‘సాక్షి’ ఎడిటర్పై సర్కార్ దాష్టీకం
సాక్షి, అమరావతి: పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికపై కక్షసాధింపును మరింత విస్తృతం చేస్తోంది. అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నందుకు అక్రమ కేసులతో బరితెగిస్తోంది. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా హక్కును కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. కర్నూలులో రూ.4 వేల కోట్ల ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు అధికార టీడీపీ నేతలు పన్నిన కుట్రలను బట్టబయలు చేయడం, ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్నవారి ఆందోళనకు మద్దతుగా నిలిచినందుకు ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులు నమోదు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు విచారణ పేరుతో సోమవారం కర్నూలు పోలీసులు హైదరాబాద్లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో హల్చల్ చేశారు. పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డికి 35 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులిచ్చారు.ఆధారాలతో కథనాలు.. వేధింపులే లక్ష్యంగా ప్రభుత్వం బాబు సర్కారులో... సాక్షి ప్రధాన కార్యాలయం, ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల నమోదు, నోటీసులు, విచారణ పేరుతో వేధించడాన్ని పోలీసులు వారి విధానంగా మలుచుకున్నట్లు స్పష్టమవు తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్పై 19 అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనం. అక్రమ కేసులకు కారణమైన కథనాల్లో ఒక్కదాంట్లోనూ ‘సాక్షి’ అవాస్తవాలను ప్రచురించలేదు. పూర్తి ఆధారాలతో ఇస్తూ బాధితులు చెప్పిందే పేర్కొన్నది తప్ప సొంత భాష్యం ఇవ్వలేదు. వాస్తవాలను వక్రీకరించలేదు. అయినా, బాబు ప్రభుత్వ డైరెక్షన్లో పోలీసులు అక్రమ కేసులకు తెగబడుతున్నారు. పోలీసు ఉన్నతాధికా రులు అత్యుత్సాహంతో కొన్ని నమోదు చేయిస్తుండగా... ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా ఆదేశించి మరీ మరికొన్ని నమోదు చేయిస్తున్నారు.బాధితుల పక్షాన నిలిచినందుకే...ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలుగె త్తడం, బాధితుల ఆవేదనను వెలుగులోకి తేవడమే ‘సాక్షి’ చేసిన నేరం అన్నట్లు చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల కుట్రపై కర్నూలు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తు న్నారు. 19 అక్రమ కేసుల్లో 5 ఈ జిల్లాలోనే నమోదవడం దీనికి నిదర్శనం. ఇక ఇటీవల నమోదు చేసిన కేసు మరీ విడ్డూరంగా ఉంది. కర్నూలులోని ఏ, బీ, సీ క్యాంప్ క్వార్టర్లను ఖాళీ చేయించాలని మంత్రి భరత్ ఆదేశించారు.ఆ భూముల్లో స్టేడియం నిర్మిస్తామని ఓసారి, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మరోసారి చెప్పారు. వీటిలో ఏ నిర్మాణానికీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినాసరే, అక్కడివారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు మంత్రి భరత్ సంసిద్ధులయ్యారు. కర్రపట్టుకుని మరీ ఖాళీ చేయిస్తామని బహిరంగంగా హెచ్చరించారు. దాంతో దశాబ్దాలుగా ఉంటున్న కుటుంబాలు తీవ్ర నిరసన తెలిపాయి. ‘సాక్షి’ దీన్ని ప్రచురించింది. ఆగ్రహించిన మంత్రి భరత్... సాక్షిపై అక్రమ కేసు నమోదు చేయాలని హుకుం జారీ చేశారు. పోలీసులు జీహుజూర్ అన్నారు. అంతేకాదు సోమవారం ఏకంగా సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చి ఎడిటర్కు నోటీసులిచ్చారు.➜భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులే ఎత్తుకెళ్లారు. దీన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు చేశారు. రాయలసీమలో భారీ దందాకు పాల్పడుతున్న అవినీతి అనకొండ ఐపీఎస్ అధికారి బాగోతాన్ని బయటపెట్టినందుకు మరో అక్రమ కేసు పెట్టారు. ఇక టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దని మంత్రి భరత్ అనుచరులు వాట్సాప్ మెసేజులతో బెదిరించారు. ఈ విషయాన్ని ప్రచురించినందుకు సాక్షిపై అక్రమ కేసు నమోదు చేశారు.➜పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రైవేట్ పీఏ సతీశ్... ఒంటరి ఉద్యోగిని ఆర్థికంగా, లైంగికంగా వేధించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని ప్రచురించిన సాక్షిపై సాలూరు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.➜పోలీసు శాఖలో అర్హులైన డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతుల్లో అన్యాయం జరగడాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీనిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులే అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం.➜ఇటీవలి భారీ వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం ముంపునకు గురైందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో విమర్శించారు. సంబంధిత ఫొటోలను ప్రదర్శించారు. దీన్ని ప్రచురించిన సాక్షిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.➜రాష్ట్రంలో టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బట్టబయలవడంతో ప్రభుత్వం కంగారుపడింది. నకలీ మద్యం బాగోతాన్ని వెలుగులోకి తెస్తున్న సాక్షి గొంతు నొక్కేందుకు అక్రమ కేసులకు తెగించింది. కల్తీ మద్యం తాగి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సందేహాస్పద రీతిలో నలుగురు మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ వాస్తవాన్ని సాక్షి ప్రచురించగా బాబు సర్కారు తట్టుకోలేపోయింది. నకిలీ మద్యం దందాను అరికట్టడంపై కాక దానిని వెలుగులోకి తెస్తున్న సాక్షిపై కక్షసాధింపునకు దిగారు.ప్రభుత్వం ఆదేశాలతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్, కలిగిరి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టారు. అర్థరాత్రి వేళ హైదరాబాద్, విజయవాడ సాక్షి కార్యాలయాలు, సాక్షి పాత్రికేయుల నివాసాలకు వెళ్లి నోటీసుల పేరుతో వేధించారు. ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డికి వాట్సాప్లో ముందుగా నోటీసులు పంపారు. వాట్సాప్లో నోటీసులు షేరింగ్ వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా దాన్ని ఉల్లంఘించారు. అనంతరం విచారణ పేరుతో పేరుతో ఎడిటర్ ధనుంజయ్రెడ్డికి ఏకంగా 85 ప్రశ్నలతో బుక్లెట్ ఇచ్చారు. పత్రికలు, మీడియా ఎలా విధులు నిర్వర్తిస్తాయనే కనీస అవగాహన లేకుండా ఈ ప్రశ్నావళి ఉంది. న్యూస్ సోర్స్, బాధితుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే విస్పష్టంగా ప్రకటించింది. కానీ, సాక్షి వద్ద ఆవేదన వెళ్లగక్కిన బాధితుల వివరాలు చెప్పాలని, న్యూస్ సోర్స్ వెల్లడించాలని ఏపీ పోలీసులు ప్రశ్నించడం విస్మయపరిచింది.
తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస
శక్తిమంతులతో పోరాడే సమయంలో పోరాటమే విజయంతో సమానం. ఆ తర్వాత దక్కిన న్యాయం సంతృప్తిని ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కేరళ సూపర్స్టార్ దిలీప్ తనపై అత్యాచారం చేసేందుకు ఒక గ్యాంగ్తో కుట్ర పన్నాడని ఆరోపించి సుదీర్ఘకాలం పోరాడిన నటి (తెలుగులో కూడా నటించింది) చివరకు డిసెంబర్ 8న జడ్జిమెంట్ వినగలిగింది. మొత్తం 15 మంది నిందితులున్న ఈ కేసులో 1 నుంచి 6 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసి 8వ నిందితుడైన దిలీప్ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై వ్యాఖ్యలు వినిపిస్తున్నా కేరళను కంపింప చేసి ఎన్నో సవాళ్లు తట్టుకుని పోరాడిన నటిని ముందు ప్రశంసించాల్సి ఉంది.తాను పని చేసే రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు విశ్వసిస్తే ఆమె చేసే పోరాటానికి ఎన్ని అవరోధాలు ఉంటాయి? మలయాళ సూపర్స్టార్ దిలీప్ పన్నిన కుట్ర వల్లే తన మీద అత్యాచారం జరిగిందని న్యాయపోరాటానికి దిగిన మలయాళ నటి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చివరకు ‘తీర్పు’ను సాధించింది. అయితే ఆ తీర్పులో తనకు దక్కిన న్యాయం పాక్షికమా? సంపూర్ణమా అనేది చర్చే అయినా... ఇంతవరకూ ఆమె వెరవక నిలబడటం చాలా గొప్ప సంగతి. స్ఫూర్తిదాయకమైన పోరాటం.→ అసలేం జరిగింది?మలయాళ నటి ‘ఎం’ (కథనం కోసం పెట్టిన పేరు) ఫిబ్రవరి 17, 2017న త్రిషూర్లోని తన ఇంటి నుంచి కొచ్చి వెళుతున్నప్పుడు రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీకొట్టిన కొంతమంది ఆమె వాహనంలోకి జొరపడ్డారు. ఆ తర్వాత కొచ్చి అంతా తిప్పుతూ ‘ఎం’ను దుర్బాష లాడారు. వారిలో పల్సన్ సుని అనే పాత నేరస్తుడు ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు అదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఒక దర్శకుడి ఇంటి ముందు ఆమెను పడేసి ఉడాయించాడు. దర్శకుడి సహాయంతో అదే రోజు ‘ఎం’ కేసు నమోదు చేసింది.→ తర్వాత ఏం జరిగింది?మొదట పోలీసులు ఇదో బ్లాక్మెయిల్ దందా చేసే వారి పని అని భావించారు. అయితే అత్యాచార సమయంలో పల్సర్ సుని ‘ఎం’తో ‘నేను కొటేషన్ అందుకోవడం వల్లే ఈ పని చేస్తున్నాను’ అన్నాడు. కొటేషన్ అంటే సుపారీ. అయితే ఈ సుపారీ సంగతి వెంటనే పోలీసుల దృష్టికి రాలేదు. బాధితురాలు ఇది కీలకమైన కామెంట్గా గమనించలేదు.→ అరెస్టులుపోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. వీరిలో పల్సర్ సునితో పాటు ‘ఎం’ వాహన డ్రైవర్ ఇంకా ఆరు గురు ఉన్నారు. మే 1, 2017 నాటికి ‘ది విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ పేరుతో మలయాళ నటీమణులు ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసి మలయాళ పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ గురించి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. జూన్, 2017 నాటికి విష్ణు అనే వ్యక్తి తాను పల్సర్ సునీ జైల్మేట్నని జైలులో అతడు ఈ కేసు వెనుక నటుడు దిలీప్ ఉన్నాడన్న సంగతి చెప్పాడని బయటకు వెల్లడి చేయడంతో గగ్గోలు మొదలైంది. మరోవైపు ‘కొటేషన్ డబ్బు బేలెన్స్ చెల్లించమని’ పల్సర్ సుని రాసినట్టుగా చెప్పే లెటర్ బయటకు ‘లీక్ అయ్యింది’. దాంతో ఈ అత్యాచారం కుట్రలో దిలీప్ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చి కేరళలో కంపనలు పుట్టాయి. జనం రెండుగా చీలి వాదులాడుకున్నారు. ‘ఎం’ను దుర్బాషలాడారు. జూన్ 24, 2017న దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు.→ దిలీప్పై ఆరోపణ ఎందుకు?నటుడు దిలీప్, నటి మంజు వారియర్ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్కు మరో నటి కావ్య మాధవన్తో సంబంధం ఉన్నట్టు మంజుకు అనుమానం వచ్చింది. కాని ఏ ఆధారం దొరకలేదు. అయితే దిలీప్కు, కావ్యా మాధవన్కు ఉమ్మడి స్నేహితురాలైన ‘ఎం’కు ఈ విషయం తెలిసి ఉండొచ్చనే ఉద్దేశంతో మంజు ‘ఎం’ను నిలదీసింది. ‘ఎం’ ఆ సంబంధాన్ని బయట పెట్టిందని సమాచారం. తనకు స్నేహితురాలిగా ఉంటూ తన పెళ్లిలో చిచ్చు పెట్టిన ‘ఎం’ మీద ఆనాటి నుంచి కోపం పెట్టుకున్న దిలీప్ సమయం కోసం ఎదురు చూశాడని ఆరోపణ. ఈలోపు 2015లో మంజు, దిలీప్లు విడాకులు తీసుకున్నారు. 2016లో దిలీప్, కావ్య వివాహం చేసుకున్నారు. 2017లో ‘ఎం’ మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నదనగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్వరంగం అంతా ‘ఎం’ను దిలీప్ దీని వెనుక ఉన్నాడని విశ్వసించేలా చేసింది. అయితే దిలీప్ ముందు నుంచీ ఇదంతా తన ప్రతిష్టను తట్టుకోలేని శక్తులు చేసిన కుట్రగా కొట్టేస్తూ వచ్చాడు. 84 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన దిలీప్ తనే ఈ కేసులో సి.బి.ఐ. విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు వరకూ వెళ్లాడు.→ 2018లో విచారణ మొదలుఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో హనీ ఎం.వర్గీస్ అనే మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో 2018లో విచారణ మొదలైంది. అయితే ఈ జడ్జి మీద తనకు విశ్వాసం లేదని బాధిత నటి కేరళ హైకోర్టు కూ, సుప్రింకోర్టుకూ వెళ్లి న్యాయమూర్తిని మార్చమని అభ్యర్థించింది. అయితే న్యాయమూర్తి మార్పు జరగలేదు. విచారణలో స్వచ్ఛతపై అసంతృప్తితో 2022 నాటికి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరుగా కేసు నుంచి తప్పుకున్నారు. చాలా మంది సాక్షులు మొదట బాధితురాలి పక్షాన స్టేట్మెంట్స్ ఇచ్చి కాలక్రమంలో అడ్డం తిరిగారు. సత్వర విచార జరగాల్సిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్లింది. దిలీప్ ఉపయోగించిన ఫోన్లు, ఇతర ఫోన్లు ‘టాంపర్’ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అత్యాచార దృశ్యాలు చిత్రీకరించిన ఫోను ‘మాయమైంది’. వీటన్నింటి మధ్య కేసు నత్తనడక నడవగా స్వయంగా సుప్రిం కోర్టు రంగంలో దిగి కేసును తొందరగా ముగించమని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు 2022లో ‘ఎం’ తనకు తానే బయటకు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది. కేరళ ప్రభుత్వం విధించిన హేమ కమిటీ మలయాళ పరిశ్రమలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలను బయటకు వెల్లడి చేయడంతో మరో దుమారం లేచింది. ఇవన్నీ అయ్యాక తుదకు డిసెంబర్ 8, 2025న తీర్పు వెలువడింది. ఇందులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. 7 నుంచి 15 వరకూ ఉన్న నిందితులను వదిలిపెట్టింది. 8వ నిందితుడైన దిలీప్కు ప్రస్తుతానికి విముక్తి దొరికింది. అయితే దీని మీద విస్తృతంగా వ్యాఖ్యలు, విమర్శలు వినపడుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఈ తీర్పును చాలెంజ్ చేస్తామని చెప్పింది. బాధిత ‘ఎం’ కూడా పై కోర్టుకు వెళ్లవచ్చు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా బలవంతులపై బాధిత మహిళల పోరాటం ఆగవలసిన అవసరం లేదని ‘ఎం’ నిరూపించింది. ఆమె స్థయిర్యం వల్లే ఇంతవరకైనా వచ్చింది. ఇక మీదట ఆమె చేయబోయే పోరాటం మరో తీర్పును ప్రసాదించవచ్చు. వేచి చూద్దాం.
