Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Telangana Govt Petition Dismissed In Supreme Court On BC Reservations1
50 శాతం మించొద్దు

సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్‌ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు కేవలం షెడ్యూల్డ్‌ ఏరియాల్లోనే ఉన్నాయని గుర్తుచేస్తూ, 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వం వాదన ఇదీ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అత్యంత శాస్త్రీయంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్‌ టెస్ట్‌’నిబంధనలకు అను గుణంగా, డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సమగ్రంగా, శాస్త్రీయంగా సర్వే జరిపామని తెలిపారు. 94 వేల ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లలో లక్షలాది మంది సమాచారాన్ని సేకరించి, బీసీ జనాభా డేటా ఆధారంగానే కమిషన్‌ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు పెంచామని వివరించారు. ఈ సందర్భంగా ఇందిరా సహానీ కేసులో తీర్పును సింఘ్వీ ఉటంకించారు. డేటా బేస్‌ ఆధారంగా, అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకునే సౌలభ్యం ఉందని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. వికాస్‌ కృష్ణారావ్‌ గవాలి కేసు తీర్పు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోందన్నారు. అంతేగాక ఈ వ్యవహారంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, అయితే గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. బిల్లును సవాల్‌ చేయకుండా, దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్‌ చేయడం సరికాదని సింఘ్వీ వాదించారు. ఇంతటి విస్తృత కసరత్తు తర్వాత, ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా హైకోర్టు స్టే విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కోటా 50% పరిమితి దాటరాదు: ప్రతివాదుల వాదన ప్రతివాది మాధవరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణ ప్రభుత్వ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. కృష్ణమూర్తి కేసు తీర్పును ఉటంకిస్తూ ‘షెడ్యూల్డ్‌ ఏరియాలు, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఉంది. జనరల్‌ ఏరియాల్లో ఈ పరిమితిని దాటడానికి వీల్లేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్‌ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెల్లడించింది’అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ట్రిపుల్‌ టెస్ట్‌లో కూడా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనేది ఒక కీలకమైన షరతు అని, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల ఉదంతాలను ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించి, 50 శాతం పరిమితికి లోబడే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో విభేదించింది. ‘ఎస్టీ ప్రాంతాల్లోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా?’అని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను, ముఖ్యంగా కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నిర్దేశించిన 50 శాతం పరిమితిని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనబడటం లేదంటూ తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా కేసు మెరిట్స్‌ ఆధారంగా తదుపరి విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతమున్న రిజర్వేషన్ల విధానం ప్రకారమే జరగనున్నాయి.

No Phone Call Between PM, Trump Yesterday India2
‘ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌ కాల్‌.. అంతా ఉత్తిదే’

న్యూఢిల్లీ: భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్‌కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ రూమర్లేనని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ‘నిన్న అసలు మోదీ-ట్రంప్‌ల మధ్య ఎటువంటి సంభాషణ జరగేలేదు. మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడలేదు. రష్యా చమురు నిలిపివేస్తామని ట్రంప్‌కు మోదీ హామీనూ ఇవ్వలేదు. వారి మధ్య ఎటువంటి టెలిఫోన్‌ సంభాషణ జరగనేలేదు. ఇదంతా అవాస్తవం’ అని విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ స్పష్టం చేశారు. ఇదీ విషయం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. @రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్‌తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్‌ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పా’. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్‌ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఇదీ చదవండి: మోదీ గొప్పోడే.. : ‍ట్రంప్‌ చిత్రమైన వ్యాఖ్యలు

Chandrababu Government Conspiracies On Sakshi Media3
సాక్షి మీడియాపై కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్‌ కుట్రలు

సాక్షి, హైదరాబాద్‌: సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇస్తున్నారు.కాగా, హైదరాబాద్‌లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం(అక్టోబర్‌ 15) కూడా దాదాపు 10 గంటల పాటు హల్‌చల్‌ చేయడం... ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించారు. ఇక ఎస్సీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు సాగిస్తోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్‌కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కూడా ఆదివారం(అక్టోబర్‌ 12) తెల్లవారుజామున పోలీసుల దాష్టీకానికి దిగిన సంగతి తెలిసిందే.టీడీపీ సిండికేట్‌ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్‌ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్‌ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది.

Sakshi Guest Column On Freedom of the press in democracy4
పదే పదే అదే దాడి!

ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది ప్రజలకు సమాచారం తెలుసు కునే హక్కు కూడా! ప్రభుత్వ తప్పిదాలు లేదా లోపాలను ఎత్తి చూపినందుకు, ముఖ్యంగా మద్యం మరణాల వంటి సున్నితమైన అంశాలలో, సంపాదకుడిని లేదా విలేకరులను వేధించడం, బీఎన్‌ఎస్‌ 179(1) వంటి అసంబద్ధమైన సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం, ‘సోర్స్‌’ వివరాలను అడగటం వంటి చర్యలు చట్టబద్ధమైన పరిధిని దాటి అధికార దుర్వినియోగానికి (అబ్యూజ్‌ ఆఫ్‌ అథారిటీ) పాల్పడటం కిందికి వస్తాయి.పత్రికా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలు జరిగినప్పుడు, వివిధ కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు జర్నలిస్టులకు బలమైన రక్షణ కవచంగా నిలిచిన విషయం గమనార్హం. సత్యాన్ని ధైర్యంగా నిల బెట్టే ప్రతీ జర్నలిస్టుకూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) ఎప్పుడూ రక్షణగా నిలుస్తుంది.ఒక వార్తా దినపత్రిక సంపాదకుడికి, మద్యం మరణాల గురించిన వార్తను ప్రచురించినందుకు గానూ, పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 179(1) కింద నోటీసులు జారీ చేయడం, ఆ వార్తకు సంబంధించిన విలేకరుల అన్ని డాక్యుమెంట్లు, వివరాలను బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 94 కింద సమర్పించాలని డిమాండ్‌ చేయడం చట్ట బద్ధమేనా? ఇటువంటి పోలీసు చర్యలు, లేదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు జర్నలిస్టులను వేధించడం కాదా? అవి వేధింపులే!ఏదైనా దర్యాప్తు, విచారణ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఏదైనా పత్రం, ఇతర వస్తువు అవసరమని కోర్టు లేదా పోలీస్‌ స్టేషన్‌ అధికారి భావించినప్పుడు, దానిని సమర్పించమని బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 94 (పాత సీఆర్‌పీసీ సెక్షన్‌ 91) కింద ఎవరికైనా సమన్లు జారీ చేయవచ్చు. కానీ అది పాత్రికేయులకు వర్తిస్తుందా? సాధారణంగా, విచారణ కోసం పత్రాలను అడగడానికి ఈ సెక్షన్‌ ఉపయోగపడుతుంది. అయితే, జర్నలిస్ట్‌ వనరు (సోర్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌) లేదా సమాచారాన్ని సమర్పించమని బలవంతం చేయడం, జర్నలిజం ప్రధాన సూత్రమైన ‘సోర్స్‌ గోప్యత’కు విరుద్ధం. విలేకరుల రక్షణ, పత్రికా స్వేచ్ఛ దృష్ట్యా, ఈ సెక్షన్‌ను విచక్షణా రహితంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం అవుతుంది. వార్తా ప్రచురణను కేవలం ప్రభుత్వంపై విమర్శగా భావించి, ఈ సెక్షన్లను ఉపయోగించి విలేకరుల వివరాలను, డాక్యుమెంట్లను కోరడం స్పష్టంగా ‘చట్టపరమైన వేధింపు’ కిందకు వస్తుంది.భారతదేశంలో జర్నలిస్టులు తమ వార్తా మూలాలను పోలీసు లకు బహిర్గతం చేయాలని ఏ చట్టం కూడా ఒత్తిడి చేయదు. సమాచా రాన్ని సేకరించే హక్కు, ప్రచురించే హక్కు – ఈ రెండింటినీ ఆర్టికల్‌ 19(1)(ఎ) కింద భారత రాజ్యాంగం ప్రసాదించింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సంబంధిత న్యాయస్థానం, అది కూడా అత్యవసర మైతేనే ఆ మూలాలను వెల్లడించమని ఆదేశించగలదు. కానీ పోలీసు లకు ఆ హక్కు లేదు. జర్నలిజంలో సమాచారాన్ని అందించిన వనరును రక్షించడం అత్యంత కీలకం. సోర్స్‌ను బహిర్గతం చేయమని బలవంతం చేయడం పత్రికా స్వేచ్ఛను అణిచివేయడమే అవుతుంది.