లు అందుబాటులోకి తీసుకురావడం, రొటీన్ సినిమాలు కాకుండా కాస్త కంటెంట్ ఉండే సినిమాలని తీసుకురావడం లాంటివి చేస్తే.. రాబోయే రోజుల్లో ప్రేక్షకుడే పైరసీ వద్దనుకుని థియేటర్కి వస్తాడు. లేదంటే మాత్రం కథ మళ్లీ మొదటికే వస్తుంది!(ఇదీ చదవండి: మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు: నాగార్జున)
నేనున్నా.. చూసుకుంటా: లాలూ ప్రసాద్ యాదవ్
రేపటి నుంచి మరో క్రికెట్ పండుగ
థార్తో విసిగిపోయిన యజమాని చేసిన పని సోషల్ మీడియాలో వైరల్
రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్: రూ.2 లక్షల కంటే తక్కువే..
లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కాంతకు కలిసొచ్చిన వీకెండ్.. మూడు రోజుల్లో ఊహించని కలెక్షన్స్!
పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంకకు బిగ్ షాక్
కాలిఫోర్నియాలో హెచ్సీఎల్ ఏఐ ఇన్నోవేషన్ ల్యాబ్
వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ..
జియో కొత్త రీచార్జ్.. 200 రోజుల చౌక ప్లాన్
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
ఐ-బొమ్మ రవి అరెస్టుపై ఆయన తండ్రి ఏమన్నారంటే?
'బిగ్బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
మొబైల్ చార్జర్ను ప్లగ్కే ఉంచుతున్నారా?
పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
తగ్గిన ధరలు: పసిడి ఊరట.. వెండి పతనం
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
రాజకీయాలతో పాటు కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకున్న లాలూ కుమార్తె రోహిణి
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
'శివ' రీ రిలీజ్.. మొదటిరోజు అన్ని కోట్ల కలెక్షన్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి పిలుపు.. ధన, వస్తులాభాలు
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆస్తిలాభం పొందుతారు
చైతో బైక్ రైడ్ ఆఫర్.. ఇంట్లో నుంచి వచ్చేస్తానన్న రీతూ
సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
నేనున్నా.. చూసుకుంటా: లాలూ ప్రసాద్ యాదవ్
రేపటి నుంచి మరో క్రికెట్ పండుగ
థార్తో విసిగిపోయిన యజమాని చేసిన పని సోషల్ మీడియాలో వైరల్
రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్: రూ.2 లక్షల కంటే తక్కువే..
లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కాంతకు కలిసొచ్చిన వీకెండ్.. మూడు రోజుల్లో ఊహించని కలెక్షన్స్!
పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంకకు బిగ్ షాక్
కాలిఫోర్నియాలో హెచ్సీఎల్ ఏఐ ఇన్నోవేషన్ ల్యాబ్
వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ..
జియో కొత్త రీచార్జ్.. 200 రోజుల చౌక ప్లాన్
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
ఐ-బొమ్మ రవి అరెస్టుపై ఆయన తండ్రి ఏమన్నారంటే?
'బిగ్బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
మొబైల్ చార్జర్ను ప్లగ్కే ఉంచుతున్నారా?
పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
తగ్గిన ధరలు: పసిడి ఊరట.. వెండి పతనం
హెచ్–1బీ పూర్తిగా బంద్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
రాజకీయాలతో పాటు కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకున్న లాలూ కుమార్తె రోహిణి
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
'శివ' రీ రిలీజ్.. మొదటిరోజు అన్ని కోట్ల కలెక్షన్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి పిలుపు.. ధన, వస్తులాభాలు
ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆస్తిలాభం పొందుతారు
చైతో బైక్ రైడ్ ఆఫర్.. ఇంట్లో నుంచి వచ్చేస్తానన్న రీతూ
సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
ఫొటోలు
చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!
తిరుపతిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన
సీపీ సజ్జనార్ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు.. ఫోటోలు
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)
కుమారుడు, సతీమణితో 'కిరణ్ అబ్బవరం' టూర్ (ఫోటోలు)
విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)
రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
సినిమా
'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?
సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో పైరసీ ఒకటి. థియేటర్లలో కొత్త మూవీ ఇలా రిలీజైన వెంటనే అలా పైరసీ సైట్లలోకి వచ్చేంత టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో ప్రతిసారి హీరోలు, నిర్మాతలు, దర్శకులు లబోదిబోమంటూనే ఉన్నారు. చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు ఇప్పుడు చిన్న ఉపశమనం లభించింది. అదే 'ఐ బొమ్మ' సైట్ని క్లోజ్ చేయడం. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఈ సైట్ ప్రధాన సుత్రధారిని ఈ మధ్యే పట్టుకున్న పోలీసులు.. అతడితోనే దగ్గరుండి మరీ సైట్ పూర్తి క్లోజ్ చేయించారు. ఇక్కడితో సమస్య తీరిపోయిందా అంటే అస్సలు కాదు.పైరసీ అనేది బలమైన వేళ్లతో భూమిలో గట్టిగా పాతుకుపోయిన మహావృక్షం లాంటిది. దీనిలో 'ఐ బొమ్మ' అనేది కేవలం ఓ కొమ్మ మాత్రమే. ఈ సైట్ రన్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న రవిని పోలీసులు పట్టుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ ఒక్క సైట్ మూసేసినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటివి బయట వందల్లో ఉన్నాయి. దీనిలానే వాటిని కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసుకుంటూ రావాలి. దేశంలోని పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం తలుచుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ 'ఐ బొమ్మ'పై పెట్టినంత దృష్టి మిగతా వాటిపైనా రాబోయే రోజుల్లో ఏ మేరకు పెడతారో చూడాలి.ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్పైరసీ సైట్స్ అనే కాదు గూగుల్ లాంటి వెబ్ సైట్లలో ప్లే స్టోర్స్లో దొరకని, వందల సంఖ్యలో ధ్రువీకరించని యాప్స్ APK ఫైల్స్ పేరిట జనాలకు అందుబాటులో ఉన్నాయి. కాస్తోకూస్తో చదువుకున్నోళ్లకు వీటి గురించి తెలుసు. చెప్పాలంటే చదువుకోని వాడు.. తనకు తెలిసిన ఒకటో రెండో సైట్లలో మాత్రమే పైరసీ సినిమాల్ని చూస్తాడు. చదువుకున్నోళ్లు మాత్రం విచ్చలవిడిగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయా వెబ్సైట్లని దగ్గరుండి నడిపించేవాళ్లు మన దేశస్థులు కావొచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ మన పోలీసులు ప్రయత్నించినా సరే దొరుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితి.కాబట్టి పైరసీ సమస్యతో పాటు ఇండస్ట్రీలోని మిగతా సమస్యలపై కూడా సినీ పెద్దలు కచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టికెట్ రేట్లు అందుబాటులోకి తీసుకురావడం, రొటీన్ సినిమాలు కాకుండా కాస్త కంటెంట్ ఉండే సినిమాలని తీసుకురావడం లాంటివి చేస్తే.. రాబోయే రోజుల్లో ప్రేక్షకుడే పైరసీ వద్దనుకుని థియేటర్కి వస్తాడు. లేదంటే మాత్రం కథ మళ్లీ మొదటికే వస్తుంది!(ఇదీ చదవండి: మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు: నాగార్జున)
నాలుగేళ్ల తర్వాత తండ్రైన సింగర్.. ఆలస్యంగా రివీల్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అఖిల్ సచ్దేవా తండ్రిగా ప్రమోషన్ పొందారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని కాస్తా ఆలస్యంగా రివీల్ చేశారు. ఈ నెల ఆరో తేదీన తన భార్య బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా కూతురి రూపంలో మా అమ్మ తిరిగొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. సింగర్ అఖిల్ సచ్దేవా.. బాలీవుడ్లో సన్ మేరే హమ్ సఫర్, తేరా బన్ జౌంగా, చన్నా వే వంటి పాటలతో ఫేమ్ తెచ్చుకున్నారు.వీరిద్దరు డిసెంబర్ 7 2020న జైపూర్లోని సమోదే హవేలీలో తాన్యా గుల్లా, అఖిల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదారేళ్ల పాటు డేటింగ్ ఉన్న ఈ జంట పెళ్లి జీవితం ప్రారంభించారు. ఆరేళ్ల క్రిత నా కచేరీకి వచ్చిన తాన్య మొదటి చూపులోనే నచ్చేయడంతో అలా మా పరిచయం మొదలైందని గతంలో సింగర్ వెల్లడించారు. View this post on Instagram A post shared by Nasha Boy (@sachdevaakhilnasha)
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి బోలెడన్ని సినిమాలు రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అనే తెలుగు చిత్రాలతో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అనే డబ్బింగ్ మూవీస్ రానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఊహించని నామినేషన్స్)ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో.. తమిళ హిట్ సినిమా 'బైసన్', కాంట్రవర్సీ చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్' ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కూడా ఇదే వీకెండ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూడు కచ్చితంగా చూడాల్సినవి కాగా వీటితో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ వారంలో రవితేజ 'మాస్ జాతర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 17 నుంచి 23వ తేదీ వరకు)అమెజాన్ ప్రైమ్ద మైటీ నెన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 19ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 21నెట్ఫ్లిక్స్బ్లాక్ టూ బ్లాక్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17బేబ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17షాంపేన్ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 19బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21హోమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21హాట్స్టార్ల్యాండ్ మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17నైట్ స్విమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 19ద రోజెస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 20నాడు సెంటర్ (తమిళ సిరీస్) - నవంబరు 20జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) - నవంబరు 21అజ్టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 23సన్ నెక్స్ట్ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21జీ5ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) - నవంబరు 21(ఇదీ చదవండి: ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీరోజ్ ఎమోషనల్)
రవితేజతో సమంత.. ఓ క్రైమ్ థ్రిల్లర్!
ఫలితంతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే టాలీవుడ్ హీరో రవితేజ.. కొన్నిరోజుల క్రితమే 'మాస్ జాతర'తో వచ్చాడు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండేసరికి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. రీసెంట్గానే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా.. ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది.ఇప్పుడు రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా సమంతని తీసుకోబోతున్నారనే రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం టాలీవుడ్లో ఇది ఫ్రెష్ కాంబో అవుతుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు 'నిన్ను కోరి', 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?)శివ నిర్వాణ సినిమాలు అనగానే దాదాపు ఫ్యామిలీ సబ్జెక్టులే గుర్తొస్తాయి. చివరగా తీసిన 'ఖుషి' లవ్ స్టోరీనే. అందులో హీరోయిన్ సమంతనే. అయితే శివ ఈసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ కథ రాసుకున్నాడని.. దీనికి రవితేజ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు సమంత హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఈ నెలలోనే లాంచ్ ఉండొచ్చని టాక్.ఈ మధ్యే సమంత.. 'మా ఇంటి బంగారం' అనే సినిమా మొదలుపెట్టింది. హీరోయిన్ కమ్ నిర్మాత ఈమెనే. నందినీ రెడ్డి దర్శకురాలు. ఇప్పుడు రవితేజతోనూ మూవీ చేయనుందని టాక్ వచ్చిందంటే.. హీరోయిన్గా చేసేందుకు ఆసక్తి చూపిస్తుందనమాట. మరి వస్తున్న పుకార్లలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
క్రీడలు
ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్
ఐపీఎల్-2026 వేలానికి ముందు ఓ దేశవాలీ బౌలర్ పిచ్చెక్కించే ప్రదర్శనతో చెలరేగాడు. రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్లో అదిరిపోయే గణాంకాలతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సర్వీసస్ స్పిన్నర్ అమిత్ శుక్లా 20 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. ఓ దశలో శుక్లా (Amit Shukla) పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు.ఈ సంచలన ప్రదర్శనతో శుక్లా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. వచ్చే నెలలో జరుగబోయే వేలంలో ఫ్రాంచైజీలు ఇతగాడి కోసం ఎగబడే అవకాశం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ కావడం శుక్లా అదనంగా కలిసి రావచ్చు. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యకు చెందిన శుక్లా అడపాదడపా బ్యాటింగ్ (కుడి చేతి) కూడా చేయగలడు. 22 ఏళ్ల శుక్లా అండర్-19 విభాగంలో పంజాబ్ తరఫున ఆడాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన శుక్లా 32 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 138 పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శుక్లా కేవలం ఏడు ఇన్నింగ్స్ల్లోనే 23 వికెట్లు తీసి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్వీసస్ 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.అంతకుముందు అమిత్ శుక్లా మాయాజాలం దెబ్బకు హర్యానా తొలి ఇన్నింగ్స్లో 111 పరుగులకే కుప్పకూలింది. శుక్లా కెరీర్లో అత్యుత్తమ గణాంకాలతో హర్యానా నడ్డి విరిచాడు. దీనికి ముందు సర్వీసస్ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకే ఆలౌటైంది. చదవండి: షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ క్రికెటర్లు
షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ క్రికెటర్లు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ (India vs Pakistan) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. క్రికెట్లో అయితే ఇరు దేశాల జట్లు కనీసం షేక్ ఇచ్చుకోవాడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ 'నో హ్యాండ్ షేక్' ఆనవాయితీని ముందుగా టీమిండియా మొదలుపెట్టింది. ఆసియా కప్-2025లో పాక్తో తలపడిన మూడు సందర్భాల్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.ఇదే తంతు మహిళల వన్డే ప్రపంచకప్, నిన్న జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలోనూ కొనసాగింది. అయితే భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు మాత్రం ఈ ఆనవాయితీకి పుల్స్టాప్ పెట్టింది.Women Blind Cricket World Cup Colombo:.India women Blind won against Pakistan Good to see Blind teams Hand shake. pic.twitter.com/jpjfM0XxFW— Sohail Imran (@sohailimrangeo) November 16, 2025నిన్న కొలొంబోలో (శ్రీలంక) జరిగిన ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్, పాక్ ఎదురెదురుపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ పాక్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ అనంతరం భారత ప్లేయర్లు క్రీడాస్పూర్తిని చాటుకుంటూ.. పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ ఉదంతం ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. అన్ని విభాగాలకు చెందిన భారత జట్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తుంటే.. అంధుల జట్టు ఇలా చేసిందేంటని చాలామంది అభిమానులు కోప్పడుతున్నారు. కొందరేమీ ఇది శుభపరిణామమే అని అంటున్నారు. అయితే ఇదే మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్, పాక్ కెప్టెన్లు హ్యాండ్ షేక్ ఇచ్చుకోకపోవడం గమనార్హం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 135 పరుగులకే ఆలౌటైంది. మెహ్రీన్ అలీ(66), బుష్రా అష్రఫ్(44) రాణించడంతో పాక్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు చెలరేగిపోయారు. ఏకంగా ఏడుగురు పాక్ ప్లేయర్లను రనౌట్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్ పాక్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దీపికా టీసీ (45), అనెఖా దేవి (64 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి భారత్కు సునాయాస విజయాన్నందించారు. ఈ టోర్నీలో భారత్కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్కు కూడా చేరింది.చదవండి: పాక్ ప్లేయర్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్, అంతర్జాతీయ వన్డేలు సహా) అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా-ఏ నిన్న (నవంబర్ 16) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అజేయ అర్ద సెంచరీ (83 బంతుల్లో 68 నాటౌట్) సాధించిన తర్వాత రుతురాజ్ లిస్ట్-ఏ సగటు 57.80కి చేరింది. తద్వారా చతేశ్వర్ పుజారాను (57.01) అధిగమించి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్గా.. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ కంటే ముందు కేవలం ఒకే ఒక ఆటగాడు ఉన్నాడు. ఆస్ట్రేలియా వైట్ బాల్ దిగ్గజం మైఖేల్ బెవాన్ (57.86) మాత్రమే రుతురాజ్ కంటే ముందున్నాడు.లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాటర్లు..మైఖేల్ బెవాన్-57.86 (427 ఇన్నింగ్స్లు)రుతురాజ్ గైక్వాడ్-57.80 (85 ఇన్నింగ్స్లు)సామ్ హెయిన్-57.76 (64 ఇన్నింగ్స్లు)చతేశ్వర్ పుజారా-57.01 (130 ఇన్నింగ్స్లు)విరాట్ కోహ్లి-56.66 (339 ఇన్నింగ్స్లు)ఇప్పటివరకు కెరీర్లో 85 లిస్ట్-ఏ ఇన్నింగ్స్లు ఆడిన రుతురాజ్ 17 శతకాలు, 18 అర్ద శతకాల సాయంతో 4509 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యధిక స్కోర్ 220 నాటౌట్గా ఉంది.భీకర ఫామ్ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న మూడు అనధికారిక వన్డే సిరీస్లో రుతురాజ్ భీకర ఫామ్లో ఉన్నాడు. రెండో వన్డేలో అజేయ అర్ద శతకంతో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అతను.. అంతకుముందు తొలి వన్డేలో అద్భుత శతకం (129 బంతుల్లో 117) బాదాడు. రెండో వన్డేలో గెలుపుతో భారత్, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 19న రాజ్కోట్లో జరుగనుంది. చదవండి: పాక్ ప్లేయర్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
పాక్ ప్లేయర్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
నిన్న (నవంబర్ 16) జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భారత్ పాకిస్తాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. పాక్ బౌలర్లు షాహిద్ అజిజ్ (3-0-24-3), సాద్ మసూద్ (4-0-31-2), మాజ్ సదాఖత్ (3-1-12-2), ఉబైద్ షా (4-0-24-1), అమ్మద్ దనియాల్ (3-0-21-1), సూఫియాన్ ముఖీమ్ (2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్కు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (28 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (35) ఓ మోస్తరు పోరాటం చేయగా.. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (10), రమన్దీప్ సింగ్ (11), హర్ష్ దూబే (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ జితేశ్ శర్మ (5), నేహల్ వధేరా (8), యశ్ ఠాకూర్ (2), గుర్జప్నీత్ సింగ్ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. అశుతోష్ శర్మ, సుయాశ్ శర్మ డకౌటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (79 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో పాక్ను గెలిపించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మకు తలో వికెట్ దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ను రేపు (నవంబర్ 18) ఒమన్తో ఆడుతుంది. అంతకుముందు భారత్ తొలి మ్యాచ్లో యూఏఈపై 148 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ పూనకాలెత్తిపోయాడు. కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు.మాటలోనూ చిచ్చరపిడుగే..!14 ఏళ్ల కుర్ర వైభవ్ ఆటలోనే కాదు మాటలోనూ చిచ్చరపిడుగే అని నిన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నిరూపించాడు. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్ ఉబైద్ షా వైభవ్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. తనదైన శైలిలో జవాబిచ్చాడు. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఉబైద్ షా వైభవ్వైపు సీరియస్గా చూడగా.. వెళ్లి పని చూడు అన్న అర్దం వచ్చేలా కౌంటరిచ్చాడు. అంతటితో ఆగకుండా మరుసటి బంతిని బౌండరీకి తరలించి పాక్ బౌలర్కు తన దమ్మును చూపాడు. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే
బిజినెస్
టెక్ కంపెనీ కొత్త చర్య.. భయపడుతున్న ఐటీ ఉద్యోగులు!
ఉద్యోగాలు పోతాయేమో అని ఉద్యోగులు భయపడుతున్న వేళ.. ప్రముఖ ఐటీ కంపెనీ చర్య వారిలో మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగ్నిజెంట్ కంపెనీ ఉద్యోగులు తమ ల్యాప్టాప్లలో ఎంతసేపు యాక్టివ్గా ఉంటున్నారు, పని సమయంలో వారు ఏ అప్లికేషన్లు లేదా వెబ్సైట్లను ఉపయోగిస్తారో ట్రాక్ చేయడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రోహ్యాన్స్ వంటి వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్ సాధనాలను ఉపయోగించనున్నట్లు, దీనికోసం ఎంపిక చేసిన ఎగ్జిక్యూటివ్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించినట్లు సమాచారం.కొత్త టెక్నాలజీ మాడ్యూల్.. మౌస్, కీబోర్డ్ కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంది. తద్వారా ఎంప్లాయిస్ ఎంతసేపు పనిచేయకుండా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. 5 నిమిషాలు పనిచేయకుండా ఉంటే.. అలాంటి ఉద్యోగిని 'ఐడిల్' అని ట్యాగ్ చేయనున్నట్లు, ల్యాప్టాప్ 15 నిమిషాల పాటు పనిచేయకుండా ఉంటే.. ఉద్యోగి సిస్టమ్ నుంచి దూరంగా ఉండి, ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు గురిస్తారు. ప్రస్తుతం దీనిని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.పనితీరును ర్యాంక్ చేయడానికి కాదుఈ కొత్త విధానం.. డేటా ప్రక్రియ దశలను అర్థం చేసుకోవడానికి, వినియోగాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందని కంపెనీ ఉద్యోగులకు తెలిపింది. ఇది వ్యక్తిగత పనితీరును ర్యాంక్ చేయడానికి లేదా రేట్ చేయడానికి కాదని వెల్లడించింది. కానీ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులపై నిఘా పెట్టడానికే ఇలాంటి కొత్త విధానాలను అమలు చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇది ఉద్యోగులలో ఒత్తిడిని పెంచుతుందని అంటున్నారు.వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది!కాగ్నిజెంట్ చర్య వల్ల ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇబ్బదుల్లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులపై నమ్మకం లేనప్పుడే కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ల్యాప్టాప్ కదలికలను బట్టి ఉద్యోగి పనితీరును అంచనా వేయడం ఎంత వరకు కరెక్ట్ అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది కంపెనీ - ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..