పంటలన్నీ కొనలేం
సాక్షి, అమరావతి: రైతులు పండించే అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది 55 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, వచ్చే ఏడాదీ కొనాలంటే సాధ్యం కాదన్నారు. మనం పండించే వరిని మనమే తినడం లేదని, అలాంటి వరిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఏం చేస్తుందని సీఎం ప్రశ్నించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో జీఎస్డీపీ వృద్ధిపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.రైతులు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రావడం లేదన్న ప్రశ్నపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కువ మంది వరి పండించడంతో ఉత్పత్తి పెరిగిందన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారని, దీంతో వాటి కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ‘రాబోయే రోజుల్లో వరి తినరు. బియ్యం తింటే డయాబెటిస్తో పాటు ఇతర జబ్బులన్నీ వస్తాయి. రైతులు కూడా ప్రజలు వినియోగించే పంటలనే సాగు చేయాలి. ఉద్యాన పంటలకు కూడా ధరల సమస్య తలెత్తింది. అరటి సాగు ఎక్కువ కావడంతో ఉత్పత్తి పెరిగి ధరల సమస్య ఉత్పన్నమైంది.ఓ రైతు 60 ఎకరాల్లో అరటి పంట వేశారు. మార్కెట్ డిమాండ్ ఆధారంగా రైతులు పంటలు సాగు చేయాలి. ఉద్యాన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. అనంతపురంలో 51 రకాల పండ్లు పండిస్తున్నారు. అన్నీ కొనాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాదు. సమతుల్యం చేసుకోవాలి. పంటల మారి్పడిపై రైతులకు అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేందుకు రైతు సేవా కేంద్రాల వారీగా కార్యాచరణ తయారు చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో అగ్రిటెక్ అమలు చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య పెంచేసిందిఈ ఆరి్థక ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో జీఎస్డీపీ లక్ష్యంలో 40.64 శాతం వృద్ధి సాధించామని, మిగతా రెండు త్రైమాసికాల్లో 59.36 శాతం వృద్ధి సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ చర్యల వల్ల ఆదాయం తగ్గిపోయిందంటూ మరోసారి నిందించారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు, అభివృద్ధి కోసం అప్పులు చేస్తున్నామన్నారు. 18 నెలల్లో ఎన్ని అప్పులు చేశారన్న ప్రశ్నకు తరువాత జవాబు చెబుతానన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్యను పెంచేయడంతో రాష్ట్ర సొంత ఆదాయం అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. అవసరం లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులను నియమించారని, పునర్ వ్యవస్థీకరణ ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నామన్నారు. పరకామణిలో డబ్బులు కొట్టేయడం చిన్న నేరం అనడం సరి కాదన్నారు. కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే సత్యకుమార్ను అడగలేను కదా? ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ౖరాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న డిమాండ్లపై స్పందించాలని విలేకరులు కోరగా.. ఊహించని సమస్య వచ్చిందని, దీన్ని కేంద్రం పరిష్కరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, అయితే కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే సత్యకుమార్ను నేను అడగలేను కదా? అని చంద్రబాబు ఎదురు ప్రశి్నంచారు. కేంద్ర మంత్రుల పనితీరులో తన జోక్యం ఉండదన్నారు. సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్లైన్లోనే... సంక్రాంతి నుంచి రాష్ట్ర పౌరులకు అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆ దిశగా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీజీఎస్పై సీఎం సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని సీఎం చెప్పారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లు కొరియర్లో నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాలన్నారు.
‘విమాన’ సంక్షోభంపై మంత్రి రామ్మోహన్ను నిలదీసిన ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడును ఎంపీలు నిలదీశారు. సంక్షోభం జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టికెట్ల ధరలు రూ.50 వేలు, రూ.60 వేలు, రూ.75 వేలు, రూ.1 లక్ష ఏమిటని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు మంత్రి రామ్మోహన్నాయుడు చెప్పిన సమాధానాలపై ఆ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభ నుంచి ఇండియా కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు.మరోపక్క జాతీయ మీడియాతో పాటు, అన్ని రాష్ట్రాల మీడియా ఫ్లాట్ఫామ్లలో జరిగే డిబేట్స్లో పాల్గొంటున్న వక్తలు, నెటిజన్లు కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్లో పౌరవిమానయానశాఖపై పలువురు ఎంపీలు ప్రశ్నలు సంధించారు. వీరిలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే వారున్నారు. ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఏఎంఎస్ఎస్), ఎఫ్డీటీఎల్ నిబంధనలు, ఇండిగో సంక్షోభం, టికెట్ల ధరలు, క్యాన్సిలేషన్ రీఫండ్ తదితర సమస్యలపై ఎంపీలు ప్రశ్నలు వేశారు. వీటికి కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మౌఖిక సమాధానమిచ్చారు. ‘ఎఫ్డీటీఎల్ నిబంధనలను రూపొందించేముందు మేం అందరితో చర్చించాం. నవంబర్ 1 నుంచి రెండోదశ నిబంధనలు అమల్లోకి తెచ్చాం.అవి అమల్లోకి వచ్చాక నెలవరకు సర్విసులు సజావుగా సాగాయి. డిసెంబర్ 3 నుంచే ఈ సమస్య తలెత్తింది. ఇండిగో అంతర్గత సమస్యల వలనే ఈ సంక్షోభం ఏర్పడింది’ అని చెప్పారు. ఈ సమాధానాలపై ఎంపీలు రాంజీలాల్ సుమన్, ప్రమోద్ తివారీ, డాక్టర్ తంబిదొరై తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. . సంక్షోభం రాబోతోందని తెలిసి కూడా ముందే ఎందుకు అడ్డుకోలేకపోయారని నిలదీశారు. పైలెట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసులు రద్దయ్యాయని, తాము ప్రయాణికులకు భరోసా కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. మీరు ధరలను నియంత్రిస్తే నేను రూ.75 వేలు ఖర్చుచేసి టికెట్ ఎందుకు కొంటానంటూ అన్నాడీఎంకే ఎంపీ డాక్టర్ తంబిదొరై మంత్రిని ప్రశ్నించారు.ఇప్పటి వరకు 5,86,705 టికెట్లు క్యాన్సిల్ అయ్యాయని, వీటికి దాదాపు రూ.569 కోట్లు రీఫండ్ చేశారని మంత్రి సమాధానమిచ్చారు. తాము ఒకటి అడిగితే మంత్రి మరొకటి చెబుతున్నారంటూ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా విమాన సంక్షోభం ఏర్పడితే దాన్ని అరికట్టడంలో కేంద్రమంత్రి పూర్తిగా వైఫల్యం చెందారు. ఎఫ్డీటీఎల్ నిబంధనలు రెండోదశవి నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తే డిసెంబర్ నెల మొదటి వారంలో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడింది? వీటిపై మీకు ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదా? మేం అడిగే వాటికి మీరెందుకు సూటిగా సమాధానం చెప్పటంలేదు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీలు సభనుంచి వాకౌట్ చేశారు.రామ్మోహన్నాయుడిపై ఆగ్రహజ్వాలలు కేంద్రమంత్రిపై ప్రజల్లో ఇంకా ఆగ్రహజ్వాలలు తగ్గలేదు. జాతీయ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన మీడియాలోను డిబేట్లు పెట్టి కేంద్రమంత్రి రామ్మోహన్ తీరును ఎండగడుతున్నారు. లక్షలాదిమంది ప్రయాణికులు అష్టకష్టాలు పడుతుంటే మంత్రికి కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇండిగో సంక్షోభం రాబోతుందని ముందే తెలిసినా మంత్రి మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫ్లైట్క్యాన్సిల్ అయినప్పుడు క్షణాల వ్యవధిలో రీఫండ్ వచ్చేలా ఎందుకు చేయలేకపోయారంటూ మండిపడుతున్నారు.దేశంలోని అన్ని విమానాశ్రయాలు.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను తలపిస్తున్నాయని పేర్కొంటున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులకు మంత్రి ఎందుకు భరోసా కల్పించలేదని నిలదీస్తున్నారు. కేంద్రమంత్రి తన పదవికి గౌరవంగా రాజీనామా చేయాలంటూ మీడియా డిబేట్లలో కూర్చున్న విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ డిమాండ్ రోజురోజుకు పెరగడం గమనార్హం. కేంద్రమంత్రి తీరును ఎండగడుతూ ఎక్స్ వేదికగా నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జీతమో.. రామ‘చంద్ర’!
‘విమాన’ సంక్షోభంపై మంత్రి రామ్మోహన్ను నిలదీసిన ఎంపీలు
వైద్య విద్య ప్రవేశాల్లో పారదర్శకతకు పాతర
రెండేళ్ల మొండిచేయి: కాంగ్రెస్ పాలనపై హరీశ్రావు విమర్శలు
స్క్రబ్ టైఫస్తో 9 మంది మృతి
పంటలన్నీ కొనలేం
మా విజన్కు విద్యుత్తే ప్రధానం
రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు
‘సాక్షి’ ఎడిటర్పై సర్కార్ దాష్టీకం
వాక్ టు వర్క్
జీహెచ్ఎంసీ వార్డులు 300కు పెంపు
ముచ్చల్తో వివాహం రద్దైంది.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మంధన
‘ఇదొక మంత్రం’.. ‘వందేమాతరం’చర్చలో ప్రధాని మోదీ
అంతర్జాతీయ మోడల్గా హైదరాబాదీ.. ట్రెండింగ్లో భవితా మండవ
మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
Goa Night Club: ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వైరల్ వీడియో
గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు
పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు షాకిచ్చిన యూకే
గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి : బరాత్, వైభవంగా వేడుక
వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..!