జర్నలిస్టులకు ‘సుప్రీం’ బాసటరోమేష్‌ థాపర్‌ (1950) నుంచి ఆర్ణబ్‌ గోస్వామి (2020), ‘న్యూస్‌క్లిక్‌’ (2024) కేసుల వరకు, భారత అత్యున్నత న్యాయ స్థానం ఎప్పటికప్పుడు పోలీసుల లేదా రాజకీయ నేతల ఒత్తిడి లేకుండా మీడియా పని చేయాలనే హక్కును కాపాడుతూనే ఉంది. ‘ఆర్ణబ్‌ గోస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసును జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా విచారించారు. ముఖ్యంగా టీవీ కార్యక్రమాల మీద పలు ఎఫ్‌ఐఆర్లు ఫైల్‌ చేయడం మీద విచా రణ జరిగింది. జర్నలిస్టులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగటం, ప్రభు త్వాన్ని విమర్శించడం వారి హక్కుగా కోర్టు పరిగణించింది. రాజకీయ దురుద్దేశంతో ఎఫ్‌ఐఆర్లు దాఖలు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుకు విరుద్ధం అని వ్యాఖ్యానించింది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రతి పౌరుడికీ వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది. ఈ హక్కులోనే పత్రికా స్వేచ్ఛ కూడా అంతర్లీనంగా ఉంది. పోలీసుల వేధింపులను ఎదుర్కొంటున్నప్పుడు, ఒక జర్నలిస్ట్‌ లేదా ఎడిటర్‌ తన రక్షణ కోసం హైకోర్టును లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులు తరచూ నాలుగు అంశాలను పరిగణన లోకి తీసుకుంటాయి: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్త ప్రచురిత మైందా? వార్తలో ఉన్న వివరాలు నిజమని భావించడానికి ప్రాథ మిక ఆధారాలు ఉన్నాయా? నేరారోపణ చేయబడిన సెక్షన్‌ (ఇక్కడ బీఎన్‌ఎస్‌ 179(1)) ఈ వార్తకు అసలు వర్తిస్తుందా? లేదా ఇది కేవలం జర్నలిస్టును వేధించడానికి లేదా భయపెట్టడానికి ఉపయో గించారా?ప్రభుత్వ చర్యలు పత్రికా స్వేచ్ఛను అరికట్టే విధంగా ఉండ కూడదు. అంటే భయపెట్టి, ఒత్తిడి చేసి జర్నలిస్టులు సత్యాన్ని రాసేందుకు వెనకాడేలా చేయడాన్ని ‘చిల్లింగ్‌ ఎఫెక్ట్‌’ అంటారు. సుప్రీం కోర్టు ఇటువంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. పత్రికా స్వేచ్ఛకు ఊతం‘న్యూస్‌క్లిక్‌’ ఎడిటర్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు అద్భు తమైన వ్యాఖ్యానాలు చేశాయి. తమకు ఇష్టం లేని రిపోర్టింగ్‌ చేసినందుకు జర్నలిస్టులను నిందితులుగా పరిగణించే అధికారం పోలీసులకు లేదని కోర్టులు స్పష్టం చేశాయి. అంతేకాకుండా, సదరు వార్త సాధనాలను స్వాధీనం చేయాలని కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.‘రోమేష్‌ థాపర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌’ కేసులో ఆర్టికల్‌ 19(1)(ఎ) కింద పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని 1950లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది ‘బ్రజ్‌ భూషణ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఢిల్లీ’ కేసులో వార్తలను ప్రచురించడానికి ముందు సెన్సార్‌ షిప్‌ను కోర్టు కొట్టివేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు తొలి విజయం.‘అభిషేక్‌ ఉపాధ్యాయ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యూపీ’ (2024) కేసులో జర్నలిస్ట్‌ రాతలను ప్రభుత్వ విమర్శగా భావించినంత మాత్రాన, ఆ రచయితపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ చర్యలను విమర్శించే జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తుంది. ‘సిద్ధార్థ్‌ వరదరాజన్, ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ అస్సాం’ (2025) కేసులో, ఒక వార్తా పోర్టల్‌కు సంబంధించిన సీనియర్‌ జర్న లిస్టులపై నిర్బంధ చర్యలు తీసుకోకుండా అస్సాం పోలీసులను సుప్రీంకోర్టు నిలువరించింది. ఈ చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడిగా కోర్టు భావించింది.పత్రికా స్వేచ్ఛ గురించి న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇస్తున్నా, వేధింపులకు సంబంధించి పోలీసులను హెచ్చరిస్తున్నా ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారు ఈ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి కేసులు నిలవవని వారికీ తెలుసు. అయితే ఈ లోపు తాత్కాలికంగా ఇబ్బంది పెడుతూ ‘చిల్లింగ్‌ ఎఫెక్ట్‌’తో భయ పెట్టడమే వారి ప్రధానోద్దేశం. ఇలాంటి చర్యలకు సైతం వారు కచ్చి తంగా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుందనేది వాస్తవం.పి. విజయ బాబు వ్యాసకర్త రాజ్యాంగ న్యాయ శాస్త్ర పట్టభద్రులు, సీనియర్‌ సంపాదకులు