ఉదయం 5 గంటలకు ఈమెయిల్..
అమెజాన్లో ఇటీవల చేపడుతున్న లేఆఫ్స్ అనేక మంది ఉద్యోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తొలగింపుల్లో కొలువు కోల్పోయిన ఓ మాజీ ఉద్యోగి తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాలు వేదికగా పంచుకున్నాడు. ఈ తొలగింపు ప్రక్రియపై తన అసంతృప్తిని వెల్లగక్కాడు.అమెరికాలోని ఒర్లాండోలో నివసిస్తున్న జాన్ పాల్ మార్టినెజ్ (35) అమెజాన్లో టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్గా మూడేళ్లు పనిచేశాడు. తన ఉద్యోగం పోయిన విషయాన్ని ఉదయం 5 గంటలకు వచ్చిన ఒక ఈమెయిల్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పాడు. తొలగింపుల గురించి చాలా ఆశ్చర్యపోయానని తెలిపాడు. తన తొలగింపు గురించి కంపెనీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పాడు.‘ఉద్యోగం కోల్పోయిన ఆ సమయం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఏడ్చేస్తూ కుప్పకూలిపోయాను. ఆ ఉదయం ఏమి జరిగిందో కాసేపు అర్థం కాలేదు. నా కుటుంబ ఆర్థిక భవిష్యత్తు గురించే ఆలోచనలంతా. తనఖా, కారు ఈఎంఐ చెల్లింపు, క్రెడిట్ కార్డులు, నా తండ్రి వైద్య బిల్లులు.. ఇలా చాలా ఆలోచనలతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యాను’ అని వివరించాడు.అక్టోబర్ చివర్లో తొలగింపులను ప్రకటించినప్పుడు అమెజాన్ సంస్థ బాధిత ఉద్యోగులకు 90 రోజుల పూర్తి వేతనం, ప్రయోజనాలను చెల్లిస్తానని వాగ్దానం చేసినట్లు మార్టినెజ్ చెప్పాడు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి అంతర్గత ఈమెయిల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉద్యోగులు ఆ సమయంలో అంతర్గత కమ్యూనికేషన్ కోసం వ్యాపార వనరులను కూడా ఉపయోగించవచ్చని తెలిపారు. అయితే, ఈ వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో అమెజాన్ విఫలమైందని మార్టినెజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా ప్రయోజనాలు, స్టాక్ ఎంపికలు, ప్యాకేజీ, ఉద్యోగ నియామక సహాయం గురించి ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయడంలో అమెజాన్ విఫలమైందని భావిస్తున్నాను’ అని అన్నారు.ఇదీ చదవండి: ‘మా మేనేజర్ కరుణామయుడు’
మెరుగైన రాబడి కోసం.. మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పెట్టుబడులపై మెరుగైన రాబడి కోరుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. వీటిల్లో రిస్క్ అధికం. రాబడి కూడా అధికంగానే ఉంటుంది. లార్జ్క్యాప్ కంటే దీర్ఘకాలంలో అదనపు రాబడి మిడ్క్యాప్ ఫండ్స్తో సాధ్యపడుతుందని గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విభాగంలో క్వాంట్ మిడ్క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. పదేళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు.రాబడులుస్వల్పకాలం నుంచి దీర్ఘకాలంలోనూ ఈ పథకంలో పనితీరు మెరుగ్గా ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ పథకం ఎలాంటి రాబడిని ఇవ్వలేదు. అదే సమయంలో నష్టాలను మిగల్చలేదు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే ఇది మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ రాబడులు పటిష్టంగా ఉన్నాయి. మూడేళ్లలో చూస్తే ఏటా 18 శాతం చొప్పున డైరెక్ట్ ప్లాన్లో రాబడి నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 28 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఏడేళ్ల కాలంలో 23 శాతం, పదేళ్లలోనూ 18.34 శాతం చొప్పున రాబడి తెచి్చపెట్టింది. బీఎస్ఈ 150 మిడ్క్యాప్ టీఆర్ఐ సూచీతో పోల్చి చూస్తే ఐదేళ్లు, ఏడేళ్లలో అదనపు రాబడి ఇచి్చంది. పదేళ్ల కాలంలోనూ సూచీతో సమాన రాబడిని అందించింది. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ ఏడాది కూడా ఈ పథకం నికరంగా నష్టాలను ఇవ్వలేదు.పెట్టుబడుల విధానంఇది యాక్టివ్ ఫండ్. అంటే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. మార్కెట్, రంగాల వారీ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియోలో కొత్త స్టాక్స్ను చేర్చుకోవడం, ప్రస్తుత స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకోవడం, పూర్తిగా వైదొలగడం వంటి బాధ్యలను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు చేస్తుంటుంది. ముఖ్యంగా ఏదో ఒక విధానానికి పరిమితం కాబోదు. మూమెంటమ్, వ్యాల్యూ, గ్రోత్ ఇలా అన్ని రకాల విధానాల్లోనూ పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం పరిశీలిస్తుంటుంది. అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.8,525 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90.52 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సెక్యూరిటీల్లో 2.8 శాతం పెట్టుబడులు పెట్టింది. 6.68 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా ఈక్విటీ పోర్ట్ఫొలియోని గమనించినట్టయితే మొత్తం 29 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్లోనే 58 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే.. మిడ్క్యాప్ కంపెనీల్లో 59 శాతం ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో 29 శాతం మేర లార్జ్క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేసింది. లార్జ్క్యాప్ పెట్టుబడులు రిస్క్ను తగ్గిస్తాయి. మిడ్క్యాప్ పెట్టుబడులు మెరుగైన రాబడులకు అవకాశం కలి్పస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఇంధన రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 18 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇండ్రస్టియల్స్ కంపెనీలకు 16.71 శాతం, హెల్త్ కేర్ కంపెనీలకు 15.30 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 11.22 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక సుదీర్ఘ ట్వీట్ చేసారు. ఇందులో వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన & బహుశా అత్యంత ధనవంతుడైన పెట్టుబడిదారుడు అని పేర్కొన్నారు.వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన & ధనవంతుడైన పెట్టుబడిదారుడు. కానీ బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టడం లేదని అన్నారు. పెట్టుబడులకు సంబంధించి అతను చెప్పేది సరైనదే కావచ్చు. కానీ స్టాక్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటివన్నీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది.ఏ సమయంలో అయిన బూస్ట్ అవుతాయినేను బిట్కాయిన్, ఎథెరియంలను కలిగి ఉన్నట్లే.. బంగారం, వెండి నాణేలను కలిగి ఉన్నాను. నేను ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, యూఎస్ ట్రెజరీ లేదా వాల్ స్ట్రీట్ను నమ్మను. ఎందుకంటే.. బిట్కాయిన్ & ఎథెరియం ఏ సమయంలో అయిన బూస్ట్ అవుతాయి. వీటిని ప్రజల డబ్బుగా, నిజమైన బంగారం & వెండిని దేవుని డబ్బుగా వర్గీకరిస్తాను. నా దృష్టిలో ఫెడ్, యూఎస్ ప్రభుత్వం & వాల్ స్ట్రీట్ డబ్బు అంతా ఫేక్ మనీ.నకిలీ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి కారణంఎప్పుడూ మీరు నిజమైన డబ్బులోనే ఇన్వెస్ట్ చేయండి. నిజమైన ఆస్తులు అందుబాటులో ఉన్నప్పుడు.. నకిలీ ఆస్తులలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?. చాలా మంది నకిలీ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి కారణం.. పాఠశాలలో ఆర్థిక విద్యను బోధించకపోవడమే అని కియోసాకి అన్నారు.ఇదీ చదవండి: ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకిబిట్కాయిన్లు పరిమిత సంఖ్యలో (21 మిలియన్స్) మాత్రమే ఉన్నాయి. కానీ నకిలీ డబ్బు (కరెన్సీ) అపరిమితంగా ఉంది. 25 సంవత్సరాల క్రితం.. రిచ్ డాడ్ పూర్ డాడ్లో, "సేవర్స్ ఆర్ లూజర్స్" అని చెప్పినందుకు నాపై దాడి జరిగింది. కానీ ఈరోజు నేను 25 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకాన్ని రాసిన రచయితగా నిలిచాను. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని కియోసాకి పేర్కొన్నారు.WARREN BUFFET trashes BITCOINWarren Buffet is arguably the smartest and maybe the richest investor in the world.He trashes Bitcoin saying it is not investing….it is speculation….. ie gambling.He is saying a blow off top will wipe out Bitcoiners.And from his worldly view…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 17, 2025
ఫ్యామిలీ
1996లో బ్యాంక్ పాస్ బుక్ అలా ఉండేదా..! ఆ రోజుల్లోనే..