‘నార్కో అనాలిసిస్ టెస్ట్కు నేను సిద్ధం.. సోమిరెడ్డి సిద్ధమా?’
‘మా ఆయన సీఎం కావాలి’: సిద్ధూ భార్య
ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్ జర్నీ
ఆస్తి మొత్తం తిరుమలకు ఇచ్చిన నటి.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం
కమాండర్ మజ్జీతో సహా భారీగా మావోయిస్టుల లొంగుబాటు
సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. అర్థమిదే: నాగార్జున యాదవ్
మరోసారి బద్ధలైన కిలౌయా అగ్నిపర్వతం.. వీడియో వైరల్
డేంజర్ జోన్లో బాలీవుడ్ భామలు!
చీరలకు సహజ రంగులను అందించే నది..!
జీతమో.. రామ‘చంద్ర’!
‘విమాన’ సంక్షోభంపై మంత్రి రామ్మోహన్ను నిలదీసిన ఎంపీలు
వైద్య విద్య ప్రవేశాల్లో పారదర్శకతకు పాతర
రెండేళ్ల మొండిచేయి: కాంగ్రెస్ పాలనపై హరీశ్రావు విమర్శలు
స్క్రబ్ టైఫస్తో 9 మంది మృతి
పంటలన్నీ కొనలేం
మా విజన్కు విద్యుత్తే ప్రధానం
రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు
‘సాక్షి’ ఎడిటర్పై సర్కార్ దాష్టీకం
వాక్ టు వర్క్
జీహెచ్ఎంసీ వార్డులు 300కు పెంపు
ముచ్చల్తో వివాహం రద్దైంది.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మంధన
‘ఇదొక మంత్రం’.. ‘వందేమాతరం’చర్చలో ప్రధాని మోదీ
అంతర్జాతీయ మోడల్గా హైదరాబాదీ.. ట్రెండింగ్లో భవితా మండవ
మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
Goa Night Club: ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వైరల్ వీడియో
గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు
పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు షాకిచ్చిన యూకే
గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యువతి : బరాత్, వైభవంగా వేడుక
వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..!
‘నార్కో అనాలిసిస్ టెస్ట్కు నేను సిద్ధం.. సోమిరెడ్డి సిద్ధమా?’
‘మా ఆయన సీఎం కావాలి’: సిద్ధూ భార్య
ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్ జర్నీ
ఆస్తి మొత్తం తిరుమలకు ఇచ్చిన నటి.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం
కమాండర్ మజ్జీతో సహా భారీగా మావోయిస్టుల లొంగుబాటు
సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. అర్థమిదే: నాగార్జున యాదవ్
మరోసారి బద్ధలైన కిలౌయా అగ్నిపర్వతం.. వీడియో వైరల్
డేంజర్ జోన్లో బాలీవుడ్ భామలు!
చీరలకు సహజ రంగులను అందించే నది..!
ఫొటోలు
చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)
సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్గా నజ్రియా (ఫొటోలు)
అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం (చిత్రాలు)
Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)
నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)
హైదరాబాద్ : ఈ కాళీ మాత ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)
మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)
థాయ్ల్యాండ్ ట్రిప్లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)
బిగ్బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు
సినిమా
దుబాయి యూట్యూబర్తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి
హీరోయిన్ సమంత.. గతవారం పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీళ్లిద్దరికీ గతంలోనే వేర్వేరుగా వివాహాలు జరిగాయి కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ విషయం పక్కనబెడితే మరో తెలుగు హీరోయిన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పెళ్లయిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు!తెలుగు కుటుంబంలో పుట్టిన సునయన.. 'కుమారి vs కుమారి' అనే సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్, పగలే వెన్నెల, మిస్సింగ్ తదితర చిత్రాల్లో నటించింది. అయితే టాలీవుడ్లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళంలో ట్రై చేసింది. ఈమెకు హిట్స్ పడ్డాయి. రీసెంట్ టైంలో అయితే శ్రీ విష్ణు 'రాజ రాజ చోర'లో నటించింది. ఈ ఏడాది వచ్చిన 'కుబేర' మూవీలో నాగార్జున పాత్రకు భార్యగా కనిపించింది.అసలు విషయానికొస్తే.. గతేడాది జూన్లో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని హీరోయిన్ సునయన బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. కాకపోతే కాబోయే వ్యక్తి ఎవరనేది రివీల్ చేయలేదు. కొన్నాళ్లకు రూమర్స్ వచ్చాయి. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరీతో ప్రేమలో ఉందని టాక్ వినిపించింది. కాకపోతే దీన్ని సునయన ఎప్పుడు ధ్రువీకరించలేదు. తాజాగా ఖలీద్.. సునయతో బంధాన్ని పబ్లిక్ చేశాడు.ఖలీద్ పుట్టినరోజు రెండు రోజుల క్రితం జరగ్గా.. సునయనతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. చేతులు పట్టుకుని తీసుకున్న ఓ సెల్ఫీని కూడా ఖలీద్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో గతేడాది వచ్చినవి రూమర్స్ కాదు నిజమేనని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రిలేషన్ బయటపెట్టారంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో?ఖలీద్ విషయానికొస్తే.. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఇతడు. సలామా అనే యూట్యూబర్ని 2007లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆమెకు విడాకులు ఇచ్చాడో తెలీదు గానీ ఇప్పుడు సునయనతో వివాహానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri)
ఆ ఒక్క సంఘటనతో 36 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం!
ఎన్టీఆర్.. ఈ పేరొక ప్రభంజనం. క్లాస్ అయినా, మాస్ అయినా, దేశభక్తి అయినా, ఆధ్యాత్మికం అయినా.. ఎటువంటి సినిమాలోనైనా సరే ఇట్టే జీవించి తన పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు నందమూరి తారకరామారావు. అచంచలమైన నటనతో తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈయన సోదరుడు త్రివిక్రమరావు రావు కూడా నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఈయన కుమారులు కళ్యాన్, హరిన్ ఇద్దరూ యాక్టింగ్నే ఎంచుకున్నారు.హీరోగా ఎంట్రీకళ్యాణ్ చక్రవర్తి 1986లో 'అత్తగారు స్వాగతం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కథానాయకుడిగానే కాకుండా సహాయక పాత్రల్లోనూ మెప్పించారు. తలంబ్రాలు, ఇంటి దొంగ, మామా కోడలు సవాల్, రౌడీ బాబాయ్, అత్తగారు జిందాబాద్, ప్రేమ కిరీటం వంటి పలు సినిమాలు చేశారు. చివరగా మెగాస్టార్ చిరంజీవి లంకేశ్వరుడు (1989) మూవీలో కీలక పాత్రలో నటించారు.ఆ విషాదంవల్లే..నటుడిగా బిజీగా ఉన్న సమయంలో కళ్యాణ్ చక్రవర్తి (Nandamuri Kalyana Chakravarthy) ఇంట తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయన సోదరుడు హరిన్ మరణించారు. తండ్రి త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం తన నట జీవితాన్ని త్యాగం చేసి చెన్నైలో ఉండిపోయారు. తర్వాత బిజినెస్ చూసుకున్నారు. మధ్యలో 2003లో వచ్చిన కబీర్దాస్ మూవీలో శ్రీరాముడి పాత్రలో కాసేపు కనిపించారు. 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ పూర్తి స్థాయిలో నటుడిగా మాత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. రోషన్ మేక హీరోగా నటిస్తున్న ఛాంపియన్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి.. రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్లో కళ్యాణ్ లుక్ పవర్ఫుల్గా ఉంది. కాగా ఎన్టీఆర్ నామకరణం చేసిన వైజయంతి మూవీస్ సంస్థతోనే కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం! ఈ మూవీ డిసెంబర్ 25న విడుదలవుతోంది.చదవండి: రాత్రిపూట మనోజ్ ఫోన్కాల్.. ఎంతో ఏడ్చా! బాలీవుడ్ నటుడు
ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్