Rasi Phalalu: Daily Horoscope On 17-10-2025 In Telugu5
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆకస్మిక ధనలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.ఏకాదశి ప.1.09 వరకు, తదుపరి ద్వాదశి,నక్షత్రం: మఖ సా.4.41 వరకు, తదుపరి «పుబ్బ, వర్జ్యం: రా.12.54 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు తదుపరి ప.12.10 నుండి 12.56 వరకు, అమృత ఘడియలు: ప.2.16 నుండి 3.53 వరకు, సర్వ ఏకాదశి.సూర్యోదయం : 5.56సూర్యాస్తమయం : 5.35రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం.... ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనుకున్న పనుల్లో ప్రతిష్ఠంభన. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.వృషభం.... సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.మిథునం..పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.కర్కాటకం....కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.సింహం..... కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కన్య... కొత్త రుణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలు ముందకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త అనుకూలత.తుల.... ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృశ్చికం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు.ధనుస్సు... శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దైవదర్శనాలు. కుటుంబంలో స్వల్ప సమస్యలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో సమస్యలు మకరం.. పనులలో ఆటంకాలు. స్వల్ప అనారోగ్యం. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. దైవదర్శనాలు.కుంభం.... శుభకార్యాలపై చర్చలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి ఒప్పందాలు. కుటుంబంలో సమస్యలు తీరే సమయం. ఆప్తులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మీనం.... విలువైన వస్తువులు సేకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