ప్రస్తుత కాలంలోని బ్యాంక్ పాస్ బుక్లు గురించి తెలిసిందే. కానీ 1996ల టైంలో ఉండే పాస్బుక్ గురించి ఈ జనరేషన్కి అంతగా ఐడియా ఉండదు. నెటింట ఆ కాలం నాటి పాస్ బుక్ తెగ వైరల్గా మారింది. అది ఒక పెన్షన్ అందుకునే ఖాతాదారుడి పుస్తకం. అందులో సేవింగ్స్ చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. వచ్చిన పెన్షన్ తక్కువే అయినా..ఎంత అద్భుతంగా డబ్బుని పొదుపు చేశారో చూస్తే..ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది క్లియర్గా తెలుస్తోంది.ఒక సోషల్ మీడియా వినియోగదారుడు నెట్టంట తన తాత గారి 199ల నాటి ఎస్బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పాస్ బుక్ని వీడియో తీసి పోస్ట్చేశాడు. ఇప్పుడు ప్రతిది డిజిటల్గా మారిన తరుణంలో ఈ పాస్బుక్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ఈ పాస్బుక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ అండ్ బికనీర్ది. ఆ సమయంలో ఎస్బీఐ అనుబంధ బ్యాంక్ పాస్బుక్లు ఇలా ఉండేవా ఆ బ్యాంక్బుక్ని చూడగానే అనిపిస్తుంది. వీడియోలో ఆ వ్యక్తి పాస్బుక్ డిజైన్, ఫోటో పేజీ, ఎంట్రీ పేజీ, తాతాగారి పెన్షన్ పొదుపు డబ్బు ఇలా ప్రతీది చూపిస్తాడు. తన తాత ఫోటో ఉన్న మొదటి పేజీ నుంచి పాస్ బుక్ ముద్రణ, కాగితం నాణ్యత, పాత కాలపు టెంప్లేట్..పెన్షన్, పొదుపు ఎంట్రీలతో సహా అన్నింటిని క్లియర్గా చూపిస్తాడు వీడియోలో. అందులో తాతగారి పెన్షన్ రూ. 5000 కాగా, పొదుపు రూ. 25 వేలకు చేరుకున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. అంతేగాదు ఆ బుక్ చివరి పేజీలో నిరంతర పెన్షన్, నగదు సర్టిఫికేట్ మొదలైన పదాలు చూడగానే అవి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పొచ్చు. దాదాపు 80 సెకన్ల నిడివి గల ఈ వీడియో, చిన్నా పెద్దా ప్రతి ఎంట్రీని చేతితో రాసిన కాలం నాటి బ్యాంకింగ్ ప్రక్రియను గుర్తు చేస్తోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఆ కాలం నాటి పాస్బుక్ల ఫాంట్, ఇంక్, ప్రింట్ లుక్, చేతితో రాసిన ఎంట్రీలు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించాయి అని కామెంట్లు చేస్తూపోస్టులు పెట్టారు. అంతేగాదు బ్రో ఈ అకౌంట్ ఇంకా యాక్టివ్గానే ఉందే అని ప్రశ్నించారు కూడా. View this post on Instagram A post shared by Govinnd Sinngh (@igovinnd) (చదవండి: గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి)
ఆయుష్మాన్ స్కాలర్షిప్ 2.0..!
భారతదేశంలోని ఫర్టిలిటి కేర్ అందించే అగ్రగామి సంస్థలలో ఒకటైన ఒయాసిస్ ఫెర్టిలిటీ, 16 సంవత్సరాల విశ్వసనీయతతో, అధునాతన సంతానోత్పత్తి చికిత్సల ద్వారా జన్మించిన 11 మంది ప్రతిభావంతులైన పిల్లలకు ఒయాసిస్ ఆయుష్మాన్ స్కాలర్షిప్లను అందించి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ హయత్ ప్లేస్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విద్యా రంగం, కళలు, సంస్కృతి, క్రీడలు ఆవిష్కరణలు/అసాధారణ విజయం అనే నాలుగు విభాగాల్లో ఈ స్కాలర్షిప్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఒబ్స్టెట్రిక్స్ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎల్. జయంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పట్ల యువ విజేతల నిబద్ధతను ప్రశంసించారు.హైదరాబాద్లోని ఒబ్స్టెట్రిక్స్ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎల్. జయంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, "వంధ్యత్వం రోజురోజుకూ పెరుగుతున్న ఆరోగ్య సమస్య అన్నారు. దంపతులు ఎదుర్కొనే భావోద్వేగపరమైన వైద్య సమస్యలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. బలమైన వైద్య ప్రమాణాలతో, రోగి-కేంద్రీకృత సంరక్షణను అందించే ఒయాసిస్ ఫెర్టిలిటీ వంటి సంస్థలు అలాంటి దంపతుల పాలిట వరం,గొప్ప భరోసా ఇస్తుందని జయంత్ రెడ్డి అన్నారు.వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా... IVF ఇతర అధునాతన సంతాన సాఫల్యత చికిత్సల ద్వారా జన్మించిన పిల్లల ప్రతిభను, దృఢ సంకల్పాన్ని గౌరవిస్తూ వారికి ఒయాసిస్ ఆయుష్మాన్ స్కాలర్షిప్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఒయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ ఆ పిల్లల ప్రతిభను సత్కరించింది, అదే సమయంలో సైన్స్ వ్యత్యాసాలను కాదు... అవకాశాలను సృష్టిస్తుందని సమాజానికి చాటింది. గత 16 సంవత్సరాలుగా ఒయాసిస్ ఫెర్టిలిటీ వేలాది మంది దంపతుల తల్లిదండ్రులవ్వాలనే కలను నిజం చేయడంలో సహాయపడింది. సంతాన సాఫల్యత చికిత్సలో నిరంతరం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. CAPA–IVM (ఇన్ విట్రో మెచ్యూరేషన్) మరియు అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్టింగ్ (PGT-A) వంటి మార్గదర్శక ఆవిష్కరణలకు పేరుగాంచిన ఈ సంస్థ... దేశవ్యాప్తంగా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ సంతాన సాఫల్య చికిత్సను అందుబాటులో ఉంచేందుకు, విలువలతో కూడిన చికిత్స అందించేలా వ్యక్తిగతీకరించేందుకు కృషి చేస్తూనే ఉంది.(చదవండి: డిజిటల్ ప్రేమలు... డిస్కనెక్టెడ్ మనసులు...)
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతోందా..?
చర్మానికి శుభ్రత, మెరుపు, టోనింగ్ వంటి ప్రయోజనాలను అందించే ‘బీ–గ్లో టీ.ఐ.ఏ సోనిక్ స్కిన్ కేర్ సిస్టమ్’ ఒక అధునాతన సౌందర్య సాధనం. ఈ ఆల్ ఇన్ వన్ డివైస్ చర్మాన్ని ప్రత్యేకంగా మెరిపిస్తుంది. యవ్వనంగా బిగుతుగా మారుస్తుంది. ఈ వినూత్న పరికరం మూడు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. శుభ్రపరచడం, యాంటీ–ఏజింగ్, డ్యుయల్పల్స్ కాంటూరింగ్ వంటి ఫలితాలను పొందొచ్చు.ఈ పరికరం పూర్తిగా వాటర్ప్రూఫ్. ఇందులో మార్చుకోగలిగే సిలికాన్ బ్రష్ హెడ్ ఉంటుంది. ఇది అల్ట్రా–హైజినిక్ శుభ్రతను అందిస్తుంది. చేతులతో శుభ్రం చేయడం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇక దీని వినియోగం తర్వాత, బ్రష్ను సులభంగా శుభ్రం చేయడానికి సిలికాన్ హెడ్ను తొలగించవచ్చు. దీని టైటానియం అప్లికేటర్ను శరీరంలో ముడతలు వచ్చే అవకాశం ఉన్న చోటల్లా ఉపయోగించవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీని ప్రత్యేకమైన పల్సేషన్ చర్మాన్ని ఇట్టే మెరుగుపరుస్తుంది. రంధ్రాలను తగ్గిస్తుంది. అంతే కాదు, ఇది డబుల్ చిన్ సమస్యకు పరిష్కారంగా నిలుస్తుంది. ఈ రీచార్జ్ చేయదగిన సోనిక్ పరికరం దవడలు, బుగ్గలు వంటి ముఖ కండరాలను బలపరచి, ముఖాకృతిని అందంగా మారుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహించి, చర్మాన్ని కాంతిమంతంగా, శక్తిమంతంగా కనిపించేలా చేస్తుంది. దీనికి చార్జింగ్ వెనుక వైపు పెట్టుకునే వీలుంటుంది. వీటిలో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి.చలికాలం వచ్చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతుంది. అలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఆలివ్ ఆయిల్. ఇది పొడిబారిన చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. పైగా ఇది చర్మంపై త్వరగా వృద్ధాప్యఛాయలు రాకుండా కాపాడుతుంది. ఇది అన్ని వయసుల వారికి అనువైన చక్కని, ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది. పొడి చర్మాన్ని మసాజ్ చేయడానికి ఆలివ్ ఆయిల్ ఉత్తమమైన నూనెలలో ఒకటి. ప్రతి రాత్రి పడుకునే ముందు, కొన్ని చుక్కల ఆలివ్ నూనె తీసుకొని శరీరమంతా పూయండి. మరొక మార్గం ఏమిటంటే, గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఆలివ్ నూనె వేసి స్నానానికి ఉపయోగించడం కూడా ఉత్తమమే!(చదవండి: Anupama Parameswaran: నటి అనుపమ అందం వెనకున్న రహస్యం ఇదే..!)
టేస్టీ తమలపాకు రైస్, అవకాడో లడ్డూ చేసేయండిలా..!
టేస్టీ తమలపాకు రైస్ కావలసినవితమలపాకులు – 4 లేదా 5జీలకర్ర, మిరియాలు – అర టీ స్పూన్ చొప్పునఅన్నం – ఒక కప్పు(మరీ మెత్తగా ఉyì కించకూడదు)ఉల్లిపాయ ముక్కలు – కొన్నివెల్లుల్లి రెబ్బలు – 4పసుపు – పావు టీస్పూన్ఉప్పు – రుచికి సరిపడానువ్వుల నూనె, నెయ్యి, ఆవాలు, మినప్పప్పు – ఒక టీస్పూన్ చొప్పునకరివేపాకు రెబ్బలు – కొన్నిఇంగువ – చిటికెడు (అభిరుచిని బట్టి)తయారీ: ముందుగా తమలపాకులను శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు తమలపాకులు, మిరియాలు, జీలకర్ర కలిపి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీటిని జోడించవచ్చు. ఈ పేస్ట్ను పక్కన పెట్టుకుని, తాలింపు రెడీ చేసుకోవాలి. ఒక బాణలిలో నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకుని, అందులో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. పసుపు వేసి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగేవరకూ వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో గ్రైండ్ చేసుకున్న తమలపాకు పేస్ట్ వేసి, కొద్దిగా నీళ్లు జోడించి 3 నిమిషాలు వేయించుకోవాలి. అనంతరం అన్నం, రుచికి సరిపడా ఉప్పు వేసి, బాగా కలపాలి. అనంతరం ఈ మొత్తం మిశ్రమాన్ని వేసుకుని, అన్నం మెతుకులు విరిగిపోకుండా మెల్లగా కలపాలి.అవకాడో లడ్డూకావలసినవిఅవకాడో పేస్ట్ – ఒకటిన్నర కప్పు (గింజ తీసి, ముక్కలు చేసుకుని మిక్సీ పట్టుకోవాలి)కొబ్బరి పాలు, పీనట్ బటర్ – 6 టేబుల్ స్పూన్లు చొప్పునతేనె లేదా పంచదార పొడి – తగినంతరోల్డ్ ఓట్స్ – పావు కప్పు (పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లునెయ్యి – కొద్దిగాఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్)కొబ్బరి తురుము – కొద్దిగా (అభిరుచిని బట్టి)తయారీ: ముందుగా ఒక బౌల్లో రోల్డ్ ఓట్స్ పౌడర్, కొబ్బరి పాలు, పీనట్ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో బాదం పౌడర్, అవకాడో పేస్ట్, ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.అనంతరం రుచికి సరిపడా తేనె లేదా పంచదార పొడి వేసుకుని, బాగా కలిపి ముద్దలా చేసుకుని, చేతులకు నెయ్యి పూసుకుని, చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అనంతరం కొబ్బరి తురుములో ఈ లడ్డూలను దొర్లించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.బనానా–చాక్లెట్ వొంటన్స్కావలసినవి: అరటిపండు గుజ్జు – పావు కప్పుపైనేచాక్లెట్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లుపైనేజీడిపప్పు, వాల్నట్స్, బాదం పప్పు – 4 టేబుల్ స్పూన్ల చొప్పున (నేతిలో దోరగా వేయించి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి)గుడ్డు తెల్లసొన – ఒకటిపంచదార పొడి – కొద్దిగా (అభిరుచిని బట్టి)చీజ్ – 2 టేబుల్ స్పూన్లువొంటన్ రేపర్స్ – 20 (మార్కెట్లో దొరుకుతాయి)నూనె – డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా ఒక బౌల్లో అరటిపండు గుజ్జు, చాక్లెట్ పౌడర్, జీడిపప్పు మిశ్రమం, పంచదార పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో చీజ్, గుడ్డు తెల్లసొన వేసుకుని బాగా కలిసి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వొంటన్ రేపర్స్లో పెట్టుకుని.. నచ్చిన షేప్లో మడిచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే అభిరుచిని బట్టి పంచదార పొడితో గార్నిష్ చేసుకుంటే, ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. (చదవండి: ట్రెండ్గా..మోడర్న్ ఊయలలు..!)