హీరోయిన్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం భాజాపా తరఫున ఎంపీగా ఉన్న కంగనా రనౌత్.. ఈ మధ్య పెద్దగా వార్తల్లో కనిపించట్లేదు. లేదంటే ఎప్పుడో ఏదో విషయమై హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. చాన్నాళ్ల తర్వాత ఈమె గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. దానికి కారణం ఓ పెళ్లిలో ఈమె చేసిన డ్యాన్స్. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)గత కొన్నాళ్లు నుంచి చూసుకుంటే కంగన పేరు చెప్పగానే ఫైర్ బ్రాండ్ అనే మాటనే గుర్తొస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలు చేసింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపైన విరుచుకుపడింది. అవార్డ్ ఫంక్షన్స్లో, డ్యాన్సులు చేయడం లాంటి వాటికి ఈమె పూర్తిగా వ్యతిరేకి. అలాంటిది ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సహచర ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె పెళ్లిలో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.స్టేజీపై ఎంపీ నవీన్ జిందాల్తోపాటు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్సీపీకి ఎంపీ సుప్రియా సులేతో పాటు వేదికగా కంగన కూడా హుషారుగా స్టెప్పులేసింది. అయితే ఈ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూడు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకే చోట కలిసి స్టెప్పులేయడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)Supriya Sule and Mahua Moitra dancing along with Kangana Ranaut at BJP MP Naveen Jindal’s daughter’s weddingThis video is for all those supporters who risk their careers and lives for such leaders 🙌 pic.twitter.com/JsgnoVhDs2— Veena Jain (@Vtxt21) December 7, 2025
చిన్నారికి మెగా దంపతుల ఖరీదైన గిఫ్ట్.. గోల్డ్ చైన్తో పాటు..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో వెంకీమామ కూడా నటించారు. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్తో కలిసి నటించాలన్న తన కోరిక ఈ మూవీతో నెరవేరిందన్నారు.అయితే మెగాస్టార్ ఇటీవలే తన మేనేజర్ స్వామినాథ్ కుమార్తె నామకరణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తన సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపకు అలేఖ్య అని చిరంజీవి పేరు పెట్టారు. మెగాస్టార్ తమ కూతురికి పేరు పెట్టడంతో మేనేజర్ దంపతులు ఎమోషనలయ్యారు.ఈ సందర్భంగా చిరు దంపతులు తమ ప్రేమను చాటుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదైన బహుమానం అందించారు. ఆ చిట్టి తల్లికి మెడకు గోల్డ్ చైన్ బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతే కాకుండా దాదాపు కోటి రూపాయల విలువైన ల్యాండ్ బహుకరించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మెగాస్టార్ దంపతులు తమ మేనేజర్ కుటుంబానికి జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025
క్రీడలు
న్యూజిలాండ్కు 'ట్రిపుల్' షాక్
స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్కు ట్రిపుల్ షాక్ తగిలింది. డిసెంబర్ 10 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగబోయే రెండో టెస్ట్కు ముందు ఏకంగా ముగ్గురు స్టార్ బౌలర్లు గాయపడ్డారు. మ్యాట్ హెన్రీ కాఫ్ ఇంజ్యూరితో, నాథన్ స్మిత్ సైడ్ స్ట్రెయిన్తో, మిచెల్ సాంట్నర్ గ్రోయిన్ ఇంజ్యూరితో మిగతా రెండు టెస్ట్లకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్రౌండర్ క్రిస్టియన్ క్లార్క్, ఫాస్ట్ బౌలర్ మైఖేల్ రే, గ్లెన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. స్మిత్, హెన్రీ తొలి టెస్ట్ సందర్భంగా గాయపడగా.. సాంట్నర్ ఇదే గాయం కారణంగా తొలి టెస్ట్కు కూడా దూరంగా ఉన్నాడు. పై ముగ్గురితో పాటు కొత్తగా మరో ఎంపిక కూడా జరిగింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన టామ్ బ్లండెల్కు కవర్గా మిచ్ హేను కూడా జట్టులోకి తీసుకున్నారు.కాగా, క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. విండీస్ బ్యాటర్లు అసమాన పోరాటపటిమతో 531 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్ను డ్రా చేసుకున్నారు.షాయ్ హోప్ సూపర్ సెంచరీ (140).. జస్టిన్ గ్రీవ్స్ అజేయ డబుల్ సెంచరీ (202).. కీమర్ రోచ్ (233 బంతుల్లో 58 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో విండీస్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్ గెలిచినట్లే. విండీస్ యెధుల పోరాటాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం కీర్తించింది.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఝలక్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజ్ను టీమిండియాకు జరిమానాగా విధించారు.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది. ఆ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లోని మిగతా టీ20లు డిసెంబర్ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్
గిల్ వచ్చేశాడు.. సంజూ శాంసన్కు మళ్లీ నిరాశే..!
డిసెంబర్ 9 నుంచి కటక్ (ఒడిషా) వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్మన్ గిల్ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్ చేరుకున్నాడు.గిల్ మెడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్ రాకతో టీమిండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్కు జోడీగా గిల్ బరిలోకి దిగితే సంజూ శాంసన్కు మళ్లీ నిరాశ తప్పదు.మిడిలార్డర్లో ఆడించాల్సి వస్తే మేనేజ్మెంట్ జితేశ్ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్గా అయితేనే సక్సెస్ కాగలడని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇది ఆసీస్ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.మేనేజ్మెంట్ దగ్గర మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జితేశ్ శర్మ రూపం మంచి ఆప్షన్ ఉంది. జితేశ్ మంచి ఫినిషర్గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.గిల్ ఆకలితో ఉన్నాడు: గంభీర్గిల్ గాయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెండు రోజుల ముందే అప్డేట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక గంభీర్ మాట్లాడుతూ.. అవును, గిల్ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్గా, ఫైన్గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో మెడ గాయానికి గురైన గిల్.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్గా ఉన్న గిల్.. టీ20ల్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో విండీస్ వీరుడి విధ్వంసం
దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో విండీస్ వీరుడి రోవ్మన్ పావెల్ (Rovman Powell) విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్కు ఆడుతున్న పావెల్.. నిన్న (డిసెంబర్ 7) అబుదాబీ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 96 పరుగులు చేశాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని సెంచరీ కూడా పూర్తైయ్యేది. పావెల్ మెరుపులకు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 52; ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో పావెల్, కాక్స్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.టాబీ ఆల్బర్ట్, సెదిఖుల్లా అటల్ తలో 8, షయాన్ జహంగీర్ 14 పరుగులకు ఔటయ్యారు. నైట్రైడర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అజయ్ కుమార్, పియూశ్ చావ్లా తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలోనూ నైట్రైడర్స్ తడబడింది. వకార్ సలామ్ఖీల్ (3.3-0-29-4), మహ్మద్ నబీ (4-0-12-2), డేవిడ్ విల్లే (3-0-13-2), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3-0-22-2) ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో ఫిల్ సాల్ట్ (27) టాప్ స్కోరర్గా నిలువగా.. విధ్వంసకర వీరులు లివింగ్స్టోన్ (16), రూథర్ఫోర్డ్ (19), రసెల్ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