Sakshi Editorial On Naxalite Mallojula Venugopal Rao Surrender6
లొంగుబాట్ల పర్వం!

ఆవిర్భవించి దాదాపు అరవయ్యేళ్లు కావస్తుండగా నక్సలైట్‌ ఉద్యమం తొలిసారి కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అరెస్టులు, నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు ఆ ఉద్యమానికి కొత్త కాకపోయినా, ఈ స్థాయిలో బీటలు వారటం ఇదే ప్రథమం. మావోయిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావుతో సహా 61 మంది నక్సలైట్లు గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ముందు బుధవారం లొంగిపోయారు. అస్త్ర సన్యాసం చేసినవారు అప్పగించిన ఏకే–47లు, ఇతర తుపాకులు స్వీకరించి అందుకు బదులుగా వారికి సీఎం రాజ్యాంగ ప్రతులు అందజేశారు. నక్సల్స్‌కు బలమైన స్థావరంగా భావించే అబూజ్‌మాడ్‌ పూర్తిగా భద్రతా బలగాల అదుపులోకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించి ఛత్తీస్‌గఢ్‌లో నిన్న, ఈ రోజు 197 మంది లొంగిపోయారని తెలిపారు. మొత్తం ఈ రెండు రోజుల్లో 258 మంది ఉద్యమానికి వీడ్కోలు చెప్పారు. ముఖ్యంగా ఉత్తర బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా అంతరించింది. గత కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. బయటినుంచి వెళ్లిన క్యాడర్‌తోపాటు పలువురు ఆదివాసీలు కూడా వీటిల్లో మరణించారు. ఈ పరిణామాలు గమనిస్తే వచ్చే ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలన్న కేంద్ర సంకల్పం నెరవేరేలా కనబడుతోంది. పీపుల్స్‌ వార్‌గా 1980లో ఆవిర్భవించిన పార్టీ ఇరవయ్యేళ్లలో పెనువేగంతో విస్తరించింది. 2000వ సంవత్సరంలో పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ), 2004లో మావోయిస్టు పార్టీగా రూపుదిద్దుకున్న సమయానికి దేశంలోని 92,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 180 జిల్లాల్లో దాని ప్రభావం ఉన్నదని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. నక్సలైట్‌ ఉద్యమం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పని తెలిపింది. తాజాగా ఆ ఉద్యమ ప్రభావం 11 జిల్లాలకు పరిమితమైంది. వాటిల్లో కూడా ఛత్తీస్‌గఢ్‌లోని మూడు జిల్లాలు – బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్‌లలో మాత్రమే నక్సల్‌ తీవ్రత అధికంగా ఉన్నదని కేంద్ర హోంమంత్రిత్వ వర్గాల కథనం. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మొదట్లో మందకొడిగా ప్రారంభమైన మార్పులు తర్వాత కాలంలో వేగం పుంజుకున్నాయి. పర్యవసానంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల నుంచి ఉద్యమంలోకి రిక్రూట్‌మెంట్‌ గణనీయంగా తగ్గింది. ఆదివాసీ యువత రాక కొంతమేర పెరిగిన మాట వాస్తవమే అయినా ఏదో సంచలనాత్మక ఘటనల సందర్భంలో తప్ప మావోయిస్టు స్వరం వినబడటం తగ్గింది. సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై ఆ పార్టీ వైఖరేమిటో తెలియని స్థితి నెలకొంది. ఇప్పటికీ ఆకలి, దారిద్య్రం ఉన్నా, గతంలో మాదిరి కాక వాటి నివారణకు ప్రభుత్వాలు ఏదో మేరకు పథకాలు రచించి అమలు చేస్తున్నాయి. తమ డిమాండ్లు అరణ్య రోదనగా మిగిలే గతకాలపు పరిస్థితి మారి, ఎవరో ఒకరు గొంతెత్తటం, వాటివల్ల సానుకూల ఫలితాలు రావటం సామాన్య ప్రజలకు ఊరటనిస్తోంది. అణచివేత, నిషేధాలతో అజ్ఞాత వాసంలో ఉండటం వల్ల కొద్దోగొప్పో బలం ఉన్న ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు వెనువెంటనే స్పందించే శక్తి లేకపోయింది. అంతక్రితం మాటేమోగానీ... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు ఎదురు కాల్పుల్లో మరణించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అంతర్మథనం మొదలైనట్టు కనబడుతోంది. మొన్న ఆగస్టులో సాయుధ పోరుకు తాత్కాలిక విరామం ప్రకటిద్దామంటూ మల్లోజుల పేరిట లేఖ విడుదలైనప్పుడు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని అందరూ అనుకున్నా పార్టీలో పలు కమిటీల మద్దతు కూడా ఉన్నదని మీడియా కథనాలు తెలిపాయి. ఇప్పుడేర్పడిన సానుకూల స్థితిని ఆదివాసీ జీవితాల మెరుగుకు వినియోగించటంతో పాటు పర్యావరణానికీ, ఆదివాసీ సంస్కృతికీ విఘాతం కలగని అభివృద్ధి నమూనాల రూపకల్పనకు పాలకులు కృషి చేయాలి. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలుచేస్తే సమస్యలు తలెత్తవు. ఆ వెంబడే వచ్చే సామాజిక, రాజకీయ ఉద్యమాలూ ఉండవు. లేకుంటే అసంతృప్తి రూపం మార్చుకుంటుంది తప్ప సమసి పోదు.

Telangana Cabinet Meeting Key Decisions7
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

సాక్షి, హైదరాబాద్‌: 1.48 లక్షల ఎకరాల్లో 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మద్దతు ధర, బోనస్ 500 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో హుజూర్ నగర్‌, కొడంగల్, నిజామాబాద్‌లో అగ్రికల్చర్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది.రాష్ట్ర వ్యాప్తంగా పలు సెక్టార్లకు ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయించింది. నల్సార్ యూనివర్సిటీ కి 7 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. నల్సార్ యూనివర్సిటీలో 25 నుంచి 50 శాతం సీట్ల కేటాయింపు కోటా పెంచుతూ కేబినెట్ తీర్మానించింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2A, 2B పొడిగింపుపై అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. సీఎస్‌ ఛైర్మన్‌గా ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కేబినెట్ ఆదేశించింది. రూ.10,500 కోట్లతో 5,500 కి.మీ మేర హ్యామ్‌ రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. జాతీయ ర‌హ‌దారులు, జిల్లా కేంద్రాలు, మండ‌ల కేంద్రాలు, ప‌ర్యాట‌క ప్రాంతాలు, ఇత‌ర రాష్ట్రాల‌తో అనుసంధాన‌మ‌య్యే ర‌హ‌దారుల‌కు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతాం.ఇద్దరు పిల్లలకు మించి సంతానం వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది.భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్ కు ప‌ది ఎక‌రాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్‌ఫోర్ట్‌ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వ‌ర‌కు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి ర‌క్ష‌ణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్ర‌త్యామ్నాయంగా 435.08 ఎక‌రాల భూముల‌ను అప్ప‌గిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేక‌ర‌ణ‌కు అయ్యే రూ.438 కోట్ల వ్య‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేందుకు అంగీక‌రిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. మ‌న్న‌నూర్‌-శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేందుకు అంగీక‌రిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.