అంతర్జాతీయం
నగరం మధ్యలో గొర్రెల మంద
బెర్లిన్: జర్మనీలోని న్యూరెంబర్గ్లో ఆదివారం ఓ అరుదైన దృశ్యం స్థానికులకు కనువిందు చేసింది. ఒకటీ రెండూ కాదు..ఏకంగా 600కు పైగా గొర్రెలు నగరం మధ్యభాగం నుంచి శీతాకాలపు ప చ్చిక బయళ్ల వైపు నడక సాగించాయి. ఈ దృశ్యం చూసి అబ్బురపడిన పాదచారులు తమ సెల్ఫోన్లలో గుంపులుగా సాగిపోతున్న గొర్రెల మంద ఫొటోలను తీసుకున్నారు. థామస్ గాక్స్ట్టట్టర్ అనే వ్యక్తికి చెందిన గొర్రెలివి. ఏటా శీతాకాల సమీపిస్తున్న వేళ ఇలా నగరం నడి»ొడ్డు మీదుగా శీతాకాలపు మేతకు ఇలా వెళుతుంటాయి. ఈ గొర్రెలను వేసవి కాలంలో నగరంలోని వివిధ ప చ్చిక బయళ్లలో గడ్డిని చక్కగా, సమానంగా ఉంచటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవి నగరం మధ్యగుండా న్యూరెంబర్గ్ పశి్చమాన ఉన్న శీతాకాలపు మేత ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. 10 కిలోమీటర్ల ప్రయాణం ఇవి దాదాపు పది కిలోమీటర్ల దూరం ఇలా నడక సాగిస్తాయి. ఈ ప్రయాణంలో భాగంగానే నగరం మధ్యనున్న ప్రధాన మార్కెట్ గుండా వెళ్తున్నాయని డీపీఏ వార్తా సంస్థ తెలిపింది. జర్మనీలోని ఇతర నగరాల మాదిరిగా కాకుండా నగరం మధ్య కూడలిని గొర్రెలు దాటే ఏకైక ప్రాంతం న్యూరెంబర్గ్ మాత్రమేనని పేర్కొంది. ఈ నగర జనాభా సుమారు 5.40 లక్షలు. గొర్రెలు నగరం గుండా సాగే వేళ అధికారులు ప్రజలకు అనేక సూచనలు చేశాయి. వాటికి దారి ఇవ్వాలని, కుక్కలను వాటికి దూరంగా ఉంచాలని కోరారు. అదేవిధంగా, ముందు జాగ్రత్తగా డ్రోన్ల సంచారాన్ని నిషేధించారు. గొర్రెలే లాన్ మూవర్లు! జర్మనీలోని న్యూరెంబర్గ్, పోట్స్డామ్, ఆగ్స్బర్గ్, బెర్లిన్, ఉల్మ్ తదితర నగరాల్లో గొర్రెలను సహజ లాన్మూవర్లు (గడ్డిని కోసే యంత్రాలు)గా వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే.. గొర్రెలు నెమ్మదిగా గడ్డి మేయడం వల్ల కీటకాలకు హాని జరగదు. గడ్డి సహజంగా పెరుగుతుంది. ఈ విధంగా జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటున్నారు. అంతేకాదు, గడ్డి కోసేందుకు అయ్యే ఖర్చులు కూడా ఆదా అవుతాయి. ఖాళీ బహిరంగ స్థలాలు కొరతగా మారుతున్న ఈ రోజుల్లో గొర్రెల కాపర్లకు ఇదో చక్కని ఏర్పాటుగా చెబుతున్నారు.
దక్షిణా చైనా సముద్రంపై చైనా బాంబర్ పెట్రోలింగ్
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా సైన్యం ఆదివారం తొలిసారిగా బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఫైటర్ జెట్లు సముద్రంపై గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ఫిలిప్పైన్స్కు హెచ్చరికగానే బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఫిలిప్పైన్స్ నావికాదళం ఇటీవల అమెరికా, జపాన్ సైన్యంతో కలిసి దక్షిణ చైనా సముద్రంలో ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ పరిణామం చైనాకు రుచించడం లేదు. దక్షిణా చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఫిలిప్పైన్స్, వి యత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. చైనా ఆధిపత్య ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఒక జర్మన్ బందీ ఆశల వంటకం!
చరిత్రలో కొన్ని ఆహార పదార్థాలు రుచిని మాత్రమే అందించవు.. అవి అనేక భావోద్వేగాలు, మహా విపత్తుల నుండి విజయవంతంగా గట్టెక్కిన అద్భుత ధైర్యసాహస గాథల్ని కూడా తమతో మోసుకొస్తాయి. అలాంటిదే జర్మనీలో పుట్టిన ‘బౌమ్కూచెన్’ అనే ఈ ప్రత్యేకమైన కేక్! ట్రీ కేక్ అని పిలిచే ఈ స్వీట్, వలయాలతో కూడిన చెట్టు కాండాన్ని పోలి ఉండడం వల్ల.. జపాన్లో దీర్ఘాయుష్షుకు, శ్రేయస్సుకు చిహ్నంగా మారింది. ఈ రుచికరమైన కేక్ ప్రయాణానికి.. మధురమే కాదు, కష్టాల కడలిని ఈదిన చారిత్రక నేపథ్యం ఉంది. దీని మూలాలు.. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్లోని ఓ చిన్న ద్వీపమైన నినోషిమాలో బందీగా ఉన్న ఒక జర్మన్ మిఠాయి తయారీదారుతో ముడిపడి ఉన్నాయి. యుద్ధ శిబిరంలో మొలకెత్తిన శాంతియుత ఆలోచన నినోషిమా.. ఒకప్పుడు సైనిక క్వారంటైన్ కేంద్రంగా, తొలి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ యుద్ధ ఖైదీల శిబిరంగా ఉండేది. 1915లో చైనాలోని క్వింగ్డావోలో పట్టుబడిన జర్మన్ మిఠాయి తయారీదారు కార్ల్ జుఖైమ్ 1917లో ఇక్కడికి వచ్చాడు. నినోషిమాలోని జర్మన్ బందీలకు కొంతమేర స్వేచ్ఛ ప్రసాదించారు. దాంతో వారు వంట చేసుకోవడానికి అనుమతి పొందారు. అప్పుడే జుఖైమ్ తన బౌమ్కూచెన్ వంటకాన్ని ఇక్కడే పరీక్షించాడని భావిస్తున్నారు. ఇప్పటికీ, నినోషిమాలో సందర్శకులు వెదురు కర్రపై పిండిని పోసి, బొగ్గుల నిప్పుపై వేడి చేస్తూ, పొరలు పొరలుగా బౌమ్కూచెన్ వంటకం తయారీ నేర్చుకుంటారు. కేక్ పొరలు బ్రౌన్ రంగులోకి మారిన ప్రతిసారీ, కొత్త పొర పోస్తారు. ఇది చెట్టు కాండంపై వలయాల మాదిరిగా మారుతుంది. ఈ పద్ధతిని జుఖైమ్ నూరేళ్ల క్రితం ఆ యుద్ధ శిబిరంలోనే ప్రారంభించారు. భూకంపాలు, బాంబు దాడులను తట్టుకుని.. యుద్ధం ముగిసిన తర్వాత కూడా జుఖైమ్ జపాన్లోనే ఉండిపోయాడు. మార్చి 1919లో హిరోషిమా ప్రిఫెక్చరల్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్లో ఆయన చేతితో చేసిన బౌమ్కూచెన్ వాణిజ్యపరంగా ప్రారంభమైంది. అది అద్భుతమైన ప్రజాదరణ పొందింది. 1922లో యోకోహామాలో ఒక పేస్ట్రీ షాప్ను కూడా తెరిచాడు. కానీ, 1923లో వశ్నిచ్చిన గ్రేట్ కాంటో భూకంపం ఆ వ్యాపారాన్ని నాశనం చేసింది. ఆ తర్వాత కోబ్కు మకాం మార్చి కాఫీ షాప్ తెరిచాడు. కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగియడానికి కేవలం రెండు నెలల ముందు, కోబ్పై అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఆ స్టోర్ కూడా నేలమట్టమైంది. అయినా, జుఖైమ్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన భార్య ఎలిస్, అంకితభావం గల జపనీస్ సిబ్బంది సహాయంతో కోబ్లోనే వ్యాపారాన్ని తిరిగి వృద్ధి చేసుకున్నాడు. జపాన్ లొంగిపోయేందుకు ఒక రోజు ముందు, ఆగస్టు 14, 1945న జుఖైమ్ అనారోగ్యంతో మరణించినప్పటికీ, ఆయన స్థాపించిన జుఖైమ్ కో లిమిటెడ్ నేటికీ జపాన్ అగ్రశ్రేణి కాన్ఫెక్షనరీ సంస్థలలో ఒకటిగా కొనసాగుతుండటం విశేషం. బౌమ్కూచెన్.. శాంతికి, సౌభాగ్యానికి ప్రతీక! ఈ ‘వృక్ష కేక్’ మూలాలు విపత్తులు, యుద్ధాలతో ముడిపడి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం జపాన్ సంస్కృతిలో ఇది విడదీయరాని భాగమైంది. దీని వలయాల నిర్మాణం నిరంతరాయమైన జీవితానికి, వృద్ధికి ప్రతీకగా భావిస్తారు. పెళ్లిళ్లు, పుట్టినరోజుల వంటి శుభకార్యాలకు అత్యంత ప్రజాదరణ పొందిన బహుమతిగా మారింది. మచ్చా, చిలగడదుంపల వంటి స్థానిక వంటకాలతో కలిపి జపనీస్ శైలిలో మార్పులు చెందింది. నినోషిమా వెల్కమ్ సెంటర్ అధిపతి కజుకి ఒటాని చెప్పినట్లు.. ‘జుఖైమ్ వంట.. శాంతి కోసం చేసిన వ్యక్తీకరణ’. మరణం, విధ్వంసం చుట్టుముట్టిన చోట ఊపిరి పోసుకున్న బౌమ్కూచెన్ అనే ఈ తీపి వంటకం.. కష్టాల నుంచి బయటపడిన మానవ ఆశలు, మనుగడకు ఒక నిశ్శబ్ద సాక్ష్యంగా నిలిచింది. ఇది కేవలం ఒక కేక్ కాదు. యుద్ధాలనూ, విపత్తులనూ జయించిన ఒక అద్భుతమైన కథ! – సాక్షి, నేషనల్ డెస్క్