న్యూస్ పాడ్కాస్ట్
నేటి నుంచే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు... ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో సర్వం సిద్ధం
‘ఇండిగో’ నిర్వాకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల అష్టకష్టాలు... మంచినీళ్లు, ఆహారం కోసం వరద బాధితుల తరహాలో ఫుడ్ కోర్డుల ముందు నిరీక్షణ
ఉన్నత శిఖరాలకు మన బంధం. ఇండియా-రష్యా సదస్సులో సంయుక్త ప్రకటన చేసిన మోదీ, పుతిన్
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సక్రమంగా ఎక్కడ అమలు చేశారు?. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జీవో సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు... విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఆ కాలేజీలకు రాష్ట్ర ఖజానా నుంచి వంద కోట్ల రూపాయలు దోచిపెట్టే కుతంత్రం
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధి మాటున భూ దోపిడీ...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం... రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బిజినెస్
హైదరాబాద్ రోడ్లకు ట్రంప్, రతన్ టాటా, గూగుల్ పేర్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు పెద్దపీట వేస్తూ ప్రముఖ ప్రపంచ నాయకుల గౌరవార్థం హైదరాబాద్లోని కీలక రహదారులకు వారి పేరుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలో లేఖ ద్వారా తెలియజేయనుంది.గ్లోబల్గా గుర్తింపు కోసం..రాష్ట్రాన్ని ఆవిష్కరణలతో నడిచే భారతదేశానికి చిహ్నంగా నిలబెట్టే విస్తృత వ్యూహంలో ఈ నామకరణ ప్రతిపాదనలు ఒక భాగమని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లోని ముఖ్యమైన రోడ్లకు ప్రముఖ గ్లోబల్ కార్పొరేషన్ల పేర్లు పెట్టాలని ప్రతిపాదించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు..డొనాల్డ్ ట్రంప్ అవెన్యూతో పాటు మరికొందరు ప్రముఖ వ్యక్తులు, కార్పొరేషన్ల గౌరవార్థం ఇతర రోడ్లకు కూడా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గౌరవార్థం నగరంలోని రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును కలిపే రాబోయే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తన పేరు పెట్టాలని నిర్ణయించింది.గూగుల్ స్ట్రీట్హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేయడాన్ని గుర్తించి ఈ లేన్ను గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్
తెలంగాణలో పెట్టుబడుల హోరు
ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వీడర్ ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు హాజరై కీలక పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అయితే, గతంలో హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును రూ.3,500 కోట్లతో నిర్మించనున్నట్లు (ట్రంప్ ఆర్గనైజేషన్-ట్రైబెకా డెవలపర్స్ భాగస్వామ్యంతో) వార్తలు వచ్చాయి. ట్రంప్ గ్రూప్ తరఫున లక్ష కోట్ల పెట్టుబడి ప్రకటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇది ట్రంప్ ఫ్యామిలీ గ్రూప్ కావడం విశేషం.తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు 8, 9 తేదీల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో ఆయా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.భారీ పెట్టుబడుల్లో ముఖ్యాంశాలు:టీసీఎస్ - టీపీజీ భాగస్వామ్యం: ఐటీ దిగ్గజం టీసీఎస్, మరో సంస్థ టీపీజీతో కలిసి రూ.70 వేల కోట్లు (8 బిలియన్ డాలర్లు)** పెట్టుబడితో అత్యాధునిక హైపర్వాల్ట్ డేటా సెంటర్లను స్థాపించనుంది. ఇది అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది.రంగాలు: ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం, క్రీడలు, వినోదం, ఉన్నత విద్య వంటి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి.ఏఐ సిటీ ఏర్పాటు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి ప్రాధాన్యత ఇస్తూ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.అజయ్ దేవ్గణ్ ప్రతిపాదన: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్సిటీ ఏర్పాటుకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ ముందుకొచ్చారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్
ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఉద్యోగుల వసతి అవసరాలను తీర్చడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో భారీ బల్క్ హౌసింగ్ కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా బ్యాంక్ దాదాపు రూ.294 కోట్లు (పన్నులు మినహాయించి) వెచ్చించి, అపార్ట్మెంట్లలో మొత్తం 200 2 బీహెచ్కే ఫ్లాట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దాంతో ఇటీవలి సంవత్సరాల్లో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇది అతిపెద్ద సంస్థాగత నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది.ఎస్బీఐ ఇటీవల జారీ చేసిన టెండర్ పత్రాల ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్లో ముంబయి ఒకటి. దాంతో అక్కడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ ఈ వ్యూహాత్మక బల్క్ కొనుగోలును నాలుగు క్లస్టర్లుగా విస్తరించింది.సెంట్రల్ శివారు ప్రాంతాలు (సియోన్ నుంచి ఘాట్కోపర్ వరకు). పశ్చిమ శివారు ప్రాంతాలు (అంధేరి నుంచి బోరివలి వరకు). థానే-కళ్యాణ్ బెల్ట్. నవీ ముంబై కారిడార్ (ఖర్ఘర్ నుంచి పన్వెల్ వరకు) విభజించింది. ప్రతి క్లస్టర్లో 50 యూనిట్ల చొప్పున మొత్తం 200 2-బీహెచ్కే అపార్ట్మెంట్లు కొనుగోలు చేయనుంది. ప్రతి అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా సుమారు 600 చదరపు అడుగులు (55.74 చదరపు మీటర్లు) ఉండాలని ఎస్బీఐ నిర్ణయించింది. కొనుగోలు చేసే ప్రాపర్టీ ప్రాజెక్ట్ 5 ఏళ్లలోపుదై ఉండాలి. మహారెరా కంప్లీషన్ సర్టిఫికేట్ (OC)తో మహారెరా రిజిస్టర్ అయి ఉండాలి. ప్రతి ఫ్లాట్కు ఒక కారు పార్కింగ్, ఒక ద్విచక్ర వాహనం పార్కింగ్ చొప్పున మొత్తం 400 పార్కింగ్ స్లాట్లు తప్పనిసరి ఉండాలని చెప్పింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) జారీ చేసిన తేదీ నుంచి 6 నెలల్లోగా (180 రోజులు) లావాదేవీని పూర్తి చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.🚨 State Bank of India is planning to buy 200 ready-to-move 2BHK apartments across Mumbai for its staff. pic.twitter.com/LgLD0vfJpQ— Indian Tech & Infra (@IndianTechGuide) December 8, 2025ఈ బల్క్ కొనుగోలు ద్వారా ఉద్యోగులకు ముంబైలో పెరుగుతున్న ఆస్తి ధరలతో సంబంధం లేకుండా స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన నివాసాలు అందించాలని బ్యాంక్ చూస్తోంది. సిబ్బంది సంక్షేమం, గృహ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం (ఉదాహరణకు, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్) రెంటల్ లేదా లీజు ఏర్పాట్ల కంటే నేరుగా రెడీ-టు-మూవ్ గృహాలను కొనుగోలు చేసే ధోరణి పెరుగుతున్నట్లు ఈ చర్య స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?
భారత్లో స్టార్లింక్ ధరలు ఖరారు
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.ధరల వివరాలునెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు చెల్లించే రుసుం.వన్-టైమ్ హార్డ్వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.హార్డ్వేర్ కిట్లో ఏముంటాయి?రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.దీని లక్ష్యం..భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్వర్క్లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.మార్కెట్ సవాళ్లుసాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?
ఫ్యామిలీ
అంధ లెఫ్టినెంట్ కల్నల్ నుంచి వీల్చైర్ మోడల్ వరకు..!