Why Do Indian Trains Have An X Mark On The Last Coach8
రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!

దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే రవాణా సాధనాలు రైళ్లు. సరళమైనవి, సౌకర్యవంతమైనవి, దేశవ్యాప్తంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటంతో నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిని భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.ఇండియన్‌ రైల్వే విస్తృత నెట్వర్క్, క్లిష్ట కార్యకలాపాలతోపాటు అనేక విశిష్ట చిహ్నాలు, గుర్తులతో ప్రయాణికులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ప్రముఖ గుర్తుల్లో ఒకటి, ప్రతి రైలు చివరి కోచ్‌పై ఉండే బోల్డ్ ‘ఎక్స్‌’ (X) గుర్తు. మొదటిసారి చూసినప్పుడు ఇది కేవలం డిజైన్ లేదా సాధారణ గుర్తుగా అనిపించవచ్చు. అయితే, ఈ గుర్తు రైలు భద్రత, కార్యకలాపాల సమర్థతలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వాస్తవ అర్థం, ఉపయోగాన్ని తెలుసుకోవడం ట్రాక్ నిర్వహణ, రైలు ఆపరేషన్లకు ఎంతో అవసరం.రైలు పూర్తిగా దాటిందని నిర్ధారణచివరి కోచ్‌పై ఉన్న "X" గుర్తు ప్రధానంగా రైలు పూర్తిగా స్టేషన్ గుండా దాటిందని రైల్వే సిబ్బందికి తెలియజేస్తుంది. ఇది ఒక దృశ్య సూచనగా పని చేస్తూ, అన్ని కోచ్‌లు పూర్తిగా వెళ్లిపోయాయని నిర్ధారించడంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో లేదా దృష్టి మందగించే వాతావరణంలో ఇది మరింత కీలకంగా మారుతుంది. కేవలం సిగ్నళ్లపై ఆధారపడటం చాలనిపించినా ఈ "X" మార్కింగ్ అదనపు భద్రతా పొరగా నిలుస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపుకొన్నిసార్లు అరుదైన సంఘటనల్లో, ఒక కోచ్ రైలు నుండి వేరు కావచ్చు. అలాంటి సందర్భంలో, రైలు చివరి కోచ్‌పై "X" గుర్తు కనపడకపోతే, అది తక్షణమే ఒక హెచ్చరికగా మారుతుంది. దీనివల్ల రైల్వే అధికారులు సమస్యను వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ప్రమాదాలను నివారించడంలో, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను పరిరక్షించడంలో కీలకంగా ఉంటుంది.

Women's CWC 2025: Australia Beat Bangladesh By 10 Wickets9
వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్‌ కెప్టెన్‌

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్‌ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదింది.కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్‌ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.రెండు మ్యాచ్‌ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం​ విశేషం. భారత్‌తో మ్యాచ్‌లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్‌పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.నేటి మ్యాచ్‌లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్‌ ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (72 బంతుల్లో 84 నాటౌట్‌; 12 ఫోర్లు, సిక్స్‌) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్‌ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్‌ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్‌కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్‌.. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, భారత్‌పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ శోభన మోస్తరి (66 నాటౌట్‌), ఓపెనర్‌ రుబ్యా హైదర్‌ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఆసీస్‌ బౌలర్లలో అలానా కింగ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, జార్జియా వేర్హమ్‌ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్‌ షట్‌కు ఓ వికెట్‌ దక్కింది.చదవండి: చివరి బెర్త్‌ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్‌ ఆడబోయే జట్లు ఇవే..!

Entire Gujarat Cabinet, except CM Bhupendra Patel, resigns10
గుజరాత్‌లో కీలక పరిణామం.. మంత్రులంతా రాజీనామా

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. "ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు" అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement