వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 32 బంతుల్లోనే శతక్కొట్టి
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్బుత ప్రదర్శనతో దుమ్ములేపాడు. ఆసియా క్రికెట్ మండలి (ACC) పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.ఈ టీ20 ఈవెంట్లో భాగంగా భారత్-‘ఎ’ జట్టు తమ తొలి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడుతోంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఐపీఎల్ సెన్సేషన్ ప్రియాన్ష్ ఆర్య వేగంగా ఆడే (6 బంతుల్లో 10) ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు.ఈ క్రమంలో మరో ఓపెనర్, భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధీర్తో కలిసి.. స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. కేవలం పదహారు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత జోరును మరింత పెంచాడు.ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ లెఫ్టాండర్ కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకుని మరోసారి సత్తా చాటాడు. వైభవ్ శతక ఇన్నింగ్స్లో పది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
కలల జాబ్ కనీసం నెల కూడా చేయలేదు..
ఉద్యోగం రావడమే కష్టమైన ప్రస్తుత రోజుల్లో దిగ్గజ కంపెనీలలో జాబ్ దక్కించుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. చదువు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా సరైన ఉద్యోగం రానివారు చాలా మందే ఉన్నారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ యువతి వేగంగా కెరియర్ వేగాన్ని చూస్తే ఆశ్చర్యంతో అభినందించాల్సిందే.ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్లో జాబ్ ఎందరికో కలల ఉద్యోగం. అంతటి ఘనమైన ఉద్యోగాన్ని దక్కించుకున్న యువ టెకీ.. ఒక్క నెల కూడా గడవకముందే వద్దుపో.. అని వదిలేసింది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తిగత మైలురాళ్లు, ప్రస్థానాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు పరిపాటి. అలాగే అనుష్క శర్మ కూడా తన కెరియర్ గమనాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో షేర్ చేశారు.బెంగళూరుకు చెందిన అనుష్క శర్మ 20 ఏళ్ల వయసులో ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్తో తన కెరియర్ను ప్రారంభించారు. తర్వాత మూడేళ్లకు అది మానేసి మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం 24 ఏళ్లకు అమెజాన్లో అంతర్జాతీయ ఉద్యోగాన్ని తెచ్చుకున్నారు. తర్వాత ఏడాదే ఎంబీఏ చేసిన ఆమె 26 ఏళ్ల వయసులో ప్రఖ్యాత గూగుల్లో మంచి జాబ్ దక్కించుకున్నారు. కానీ చేరి నెల రోజులు కూడా గడవకుండానే దాన్ని వదిలేశారు. అనంతరం వ్యక్తిగత జీవితంలో మరో మెట్టు ఎక్కారు. పెళ్లి చేసుకుని 27 ఏళ్లకే సొంతంగా కంపెనీ పెట్టేశారు. ఆమె కంపెనీ పేరు ‘డ్రింక్క్వెంజీ’. ఇదో ప్రోబయోటిక్ సోడా కంపెనీ.అనుష్క శర్మకు పోస్ట్కు సోషల్ మీడియాలో విస్తృత స్పందన వచ్చింది. విజయవంతమైన ఆమె కెరియర్ గమనాన్ని నెటిజనులు అభినందించకుండా ఉండలేకపోయారు. ‘మీ అనుభవానికే సంబంధం లేని సోడా కంపెనీని ఎలా ప్రారంభించారు?’ అంటూ ఓ యూజర్ ఆశ్చర్యపోయారు. ‘ గూగుల్ జాబ్ను ఎందుకు విడిచిపెట్టారు?’ అని మరో యూజర్ ఆతృతగా ప్రశ్నించగా దానికామె వ్యక్తిగత కారణాలు అని బదులిచ్చారు.ఇదీ చదవండి: నమ్ముకున్న ఉద్యోగులకు అనిల్ అంబానీ వరాలుఇక అనుష్క శర్మ విద్యార్హతల విషయానికి వస్తే.. ఆమె లింక్డ్ఇన్ బయో ప్రకారం.. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనుష్క శర్మ ఆ తర్వాత ఈఎస్సీపీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.20 -started my investment banking job, lowkey enjoyed itt soo much 23- went for masters24 - got my first international job and my first FAANG job at Amazon25- finished mba 26 - joined google and quit google in less than a month 27 - got married to the love of my life ,… https://t.co/AsRVaAOkJK— Anushka Sharma (@Anushka257) November 12, 2025
అంధకారం నుంచి ‘చిరాగ్’ వెలుగులు!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం దాదాపు ఖాయం. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూనే మరో యువనేత చిరాగ్ పాశ్వాన్ గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో చిరాగ్ పార్టీ లోక్ జనశక్తి హవా మామూలుగా లేదు, రాబోయే కాలమంతా చిరాగ్దే అన్నంతంగా చాటిచెప్పాయి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 29 సీట్లను పట్టుబట్టి తీసుకున్న ఆయన.. ఏకంగా 21 సీట్లలో గెలుపు దిశగా పయనిస్తున్నారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్కు తగ్గ తనయుడిగా తనదైన ముద్రను వేశారు చిరాగ్ పాశ్వాన్. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేసి అన్నింటిలోనూ విజయం సాధించిన చిరాగ్ పాశ్వాన్.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తన పార్టీ ప్రభావం ఏమిటో చెప్పకనే చెప్పేశారు. ఫీనిక్స్లా పుంజుకుని..చిరాగ్ పాశ్వాన్ తిరిగి పుంజుకున తీరు ఫీనిక్స్ పక్షిని గుర్తు చేస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్ అంతా గందరగోళమే. జేడీయూ అధినేత నితీష్ కుమార్తో విభేదాల వల్ల ఆ సమయంలో ఒంటరిగానే పోటీకి సిద్దమయ్యారు. 130కి పైగా స్థానాల్లో పోటీ చేసిన చిరాగ్.. కేవలం ఒక్క సీటును మాత్రమే సాధించారు. దాంతో ఆయన రాజకీయ అంధకారంగా కనిపించింది. అదే సమయంలో చిరాగ్ అవమానాలను సైతం ఎదుర్కొన్నాడు. అందకారం నుంచి ఆకాశమంత వెలుగు..ఆపై 2021లో సొంత బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పార్టీని చీల్చి, రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం పోటీపడ్డారు. అప్పుడు చిరాగ్ రాజకీయ భవిష్యత్ అంతా అంధకారంగానే కనిపించింది. బిహార్ రాజకీయాల్లో ఓ శక్తిగా వెలిగిన రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే లక్షణాలు చిరాగ్లో లేవనే విమర్శలు వినిపించాయి. తండ్రిలో ఉన్న చరిష్మా చిరాగ్లో లేదని విమర్శకులు అభిప్రాయాపడ్డారు. అయితే ఐదేళ్ల వ్యవధిలోనే ఎంతలా పుంజుకున్నారో తాజాగా ఆయన తన అభ్యర్థులను ముందువరుసలో నిలిపిన తీరే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో వంద శాతం స్తైక్రేట్ సాధించిన చిరాగ్.. ఇప్పుడు కూడా అదే జోరుతో ముందుకు సాగుతున్నారు. #WATCH | पटना: केंद्रीय मंत्री और LJP(रामविलास) के राष्ट्रीय अध्यक्ष चिराग पासवान ने NDA के बहुमत का आंकड़ा पार करने पर कहा, "बिहार की जनता ने जिस तरह से NDA को प्रचंड बहुमत दिया है और अगले पांच साल बिहार को विकास की ओर ले जाने का फैसला किया है, उसके लिए मैं विशेष रूप से उन्हें… pic.twitter.com/Lz5lWpDYuA— ANI_HindiNews (@AHindinews) November 14, 2025 చిరాగ్ అంటే కాగడా అని అర్థం.. ఇప్పుడు బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఎన్డీఏ కూటమిలో కాగడా మాదిరి మారి మరింత వెలుగు నింపారు. అదే సమయంలో ఆయన రాజకీయ జీవితాన్ని అంధకారం నుంచి ఆకాశమంత వెలుగుల వరకూ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు చిరాగ్. ఇక బిహార్లో అంతా చిరాగ్ శకమే అన్నంత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారాయన.
ఉత్తుంగ కెరటం.. సంకల్ప శక్తికి నిర్వచనం
ఆమె ఒక ఉత్తుంగ కెరటం.. సంకల్ప శక్తికి నిర్వచనం.. ఆత్మవిశ్వాసం ఆమె ఆభరణం.. కుటుంబం ఆమె బలం.. దేవుడు ఆమె తోడు.. దైవశక్తి ఆమెకు మార్గదర్శి..మనో సంకల్పానికి దైవశక్తి తోడైతే సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటారు.. దేవుడు కరుణిస్తే అసాధ్యం సుసాధ్యమవుతుందని బలంగా నమ్ముతారు బొల్లారెడ్డి దివ్యారెడ్డి. అందుకే నాలుగు పదుల వయసులోనూ ఆమె అథ్లెట్గా పతకాల పంట పండిస్తున్నారు.ముప్పై ఐదేళ్ల వయసులో ఆమె ‘నడక’ పరుగుగా మారింది. రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత థైరాయిడ్ సంబంధిత సమస్యలు మొదలయ్యాయి. వీటిని అధిగమించేందుకు ఆమె వ్యాయామాలు ప్రారంభించారు. భర్తతో కలిసి రోజూ జిమ్కుభర్త బైజు మథాయ్ ప్రోత్సాహంతో ఆయనతో కలిసి రోజూ జిమ్కు వెళ్తూ కసరత్తులు చేసేవారు. ఈ క్రమంలో రోడ్రేస్లో పాల్గొనమని ఫ్రెండ్ ఒకరు సలహా ఇచ్చారు. అలా మొదటి ప్రయత్నంలోనే దివ్యారెడ్డి రేసులో ఏకంగా మూడోస్థానంలో నిలిచారు.ఆ తర్వాత హాఫ్ మారథాన్ నుంచి.. క్రమక్రమంగా ఫుల్ మారథాన్లలో పాల్గొన్నారు. కోచ్ రాజశేఖర్ కాళీవెంకట మార్గదర్శనంలో ఆరు నెలలపాటు శిక్షణ పొందిన దివ్యారెడ్డి.. ఆయన సూచన మేరకు అథ్లెట్గా ప్రయాణం మొదలుపెట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘గోల్డెన్ మైల్ రన్’లో దివ్యారెడ్డి విజేతగా నిలిచారు. ఆ తర్వాత జిల్లా స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్కు వెళ్లారు. అక్కడ గెలిచి రాష్ట్ర స్థాయి.. ఆపై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ, పతకాలు సాధించారు.2019లో మలేసియాలో జరిగిన ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 40 ఏళ్లకు పైబడిన వయో విభాగంలో 800 మీటర్ల పరుగులో పసిడి పతకం గెలిచిన దివ్యారెడ్డి.. 400 మీటర్ల విభాగంలో కాంస్యం దక్కించుకున్నారు. ట్రైనింగ్ కష్టమై..