దివ్యాంగులకు సాధికారత కల్పించడం అనేది అందరి కర్తవ్యవం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. వారంతా ప్రత్యేక సామర్థ్యంతో తమలోని అసామాన్య ప్రతిభతో ఆకట్టుకుంటారని ప్రశంసించారు. గత మంగళవారం జరిగిన 2025 జాతీయ వికలాంగుల సాధికారత అవార్డుల వేడుకలో దివ్యాంగుల ప్రతిభను మెచ్చుకుంటూ 32 మందికి అవార్డులు ప్రదానం చేశారు. వాళ్లంతా లింగ వివక్షను, వైకల్యాన్ని అధిగమించి అసాధారణ విజయాలను అందుకున్న వారు. అవార్డులందుకున్న ఈ 32 మందిలో ప్రతిఒక్కరిలో ఉన్నా అసామాన్య ప్రతిభ స్ఫూర్తిని రగిలికస్తూ ఉంటుంది. మరి ఆ అసామాన్య ప్రతిభావంతులెవరూ..వారి ప్రత్యేకత గురించి సవివరంగా చూద్దామా..!.80% లోకోమోటర్ వైకల్యం ఉన్న యాజీన్ జాతీయ వికలాంగులు సాధికారత అవార్డు గ్రహిత. ఆయన కళ్లకు గంతలు కట్టుకుని కీబోర్డుని అవలీలగా ఆలపించగలరు. ఆయన ఊహ గొప్పతనాన్ని చెప్పిన వ్యక్తి. ఒకప్పుడూ తాను సంజు సామ్సన్తో ఆడానని, ఇప్పుడూ ఈ వైకల్యం కారణంగా వీల్చైర్కే పరిమితమయ్యా..కానీ తనని ఆపేది ఏది లేదని చెప్పుకొచ్చారు. ఇక బెంగళూరుకు చెందిన షీబా కోయిల్పిచాయ్ బహుళ వైకల్యంతో పోరాడుతోంది. ఆమె మాట్లాడలేకపోయిన సుమారు మూడు వేలకు పైగా వార్లీ పెయింటింగ్లతో తన అనుభవాలను చెబుతుంది. ఆమె రచనలు కర్ణాటకలో రాష్ట్రపతి భవన్, లోక్భవన్ ప్రపంచ సేకరణలో ప్రచురితమయ్యాయి. ఆమె శిక్షణ పొందిన సంస్థలోనే టీచర్గా పాఠాలు బోధిస్తుంది. నాగ్పూర్కు చెందిన అబోలి విజయ్ జరిత్ దేశంలోని మొట్టమొదటి వీల్చైర్ మోడల్, ప్రేరణాత్మక వక్తకూడా. తన కుటుంబమే అతిపెద్ద బలం అంటోంది.లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేష్ చంద్రశేఖరన్ పూర్తిగా అంధుడైనప్పటికీ భారసాయుధ దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన జాతీయ ఈత రికార్డులను బద్దలు కొట్టారు. భారతదేశంలో బ్లైండ్ షూటింగ్ని ప్రవేశపెట్టిన ఘనత అతడిదే. అలాగే సియాచిన్ హిమానీనదం వరకు ట్రెక్కింగ్ చేశారు.బెంగళూరుకు చెందిన సీనియర్ యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్ మేఘ పతంగి దృష్టి లోపంతో బాధపడుతున్నా.. డిజిటల్ టెక్నాలజీ లక్షలాదిమంది అంధులకు హెల్ప్ అయ్యేలా కృషి చేసింది. ఈ అవార్డు గ్రహీతల్లో చత్తీస్గఢ్లోని ధమ్తారికి చెందిన బసంత్ వికాస్ సాహు కూడా ఉన్నారు. 95% లోకోమోటర్ వైకల్యంతో జీవిస్తూ.. తన జీవన్ రంగ్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక వికలాంగులు, గిరిజన యువతకు శిక్షణ ఇస్తూన్నారు. పైగా తన చేతికి బ్రష్ కట్టుకుని చిత్రలేఖనాలు గీస్తారాయన. ఆయన చిత్రాలు గిరిజన జీవితంపై స్పష్టమైన ఆలోచనను అందిస్తాయి.వడోదరకు చెందిన రాజేష్ శరద్ కేత్కర్ భారతీయ సంకేత భాష (ISL)ను సమర్థించే యాక్సెసిబిలిటీ భావనను పునర్నిర్మించారు. ఆయన మార్గదర్శక ISL-ఆధారిత అభ్యాస వ్యవస్థలను ప్రవేశపెట్టారు. దాంతో లక్షలాది మందికి బధిరులు నడిపే వార్తా వేదికను నిర్మించారు. అలాగే కమ్యూనికేషన్ను సాధికారతగా మార్చారు. చివరగా అవార్డు గ్రహీతలంతా ఒక ఏకైక సత్యాన్ని వివరించారు. అదేంటంటే..వైకల్యం ప్రతిబంధకం, మనల్ని కోల్పోవడం కాదని ప్రూవ్ చేశారు. ఆ వైకల్యం మన అభ్యన్నతిని ఏ మాత్రం ఆపలేదని తమ సక్సెస్తో నిరూపించారు. (చదవండి: Gucchi Mushrooms: పుతిన్ రాష్ట్రపతి భవన్ విందులో గుచ్చి పుట్టగొడుగుల రెసిపీ..! స్పెషాలిటీ ఏంటంటే..)
పుతిన్ రాష్ట్రపతి భవన్ విందులో గుచ్చి పుట్టగొడుగుల రెసిపీ..!
భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. డిసెంబర్ 2021 అనంతరం తొలిసారిగా ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశంలో ఉన్నారు పుతిన్. ప్రధాని మోదీ ఆయనకు రష్యన్ ఎడిషన్తో కూడిన భగవద్గీతను గిఫ్ట్గా ఇచ్చారు కూడా. అలాగే గత శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలకు గ్రాండ్గా విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సమావేశ ముగిసింది. అయితే ఆ విందు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది కూడా. ఈ నేపథ్యంలో మెనూలో వడ్డించిన వంటకాలేంటి..వాటి ప్రత్యేకతలు గురించి తెలుసుకుందామా..!.మోనూ మొత్తం శాకాహార వంటకాలే ఉన్నాయి.భారతదేశం అంతటా ఉన్న ప్రాంతీయ వంటకాల జాబితాను అందించారు. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ నుంచి గుర్సందేశ్, ఉత్తర భారతదేశం నుంచి పసుపు పప్పు తడ్కా, దక్షిణ ప్రాంతాల నుంచి మురుక్కు టిబెట్, నేపాల్ సరిహద్దుల నుంచి జోల్ మోమో, జమ్మూ కశ్మీర్ నుంచి గుచ్చిడూన్ చెటిన్(వాల్నట్ చట్నీతో వడ్డించే స్టఫ్డ్ మోరెల్ పుట్టగొడుగులు) ఉన్నాయి. ఈ రెసిపీలో గుచ్చి పుట్టగొడుగుల వంటకం అత్యంత స్పెషల్. అంత సులభంగా వండుకునే అవకాశం ఉండదే. అలాగే ఎప్పుడు పడితే అప్పుడ తినలేం కూడా. ఎందువల్ల అంటే..ఈ కాశ్మీరీ వంటకం దాని మూలం కారణంగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో అరుదుగా లభించే పుట్టగొడుగులివి. అందువల్లే ఇది కిలో దాదాపు రూ. 35 వేలు నుంచి రూ. 40 వేలు వరకు పలుకుతుంది. ఇవి అడవిలోనే లభిస్తాయి. వీటిని ప్రత్యేకంగా పెంచడం సాధ్యం కాదు. వీటికి ఒక విధమైన నేల రకం, నిర్ధిష్ట ఉష్ణోగ్రత అవసరం. హిమపాతం సీజన్ ముగిసిన వెంటనే వసంతకాలం సమయానికి హిమాలయ ప్రాంతంలో ఇవి దర్శనమిస్తాయి. అనుకోని అటవీ మంటల తర్వాత కూడా వీటిన సాగు చేయొచ్చట. అదే దీనిలో స్పెషాలిటీ అట. ఈ ప్రత్యేకత కలిగిన గుచ్చి పుట్టగొడుగులను కనిపెట్టడం కూడా సవాలట. కొన్ని వారాలపాటు మాత్రమే సాగయ్యే ఈ పుట్టగొడుగును అన్వేషించడం ఓ టాస్క్లా ఉంటుందట. అదీగాక పాకశాస్త్రంలో వీటికి ఉన్న టేస్టే వేరేలెవెల్ అట. పైగా సంప్రదాయ వైద్యలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజలు విరివిగా వినయోగించడంతో వీటికి అధిక డిమాండ్ ఉందట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుట్టగొడుగులగా ఇవి ప్రసిద్ధిగాంచినవి. View this post on Instagram A post shared by NDTV (@ndtv) ఈ మష్రూమ్తో చేసే వంటకాలు..గుచ్చి పులావ్, యాఖ్ని, రోగంజోష్, వంటి శాకాహార వంటకాలను చేస్తారుట. పైగా మాంసానికి ప్రత్యామ్నాయ వంటకంగా ఆస్వాదిస్తారట ఆహారప్రియులు. అంత ప్రత్యేకతలు కలిగిన ఖరీదైన పుట్టగొడుగులు కావడంతోనే ఈ గుచ్చి డూన్ చెటిన్ రాష్ట్రపతి భవన్లో వ్లాదిమిర్ పుతిన్ విందు కోసం మెనూలో స్పెషల్గా ఏర్పాటు చేశారట. (చదవండి: దోసెల రెస్టారెంట్ కోసం..టెక్ ఉద్యోగాన్ని వదిలేశాడు! కట్చేస్తే..)