అమెరికాలో కొత్త వైరస్ కలకలం
అమెరికాలో కొత్త రకం వైరస్ కలకలం రేపుతోంది. వాషింగ్టన్ కు చెందిన ఓవ్యక్తికి బర్డ్ ప్లూ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి " హెచ్5 ఎన్5 ఏవియన్ ఇన్ప్లూయింజా" అనే కొత్తరకం వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇటువంటి వైరస్ మానవులలో సోకడం ఇది మెుదటిసారని డాక్టర్లు తెలిపారు.వాషింగ్టన్ లోని ఓ వ్యక్తికి "ఎచ్5ఎన్5 ఏవియన్ ఇన్ప్లూయింజా" వైరస్ సోకడం ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. సాధారణంగా ఈ వైరస్ మనుషులకు అంటుకోదని కానీ ఈ వ్యక్తికి ఎలా సోకిందనే విషయాలను అధ్యయనం చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. బాధితుడు బహుశా కోళ్ల ద్వారనే వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు.అయితే ఈ వైరస్ సోకిన వ్యక్తి వృద్ధుడని అతనికి ఇతర ఆరోగ్యసమస్యలున్నాయని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా ఇన్ప్లూయింజా వైరస్ జంతువులలోనే వ్యాపిస్తుందని ఈ వైరస్ సోకిన జంతువుల లాలాజలం, మలపదార్థాలు, పాడి పశువుల పాల ద్వార వేరే ప్రాణులకు సోకే అవకాశం ఉందని తెలిపారు. ఇది ఒకప్రాణి నుంచి మరోప్రాణికి సోకే అవకాశం శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నామని వారికి కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్లు పేర్కొన్నారు.అమెరికాలో బర్డ్ ప్లూ వైరస్ కేసు రావడం గడిచిన తొమ్మిది నెలల్లో ఇదే తొలిసారని అక్కడి వైద్యశాఖ ప్రకటించింది. ఈ వైరస్ మనుషులలలో అంత ప్రభావం చూపే అవకాశాలు లేవని అయితే అలా అని దానిని తేలికగా తీసుకోకూడదని డాక్టర్లు తెలిపారు. బర్డ్ ప్లూ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త పాటించాలని ఆరోగ్యశాఖ తెలిపింది. కోళ్ల పరిశ్రమలలో విధులు నిర్వహించే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
జాతీయం
అయ్యప్ప భక్తులకు అలర్ట్..! శబరిమలలో మళ్లీ..
సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజా, పతనం తిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శబరిమల యాత్ర ప్రాంతంతో సహా మొత్తం ఆరు ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ భారీ వర్షాలకి కారణం అని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ఈ రోజు, రేపు శబరిమల సన్నిధానం, పంప, నీలక్కల్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా ప్రాంతల్లో తప్పనిసరిగా..సన్నిధానం, పంబా, నీలక్కల్లలో ఇవాళ, రేపు 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు వర్షం పడే అవకాశం ఉందిఅలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో 24 గంటల్లో 64.5 మిమీ నుంచి 115.5 మిమీ వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అయ్యప్ప భక్తులకు భద్రతా సూచనలుభారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ యాత్రికులకు ప్రత్యేక హెచ్చరిక సూచనలు జారీ చేసింది.కొండచరియలు విరిగిపడటం, బురదజల్లులు, పర్వత వరదలకు గురయ్యే ప్రాంతాలలో నివసించేవారు, అలాగే నదుల వెంబడి, ఆనకట్టల దిగువన నివసించేవారు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.విపత్తు సంభవించే ప్రాంతాల్లో నివసించేవారు పగటిపూట సమీపంలోని సహాయ శిబిరాలకు తరలి వెళ్లాలి. వాటి సమాచారం కోసం ప్రజలు స్థానిక స్వపరిపాలన, రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, భద్రత లేని ఇళ్లు లేదా బలహీనమైన పైకప్పులు ఉన్న ఇళ్లలో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.వర్షపు రోజుల్లో అనవసరమైన ప్రయాణాలు, పర్వతారోహణను నివారించాలి.శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే భద్రతాధికారుల సూచనల మేరకు ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉందన స్పష్టం చేసింది కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ.(చదవండి: శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!)
Delhi Car Blast: ఎవరీ మేడమ్ X, మేడమ్ Z?
ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో హ్యుందయ్ ఐ20లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్కు.. భారత్లోని జైషే మహమ్మద్ నెట్వర్క్ స్థాపించేందుకు చేసే ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ఉగ్రవాది డాక్టర్ షాహిన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్లతో పాటు ఇతర ఉగ్రకుట్రకు సంబంధింత అంశాల్లో అనుమానాస్పద వ్యక్తులతో చేసిన చాటింగ్, అందుకు ఉపయోగించిన కోడ్ సైతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనతో పాటు జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నాయని ఆధారాలతో డాక్టర్ షాషిన్ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అధికారులు ఆమె కదలికలు, ఫోన్, ల్యాప్ట్యాప్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డాక్టర్ షాహిన్ ఫోన్ నుంచి సేకరించిన వాట్సప్లో కీలక ఆధారాల్ని వెలుగులోకి తెచ్చారు. మేడమ్ X,మేడమ్ Z వాటిల్లో మేడమ్ X,మేడమ్ Z పేరుతో సేవ్ చేసిన మహిళలతో షాషిన్ మాట్లాడినట్లు తేలింది. అదే సమయంలో ఈ రెండు నంబర్ల నుండి డాక్టర్ షాహీన్కు క్రమం తప్పకుండా కాల్స్, మెసేజ్లు వచ్చేవి. ఆ మెసేజ్లలో ‘మెడిసిన్’ అనే పదం ఎక్కువగా ఉపయోగించినట్లు,.. మెడిసిన్ అంటే పేలుడు పదార్థాలేనని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం ప్రకారం మెడిసిన్ అంటే వేరేదేమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఓ మెసేజ్లో మేడమ్ X నుంచి షాహిన్కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ‘ఆపరేషన్కు ఔషధం కొరత ఉండకూడదు’ అని ఉంది. ‘హమ్దర్ద్’ అంటే ఇంకొక మెసేజ్లో మేడమ్ జెడ్ ‘మేడమ్ సర్జన్, ఆపరేషన్ హమ్దర్ద్పై మరింత శ్రద్ధ పెట్టండి’అని పేర్కొనడం గమనార్హం.‘ఆపరేషన్ హమ్దర్ద్’ అనేది మహిళా ఉగ్రవాదులను నియమించేందుకు రూపొందించిన ప్రణాళికగా గుర్తించారు. ‘హమ్దర్ద్’ అంటే ఉర్దూలో సానుభూతి పరులని సమాచారం. డాక్టర్ షాషీన్ లక్నోలోని లాల్ బాగ్ నివాసి. పాకిస్తాన్కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి నాయకత్వం వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. 2001లో పార్లమెంటుపై దాడి, 2019లో పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ ఈ ముఠాను నడిపినట్టు సమాచారం.కాగా, షాహీన్ గతంలో కాన్పూర్ మెడికల్ కాలేజ్లో ఫార్మకాలజీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. అనంతరం ఆమె కన్నౌజ్ మెడికల్ కాలేజీకు బదిలీ అయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటనలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్కు గంటల ముందు ఉమర్ మహ్మద్ హ్యూందయ్ ఐ20 కారులో ఆత్మాహుతి చేసుకున్నాడు.
డర్టీ కిడ్నీ ఆరోపణలు : ఆర్జేడీ నేత రోహిణి ఆచార భర్త ఎవరో తెలుసా?
పట్నా:ఒకపుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రి కిడ్నీ దానం చేసి వార్తల్లో నిలిచిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఇపుడు మరోసారి సంచలనంగా మారారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఇలా వెలువడ్డాయో లేదో, తన కుటుంబంతో సంబంధాలను తెంచుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు లాలూ కుటుంబంపై ఆర్జేడీ నేత రోహిణీ ఆచార్య పలు ఆరోపణలు చేశారు. మరోవైపు టికెట్ కోసం ‘డర్టీ కిడ్నీ’రాజకీయాలు అంటూ కుటుంబసభ్యులు ఆమెపై మండిపడ్డారు. అసలే ఓటమి భారంతో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు రచ్చకెక్కడం ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది.దీనిపై స్పందించిన రోహిణి తన భర్త, ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం కంటే కిడ్నీ దానం చేసి తండ్రిని కాపాడుకోవడం మీదనే దృష్టిపెట్టడం తన పాపమైపోయిందని సోషల్ మీడియా పోస్ట్లో వాపోయింది. ఎవరూ తన లాంటి తప్పు చేయకూడదని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు రోహిణి కుటుంబం ఏమిటి, భర్త ఎవరనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రోహిణి ఆచార్య భర్త ఎవరు?రోహిణి భర్త సమరేష్ సింగ్, కుమార్తె అనన్య ,ఇద్దరు కుమారులు ఆదిత్య , అరిహంత్లతో కలిసి సింగపూర్ నివసిస్తుంది. 2002లో సమరేష్ సింగ్తో రోహిణి వివాహం జరిగింది. ముంబైలో ఒకప్పుడు సీనియర్ ఆదాయపు పన్ను అధికారిగా పనిచేసిన దివంగత రణవిజయ్ సింగ్ కుమారుడే సమరేష్. పెళ్లి తరువాత రోహిణి, సమరేష్ జంట మొదట అమెరికాకు వెళ్లారు ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. సమరేష్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో బిఎ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో మాస్టర్స్ ,INSEAD (ఇన్స్టిట్యూట్ యూరోపీన్ డి'అడ్మినిస్ట్రేషన్ డెస్ అఫైర్స్)బిజినెస్ స్కూల్లో ఎంబీఏ (ఫైనాన్స్) చేశారు. ప్రస్తుతం, సమరేష్ సింగపూర్లోని ఎవర్కోర్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్,మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన గతంలో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో సీనియర్ ఉద్యోగిగా పనిచేశారు.(ఆర్బీఐ, సీబీఐ అంటూ.. 6 నెలల్లో రూ. 32 కోట్లు!)కాగా మరోవైపు రోహిణికి బీజేపీ అండగా నిలవడం విశేషం. కుమార్తె నుంచి కిడ్నీ స్వీకరించి బతికి బట్ట కట్టిన లాలూ, కొడుకు తేజస్వికి అనుకూలంగా వ్యవహరించారంటూ తన విమర్శలను ఆర్జేడీపై ఎక్కుపెట్టింది. పార్టీలోని అరాచకమే కుటుంబంలో కూడా కనిపిస్తోందని బిహార్ ఉపముఖ్యమంత్రి విజయ్ సిన్హా కూడా యాదవ్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. తమ సొంత కుటుంబాన్నే ఐక్యంగా ఉంచుకోలేని వారు, ఇక రాష్ట్రాన్నేం పాలిస్తారంటూ ఎద్దేవా చేశారు.
Lalu Family: అతిపెద్ద రాజకీయ కుటుంబం..
'సమోసాలో ఆలు ఉన్నంత కాలం.. బిహార్లో లాలూ ఉంటాడని..' బిహార్ రాజకీయ భీష్ముడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తరచుగా అంటుండే వారు. ఇప్పుడు సొంత కూతుళ్లే ఆయనను వదిలేసి వెళ్లిపోతున్నారు. తమ్ముడి మాయలో పడి తమను చిన్నచూపు చూస్తున్నారని తండ్రిని వేలెత్తి చూపిస్తున్నారు. తమకు గౌరవం లేని ఇంట్లో ఉండబోమంటూ తెగేసి చెబుతున్నారు.చిన్న తమ్ముడు తేజస్వీ వైఖరి కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఘోర పరాజయం ఎదురైందని లాలూ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య (rohini acharya) సంచలన ఆరోపణలు చేశారు. అతడి కారణంగా సొంత ఇంట్లోనే తనకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన చెందారు. పుట్టింటితో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. రోహిణి చెల్లెళ్లు చందా సింగ్, రాగిణి యాదవ్, రాజ్యలక్ష్మి యాదవ్ కూడా పట్నాలోని పుట్టింటిని వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. అటు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ కూడా ఈ వ్యవహారంపై స్పందించాడు. తన అక్కను అవమానించిన వారిని వదిలిపెట్టబోనంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతా జరుగుతున్నా కుటుంబ పెద్ద లాలూ ప్రసాద్ ఇప్పటివరకు స్పందించలేదు.చాలా సంవత్సరాలు పాటు బిహార్ రాజకీయాలను శాసించిన లాలూ ప్రసాద్.. తన సొంత కుటుంబంలో అలజడిని ఎలా ఎదుర్కొంటారోనని జనం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం వివరాలు తెలుసుకునేందుకు నెటిజనులు సోషల్ మీడియాలో తెగ శోధిస్తున్నారు. లాలూ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి 1973లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మొత్తం 9 మంది సంతానం. వీరిలో ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తేజస్వీ యాదవ్ (tejashwi yadav) అందరి కంటే చిన్నవాడు.1. మీసా భారతిలాలూ, రబ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె. ఎంబీబీఎస్ చదివిన ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 49 ఏళ్ల మీసా భారతి ప్రస్తుతం పాటలీపుత్ర నుంచి లోక్సభ ఎంపీగా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో మీసా యాక్ట్ కింద లాలూ జైలుపాలయ్యారు. దీంతో తన పెద్ద కూతురికి మీసా అని పెట్టారు లాలూ.2. రోహిణీ ఆచార్యతన తండ్రికి కిడ్నీ దానం చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు లాలూ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య. సింగపూర్లో ఎంబీబీఎస్ చదివిన సమరేశ్ సింగ్ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. పుట్టింటితో సంబంధాలు తెంచుకుంటున్నట్టు బహిరంగంగా ప్రకటించారు.3. చందా సింగ్లాలూ మూడో కుమార్తె అయిన చందా సింగ్.. ప్రజా జీవితంలో లేరు. మిగతా తోబుట్టువులతో పోలిస్తే ఆమె బయట కనిపించింది చాలా తక్కువ. పైలట్ విక్రం సింగ్ను ఆమె వివాహం చేసుకున్నారు.4. రాగిణి యాదవ్ఇంజినీరింగ్ విద్య పూర్తి చేయకుండానే మధ్యలో వదిలేశారు లాలూ నాలుగో కుమార్తె అయిన రాగిణి యాదవ్. సమాజ్వాదీ పార్టీకి చెందిన రాహుల్ యాదవ్ను ఆమె పెళ్లాడారు.5. హేమ యాదవ్లాలూ ప్రసాద్ 5వ కుమార్తె అయిన హేమ యాదవ్ బీటెక్ వరకు చదివారు. వినీత్ యాదవ్ను వివాహం చేసుకున్నారు. ఈమె కూడా పబ్లిక్లో ఎక్కువ కనబడరు.6. అనుష్క రావుఅనుష్కను కుటుంబ సభ్యులు ముద్దుగా దన్ను అని పిలుస్తుంటారు. ఇంటీరియర్ డిజైనింగ్, న్యాయ విద్య చదివారు. హరియాణా రాజకీయ కుటుంబానికి చెందిన చిరంజీవ్ రావుతో ఆమె పెళ్లి జరిగింది.7. రాజ్యలక్ష్మిలాలూ ప్రసాద్ చిన్న కుమార్తె అయిన రాజ్యలక్ష్మి ప్రైవేటు యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశారు. రాజకీయ కుటుంబానికి తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ను వివాహం చేసుకున్నారు.8. తేజ్ ప్రతాప్ యాదవ్లాలూ ప్రసాద్ పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ ఇంటర్మీయట్ వరకు చదువుకున్నారు. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బిహార్ రాష్ట్ర మంత్రిగా గతంలో పనిచేశారు. బాధ్యతా రహిత ప్రవర్తన కారణంగా తండ్రి ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కుటుంబం, పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జనశక్తి జనతాదళ్ పేరుతో పార్టీ పెట్టి, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. కుటుంబ గొడవల నేపథ్యంలో అక్క రోహిణీ ఆచార్యకు బాసటగా నిలిచారు.9. తేజస్వీ యాదవ్అందరికంటే చిన్నవాడైన తేజస్వీ యాదవ్ రాజకీయాల్లో లాలూ వారసుడిగా చెలామణి అవుతున్నారు. కేవలం పదకొండో తరగతి వరకు మాత్రమే చదివిన తేజస్వీ.. రాజకీయంగా మాత్రం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన భార్య పేరు రాజశ్రీ యాదవ్. వీరికి ఇద్దరు సంతానం. చదవండి: డర్టీ కిడ్నీ అంటూ దూషించారు
ఎన్ఆర్ఐ
అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావుకి అరుదైన గౌరవం
ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావు కావేటిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అంతర్జాతీయ న్యాయ సేవల్లో విశేష కృషి చేసినందుకు గాను డా. శ్రీనివాస్ రావు కావేటికి ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సెల్ లీడర్షిప్ ఇన్ ది యూఎస్ ఆఫ్ 2025’ అవార్డు దక్కింది. ‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ డా. శ్రీనివాస్ రావు కావేటికి ఈ అవార్డును అందించింది.‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ అందించిన ఈ గౌరవం, భారతీయ చట్టాలను అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలతో సమన్వయం చేయడంలో డా. కావేటి చేసిన అసాధారణ కృషికి దక్కిన గుర్తింపు అని చెప్పవచ్చు. అంతర్జాతీయ న్యాయ సేవలలో కావేటి లా సంస్థ ఎంతో పేరొందింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా అడుగుపెట్టిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాలలో సొలిసిటర్గా, నోటరీ పబ్లిక్గా సేవలందించారు.ఆయన స్థాపించిన కావేటి లా ఫర్మ్.. అమెరికా, భారతదేశం, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో సేవలందిస్తోంది. కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ ఇమ్మిగ్రేషన్ వంటి కీలక రంగాలలో సరిహద్దులు దాటి క్లయింట్లకు సేవలను అందిస్తోంది. ఒకే గొడుగు కింద స్థానిక, అంతర్జాతీయ న్యాయ సేవలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు న్యాయ విద్యతో పాటు ఎంబీఏ, జర్నలిజంలో మాస్టర్స్ పట్టాలను కూడా పొందారు. న్యాయ విద్యార్థులకు, చార్టర్డ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ గ్లోబల్ ఎడ్యుకేటర్గా కూడా ఆయన గుర్తింపు పొందారు.(చదవండి: ఘనంగా 'ఆటా' 19 మహాసభలు కిక్ ఆఫ్ వేడుడ
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
క్రైమ్
నాకు ఉద్యోగం వచ్చింది.. పెళ్లి క్యాన్సిల్..!