అయితే.. రెండేళ్ల క్రితం చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో ట్రైనింగ్ కష్టమై.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆ తర్వాత జరిగిన వైద్య పరీక్షల్లో గర్భాశయంలో కణతి ఉన్నట్లు తేలింది.సర్జరీ తదనంతర పరిణామాల వల్ల శారీరకంగా బలహీనపడుతున్నానేమో అన్న సందేహం ఆమెను వెంటాడింది. దీనిని అధిగమించేందుకు సరైన డైట్ తీసుకుంటూనే.. వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకోవడం ప్రారంభించిన దివ్యారెడ్డి.. నెమ్మదిగా వ్యాయామం మళ్లీ మొదలుపెట్టారు.యాక్టివ్ లైఫ్స్టైల్తో జయించవచ్చు..ఇలాంటి సర్జరీ జరిగాక ఎక్సర్సైజులు, పరుగుతో శరీరాన్ని కష్టపెడితే.. భవిష్యత్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దలు హెచ్చరించారు. నడుంనొప్పి వంటి దీర్ఘకాలిక రుగ్మతలతోపాటు.. బరువు పెరిగే ప్రమాదముంటుందని పేర్కొన్నారు. అయితే.. సరైన కసరత్తుతో శరీరాన్ని బలోపేతం చేసుకుంటే.. ఇలాంటివన్నీ అపోహల్లాంటివేనని, యాక్టివ్ లైఫ్స్టైల్తో.. మెనోపాజ్ సమస్యలను సైతం ధైర్యంగా అధిగమించవచ్చని దివ్యారెడ్డి నిరూపించారు.భయపడి ఓటమిని అంగీకరించకూడదని ఆమె బలంగా విశ్వసిస్తారు. ఆపరేషన్ తొలివారంలో ఐదు నిమిషాల నడకతో మొదలుపెట్టి.. ఎనిమిది వారాల్లో సాధారణ స్థాయికి చేరుకోవడం ఇందుకు నిదర్శనం.సంకల్పం గట్టిగా ఉంటే కొండంత లక్ష్యమైనా చిన్నదని నమ్మే దివ్యారెడ్డి.. తన శారీరక సమస్యల నుంచి కోలుకున్న తర్వాత.. మరింత గొప్పగా రాణించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో పాల్గొనడమే కాదు పతకాలు గెలిచే స్థాయికి చేరారు.ఏం తినాలి?.. ఎంత తినాలి?ఇటు తిండి.. అటు వ్యాయామం.. రెండూ మితంగానే ఉండాలంటారు దివ్యారెడ్డి. తాను తాజా కూరగాయలతో పాటు.. ప్రొటిన్ కోసం ఎగ్స్, చికెన్ తింటానని చెప్పారు. కొద్దిగా అన్నం, చపాతీలు.. ఓట్స్, నట్స్ తదితర ఫైబర్ ఫుడ్స్ కూడా తన డైట్లో భాగమేనని వివరించారు. అన్నింటికంటే శరీరాన్ని హైడ్రేట్గా ఉంచటం అత్యంత ముఖ్యమని దివ్యారెడ్డి అంటారు. రోజుకు కనీసం 3-5 లీటర్ల నీళ్లు తాగాలని చెబుతారు.శిక్షణ సమయంలో మాత్రం తాను ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్, బయటి భోజనం తినలేదని చెప్పారు. మెనోపాజ్ దశలో చాలా మంది లావైపోయామనే ఆందోళనతో ఉపవాసాలు చేస్తారని.. దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. జీవనశైలిలో అకస్మాత్ మార్పు వల్ల తీసుకునే కాస్త ఆహారమైనా కొవ్వుగా మారి.. మెటబాలిజం దెబ్బతిని, మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు.ఎక్సర్సైజ్ ఆప్షన్ కాదు.. మీ వెపన్దేవాలయం లాంటి శరీరం మీద.. వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే.. వ్యాయామం అనే ఆయుధాన్ని సమర్థంగా ఉపయోగించాలంటారు దివ్యారెడ్డి. ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా తమ కోసం తాము సమయం కేటాయించి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచిస్తారు. గృహిణి, ఉద్యోగిని.. ఎవరైనా సరే ముందు తాము ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాన్ని చక్కగా చూసుకోగలరని చెబుతారు.నిద్ర అత్యంత ముఖ్యం.. పవర్ న్యాప్ తప్పనిసరిసోషల్ మీడియాను అవసరం మేరకు వాడతారు దివ్యారెడ్డి. రాత్రి 8.30 గంటలు దాటకముందే వృత్తిపరమైన, వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అథ్లెట్ రికవరీకి నిద్ర అత్యంత ముఖ్యం అంటూ నిద్రకు సమయం కేటాయించాలని.. ఎలక్ట్రానిక్ డివైజ్ల వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. తాను ఎంతటి హడావుడిలో ఉన్నా కనీసం ఇరవై నిమిషాల పాటు నిద్ర పోతే వెంటనే రికవరీ అవుతానంటున్నారు. కారులో ప్రయాణించే సమయమైనా పవర్ న్యాప్ కోసం కేటాయిస్తానని పేర్కొంటున్నారు.భర్త అండదండలు..తన ఆలోచనా విధానాన్ని భర్త బైజు మథాయ్, పిల్లలు ఇష్వి, ఆశ్రయ్ అర్థం చేసుకోవడం నిజంగా అదృష్టం లాంటిదేనంటారు దివ్యారెడ్డి. ఓ బహుళ జాతి సంస్థ(ఎంఎన్సీ)లో ఉన్నత హోదాలో ఉన్న తన భర్త బైజు మథాయ్.. తాను టోర్నీలకు వెళ్లినపుడు ఇంటి బాధ్యతలను ఆయనొక్కరే చక్కబెడతారని.. ప్రతి భర్త ఇలా ఆలోచిస్తే మహిళలకు సగం బలం వచ్చేస్తుందంటారు. భార్యాభర్తలిద్దరూ కలిసి రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేస్తే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కాసేపు హ్యాపీగా మాట్లాడుకునే సమయం దొరుకుతుందంటారు.దేవుడి దయ ఉంటేనే..“అతడు నా పాదములను జింక పాదములవలె చేసెను; నన్ను ఎత్తైన ప్రదేశములమీద నిలుపును” అనే దేవుడి వ్యాఖ్యాన్ని ప్రగాఢంగా విశ్వసించే దివ్యారెడ్డి.. తన పరుగు విజయం వెనక ఆ భగవంతుడే ఉన్నారంటున్నారు. స్వీయ శిక్షణ, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన దివ్యారెడ్డి.. ఇటీవల ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్-2025లో ఏకంగా నాలుగు పతకాలు సాధించారు.నలభై ఐదేళ్లకు ఏళ్లకు పైబడిన వయో విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం గెలిచిన ఆమె.. 1500 మీటర్ల రేసులో రజతం, 400 మీటర్ల పరుగులో కాంస్యం కైవసం చేసుకున్నారు. అదే విధంగా.. 4X400 రిలేలో స్వర్ణం గెలిచిన భారత జట్టులో దివ్యారెడ్డి సభ్యురాలు. తెలంగాణ తరఫున ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో నాలుగు పతకాలతో ఆమె సత్తా చాటారు.నిజానికి.. 800 మీటర్ల పరుగు పందెంలో లక్ష్యాన్నికి 70 మీటర్ల దూరం ఉన్నంత వరకు దివ్యారెడ్డి వెనుకబడే ఉన్నారు. అయితే, అనూహ్యంగా క్షణకాలంలో శక్తిని పుంజుకుని టార్గెట్ను ఛేదించి.. పసిడి పతక విజేతగా నిలిచారు. ఎప్పటిలాగే ఆ సమయంలోనూ ఆ దేవుడే తనను ముందుకు నడిపించారని దివ్యారెడ్డి చెబుతున్నారు. అమ్మ విమలమ్మ, తన చర్చి సంఘం ప్రార్థనలు ఫలించి.. ఊహించని రీతిలో తాను విజేతగా నిలిచానని హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఓడిన చోట(చెన్నై) ఇప్పుడు ఏకంగా నాలుగు పతకాలు గెలవడం ఆ దేవుడి కృప కాకపోతే మరేమిటని మురిసిపోయారు.తన వయసువారు మరో 20-30 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇప్పటి నుంచే శ్రద్ధతో కూడిన కసరత్తు అవసరమని, అందుకు ప్రతిరోజు వ్యాయామం చేయడం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు దివ్యారెడ్డి.-సుష్మారెడ్డి యాళ్ల, స్పోర్ట్స్ డెస్క్ (సాక్షి డిజిటల్)-పసుపులేటి వెంకటేశ్వరరావు, సాక్షి లైఫ్
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 32 బంతుల్లోనే శతక్కొట్టి
వాడే నాకు కరెక్ట్ : చాట్జీపీటీ వరుడొచ్చేశాడు!
టీడీపీ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు
హీరోగా టాలీవుడ్ కమెడియన్.. టైటిల్తోనే హైప్!
'అఖండ 2' నుంచి తాండవం పాట రిలీజ్
బీజేపీ, జేడీయూ కంటే ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు!
ఈ ఫలితాలు భూకంపం ముందొచ్చే హెచ్చరికలాంటివి: రేవంత్
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
బుమ్రా సూపర్ హిట్.. జైసూ విఫలం.. తొలిరోజు హైలైట్స్
IPL 2026: కేకేఆర్ కీలక ప్రకటన
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
హన్మకొండ జిల్లా: వీడిన ‘నాటు కోళ్ల’ మిస్టరీ
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారవృద్ధి
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
'శివ' చైల్డ్ ఆర్టిస్ట్కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
ముఖ్యంగా పాలిటిక్స్లో లేరనిపిస్తోంది!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
వామ్మో.. కోబ్రా ఫ్యామిలీ రౌండప్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి
H1B Visa: తలొగ్గిన ట్రంప్.. మాకు వలస కార్మికులు కావాలి
ఎర్రకోట సమీపంలో పేలుడు - 12 మంది మృతి
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలలో లాభాలు
ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
బడికి పంపడానికి ఏమీ అభ్యంతరం లేదటకానీ మధ్యాహ్న భోజనం పెట్టనని హామీ ఇవ్వాలట సార్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 32 బంతుల్లోనే శతక్కొట్టి
వాడే నాకు కరెక్ట్ : చాట్జీపీటీ వరుడొచ్చేశాడు!
టీడీపీ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు
హీరోగా టాలీవుడ్ కమెడియన్.. టైటిల్తోనే హైప్!
'అఖండ 2' నుంచి తాండవం పాట రిలీజ్
బీజేపీ, జేడీయూ కంటే ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు!
ఈ ఫలితాలు భూకంపం ముందొచ్చే హెచ్చరికలాంటివి: రేవంత్
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
బుమ్రా సూపర్ హిట్.. జైసూ విఫలం.. తొలిరోజు హైలైట్స్
IPL 2026: కేకేఆర్ కీలక ప్రకటన
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
హన్మకొండ జిల్లా: వీడిన ‘నాటు కోళ్ల’ మిస్టరీ
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారవృద్ధి
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
'శివ' చైల్డ్ ఆర్టిస్ట్కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
ముఖ్యంగా పాలిటిక్స్లో లేరనిపిస్తోంది!
H1B Visa: తలొగ్గిన ట్రంప్.. మాకు వలస కార్మికులు కావాలి
ఎర్రకోట సమీపంలో పేలుడు - 12 మంది మృతి
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలలో లాభాలు
ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
బడికి పంపడానికి ఏమీ అభ్యంతరం లేదటకానీ మధ్యాహ్న భోజనం పెట్టనని హామీ ఇవ్వాలట సార్!
లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియో
సినిమా
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
కొందరు తారలు ఫస్ట్ సినిమాకే క్లిక్ అవుతుంటారు.. మరికొందరు పెద్ద బ్లాక్బస్టర్ హిట్ కొడితే కానీ క్లిక్ అవరు. కానీ, మరాఠి నటి గిరిజ ఓక్ (Girija Oak Godbole) సోషల్ మీడియా వల్ల సడన్గా పాపులర్ అయిపోయింది. హిందీ, మరాఠి, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆమె ఇంటర్వ్యూ క్లిప్పింగ్సే కనిపిస్తున్నాయి.చాలా హ్యాపీ..ఇలా సడన్గా వైరల్గా మారడంపై సంతోషం వ్యక్తం చేసింది గిరిజ. అయితే తన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. అందులో గిరిజ మాట్లాడుతూ.. ఆన్లైన్లో నాకు వస్తున్న సడన్ అటెన్షన్ చూసి షాకైపోయాను. చాలామంది నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. గ్యాప్ లేకుండా ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రేమ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని మీమ్స్ చూస్తుంటే భలే సరదాగా ఉన్నాయి. నా 12 ఏళ్ల కొడుకుస్తే..కానీ కొన్ని మీమ్స్లో మాత్రం ఏఐ (కృత్రిమ మేధ)ను ఉపయోగించి నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. అవి చూడటానికి కూడా చాలా అసౌకర్యంగా ఉన్నాయి. ఆ ఎడిటింగ్స్ అస్సలు బాగోలేవు. ఏదైనా వైరలయితే చాలు ఇలా ఏవేవో ఇష్టమొచ్చినట్లు ఎడిట్లు చేస్తుంటారు. దీనికి హద్దులు, పరిమితులంటూ ఏవీ ఉండవు. అదే నాకు వచ్చిన పెద్ద సమస్య! నాకు 12 ఏళ్ల కొడుకున్నాడు. ప్రస్తుతానికైతే వాడు సోషల్ మీడియా వాడడు. కానీ, రేప్పొద్దున వాడు కూడా ఈ ఆన్లైన్ ప్రపంచంలో అడుగుపెట్టక మానడు. చీప్ ట్రిక్స్ మానుకోండిఅప్పుడు నా మార్ఫింగ్ ఫోటోలు వాడి కంట పడతాయని భయంగా ఉంది. మా అమ్మ అభ్యంతరకర ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయేంటి? అని వాడు బాధపడతాడన్న ఆలోచనే నన్ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వ్యూస్ కోసమే మీరిలాంటి అసభ్య ఫోటోలు సృష్టిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండి. ఒకమ్మాయి ఫోటోలను ఇలా ఎడిట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అంతకంటే ఏం కావాలి!అలాంటి ఎడిటింగ్ ఫోటోలను చూసి ఆస్వాదించేవారు కూడా ఈ తప్పుడు పనిలో భాగమైనట్లే లెక్క! దయచేసి అలాంటివి ఆపేయండి. ఇదంతా పక్కనపెడితే సడన్గా వచ్చిన ఈ పాపులారిటీ వల్ల ఎక్కువమంది జనాలు నా సినిమా, సిరీస్లు చూస్తే అంతే చాలు అని వీడియో ముగించింది. గిరిజ ఓక్... హిందీలో తారే జమీన్ పర్, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జిండె సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Girija Oak Godbole (@girijaoakgodbole) చదవండి: నా యాక్టింగ్పై నాకే డౌట్: దుల్కర్
‘కాంత’ మూవీ రివ్యూ
‘మహానటి’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దుల్కర్కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1950 బ్యాక్డ్రాప్లో ఓ స్టార్ హీరో- దర్శకుడి చుట్టూ తిరుగుతుంది. అయ్య(సముద్రఖని) ఓ గొప్ప సీనీ దర్శకుడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శాంత’. ‘నట చక్రవర్తి’ టీకే మహదేవన్ అలియాస్ టీకేఎం(దుల్కర్ సల్మాన్) హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఓ కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ కథను టీకే మహదేవన్తోనే తెరకెక్కించాల్సి వస్తుంది. అయ్యకు ఇష్టంలేకపోయినా..ప్రొడ్యూసర్ కారణంగా టీకేఎంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. కానీ టీకేఎం ఈ సారి ఈ కథ క్లైమాక్స్ని మార్చి దానికి ‘కాంత’(Kaantha Review) అనే టైటిల్ని ఫిక్స్ చేస్తాడు. అంతేకాదు అయ్యను కేవలం కుర్చీకే పరిమితం చేసి తనకు నచ్చినట్లుగా సినిమాను తీస్తుంటాడు. ఇందులో కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ) హీరోయిన్. ఆమెను నటిగా తీర్చిదిద్దింది కూడా అయ్యనే. అటు హీరో, ఇటు దర్శకుడి మధ్య ఈగో వార్ జరుగుతున్నప్పటీకీ..సినిమా షూటింగ్ మాత్రం ఆగదు. చివరి రోజు ఒకే ఒక్క సీన్ మిగిలి ఉండగా..హీరో-దర్శకుడి మధ్య గొడవ జరిగి షూటింగ్ ఆగిపోతుంది. అదే రోజు స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. అది ఎవరిది? ఎందుకు చేశారు? గురు శిష్యులైన అయ్య, టీకేఎం మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయి? వీరిద్దరి ఈగోల కారణంగా కుమారికి జరిగిన నష్టం ఏంటి? స్టూడియోలో జరిగిన హత్య కేసును పోలీసు అధికారి ఫీనిక్స్(రానా) ఎలా సాల్వ్ చేశాడు?అనేది తెలియాలంటే సినిమా(Kaantha Review) చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇది కల్పిత కథ అని చెప్పినప్పటీకీ..1934-59 మధ్యకాలంలో తమిళంలో సూపర్స్టార్గా వెలుగొందిన ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటలను ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈగోతో ఓ దర్శకుడితో గొడవపడడం.. జైలుకు వెళ్లడం.. ఇవన్నీ ఎంకేటీ నిజజీవితంలో జరిగాయి. దర్శకుడు సెల్వరాజ్ ఈ ప్రధాన అంశాలకు కాస్త ఫిక్షనల్ స్టోరీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ని తెరపై చూపించడం అంత ఈజీ కాదు. సినిమాలోనే ఓ సినిమా చూపించాలి. అదీ కూడా బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి కథ. టెక్నికల్గా ఇది కష్టమైనప్పటీకీ.. తెరపై మాత్రం చాలా చక్కగా చూపించారు. ఆ కాలంనాటి సంగీతం, ఆర్ట్వర్క్, కలర్ టోన్.. ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుడు అప్పటి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించారు. ఈ విషయంలో దర్శకుడితో పాటు టెక్నికల్ టీమ్ని కూడా అభినందించాల్సిందే. కానీ ఈ కథను ఆడియన్స్ని ఆకట్టుకునేలా రూపొందించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్.. సినిమా సంబంధిత వర్గాలను మాత్రమే ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ మొత్తం షూటింగ్ సమయంలో దర్శకుడికి, హీరోకి మధ్య గొడవలు.. వారి ఈగోల వల్ల కింది స్థాయి సిబ్బంది పడే ఇబ్బందులు.. హీరో-హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టూనే కథనం సాగుతుంది. దర్శకుడి- హీరోకి మధ్య విబేధాలు రావడానికి గల కారణం ఏంటనేది పూర్తిగా చెప్పకుండా..అక్కడక్కడ కొన్ని సీన్లను మాత్రమే చూపించడంతో అసలు వీళ్ల మధ్య ఏం జరిగి ఉంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితాయార్థం మొత్తం హత్య కేసు చుట్టూనే తిరుగుతూ..ఓ సాధారణ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పోలీసాఫీసర్గా రానా ఎంట్రీ ఇవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తుంది. ఈ కథ 1950 బ్యాక్డ్రాప్లో సాగుతున్నప్పటికీ.. రానా ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతం కాలాన్నే గుర్తు చేస్తుంది. ఇన్వెస్టిగేషన్లో బయటపడే చిన్న చిన్న ట్విస్టులు కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. హంతకుడు ఎవరనేది ముందే ఊహించినా.. ఎందుకు చేశాడనేది మాత్రం గెస్ చేయలేం. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. దుల్కర్ నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటిస్తాడు. అందులోనూ పిరియాడికల్ బ్యాక్డ్రాప్ పాత్రల్లో అయితే జీవించేస్తాడు.1950లలో నాటి సూపర్ స్టార్ టీకే మహాదేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కొన్ని సీన్లను చూస్తే.. ఇది దుల్కర్ తప్ప మరే నటుడు చేయలేడు అన్నంతగా ఆయన ఫెర్మార్మెన్స్ ఉంది. దుల్కర్తో పోటీపడి నటించారు సముద్ర ఖని, భాగ్యశ్రీ. సముద్రఖని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెర్మార్మెన్స్గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పవచ్చు. తెరపై డైరెక్టర్ అయ్య మాత్రమే కనిపిస్తాడు తప్పితే సముద్రఖని కనిపించడు. ఇక భాగ్యశ్రీ కూడా అంతే. ఇంతవరకు అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైన భాగ్యశ్రీ.. ఈ చిత్రంతో నటన పరంగానూ ఆకట్టుకుంది. నటి కుమారి పాత్రలో జీవించేసింది. రానా తెరపై కనిపించేది కాసేపే అయినా..ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. జాను చాంతర్ పాటలు బాగున్నాయి. కథతో భాగంగా ఈ పాటలు వస్తుంటాయి తప్పితే..ఎక్కడా ఇరికించినట్లుగా అనిపించవు. డాని సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటి టైంని రీ క్రియేట్ చేయడంలో తన కెమెరా పనితనాన్ని చూపించాడు. సినిమా చూస్తున్నంత సేపు అప్పటి రోజుల్లోకి వెళతాం. ఆర్ట్వర్క్ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్లోని కొన్ని సీన్లను మరింత షార్ప్గా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
వేడుకగా తెలుగు సీరియల్ నటి సీమంతం
అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం తదితర సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన చైత్ర రాయ్.. ఈ ఏడాది జూలైలో రెండోసారి ప్రెగ్నెన్సీ ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు వేడుకగా సీమంతం చేసుకుంది. ఈసారి చాలా స్పెషల్ అని చెబుతూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?: గిరిజా ఓక్)'చాలా ఆనందంగా రెండో సీమంతాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. చాలామంది మళ్లీ ఎందుకు అని అడిగారు. కానీ ప్రతి బిడ్డ కూడా వరమే కదా. ప్రతిక్షణం ప్రేమ కావాలి కదా. నా మొదటి సీమంతం కొవిడ్ టైంలో చేసుకున్నాను. అప్పుడు చాలా పరిమితంగానే జరుపుకొన్నాం. ఈసారి మాత్రం భర్త నాతో పాటు ఉన్నాడు. అప్పుడు ఆయన రావడం కుదరలేదు' అని చైత్ర రాయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం. ఇప్పుడు ఆ సీక్రెట్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు మరో బేబీ రాబోతోంది. నిశ్క శెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి అని జూలైలో పోస్ట్ పెట్టి చైత్ర.. ఇప్పుడు సీమంతం చేసుకుంది. కొత్త ఏడాదిలో బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలుస్తోంది. స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన చైత్ర.. సొంత భాషతో పాటు తెలుగులోనూ సీరియల్స్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలోనూ యాక్ట్ చేసింది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్ సినిమా) View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17)
చిల్ట్రన్స్డే రోజే వదిలేసి వెళ్లిపోయావ్.. జీవితం శూన్యం!
నేడు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ రోజును ఇష్టపడనివారు ఎవరుంటారు? అయితే ఎంతో ఇష్టమైన ఈరోజు తన జీవితంలో బాధాకరమైన రోజుగా మారిపోయిందంటోంది స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య, నిర్మాత సుప్రియ మీనన్ (Supriya Menon Prithviraj). బాలల దినోత్సవం నాడే తండ్రి తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.శాశ్వతంగా దూరమై 4 ఏళ్లునాన్న, నువ్వు మాకు దూరమై నాలుగేళ్లవుతోంది. నువ్వు వెళ్లిపోయాక ఎన్నోసార్లు జీవితం ఒక శూన్యంలా అనిపించింది. సంతోషకర క్షణాల్లో కూడా తెలియని బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. నువ్వు ఇంకొంతకాలం మాతో ఉంటే బాగుండని చాలాసార్లు అనిపించింది. నీతో కలిసి నేను ఎన్నో పనులు చేయాలనుకున్నాను. కానీ, అంత సమయం లేకపోయింది.మాటల్లో చెప్పలేనుఅన్నిటికంటే బాధాకరమైన విషయమేంటో తెలుసా? చిల్డ్రన్స్ డే రోజే నువ్వు నాకు శాశ్వతంగా దూరమయ్యావు. నిన్ను ప్రతిరోజు మిస్ అవుతున్నాను డాడీ.. మిస్యూ సో మచ్. నిన్ను ఎంత మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను అంటూ తండ్రితో కలిసి దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. సుప్రియ తండ్రి, నిర్మాత, బిజినెస్మెన్ విజయకుమార్ 2021లో క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశాడు.మలయాళ స్టార్తో పెళ్లిసుప్రియ ఒక జర్నలిస్టు. ఈమె.. హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran)ను 2011లో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు సంతానం. పృథ్వీరాజ్ భార్య సుప్రియతో కలిసి పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ బ్యానర్లో 9, డ్రైవింగ్ లైసెన్స్, జనగణమన, కడువ, గురువాయూర్ అంబలనడయిల్ సినిమాలు నిర్మించారు. సినిమాకేజీఎఫ్:2, సలార్ సినిమాలను మలయాళంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న పృథ్వీరాజ్ ప్రస్తుతం #SSMB29 (మహేశ్బాబు -రాజమౌళి కాంబినేషన్) మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Supriya Menon Prithviraj (@supriyamenonprithviraj) చదవండి: నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా? : నటి
న్యూస్ పాడ్కాస్ట్
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు
IND vs SA: చెలరేగిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోరెంతంటే?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అతడికి తోడుగా మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), అక్షర్ పటేల్ రాణించడంతో ప్రొటిస్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.టాస్ గెలిచిన సౌతాఫ్రికాప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 (WTC )సీజన్లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే విజృంభించిబుమ్రా ఆరంభం నుంచే బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23) వికెట్లు తీసి ఆదిలోనే సఫారీలకు షాకిచ్చాడు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. సౌతాఫ్రికా వన్డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ (24)తో పాటు కెప్టెన్ తెంబా బవుమా (3) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోరెంతంటే?ఆ తర్వాత బుమ్రా మరోసారి తన పేస్ పదునుతో టోనీ డి జోర్జి (24)ని బౌల్డ్ చేయగా.. వికెట్ కీపర్ వెరెన్నె (16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సిరాజ్.. మార్కో యాన్సెన్ (0)ను డకౌట్ చేశాడు. ఇక స్పిన్నర్ అక్షర్ పటేల్.. కార్బిన్ బాష్ (3)ను ఎల్బీడబ్ల్యూ చేసి ఒక వికెట్ దక్కించుకోగా.. సైమన్ హార్మర్ (5)ను తొమ్మిదో వికెట్గా బుమ్రా వెనక్కి పంపాడు.ఆ తర్వాత కేశవ్ మహరాజ్ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన బుమ్రా.. ఐదు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేసుకుని... సౌతాఫ్రికా కథను ముగించాడు. తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లలో 159 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు తుది జట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.దక్షిణాఫ్రికా ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్ని (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్చదవండి: IND vs SA: అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే
కోల్కతా వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లతో బరిలోకి దిగింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ ఆటగాళ్లు ఆడడం ఇదే తొలిసారి.యశస్వి జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్ వంటి ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లు ఉన్నారు. టాప్-8లో అయితే ఏకంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఏకంగా ఐదుగురు ఉండడం గమనార్హం.అంతకముందు మూడు సందర్భాల్లో భారత్ ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లతో ఆడింది. కానీ ఆరు మంది ఆడడం ఇదే మొదటి సారి. అయితే హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఆరుగురు అవసరమంటా అంటూ మండిపడుతున్నారు. అందులో నలుగురు స్పిన్నర్లే ఉన్నారు. ఈ మ్యాచ్లో కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే భారత్ ఆడుతోంది.భారత్ అత్యధిక లెఫ్ట్ హ్యాండర్లతో ఆడిన టెస్టులు ఇవే..6 vs సౌతాఫ్రికా-కోల్కతా 20255 vs ఇంగ్లండ్ - మాంచెస్టర్, 20255 vs వెస్టిండీస్- అహ్మదాబాద్, 20255 vs వెస్టిండీస్- ఢిల్లీ, 2025సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత తుది జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు సాయి సుదర్శన్ను జట్టు నుంచి తప్పించడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో సుదర్శన్ విఫలమైనప్పటికి.. స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్లో మాత్రం సత్తాచాటాడు.దీంతో సౌతాఫ్రికా సిరీస్లో కూడా అతడు ఆడడం ఖాయమని అంతా భావించారు. కానీ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతడిని బెంచ్కు పరిమితం చేశాడు. మూడో స్ధానంలో సుదర్శన్కు బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు పంపాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో భారత్ ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లు (జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్)తో బరిలోకి దిగింది.ఈ నేపథ్యంలో గంభీర్పై భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ ఖచ్చితంగా ఆడుతాడని అనుకున్నాను. కానీ అతడిని పక్కన పెట్టారు. ఇప్పుడు నంబర్ 3లో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? వాషింగ్టన్ సుందర్ నంబర్ 3లో ఆడుతాడా? అస్సలు మీ ప్రణాళిక ఎంటో ఆర్ధం కావడం లేదు. నలుగురు స్పిన్నర్లు, కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో ఆడడం ఏంటి? తొలి రోజు బ్యాటింగ్కు కోల్కతా వికెట్ బాగుంది. కాబట్టి నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. కచ్చితంగా నలుగురులో ఎవరో ఒకరు తక్కువ ఓవర్లకే పరిమితమవుతారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ తనకు ఉన్న అప్షన్స్ను ఎలా ఉపయోగిస్తాడో వేచి చూడాలి అని సోనీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా కెప్టెన్ను ఎగతాళి చేసిన బుమ్రా!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. అద్బుతమైన యార్కర్లు, ఇన్స్వింగర్స్తో ప్రోటీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. సౌతాఫ్రికా ఓపెనర్లు రియాన్ రికెల్టన్, ఐడైన్ మార్క్రమ్ ఇద్దరిని బుమ్రా వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు. అయితే ప్రోటీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?13 ఓవర్లో మార్క్రమ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా.. బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆ ఓవర్లో ఆఖరి బంతిని జస్ప్రీత్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని ప్రోటీస్ కెప్టెన్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ బంతి మిస్స్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో బౌలర్తో పాటు భారత ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. బుమ్రా మాత్రం ఖచ్చితంగా వికెట్లకు తాకుతుందన్న నమ్మకంగా కన్పించాడు.అయితే బంతి మరీ ఎత్తులో తాకిందా లేదా అని చర్చించడానికి రిషబ్ పంత్ వద్దకు బుమ్రా వెళ్లాడు. మిగితా ఆటగాళ్లంతా స్టంప్ల దగ్గర గుమిగూడారు. ఇదే విషయాన్ని పంత్ను బుమ్రా అడిగాడు. పంత్ కూడా కొంచెం పైకి వెళ్తుందని సూచించాడు. కెప్టెన్ గిల్ కూడా శుభ్మన్ గిల్ రివ్యూ తీసుకోవడానికి అంతగా సుముఖత చూపలేదు. దీంతో “క్రీజులో ఉన్నది బావుమా” కదా అంటూ బుమ్రా బౌలింగ్ చేసేందుకు తన ఎండ్కు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా ఓ అసభ్య పదాజాలన్ని కూడా వాడాడు. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయింది. కాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ పొట్టిగా ఉంటాడని ఉద్దేశ్యంతో బుమ్రా ఈ కామెంట్స్ చేశాడు. అతడి హైట్ తక్కువగా ఉండడంతో బంతి మరీ ఎత్తులో వెళుతుందేమో అనే డౌట్తో బుమ్రా రివ్యూకు వెళ్లలేదు. బుమ్రా సందేహమే నిజమైంది. రిప్లేలో బంతి స్టంప్స్ మిస్ అవుతున్నట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బుమ్రా ప్రవర్తనపై సీరియస్ అవుతున్నారు. పొట్టిగా ఉన్న బవుమాను బుమ్రా ఎగతాళి చేశాడని, ఇది అస్సలు ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఇది బుమ్రా సరదాగా అన్నాడని, సీరియస్ తీసుకోవాల్సిన అవసరములేదని మద్దతుగా నిలుస్తున్నారు. సాధారణంగా బుమ్రా మైదానంలో చాలా సైలెంట్గా ఉంటాడు. వికెట్ సెలబ్రేషన్స్ కూడా అతిగా చేసుకోడు. ప్రత్యర్ధి బ్యాటర్లను హేళన చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి బుమ్రా ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం తన సహజ ప్రవర్తనకు కాస్త భిన్నంగా బుమ్రా వ్యవహరించాడు.చదవండి: పాకిస్తాన్కు ఐసీసీ భారీ షాక్..pic.twitter.com/TEgjD33KZA— Pulga (@Lap_alt) November 14, 2025
బిజినెస్
హోండా రీకాల్: ఈ బైకులపై ఎఫెక్ట్
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్లోని బిగ్వింగ్ అవుట్లెట్ల ద్వారా విక్రయించే ప్రీమియం CB1000 హార్నెట్ SP కోసం రీకాల్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది?, సమస్య ఏమిటనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఎగ్జాస్ట్ నుంచి వచ్చే వేడి వల్ల సీటు ఉపరితలం మృదువుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో పెడల్ పివోట్ వదులయ్యే అవకాశం ఉందని హోండా చెబుతోంది. ఈ వేడి కారణంగా గేర్ బోల్ట్ వదులైతే.. అది రైడింగ్ చేస్తున్నప్పుడు పడిపోవచ్చు. తద్వారా గేర్లను మార్చేటప్పుడు సమస్య తలెత్తుతుందని కంపెనీ స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది.జనవరి 2026 నుంచి సర్వీస్ఈ సమస్యను పరిష్కరించడానికి.. మోటార్ సైకిల్ వారంటీ స్థితితో సంబంధం లేకుండా, ప్రభావిత భాగాలను కంపెనీ ఉచితంగా చెక్ చేసి భర్తీ చేస్తుంది. రీకాల్ సర్వీస్ జనవరి 2026 నుంచి భారతదేశం అంతటా ఉన్న హోండా బిగ్వింగ్ టాప్లైన్ డీలర్షిప్లలో ప్రారంభమవుతుంది.హోండా మోటార్సైకిల్.. దాని బిగ్వింగ్ డీలర్లతో కలిసి కస్టమర్లకు ఫోన్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ & ఈమెయిల్స్ ద్వారా రీకాల్ గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా బైక్ ఓనర్స్ అధికారిక హోండా వెబ్సైట్లో వారి వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా రీకాల్ సమాచారం తెలుసుకోవచ్చు. సర్వీస్ సెంటర్లలో ఆలస్యం కాకుండా ఉండటానికి కస్టమర్లు అపాయింట్మెంట్లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: ఏరోక్స్-ఈ వచ్చేస్తోంది: 106 కిమీ రేంజ్!హోండా CB1000 హార్నెట్ SP బైక్ 999cc ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ ద్వారా 155 bhp & 107 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, మెరుగైన పనితీరు కోసం ఐదు రైడింగ్ మోడ్లతో వస్తుంది.
నమ్ముకున్న ఉద్యోగులకు అనిల్ అంబానీ వరాలు
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ తొలిసారిగా తమ గ్రూప్లోని రెండు సంస్థల ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ను (ఎసాప్స్) ప్రకటించింది. రిలయన్స్ ఇన్ఫ్రా (ఆర్ఇన్ఫ్రా), రిలయన్స్ పవర్లోని 2,500 మంది ఉద్యోగులకు ఇవి లభిస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది.దీని ప్రకారం రూ. 10 ముఖ విలువ గల షేరును అదే విలువకు ఉద్యోగులకు కేటాయిస్తారు. దీర్ఘకాలంగా, నమ్మకంగా కొనసాగుతున్న చాలా మటుకు ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా నవంబర్ 3న ఎసాప్స్ ప్రతిపాదనకు షేర్హోల్డర్లు ఆమోదం తెలిపినట్లు కంపెనీ వివరించింది. రిలయన్స్ గ్రూప్లో 28,000 మంది ఉద్యోగులు, రూ. 1,07.123 కోట్ల అసెట్స్ ఉన్నాయి.రిలయన్స్ ఇన్ఫ్రా సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో నికర లాభం 50% తగ్గి రూ.1,911 కోట్లకు పడిపోయింది. ఇది ఒక సంవత్సరం క్రితం రూ.4,082 కోట్లుగా ఉంది. ఆదాయం కూడా రూ.7,346 కోట్ల నుంచి రూ.6,309 కోట్లకు తగ్గింది. వృద్ధి కార్యక్రమాల కోసం 600 మిలియన్ డాలర్ల సమీకరణ ప్రణాళికలను కంపెనీ ఇటీవల ప్రకటించింది.రిలయన్స్ పవర్ రెండో త్రైమాసికంలో గణనీయంగా పుంజుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.352 కోట్ల నష్టం నుండి రూ.87 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇబిటా 64శాతం పెరిగి రూ.618 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.634 కోట్ల రుణాన్ని తీర్చేసింది. దాని డెట్-టు-ఈక్విటీ నిష్పత్తిని 0.87 కు తగ్గించుకుంది.రిలయన్స్ గ్రూప్పై నియంత్రణ సంస్థలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈడీ చర్యల తరువాత రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తు చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ ఇటీవల రూ .7,500 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025 విజేతల ప్రకటన
విభిన్న రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన ఆరుగురు పరిశోధకులు, శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ (ISF) ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025’ను ప్రకటించింది. ఆరు వేర్వేరు విభాగాల్లోని సమకాలీన పరిశోధకులు, శాస్త్రవేత్తల విజయాలను గుర్తించి ఏటా ఈ అవార్డును అందజేస్తారు. వీరి ప్రతిభను గౌరవిస్తూ ప్రతి ఒక్కరికీ బంగారు పతకం, ప్రశంసా పత్రం, 1,00,000 డాలర్లు (సుమారు రూ.88 లక్షలు)ఇస్తారు.విజేతలుఫిజికల్ సైన్సెస్: కాల్టెక్లోని కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ ప్రొఫెసర్ కార్తీష్ మంతిరామ్ ఈ బహుమతిని గెలుచుకున్నారు. పునరుత్పాదక విద్యుత్తును ఉపయోగించి స్థిరమైన రసాయన ప్రక్రియలను సృష్టించడంపై ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది.గణిత శాస్త్రం: ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన సవ్యసాచి ముఖర్జీ విజేతగా నిలిచారు. గ్రూప్ డైనమిక్స్, సంక్లిష్ట విశ్లేషణ వంటి గణితంలోని వివిధ రంగాలను అనుసంధానించే ఆయన పరిశోధన, నమూనాలకు గుర్తుగా ఈ గుర్తింపు లభించింది.లైఫ్ సైన్సెస్: బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అంజనా బద్రినారాయణన్ విజేతగా నిలిచారు. జీవన వ్యవస్థలను స్థిరంగా, ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన ప్రక్రియలను అర్థం చేసుకోవడంలో సహాయపడే ఆమె పరిశోధనకు ఈ అవార్డు దక్కింది.ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్: టొరంటో విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ సుశాంత్ సచ్దేవకు ఈ బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్, ఆరోగ్య సంరక్షణ, రవాణా వ్యవస్థల కోసం మెరుగైన అల్గోరిథమ్లను రూపొందించడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్: చికాగో విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రూ ఓలెట్కు ఈ అవార్డు దక్కింది.ఎకనామిక్స్: ఎంఐటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉన్న నిఖిల్ అగర్వాల్ ఈ అవార్డును గెలుచుకున్నారు.విజేతలను ప్రకటించిన సమావేశంలో ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ట్రస్టీ, ఇన్ఫోసిస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ..‘పరిశోధన చేయడానికి ధైర్యం, పట్టుదల, ఊహ అవసరం. ఇది సైన్స్, సమాజం, విలువలు, నైతికతను వారధిగా ఉపయోగించుకుంటుంది. ఆకలి, పేదరికం, మూఢనమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాల్లోని సమస్యలను సైన్స్ మాత్రమే పరిష్కరించగలదు. భారతదేశాన్ని, ప్రపంచాన్ని మెరుగ్గా మార్చడానికి పరిశోధనే ఏకైక మార్గం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఓపెన్ఏఐతో ఫోన్ పే భాగస్వామ్యం
ఓపెన్ఏఐతో ఫోన్ పే భాగస్వామ్యం
భారతదేశంలోని ప్రముఖ ఫిన్టెక్ సంస్థల్లో ఒకటైన ఫోన్ పే జనరేటివ్ ఏఐ (Generative AI) కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఫోన్ పే తన వినియోగదారుల కోసం చాట్ జీపీటీ ఫీచర్లను యాప్లో ఏకీకృతం చేయనుంది. ఫోన్ పే ప్లాట్ఫామ్లో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈమేరకు చర్యలు చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది.ఈ భాగస్వామ్యం ద్వారా చాట్ జీపీటీ అత్యాధునిక సామర్థ్యాలను నేరుగా ఫోన్ పే యాప్, ఫోన్ పే ఫర్ బిజినెస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులోకి తేనున్నారు. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా వినియోగదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేయడం నుంచి షాపింగ్ చేయడం వరకు అనేక రోజువారీ అవసరాలపై ఏఐ సహాయంతో నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సందర్భంగా ఫోన్ పే వ్యవస్థాపకుడు, సీటీఓ రాహుల్ చారి మాట్లాడుతూ..‘వినూత్న కంపెనీల మధ్య సహకారం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడంలో సహాయపడుతుంది. పర్సనలైజ్డ్ సిఫార్సుల నుంచి ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ వరకు ఫోన్ పే పర్యావరణ వ్యవస్థలో చాట్ జీపీటీని ఏకీకృతం చేయడం ద్వారా యూజర్లు మెరుగైన డిజిటల్ సర్వీసులు పొందవచ్చు’ అని చెప్పారు.మోసాల నివారణకు ఫోన్ పే ప్రొటెక్ట్మరోవైపు, మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించడానికి ఫోన్ పే ఇటీవల ఫోన్ పే ప్రొటెక్ట్ అనే కొత్త భద్రతా ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ టూల్ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) డేటాను ఉపయోగించి పనిచేస్తుంది. దీని ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) ఫీచర్ ద్వారా DoT ప్రమాదకరమైనవిగా గుర్తించిన ఫోన్ నంబర్లకు చెల్లింపులను గుర్తించి నిరోధిస్తుంది.హై రిస్క్గా లేబుల్ చేసిన నంబర్లకు చెల్లింపులను ఫోన్ పే స్వయంచాలకంగా బ్లాక్ చేస్తుంది. స్క్రీన్పై హెచ్చరిక సందేశాన్ని చూపుతుంది. మీడియం రిస్క్ నంబర్ల కోసం లావాదేవీని అనుమతించడానికి ముందు వినియోగదారులకు హెచ్చరిక సందేశాన్ని అందిస్తుంది. భద్రతా కారణాల వల్ల లావాదేవీని ఎందుకు నిరోధించారో ఫోన్ పే ప్రొటెక్ట్ వినియోగదారులకు స్పష్టంగా వివరాలు అందిస్తుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ జీవితాన్ని మార్చిన 10 పుస్తకాలు
ఫ్యామిలీ
ఐఏఎస్ అవ్వాలని ఎంతలా ప్రయత్నించాడంటే..! ఏకంగా 12 సార్లు..
పరాజయం అనగానే..ఫెయిల్యూర్స్ అని కాదు..పోరాడుతూ..ఉండేవాళ్లని. గెలుపు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గొప్ప యోధులు కూడా. ఎప్పుడు విజేతల విజయాలనే సెలబ్రేట్ చేసుకోవడం క, స్ఫూర్తిగా తీసుకోవడమే కాదు. ఓటమిని ఓర్చుకుంటూ సాగుతున్న పరాజితులు కూడా అంతకుమించిన మహామహులే. గెలుపు.. పొగరుని, అహంకారాన్ని అందిస్తే..ఓటమి ఓర్పు విలును నేర్పిస్తుంది. కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడం ఏంటో తెలియజేస్తుంది. నిద్దురలో సైతం భయపెట్టించే ఓటమని ఒడిసిపట్టి గెలుపు శిఖరాన్ని అందుకోవడం కోసం తపించే పట్టువదలని విక్రమార్కులు. వాళ్ల అనుభవం విజేతలకు మించిన గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఎప్పుడూ సక్సెస్ని అందుకున్నవాళ్లని కాదు..విజయంకోసం ఆరాటపడుతూ..వెన్ను చూపకుండా చివ్వరి వరకు పోరాటం చేసే పరాజితులను కూడా అభినందిద్దాం, ప్రేరణగా తీసుకుందాం.! వాట్ ఇదేంటి అని అనుకోకండి..చక చక స్టోరీలోకి వెళ్లిపోదాం..ఇంతవరకు సివిల్ సర్వీసెస్లలో గెలుపొందిన ఐఏఎస్ అధికారుల విజయ ప్రస్థానాన్ని అభినందించాం, స్ఫూర్తిగా తీసుకున్నాం. ఈ సారి ఐఏఎస్ కోసం చివ్వరి వరకు పోరాడి..లెక్కలేనన్ని ఓటములు చవి చూసినా..తన కథ కూడా మరొకరికి స్ఫూర్తిగా మారుతుందని చిరునవ్వుతో చెబుతున్న కునాల్ విరుల్కర్ ఫెయిల్యూర్ స్టోరీ ఏంటో చూద్దామా..!.మొత్తం 12 ఏళ్లు యూపీఎస్సీకి తన లైఫ్ని అంకితం చేశాడు. ఒకటి, రెండు కాదు 12 సార్లు విఫలం. అయినా తనకు దొరికిన ప్రతి ఛాన్స్ని మిస్ చేయలేదు. గెలుపు తీరం అందుకునేదాక పోరాడేందుకు సంకల్పించిన అతడి తీరు ప్రశంసనీయం. సరిగ్గా 2012లో తొలి ప్రయత్నంలో ప్రిలిమినరీ పరీక్షలో తడబడ్డాడు. పోనీలే అని 2013లో మరోసారి ట్రై చేశాడు. ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసినా, మెయిన్స్లో ఓటమి తప్పలేదు. ఇదే పరిస్థితి 2014లో కూడా పునరావృతమైంది. 2015లో ఎట్టకేలకు మెయిన్స్ కూడా క్లియర్ చేశాడు. రెండింటిని దాటుకుని వచ్చినా ఇంటర్వ్యూలో ఓటమి పలకరించింది. పరాజయానికి కారణాన్ని విశ్లేషిస్తుండగా..52 మార్కుల తేడాతో ఇంటర్వ్యూని కోల్పోయానని తెలుసుకుని మరింత గట్టిగా ప్రయత్నించాడు. కానీ అప్పటికే నైరాశ్యం మనసుని కమ్మేయడంతో 2016, 2017 ప్రిలిమ్స్ చేధించలేక..మళ్లీ యథావిధిగా జీరో పొజిషన్కి చేరిపోయాడు. ఇక లాభం లేదనుకుని మరింత కసితో 2018లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్, రెండింటిని క్లియర్ చేసి.. నూతనోత్సాహంతో ఇంటర్వ్యూ దశకి చేరాడు. అయితే ఈసారి చవిచూసిన ఓటమి కంటిమీద కునుకప్టటనీయకుండా చేసింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో గెలుపు కనుచూప మేరలో కూడా లేదు, ఈసారి సక్సెస్కి ఒక్కడుగు దూరంలో సివిల్ సర్వీస్ అధికారిని అవ్వలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అయినా అంత బాధను ఓర్చుకుంటూ..ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అలా 2023 వరకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండటం విశేషం. ఇంతలా ఓటమి తనను మట్టికరిపించినా..ఏ మాత్రం నైరాశ్యానికి తావివ్వలేదు..జీవితం అంటేనే పోరాటం అంటూ అజేయమైన సంకల్పంతో ముందుకుపోతున్నాడు. అంతేగాదు..తాను సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పొందిన అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సోషల్ మీడియా వేదికగా తన పరాజయాల పరంపరను పంచుకున్నాడు. అది కూడా ఏడుస్తూ కాదు..సగర్వంగా కాన్ఫిడెంట్గా తాను చేసిన పోరాటాన్ని చెబుతుంటే..ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి, మనసు మెలిపెట్టేలా భావోద్వేగం చెదేలా చేసింది. ఇంతలా ఓటమి నీడలా వెంటాడుతున్నా..అంతలా స్థైర్యంగా చిరునవ్వుతూ ఉండటం అందరికీ సాధ్యం అయ్యే పనికాదు అంటూ నెటిజన్లు అభినందించారు. అంతేగాదు ఓటమిని అధిగమించి..లైఫ్ని ధైర్యంగా లీడ్ చేయడం ఎలా అనే విషయంలో గొప్ప మార్గదర్శకులు మీరే అని కునాల్ని అభినందించారు. ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయినా కునాల్ టీచర్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ..ఔత్సాహిక సివిల్ సర్వీస్ అభ్యర్థులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. కునాల్ స్టోరీలో..ఓటమి పదే పదే పలకరించినా..పట్టువదలని విక్రమార్కుడిలా చేసినా అతడి ప్రయత్నాన్నికి కచ్చితంగా సెల్యూట్ చెప్పాల్సిందే కదూ..!. 12 attempt 7 main5 interview NO SELECTION.शायद जिंदगी का दूसरा नाम ही संघर्ष हैं ।#UPSC #यूपीएससी pic.twitter.com/FEil9NGJ5l— Kunal R. Virulkar (@kunalrv) April 16, 2024(చదవండి: Bhavya Narasimhamurthy on: అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!)
అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!
పాలన, రక్షణ రంగాలను వారధిగా చేసుకుని దేశ సేవ చేయాలనే ఆమె ద్వంద్వ వైఖరి అందరికి స్ఫూర్తిదాయకం. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, దేశానికే గర్వకారణం కూడా. సింపుల్గా చెప్పాలంటే బహువిధ మార్గాల్లో దేశానికి సేవ చేయడం అంటే ఏంటో యువతకు ప్రేరణని ఇచ్చారామె. మరి ఇలా రెండు రకాలుగా దేశానికి సేవలందిస్తున్న ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందామా.కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగిన భవ్య నరసింహమూర్తి(Bhavya Narasimhamurty) గతేడాది టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఇటీవట గత మూడు నెలలుగా డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ప్రతి ఏడాది ఒక నిర్దిష్ట కాలానికి లెఫ్టినెంట్ హోదాలో భారత సైన్యంలో సేవలందిస్తూనే ఉంటారామె. అంతేగాదు భవ్య దక్షిణ భారతదేశం నుంచి మొదటి మహిళా టెరిటోరియల్ ఆర్మీ (TA) అధికారిగా ఘనత సృష్టించింది. ఇది నిజంగా భారత సైనిక చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి. రాజకీయ ప్రస్థానం..భవ్య నరసింహమూర్తి 2020లో అధికారికంగా భారత జాతీయ కాంగ్రెస్ (INC)లో చేరారు. ఆ తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రతినిధిగా , టెలివిజన్ చర్చలలో సుపరిచితమైన వ్యక్తిగా మారింది. పార్టీ విధానాలను ఉద్రేకంతో సమర్థిస్తూ, ప్రతిపక్షాలను విమర్శించేది. ఆమె స్పష్టమైన వాదనలు సామాజిక సమస్యలపై లోతైన అవగాహన తదితరాలు భవ్యను కర్ణాటక రాజకీయ రంగంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. అలా ఆమెను 2023లో AICC సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ల జాతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ పదవి ఆమెకు డిజిటల్ కమ్యూనికేషన్లో తనకున్న నైపుణ్యంతో పార్టీ ఆన్లైన్ ఉనికిని రూపొందించి ఓటర్లతో సన్నిహితంగా ఉండటానికి, అలాగే ప్రగతిశీల భారతదేశం కోసం కాంగ్రెస్ దార్శనికతను ప్రోత్సహించడానికి వీలు కల్పించింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో, భవ్య రాజాజీనగర్ నియోజకవర్గం టికెట్ కోసం బలమైన పోటీదారుగా నిలిచింది.అలా ఆర్మీవైపు అడుగులు..ఆమె 2022లో కఠినమైన టెరిటోరియల్ ఆర్మీ (TA) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఆ ఏడాది ఎంపికైన ఏకైక మహిళా అభ్యర్థిగా భవ్య నిలిచింది. మే 2024లో, ఆమెను ఇండో-పాక్ నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని ఆర్మీ యూనిట్కు నియమించారు. అక్కడ ఆమె ఇంటెన్సివ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, లెఫ్టినెంట్గా నియమితురాలైంది. రాజకీయాల నుంచి సైన్యంలోకి ఆమె తీసుకున్న యూటర్న్.. జాతీయ సేవపట్ల తనకున్న బహుముఖ నిబద్దతను తెలియజేస్తోంది. ఇలా పౌరులు తమ వృత్తిపరమైన కెరీర్ల తోపాటు ఆర్మీలో సేవ చేయడానికి వీలు కల్పించే టెరిటోరియల్ ఆర్మీ,భారతదేశ రక్షణకు తోడ్పడటానికి భవ్యకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. ఇలా టెరిటోరియల్ ఆర్మీ ఆపీసర్గా క్రికెటర్ ఎంఎస్ ధోని, రాజకీయ నాయకుడు సచిన్ పైలట్ వంటి ప్రముఖ వ్యక్తులు ఎందరో భాగమయ్యారు. కానీ దక్షిణ భారతదేశం నుంచి తొలి మహిళగా భవ్య సాధించిన విజయం సైన్యంలో చేరాలనుకునే ఎందరో ఔత్సాహిక మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది. ఇక భవ్య నరసింహమూర్తి కూడా సోషల్ మీడియా ఎక్స్లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ.."ఈ ఆర్మీ శిక్షణ చాలా సవాలుతో కూడుకున్నది, పైగా గొప్ప అసాధారణ అనుభవాన్ని అందించింది. ముఖ్యంగా నా శారీరక బలాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది." అని భవ్య పోస్ట్లో రాసుకొచ్చారామె. అంతేగాదు తాను భారత సైన్యంలో అధికారిగా, అలాగే రాజకీయ నాయకురాలిగా నా మాతృభూమికి సేవ చేయగలిగే అద్భుతమైన అవకాశాన్ని అందించిన ఆ భగవంతుడుకి సదా కృతజ్ఞతలు అని పోస్ట్ని ముగించిందామె. Late post After my selection as a Lieutenant in Territorial Army of Indian Army, every year I serve in Indian army for a short period. This year with your love and blessings I successfully completed 3 months training at the prestigious Indian Military Academy Dehradun, now I am… pic.twitter.com/Qs0fB2zlLG— Bhavya Narasimhamurthy (@Bhavyanmurthy) November 4, 2025 (చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ)
లక్ష్మీదేవికి కమలం ఎందుకు ప్రీతికరం?
సిరిసంపదలకు అధిదేవత అయిన అమ్మవారిని వర్ణించే ప్రతి చిత్రంలోనూ లేదా విగ్రహంలోనూ కమలం తప్పక ఉంటుంది. ఆమె కమలంపై కూర్చుని ఉండటం చేతిలో కమలం ధరించి ఉండటం మనం చూస్తాం. దీని వెనుక పురాణ గాథలు, ఆధ్యాత్మిక కారణాలు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవి సముద్ర మథనం సమయంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించింది. ఆ సమయంలో ఆమె చేతిలో కమలంతో వచ్చింది. అందుకే ఆమెను ‘క్షీర సాగర కన్య’ అని, అలాగే కమలంతో ముడిపడి ఉంది కాబట్టి ‘పద్మ’ ‘కమల’ ‘పద్మప్రియ’ వంటి పేర్లతో పిలుస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే కమలం అనేది పరిశుభ్రతకు. వైరాగ్యానికి గొప్ప చిహ్నం. కమలం ఎల్లప్పుడూ బురద నీటిలో లేదా మురికి కొలనులో పెరుగుతుంది. కానీ ఆ బురదలోని ఒక్క అణువు కూడా కమలాన్ని అంటకుండా అది అత్యంత స్వచ్ఛంగా నిర్మలంగా వికసిస్తుంది. ఈ లక్షణమే కమలాన్ని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మార్చింది.ఇక్కడ దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే. సంపద, ధనం అనేది ‘బురద’ వంటి ఈ లోక వ్యవహారాల మధ్యే ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించే భక్తులు సంపదను పొందినప్పటికీ, ఆ ధనమదం లేదా లోక కష్టాల ప్రభావం తమపై పడకూడదు. కమలంలాగే, ఈ ప్రపంచంలో ఉన్నా, దానికి అంటకుండా పరిశుద్ధంగా, నిర్లిప్తంగా జీవించాలి. ధనాన్ని కేవలం జీవితానికి ఒక సాధనంగా మాత్రమే చూడాలి, దానిలో మునిగిపోకూడదు. కమలంపై కూర్చునే లక్ష్మీదేవి ‘‘నీ సంపదను ధర్మ మార్గంలో ఉంచు, దానిపై వ్యామోహం పెంచుకోకు’’ అని పరోక్షంగా చెబుతుంది. అందుకే ఆధ్యాత్మిక సంపద మరియు భౌతిక సంపద రెండింటికి చిహ్నంగా కమలం ఆమెతో నిరంతరం ఉంటుంది. (చదవండి: Kalabhairava Swamy Temple: నమోస్తు కాలభైరవా!)
నమోస్తు కాలభైరవా!
‘కాలుడు’ అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమగల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. ఈ పేరును స్వయంగా శివుడే తన కుమారునికి పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. అందుకే నిత్యం అశేష భక్తుల తాకిడితో ఇసన్నపల్లి (రామారెడ్డి) శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. నవంబర్ 9, ఆదివారం కార్తీక బహుళ పంచమి నుంచి 13, గురువారం బహుళ నవమి వరకు కాలభైరవస్వామి జన్మదిన వేడుకల సందర్భంగా... కామారెడ్డి జిల్లా ఎన్నో ప్రాచీన దేవాలయాలకు ప్రసిద్ధిగాంచింది. రాష్ట్ర రాజధాని నుంచి నాగ్పూర్ వెళ్లే ఎన్హెచ్–44 జాతీయ రహదారి పై కామారెడ్డి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మరో 10 కిలోమీటర్ల దూరంలో ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామం ఉంటుంది. వందల యేళ్ల క్రితం ఇక్కడ వెలసిన శ్రీ కాలభైరవస్వామి దర్శనానికి నిత్యం వేలసంఖ్యలో జనం వస్తుంటారు. దిగంబరునిగా ఎందుకున్నాడంటే..? ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. స్వామివారి మూలవిగ్రహం ఎప్పుడు వెలిసిందో కచ్చితంగా చెప్పే ఆధారాలు లభ్యం కాలేదు. క్రీ.శ 13వ శతాబ్దంలో జైనమతం బాగా వ్యాప్తి చెందిన సమయంలో ఆలయం నిర్మించి ఉంటారని కొందరు చెబుతుంటారు. అందుకే దిగంబరునిగా దర్శనమిస్తాడని కొందరి భావన. కానీ ఇసన్ననపల్లి–రామారెడ్డి గ్రామాలు క్రీ.శ 1550–1600 సంవత్సరాల మధ్య కాలంలో దోమకొండ సంస్థానాధీశుల పరి΄ాలనను నిర్మించబడినట్లు స్పష్టమైన ఆధారాలు కనబడుతున్న కారణంగా జైనవిగ్రహం అనడానికి వీలులేదు. పురాణేతిహాసాల్లోనూ శ్రీ కాలభైరవుడిని దిగంబరుడిగానే పేర్కొనడం జరుగుతుంది. స్థలపురాణంఇసన్నపల్లి గ్రామం ప్రారంభంలోనే శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఉంటుంది. అష్టదిక్కులలో రామారెడ్డి గ్రామానికి అష్టభైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడు గ్రామాన్ని రక్షిస్తుంటారని నానుడి. ఈ అష్టభైరవులలో ప్రధానుడు శ్రీ కాలభైరవస్వామి. మిగతా ఏడు భైరవ విగ్రహాలు కాలప్రవాహంలో కనుమరుగై΄ోయాయి. గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో కాశిపల్లి అనే చోట విశ్వేశ్వరుని ఆలయం, దానికి ముందుభాగంలో గ్రామం వైపు చూస్తున్న భైరవ విగ్రహం కూడా ఉన్నాయి. ఇలా రామారెడ్డి గ్రామం చుట్టు కాశీ (కాశిపల్లి), రామేశ్వరం (రామేశుని కుంట) ఇలాంటి పుణ్యక్షేత్రాల పేర్లతో శివాలయాలు, భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ కాలభైరవస్వామి తన తండ్రి పేరిట ఈశాన్య దిక్కునే ఉంచుకుని నిరంతరం గ్రామాన్ని, భక్తులనూ రక్షిస్తు ఉంటాడని చెబుతున్నారు. ఇక్కడి పుష్కరిణిని అమృతమయమైన నీళ్లను అందించే అక్షయ పాత్రగా భావిస్తారు. ఎన్ని నీళ్లు తోడుకున్నా తరిగిపోని జలసంపద ఈ పుష్కరిణి ప్రత్యేకత.ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసే వారికి అన్నిరకాల వ్యాధులు, భూతప్రేత పిశాచ బాధలు తొలగి΄ోతాయని నమ్మకం. నిత్యపూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి యేడాది వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తికంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలోనూ ఒకరోజంతా సంతతాభిషేకం, విశేషపూజలు నిర్వహిస్తారు. ఆదివారం మొదలైన జయంతి వేడుకలు నేడు దక్షయజ్ఞం, ఆరున్నర నుంచి 8 గంటల వరకు పూర్ణాహుతితో ముగుస్తాయి. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి,
ఫొటోలు
అక్షర్ పటేల్ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)
సిద్ధార్థ్ సతీమణి ఆదితి రావు హైదరీకి అరుదైన అవార్డ్ (ఫొటోలు)
కాంగ్రెస్ ఘన విజయం.. గాంధీభవన్లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు (ఫొటోలు)
జూబ్లీహిల్స్లో కొనసాగుతున్న కౌంటింగ్.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)
ఫ్రెషర్స్ డే పార్టీ.. అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)
బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)
భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
SSMB29 లోకేషన్కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
అంతర్జాతీయం
షట్డౌన్కు తెర
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43 రోజులపాటు కొనసాగిన షట్డౌన్ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ నిధుల బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యుల కష్టాలకు తెరపడింది. షట్డౌన్కు ముగింపు పలికే గవర్నర్మెంట్ ఫండింగ్ బిల్లు సోమవారం సెనేట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అనంతరం అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు అనుకూలంగా 222, వ్యతిరేకంగా 209 ఓట్లు వచ్చాయి. అధికార రపబ్లికన్ పార్టీ సభ్యులు మద్దతు ఇవ్వగా, విపక్ష డెమొక్రాట్లు బిల్లులోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వ్యతిరేకంగా ఓటువేశారు. అయినప్పటికీ సభలో అధికార పార్టీకి మెజార్టీ ఉండడంతో బిల్లు గట్టెక్కింది. అనంతరం గంటల వ్యవధిలోనే అధ్యక్షుడి ఆమోదం కోసం బిల్లును పంపించడం, ఆయన సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. #BREAKING: U.S. House votes to end government shutdown, 222-209. Goes now to the president. pic.twitter.com/LPySa48qUZ— CSPAN (@cspan) November 13, 2025దోపిడీకి అమెరికా లొంగదు: ట్రంప్ షట్డౌన్ కారణంగా ఉద్యోగులకు ఇన్నాళ్లూ వేతనాలు ఆగిపోయాయి. ఆఖరికి ఎయిర్పోర్టుల్లో విమానాల రాకపోకలపైనా భారీ ప్రభావం పడింది. ఆహారం కోసం ఫుడ్ బ్యాంకుల ఎదుట జనం బారులు తీరాల్సి వచి్చంది. షట్డౌన్ ఆగిపోవడంతో ఆ కష్టాలకు ఇక తెరపడినట్లే. ప్రజల కష్టాలకు డెమొక్రాట్లే కారణమని డొనాల్డ్ ట్రంప్ నిందించారు. వచ్చే ఏడాది జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయం మర్చిపోవద్దని కోరారు. విపక్ష సభ్యులు చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. అమెరికా ఎప్పటికీ దోపిడీకి లొంగిపోదన్న సందేశాన్ని పంపిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికన్లకు రాయితీపై చౌకగా వైద్య సేవలందించే అంశంపై అధికార, విపక్షాల మధ్య మొదలైన ప్రతిష్టంభన చివరకు షట్డౌన్కు దారితీసింది. ఈ రాయితీ ఈ ఏడాది ఆఖర్లో ముగిసిపోనుండగా, దాన్ని ఇంకా పొడిగించాలని డెమొక్రటిక్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ట్రంప్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 1న షట్డౌన్ మొదలైంది. అత్యవసరం కాని సాధారణ ప్రభుత్వ సేవలకు నిధుల విడుదల ఆగిపోయింది. విపక్షాలను దారికి తీసుకురావడానికి కొందరు ఉద్యోగులను ట్రంప్ బలవంతంగా తొలగించారు. ప్రభుత్వ నిధుల బిల్లు ప్రకారం.. తొలగింపుకు గురైన ఉద్యోగులను మళ్లీ విధుల్లో చేర్చుకుంటారు. ప్రభుత్వ సేవలకు యథావిధిగా నిధులు విడుదల చేస్తారు. మరోవైపు రాయితీపై ఆరోగ్య సేవలను కొనసాగించడంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై త్వరలో చర్చలు జరుగనున్నాయి.
నెతన్యాహును క్షమించండి.. ట్రంప్ లేఖ
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును క్షమించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నెతన్యాహుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోర్టుల్లో విచారణ జరుగుతోంది. దోషిగా తేలితే పదవి నుంచి తప్పుకోవాల్సిందే.ఈ నేపథ్యంలో నెతన్యాహుకు మద్దతుగా ట్రంప్ లేఖ రాయడం గమనార్హం. నెతన్యాహుపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ పేర్కొన్నారు. ఆయనను విచారించడం న్యాయ సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ను శాంతి మార్గంలో నడిపిస్తున్నారంటూ నెతన్యాహును ప్రశంసించారు. మరోవైపు ఇజ్రాయెల్ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ పెత్తనం పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ గత నెలలో ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించారు. అప్పుడు కూడా నెతన్యాహును వెనకేసుకొచ్చారు. ఆయనను పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు.
భూటాన్ అభివృద్ధికి సహకరిస్తాం
థింపూ: భూటాన్ సర్వతోముఖాభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భూటాన్ 13వ పంచవర్ష(2024–2029) ప్రణాళికకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోదీ భూటాన్ పర్యటన రెండో రోజు బుధవారం కూడా కొనసాగింది. మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్తో ఆయన సమావేశమయ్యారు. భారత్, భూటాన్ సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఇంధనం, వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, అనుసంధానం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. భారత్–భూటాన్ సంబంధాల బలోపేతానికి జిగ్మే సింగ్యే వాంగ్చుక్ ఎంతగానో కృషి చేశారని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ(తూర్పునకు ప్రాధాన్యం)లో భాగంగా భూటాన్లో చేపట్టిన గెలెఫూ మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్టులో ప్రగతి పట్ల మోదీ సంతోషం వ్యక్తంచేశారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళిక అమలుకు రూ.10,000 కోట్ల సాయం అందిస్తామని భారత్ ఇప్పటికే హామీ ఇచ్చింది. కాలచక్ర వేడుకలో మోదీ భూటాన్లో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రార్థన పండుగలో భాగంగా కాలచక్ర ఎంపవర్మెంట్ వేడుకను ప్రధాని మోదీ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో కలిసి కాలచక్ర ‘వీల్ ఆఫ్ టైమ్ ఎంపవర్మెంట్’ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఇదొక గొప్ప వేడుక అని తెలిపారు. కాలచక్రకు బౌద్ధమతంలో అత్యున్నత సాంస్కృతిక ప్రాధాన్యం ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి పండితులు, గురువులు, భక్తులు హాజరయ్యారని వెల్లడించారు. భారత ప్రధాని మోదీ ‘అనుకున్నది సాధించిన ఆధ్యాతి్మక గురువు’ అని భూటాన్ ప్రధానమంత్రి త్సెరింగ్ టాబ్గే అభివరి్ణంచారు. మోదీ బుధవారం భూటాన్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. తన పర్యటనతో భారత్–భూటాన్ మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వేగం మరింత పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. కాలచక్ర అంటే? ఇదొక ఆధ్యాత్మిక వేడుక. బౌద్ధులు పరమ పవిత్రంగా భావిస్తారు. భగవంతుడి ఆశీస్సుల కోసం కాలచక్ర నిర్వహిస్తారు. గౌతమబుద్ధుడి మార్గంలో నడస్తూ జ్ఞానోదయం పొందడానికి ప్రార్థనలు, ధ్యానం నిర్వహిస్తారు. మత గురువుల బోధనలు ఉంటాయి. భూటాన్ ప్రభుత్వం అధికారికంగా కాలచక్ర ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
పుడమి పొర చిరిగిపోతోందా?
వాషింగ్టన్: ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ఖండాలుగా విడిపోయిన భూఉపరితం కొన్ని కోట్ల సంవత్సరాలక్రితం ఒకే అఖండ గోండ్వానా ఉండేదని పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడీ ఖండాలు నెమ్మదిగా మరింత దూరంగా వెళ్తున్నా యనే సిద్ధాంతమూ వింటున్నాం. అయితే ఈ ఖండాలు దూరంగా జరిగే క్రమంలో కేవలం ఉపరితల భూమి మాత్రమే చీలిపోవడంలేదని మహాసముద్రాల అడుగుల వందల కిలోమీటర్ల లోతులోనూ భూమి పొర చీలిపోతోందని తాజా అధ్యయనంలో తేలింది. దూరంగా జరిగినంత మాత్రాన మనకొచ్చే నష్టమేమీ లేదని అనుకో కూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఖండాల భూగర్భ పొర చీలిపోవడంతో దాని అడుగున ఉన్న శిలాద్రవ మ్యాంటిల్ పొర నుంచి భడభాగ్ని లాంటి శిలాద్రవం బయటకు ఎగజిమ్మే ఆస్కార ముంది. దీంతో కొత్తగా లెక్కలేనని అగ్నిపర్వ తాలు పుట్టుకొచ్చే ప్రమాదముందని భూభౌగో ళిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త అగ్ని పర్వ తాలు కోట్ల ఏళ్లపాటు అలాగే శిలాద్రవం, మాగ్మాను ఎగజిమ్మే పెనుముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో స్పష్టమైంది. సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘నేచర్ జియోసైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా వేర్వేరు భూఫలకాలకొనలు పరస్ప రం ఢీకొనడం, రాపిడి సందర్భాల్లోనే అగ్ని పర్వ తాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు కొత్తగా సముద్ర గర్భంలోనూ అగ్నిపర్వతాలు ఏర్పడి కోట్ల సంవత్సరాలపాటు అవి అలాగే క్రియాశీలకంగా ఉండిపోయే ప్రమాదం ఉందని అధ్యయనకారులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలోని సౌతాంప్టన్ విశ్వ విద్యాలయం, పోట్స్డామ్లోని జీఎఫ్జెడ్ హెల్మ్ హోట్జ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్, పోట్స్డ్యామ్ యూనివర్సిటీ, కెనడాలోని క్వీన్స్ విశ్వవిద్యా లయం, స్వాన్సియా యూనివర్సిటీలోని పరిశో ధకుల బృందం సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టింది. కంప్యూటర్ స్టిములేషన్ విధానంలో ఖండాల చీలిక కారణంగా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జరగబోయే విపరిణామాలను వీళ్లు విశ్లేషించగలిగారు.
జాతీయం
ఇది ముమ్మాటికీ ఆయన విక్టరీనే!
‘‘నితీశ్ కుమార్కు వయసు పైబడిపోయింది. ఆయన ఆరోగ్యమూ బాగోలేదు. ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జనాల్లో తిరిగే ఓపిక ఆయనకు ఉండడం లేదు. ఇక ఆయనకు విశ్రాంతి అవసరం. పైగా ఆయనకు అధికారంపైనే తప్ప ప్రజలపై మమకారం లేదు. బిహార్కు ఇప్పుడు కొత్త తరహా ఆలోచనలు అవసరం.’’.. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వినిపించిన విమర్శలు ఇవి. అయితే ఆ విమర్శలకు ఆయన గ్రాండ్ విక్టరీతోనే చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చారు. నితీశ్ పాలనతో బిహారీలు విసిగిపోయారని.. అందుకే ఆయన్ని తప్పించాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ వేరుగా ర్యాలీలు నిర్వహించమే అందుకు నిదర్శనమని.. రాజకీయ ప్రచారం విస్తృతంగా సాగింది ఎన్నికల ప్రచారం సమయంలో. అయితే ఇలాంటి ప్రచారాలను, తనపై వచ్చిన విమర్శలను నితీశ్ కుమార్ ఏనాడూ తిప్పి కొట్టింది లేదు. అయితే.. 74 ఏళ్ల వయసులో ప్రచారంలో చురుకుగా పాల్గొనడం ద్వారా హుందాగా ఆయన వాళ్ల నోళ్లు మూయించారు. టైగర్ అబీ జిందా హై(పులి పని ఇంకా అయిపోలేదు).. తనను తక్కువ అంచనా వేయొద్దంటూ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ వచ్చారు. అంతేకాదు.. ప్రజలే నిజమైన తీర్పు ఇస్తారంటూ ఓ వ్యాఖ్య చేశారు. అదే సమయంలో.. బీజేపీ వ్యవహారంలోనూ ఆయన ట్రిగ్ అయిన దాఖలాలు కనిపించలేదు. అందుకు కారణం లేకపోలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన సీట్లు 43. బీజేపీ కంటే 31 సీట్లు తక్కువే. అయినప్పటికీ ప్రాంతీయత, అనుభవం పేరిట నితీశ్కుమార్కే సీఎం పగ్గాలు అప్పగించింది బీజేపీ. ఆ తర్వాత బీజేపీకి కటీఫ్ చెప్పినా.. మళ్లీ కొంతకాలానికి జట్టు కట్టి సీఎం అయ్యారు. ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీతో ఆయన స్నేహపూర్వకంగా మెదులుతూ వచ్చారు. బీజేపీ చివరిదాకా నితీశ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించపోయినా ఆయన నొచ్చుకోలేదు. ఈలోపు.. ఇటు బిహార్ ఓటర్లు మహాఘట్ బంధన్లో కీచులాటను సునిశితంగా గమనించారు. చివరకు సుదీర్ఘ నాయకత్వాన్ని గౌరవమిస్తూ ‘సుశాసన్ బాబు’కే ఓటు వేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 80 సీట్లు గెల్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు డబుల్ ఫలితం. తద్వారా పదో సారి ముఖ్యమంత్రిగా నితీశ్కుమార్ ప్రమాణం చేయబోతున్నారు. అయితే.. JD(U) విజయానికి నితీశ్ కుమార్ తిప్పిన రాజకీయ చక్రం ప్రధాన శక్తిగా ఉన్నా.. పార్టీకి చెందిన ఇతర నేతలు, ఎన్డీయే భాగస్వాములు, సామాజిక సమీకరణలు, యువతకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడా విజయానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు.