అన్నమయ్య జిల్లా: ఇద్దరి మనసులు కలిశాయి, పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. కాబోయే పెళ్లి కొడుక్కి.. అప్పటికి ఉద్యోగం రాలేదు. పెళ్లికూతురు ప్రైవేట్ టీచర్గా పని చేస్తోంది. తర్వాత ఇద్దరూ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తే.. కాబోయే పెళ్లి కొడుక్కి ఉద్యోగం వచ్చింది. దీంతో ఈ పెళ్లి వద్దంటూ వరుడి కుటుంబీకులు నిరాకరించారు. ఈ క్రమంలో ఆదివారం పురుగుల నివారణ మందు తాగి కాబోయే పెళ్లి కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకుల కథనం మేరకు వివరాలి ఉన్నాయి.మదనపల్లె రూరల్ మండలం చీకలబయలు గ్రామానికి చెందిన యువతి (24)కి కలికిరి మండలం అమరనాథ్రెడ్డి కాలనీకి చెందిన ప్రకాష్తో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 30న నిశ్చితార్థం జరిగింది. ఇది జరిగిన రెండు నెలల తర్వాత వివాహం జరిపేందుకు నిర్ణయించారు. ఈ మధ్యలో ప్రకాష్ డీఎస్సీ పరీక్ష రాశాడు. మొదటి రెండు కౌన్సెలింగ్లలో ఉద్యోగం రాలేదు. మూడో విడత కౌన్సెలింగ్ లో టీచరు ఉద్యోగం వచ్చింది. అప్పట్నుంచి కాబోయే పెళ్లి కొడుకు తరఫు కుటుంబీకుల నిజ స్వరూపం బయటపడింది. నిశ్చితార్థం జరిగి రెండు నెలలు కావడంతో.. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామని యువతి కుటుంబీకులు అడుగుతూ వచ్చారు. ఈ విషయాన్ని పెళ్లికొడుకు కుటుంబీకులు దాట వేస్తూ వచ్చారు. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ వేధించడం మొదలుపెట్టారు. ఫోన్లో తిట్టడం, దుర్భాషలాడినా.. పెళ్లిని దృష్టిలో ఉంచుకొని యువతి కుటుంబీకులు భరిస్తూ వచ్చారు. అయితే ఆదివారం ఇది శ్రుతి మించిపోయింది. కాబోయే పెళ్లికొడుకు కుటుంబీకులు ఫోన్లో తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. దీంతో మనస్తాపానికి గురి కావడం, పెళ్లికి నిరాకరించడంపై ఆవేదనకు గురైన యువతి మధ్యాహ్నం ఇంటిలోనే పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుర్తించిన కుటుంబీకులు చికిత్స కోసం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ బిడ్డ ఆత్మహత్యకు ప్రయత్నించడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఎన్నో ఆశలతో నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు పెళ్లి జరగదని తెలిసి, తమ బిడ్డ చనిపోయేందుకు ప్రయతి్నంచిందంటూ తల్లి బోరున విలపిస్తోంది. కాబోయే పెళ్లి కొడుకు కుటుంబీకులు ఫోన్లో తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారంటూ యువతి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
సౌదీ ఘటనలో హైదరాబాదీ యువకుడు సురక్షితం
సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనం అయ్యింది తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ అసిఫ్ నగర్, హబీబ్ నగర్కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం అల్ మక్కా, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్లు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. ఆ సమయంలో దాటాక వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 42 మంది మరణించగా.. మృతుల్లో హైదరాబాద్కు చెందిన వాళ్లే 16 మంది ఉన్నారు. అయితే మృతుల్లో నగరానికి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో ఏడుగురు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. ఆ కుటుంబాల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బస్సు డ్రైవర్తో పాటు హైదరాబాద్కు చెందిన షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ధృవీకరించారు.‘‘మక్కా యాత్రికులు మరణించడం దురదృష్టకరం. హైదరాబాద్ నుంచి 44 మంది యాత్రికులు వెళ్లారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ఉన్నారు. నగరానికి చెందిన 16 మంది మరణించారు. వాళ్ల వివరాలు సేకరిస్తున్నాం. షోయబ్ అనే యువకుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు’’ అని తెలిపారు. మరోవైపు.. ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు ట్రావెల్ ఏజెన్సీలకు వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఫ్లై జోన్ ట్రావెల్స్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.సాయంత్రానికే ఆ స్పష్టత: నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతిని గురిచేసింది. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడు. ఇక్కడ బాధిత కుటుంబాలను కలిసాను. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. మా పార్టీ అధినేత, ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలుస్తాం. మృతదేహాలను ఇక్కడికి రప్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. మా బృందం ఒకటి సాయంత్రానికి సౌదీ చేరుకుంటుంది. ఆ తర్వాతే మృతదేహాల తరలింపునకు అవకాశం ఉందా? లేదా? అనే దానిపై క్లారిటీ వస్తుంది.
తమ్ముడిని చంపి ఇంట్లో పూడ్చిపెట్టిన అన్న..
కుప్పంరూరల్ : అప్పు అడిగినందుకు తమ్ముడు అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసి ఓ ఇంట్లో పూడ్చిపెట్టిన వైనం కుప్పం పట్టణానికి సమీపంలోని జగనన్న కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. కుప్పం మండలం, దళవాయికొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్ (37) కుటుంబం కొద్ది సంవత్సరాల కిందట బతుకు తెరువు కోసం బెంగళూరు వెళ్లి అత్తిబెల్లి వద్ద స్థిర పడ్డారు. శ్రీనాథ్కు వరుసకు అన్నయ్య అయిన ప్రభాకర్కు ఆర్థిక లావాదేవీలు నడిచేవి. ఈ క్రమంలో ప్రభాకర్కు దాదాపు 40 లక్షల వరకు అప్పు ఇచ్చాడు. తీరా అప్పు తీర్చమని అడిగితే ఇదిగో... అదిగో అంటూ కాలం వెలిబుచ్చేవాడు. శ్రీనాథ్ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రభాకర్ ఎలాగైనా శ్రీనాథ్ను కడతేర్చాలని కొంత కాలంగా కుట్ర పన్నాడు. గత 27న 10 లక్షల అప్పు తిరిగి ఇస్తానని శ్రీనాథ్ను నమ్మబలికిన ప్రభాకర్... ఒంటరిగా సెల్ఫోన్ లేకుండా కుప్పం రావాలని కోరాడు. ప్రభాకర్ మాటలు నమ్మని శ్రీనాథ్ సెల్ఫోన్ లేకుండా తలపై టోపి, ముఖానికి మాస్కు ధరించి వచ్చాడు. ప్రభాకర్, అతడి స్నేహితుడు జగీష్ లతో కలిసి శ్రీనాథ్ కుప్పం పట్టణంలోని జగనన్న కాలనీలోని ప్రభాకర్ ఇంటికి చేరుకున్నారు. శ్రీనాథ్ను అతికిరాతకంగా సుత్తితో కొట్టి అక్కడే పూడ్చిపెట్టి ఏమి తెలియనట్లు వచ్చేశాడు. శ్రీనాథ్ రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బెంగళూరులోని అత్తిబెలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులు పలుమార్లు కుప్పం వచ్చి దర్యాప్తు చేపట్టిన ఎలాంటి ఆచూకీ దొరలేదు. ప్రభాకర్ మాత్రం తనకేమి తెలియనట్లు దర్జాగా తిరుగుతూనే ఉన్నాడు. చివరకు శ్రీనాథ్ మొబైల్ కాల్ హిస్టరీ పరిశీలించగా, ప్రభాకర్కు పలుమార్లు ఫోన్లు చేసినట్లు గుర్తించారు. వెంటనే ప్రభాకర్ను బెంగళూరు తీసుకుపోయి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. తానే శ్రీనాథ్ను హత్య చేసి కుప్పంలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఆదివారం బెంగళూరు పోలీసులు కుప్పం వారితో కలిసి శ్రీనాథ్ మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ఇంటి నుంచి శవాన్ని బయటకు తీశారు. శ్రీనాథ్ కుటుంబ సభ్యుల రోదనలతో జగనన్న కాలనీ దుఃఖసాగరంలో నిండింది. కాగా ప్రభాకర్ శ్రీనాథ్కు స్వయన పెద్దనాన్న కొడుకు. అన్నయ్య అవుతాడని స్థానికులు చెప్పారు. ప్రభాకర్ ఇప్పటికే ఓ హత్య కేసులో జీవిత కాలం శిక్ష అనుభవించి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.
సౌదీ ప్రమాదం: మృతి చెందిన హైదరాబాదీలు వీళ్లే..
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతులు హైదరాబాద్కు చెందిన యాత్రికులే. ‘‘సీఎం ఆదేశాల మేరకు మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీని సంప్రదించాం. ఇప్పటిదాకా అందిన నివేదికల ప్రకారం మృతుల్లో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ’’ అని మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు చెబుతున్నారు. Click here for the list of Passengers Detailsహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది యాత్రికులు అక్కడికి వెళ్లారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన వాళ్లని తెలుస్తోంది. రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహమ్మద్, ఫర్హీన్ బేగం, మహ్మద్ మస్తాన్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సోహైల్, జకీన్ బేగం, జహీయా బేగం, మరో నలుగురు మల్లేపల్లి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. పైన చిత్రాల్లో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లినవాళ్లే. వీళ్లలో చాలా మంది తమ బంధువుల ఫోన్లకు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరణించిన వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ట్రావెల్ ఏజెన్సీ వద్దకు బంధువులుహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది ఉమ్రా యాత్రకు వెళ్లారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లైజోన్స్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో ఏజెన్సీల వద్దకు వద్దకు జనాల తాకిడి పెరిగింది. తమ వాళ్లు ఎలా ఉన్నారనే ఆందోళనతో పలువురు అక్కడికి చేరుకుని ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఘటన నుంచి బస్సు డ్రైవర్తో పాటు హైదరాబాద్కు చెందిన షోయబ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.ఈ ఘోర ప్రమాదంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘ఈ ఘటనపై రియాద్లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అయిన అబూ మాథెన్ జార్జ్తో నేను మాట్లాడా. వారు ఈ ఘటనపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాదుకు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను నేను సంప్రదించాను. ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీకి, విదేశాంగ కార్యదర్శికి పంపించాను. మృతదేహాలను భారత్కు తీసుకురావాలని, ఎవరైనా గాయపడినట్లయితే వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ను కోరుతున్నా అని అన్నారు. #WATCH | Delhi | On the bus accident in Saudi Arabia, Hyderabad MP Asaduddin Owaisi says, "...Forty-two Hajj pilgrims who were travelling from Mecca to Medina were on a bus that caught fire...I spoke to Abu Mathen George, Deputy Chief of Mission (DCM) at the Indian Embassy in… pic.twitter.com/z88Pa8GmsS— OTV (@otvnews) November 17, 2025స్పందించిన విదేశాంగ శాఖసౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. మరోవైపు.. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్లోని డిప్యూటీ అంబాసిడర్తో సంప్రదింపులు జరుపుతున్నారు. యాత్రికుల వివరాలపై పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. మరోపక్క.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అదేశాలు జారీ అయ్యాయి.
వీడియోలు
ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు
Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం
సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం
BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష
Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర
హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు
కోర్టు ధిక్కర పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు
ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