Bihar Election: ఎన్డీఏని నిలబెడుతున్న ‘చిరాగ్’
పట్నా: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)కి ప్రోత్సాహాన్నిచ్చే విధంగా, చిరాగ్ పాశ్వాన్కి చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. పాశ్వాన్ పార్టీ పోటీ చేసిన 28 సీట్లలో, 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు ఎన్డీఏకి బలమైన సహకార పార్టీలలో ఒకటిగా నిలిచింది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తాజా ట్రెండ్లలో అధికార ఎప్డీఏ 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ చాలా వరకూ వెనుకబడి ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 82 సీట్లలో ఆధిక్యంతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుండగా, దాని కీలక మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 81 సీట్లలో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఎఎం) సహా ఇతర ఎన్డిఎ భాగస్వాములు వరుసగా ఒకటి, నాలుగు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారం బీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండు దశల ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు 38 జిల్లాల్లోని 46 కేంద్రాలలో ప్రారంభమైంది. నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో 243 సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 67.13 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ హావా.. నిజమైన అమిత్ షా జోస్యం?
బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి దుమ్మురేపుతోంది. 180కి పైగా సీట్లలో అధిక్యం సంపాదించి భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాషాయ కూటమికి పట్టం కట్టినా ఇంత భారీ స్థాయిలో మెజారిటీ వస్తుందని ఎవరూ చెప్పలేదు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం ఎన్డీఏ కూటమి తప్పకుండా 160కి పైగా సీట్లు వస్తాయని, మూడింట రెండో వంతు మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిహార్ ఎన్నికలు ఫలితాలు విడుదలవుతున్నాయి. ఫలితాలలో అధికార ఎన్డీఏ కూటమి హావా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 180పైగా సీట్లలో కాషాయకూటమి అధిక్యం కనబరుస్తోంది. మహాగఠ్ భందన్ 50 కిపైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు చూస్తుంటే బిహార్ లో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపుగా ఖాయమైనట్లే. అయితే బిహార్ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంతగానో శ్రమించింది. కాంగ్రెస్ అగ్రనేత బిహార్ ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా తన భూజాలపైన వేసుకొని రాష్టమంతా కలియతిరిగారు. ఎన్నికల కమిషన్ ఓట్లు దొంగలిస్తుందని గతంలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఇలానే జరిగిందంటూ ప్రచారం చేశారు. ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సైతం ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని బిహార్ ని అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. అయినప్పటికీ బిహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తుంది.కాగా కేంద్రం హోం మంత్రి అమిత్ షా మెుదటినుంచి ఎన్డీఏ కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయన్నారు. "బిహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు. ఇది పాండవుల యుద్ధం ఐదు పార్టీల సంకీర్ణం( జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ, హెచ్ ఏ మ్, ఆర్ఎల్ఎమ్) కలిసికట్టుగా పోరాడుతున్నాం" అని అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు.
పార్టీల వారీగా ఫలితాలు ఇలా..
దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అధికార ఎన్డీఏ కూటమి జయభేరి మోగించింది. డబుల్ సెంచరీతో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేసేలా జయ కేతనం ఎగుర వేసింది. మహాగఠ్బంధన్ ఊహించని విధంగా ఘోర పరాజయం చవిచూసింది.ఎన్డీఏ కూటమి 203 స్థానాల్లో విజయం సాధించగా, మహాగఠ్బంధన్ 34 స్థానాలకు పరిమితమైంది. ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని జన్ సురాజ్పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం తన 5 స్థానాలను నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి విజయం సాధించడం విశేషం. యువనేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నాయకత్వంలోని లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ(ఆర్వీ) 28 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాగా, చిరాగ్ పాశ్వాన్కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశముందని వార్తలు వ స్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం పార్టీల వారీగా ఫలితాలు ఇలా.. పార్టీ ఆధిక్యం1 భారతీయ జనతా పార్టీ -బీజేపీ912జనతాదళ్ (యునైటెడ్)- జేడీయూ833రాష్ట్రీయ జనతాదళ్- ఆర్జేడీ254లోక్ జనశక్తి (రామ్ విలాస్)195ఇండియన్ నేషనల్ కాంగ్రెస్66 ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 57 హిందుస్థానీ అవామ్ మోర్చా- హెచ్ఏఎంఎస్ 58రాష్ట్రీయ లోక్ మోర్చా- ఆర్ఎస్హెచ్టీఎల్కేఎం49సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్310కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)111బహుజన సమాజ్ పార్టీ- బీఎస్పీ1 Total243
ఎన్ఆర్ఐ
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)
క్రైమ్
Hyderabad: అశ్లీల ఫొటోలు పంపి మహిళకు వేధింపులు
హైదరాబాద్: ఓ మహిళకు వాట్సాప్లో అశ్లీల ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. మార్గదర్శికాలనీ విజయలక్ష్మి అనెక్స్ అపార్టుమెంటులో ఓ మహిళ (41) నివాసముంటోంది. అదే అపార్టుమెంటులో ఉండే నాగిరెడ్డి నాగసుబ్బారెడ్డి (32) కొద్ది రోజులుగా ఆమె ఫోన్కు అశ్లీల చిత్రాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మందలించి పంపించారు. అయితే సుబ్బారెడ్డి బాధితురాలికి ఫోన్ చేసి ఇక ముందు అశ్లీల ఫొటోలు పంపించకుండా ఉండాలంటే తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. మరోసారి బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని వీహెచ్పీ నాయకులు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
అత్యాచార కేసులో 35 ఏళ్ల జైలు
శాంతినగర్/ ఎర్రవల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రవికుమార్ సంచలన తీర్పులు వెలువరించారు. ఇద్దరు బాలికల అత్యాచార కేసులకు సంబంధించి నిందితులకు 35, 25 ఏళ్ల జైలుశిక్ష, జరిమానా విధించారు. వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లికి చెందిన ఓ బాలికకు ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్కు చెందిన వడ్డె వెంకటరమణ అలియాస్ లక్కీ (23)తో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి హిందూపూర్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లి గతేడాది అక్టోబర్ 10న శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న మేజి్రస్టేట్... వెంకటరమణ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి 25 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.40 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఘటనలో.. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని గార్లపాడుకు చెందిన చాకలి హరిచంద్ర 2017లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కోదండాపురం పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ యాదగిరి విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను విన్న జడ్జి రవికుమార్ నేరస్తుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానాతోపాటు బా ధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాల ని తీర్పు వెలువరించారు. నిందితులకు శిక్ష ప డేలా కృషిచేసిన డీఎస్పీ, ఎస్ఐలు, న్యాయవా దులు, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
నడిరోడ్డుపై భార్యను కిరాతకంగా..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 14న విజయ్, సర్వసతీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి.. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్గా పని చేస్తుండగా.. భర్త విజయ్.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుందిప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?కాగా, ప్రత్యక్ష సాక్షి బాలయ్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతిని విజయ్ కత్తితో పొడిచిన సమయంలో తాను ఆపే ప్రయత్నం చేశానని తెలిపారు. ‘‘దగ్గరకి వెళ్తే.. మీకు దీని గురించి తెలియదు నన్ను అపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది అందుకే చంపేస్తున్నా అంటూ అరిచాడు. వద్దని వారించిన మెడపై కత్తి తో పొడిచాడు.. పీక కోసి రాక్షసుడిలా బిహేవ్ చేశాడు. ఆసుపత్రిలో సరస్వతి డ్యూటీ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. అప్పుడే కత్తితో దాడి చేశాడు‘‘ అని బాలయ్య వివరించారు.
రూ.20 లక్షల కట్నం తేకపోతే మరో పెళ్లి చేసుకుంటా..!
జనగామ జిల్లా: ఓ కుటుంబ పంచాయితీలో జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం స్థానిక పోలీస్స్టేషన్ సమీపంలో జరిగింది. గొడవతో ఒక్కసారిగా బాధితులు కేకలు వేయడంతో ఎస్సై వినయ్కుమార్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చేరుకుని పెద్దమనుషులను మందలించారు. గాయపడివారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు మోటం పూర్ణ, పోలీసుల కథనం ప్రకారం.. స్టేషన్ఘన్పూర్కు చెందిన కడమంచి యాదయ్య, దుర్గమ్మ దంపతుల కుమార్తె మోటం పూర్ణను 2013, నవంబర్ 9న రఘునాథపల్లికి చెందిన అశోక్కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.4 లక్షల నగదు, తులంన్నర బంగారం కట్నంగా అందించారు. అశోక్ ప్రైవేట్ ఉద్యోగం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. మొదట్లో వారి సంసారం సాఫీగా సాగింది. వారికి ఎనిమిదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రఘునాథపల్లిలో తన ఇంటివద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పూర్ణ గతేడాది సెప్టెంబర్ 2, 2024లో రెండో ఫ్లోర్నుంచి కిందపడింది. ఈఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆమెను భర్త అశోక్, అత్తామామ మోటం రాముల, శ్రీనివాస్ సరిగ్గా చూసుకోవడం లేదు. సరైన వైద్య చికిత్స చేయించలేదు. మరో రూ.20 లక్షలు అదనపు కట్నం తేవాలని, లేని పక్షంలో మరో వివాహం చేసుకుంటానంటూ పూర్ణను భర్తతో పాటు అత్తామామలు ఆరు నెలలుగా వేధిస్తున్నారు. ఈ విషయమై హైదరాబాద్ ఉప్పల్లోని మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా భర్త తీరులో మార్పు రాలేదు. దీంతో పూర్ణ మూడు నెలల నుంచి ఘన్పూర్లో అమ్మగారింటి వద్ద ఉంటోంది. అయితే పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కోసం బుధవారం పిలిపించారని, పంచాయితీలో తన బాధను చెపుతుండగానే భర్త అశోక్, అత్త రాముల, మామ శ్రీనివాస్.. తమపై దాడి చేశారని బాధితురాలు వాపోయింది. దాడిలో తన అత్త రాయి విసరగా అమ్మ దుర్గమ్మకు తీవ్రగాయమైందని, భర్త, మామ కలిసి తమ్ముడు పవన్పై దాడి చేశారని రోదించింది. కాగా, ఘర్షణ జరుగుతుండగా పెద్ద మనుషులు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.
వీడియోలు
చికిరి చికిరి.. ఈ సాంగ్ క్రేజ్ చూసి చిరంజీవి, రామ్ చరణ్ రియాక్షన్!
200 మార్క్ దాటిన NDA సునామీలో కొట్టుకుపోయిన కాంగ్రెస్
సీఐఐ సమ్మిట్ సాక్షిగా బాబు బండారం బట్టబయలు చేసిన కరణ్ అదానీ
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం.. నవీన్ యాదవ్ రియాక్షన్
బిహార్ లో NDA దిమ్మతిరిగే స్ట్రైక్ రేట్
వేధింపులకే చనిపోయారా? టీటీడీ ఉద్యోగి మృతిపై అనుమానాలు
జూబ్లీ ఫలితాలపై సంచలన ప్రెస్ మీట్
ఎన్నికల ఫలితాలపై మాగంటి సునీత ఎమోషనల్
సీఎం రేంజ్ లో సవాల్ విసిరి తుస్సుమన్న PK
బీజేపీ ఓటమిపై దీపక్ రెడ్డి ఎమోషనల్