మధుమేహుల్లో కాళ్ల సంరక్షణపై అవగాహనకు వాకథాన్
మన దేశం మధుమేహ రాజధానిగా మారిపోయింది. 2022 నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలో మధుమేహ బాధితులు అత్యంత ఎక్కువగా ఉంది భారతదేశంలోనే. అయితే మధుమేహ బాధితులు అన్నింటికంటే ఎక్కువగా దృష్టిపెట్టాల్సింది వాళ్ల కాళ్లమీదేనని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు భాగ్యనగరంలో ఆదివారం వాకథాన్ను నిర్వహించారు. ఈ వాక్థాన్ను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ రమేష్ గోరంట్ల, టాలీవుడ్ నటుడు సుశాంత్, కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ప్రారంభించారు.మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. “మధుమేహం అనేది చాలా సాధారణంగా మొదలయ్యే సమస్య. అసలు చాలామందికి అది ఉందన్న విషయమే మొదట్లో తెలియదు. దాన్ని గుర్తించేసరికే చాలా ఆలస్యం అవుతుంది. పైగా మధుమేహం ఉన్నవాళ్లు తమ కళ్లు, కాళ్లు, ఇతర అవయవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కంటిచూపు తగ్గుతున్నా, కాళ్ల మీద పుళ్లు కనిపించినా, ఏమైనా దెబ్బలు తగిలినా వెంటనే తగిన చికిత్సలు తీసుకోవాలి. వాటిలో నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామందికి కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతిరోజూ తగినంత నడక, యోగా, లేదా మరేదైనా భౌతిక కార్యకలాపాలతో చురుకైన జీవనశైలి గడపాలి. స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల మీద ఎక్కువగా ఆధారపడితే శారీరక కార్యకలాపాలు తగ్గిపోయి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి” అని తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ రమేష్ గోరంట్ల మాట్లాడుతూ.. “ఇంతకుముందు మధుమేహం అంటే 50. 60 ఏళ్లు దాటినవాళ్లకే ఉండేది. కానీ ఇప్పుడు బాగా చిన్నవయసు వాళ్లలో కూడా ఇది ఉంటోంది. పిల్లలు, యువత మామూలుగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఆటల్లో దెబ్బలు తగలడం సర్వసాధారణం. అయితే అలాంటప్పుడు మధుమేహం ఉన్నవాళ్లయితే వాళ్లకు గాయాలు అంత త్వరగా నయం కావు. ఇప్పుడు ఇక్కడున్న వైద్యులు, ఇతర ప్రముఖులు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇలాంటి గాయాల వల్ల కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మధుమేహం ఉన్నవాళ్లు కాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు మధుమేహం స్థాయి పరీక్షించుకోవడంతో పాటు కీలక అవయవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.టాలీవుడ్ నటుడు సుశాంత్ మాట్లాడుతూ, “ఇన్నాళ్ళూ కళ్లకు, ఎముకలకు, పొట్టలోని భాగాలకు.. ఇలా రకరకాల వైద్యులు ఉంటారని తెలుసు గానీ, ప్రత్యేకంగా పాదాల కోసం కూడా ఒక ప్రత్యేక వైద్యవిభాగం ఉందన్న విషయం నాలాంటి చాలామందికి తెలియదు. ఇటీవలి కాలంలో చాలామందికి మధుమేహం ఉంటోంది. అందువల్ల ప్రతి ఒక్కళ్లూ కాళ్ల విషయాన్ని సరిగ్గా పట్టించుకోవాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే ఇలాంటి ఫుట్ క్లినిక్లకు వచ్చి పరీక్ష చేయించుకోవాలి” అన్నారు.ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ, ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ, “మధుమేహుల్లో 15-25% మందికి తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు కాళ్ల మీద పుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, మధుమేహ బాధితులకు నరాలు పాడవ్వడం వల్ల ఇలాంటి సాధారణ పుండ్ల వల్ల వాళ్లకు నొప్పి అంతగా తెలియదు. అందువల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, మధుమేహం వల్ల కాళ్లు తొలగించాల్సిన పరిస్థితుల్లో 85% కేవలం ఇలాంటి పుండ్లకు చికిత్స చేయకపోవడం వల్లే వస్తాయి. సరైన సమయానికి పుండ్లకు చికిత్స చేయించకపోతే పరిస్థితి చాలా విషమంగా మారుతుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారంతా ఎప్పటికప్పుడు తమ కాళ్ల విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి” అని చెప్పారు.ఈ సందర్భంగా ద ఫుట్ డాక్టర్ ఆస్పత్రిలో డాక్టర్ వూండ్ అనే యాప్ను ఆవిష్కరించారు. సురక్షితమైన, పరిశుభ్రమైన డ్రసింగ్తో ఇంట్లోనే గాయాలను నయం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నిపుణులైన వైద్యులు దూరంగా ఉండే గాయాలను గమనించి, ఎక్కువగా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసి అటు ఆర్థికభారం, ఇటు సమయం కూడా ఆదా చేస్తుంది. దీంతోపాటు.. ప్రతి ఒక్కరికీ వాళ్ల పాదాల తీరు, సైజులకు అనుగుణంగా పాదరక్షలు తయారుచేసే ప్రత్యేకమైన మిషన్ ఒకదాన్ని ద ఫుట్ డాక్టర్ ఆస్పత్రిలో ఏర్పాటుచేశారు. దీనివల్ల రోగులు తమ కాళ్ల సమస్యలను త్వరగా గుర్తించడంతో పాటు నూరుశాతం కస్టమైజ్డ్ పాదరక్షలను పొందే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ల పాదాలకు సంపూర్ణ రక్షణ, సౌకర్యం లభించి.. కాళ్లు, పాదాలకు గాయాలు కాకుండా ఉంటాయి.(చదవండి: డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం)
దోసెల రెస్టారెంట్ కోసం..టెక్ ఉద్యోగాన్ని వదిలేశాడు! కట్చేస్తే..
ఫుడ్ రెస్టారెంట్ లేదా హోటల్ నడపడం అంటే అంత ఈజీ కాదు. చాలా శ్రమతో కూడిన పని. అభిరుచి లేదా ప్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ ఈ యువకుడు చక్కగా అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగాన్ని కేవలం దోసెలు అమ్మడం చాలా తృణపాయంగా వదిలేశాడు. ఇదేం ఆసక్తి అనుకోకండి. ఆయన ఆరోగ్యకరమైన రీతీలో దోసెలను అమ్మాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడట. వినడానికి ఏంటిది అనిపించినా..? మరి.. అంత రిస్క్ తీసుకుని ఆ యువకుడు సక్సెస్ అయ్యాడా అంటే..జర్మన్లో అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగం చేసేవాడు మోహన్. స్కాలర్షిప్పై పారిస్లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో అధిక వేతనంతో కూడాన ఉద్యోగాలు వచ్చాయి. అయితే వాటన్నింటిని కాదనుకుని స్నేహితులతో కలిసి దోసె రెస్టారెంట్ని ప్రారంభించాలనుకున్నాడు. అది కూడా ఆరోగ్యకరమైన గ్లూటెన్ రహిత దోసెలను అందించాలనే లక్ష్యంతో ఆ టెక్ ఉద్యోగాలను వద్దనుకున్నానంటూ తన స్టోరీని ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. అలాతాను 2023లో తన దోసెమా రెస్టారెంట్ని ప్రారంభించినట్లు తెలిపాడు. అతను సహా వ్యవస్థాపకుడిగా, మేనేజింగ్ డైరెక్టర్గా రెస్టారెంట్ బాధ్యతలు చూసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆకస్మిక మార్పు చాలా కొత్తగా..ఇష్టంగా ఉన్నా..చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని కూడా వివరించాడు. బాగా అలసిపోయి, నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు చాలా ఉన్నా..ఇష్టంతో చేసే పనిలో ఆ ఇబ్బందులు పెద్ద కష్టంగా అనిపించవని అంటున్నాడు. ఇవాళ తన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో శాఖలు ఉన్నాయని, తాజాగా భారతదేశంలో పుణేలో కూడా శాఖలు ఉన్నాయని వీడియోలో మోహన్ చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఆ యువకుడి ధైర్యానికి ఆశ్చర్యపోవడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే అతడి తపన మమ్మల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది, పైగా అతడిపై గౌరవం ఇంకా పెరిపోయింది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dosamaa (@dosamaa_in) (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..)
అంతర్జాతీయం
అమెరికా అగ్నిప్రమాద ఘటనలో మరో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న అల్బనీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థి ఉడుముల సహజారెడ్డి (24) మృతిచెందగా ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్వేష్ సారపెల్లి అనే తెలుగు విద్యార్థి సైతం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం శనివారం సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించింది. మృతుని కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. ఈ విషయంలో వీలైనంత సాయం చేస్తున్నామని తెలిపింది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు సహజారెడ్డి, అన్వేష్తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు అల్బనీలోని క్వెయిల్ స్ట్రీట్లో ఉన్న ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 4న వారి ఇంటికి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే సహజారెడ్డి 90 శాతం కాలిన గాయాలకు గురవగా అన్వేష్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు వారిని అల్బనీ మెడికల్ కేర్ సెంటర్ ఆస్పత్రికి... అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వెస్ట్చెస్టర్ మెడికల్ బర్న్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సహజారెడ్డి శుక్రవారం మృతి చెందగా అన్వేష్ శనివారం మరణించాడు.
బెనిన్లో తిరుగుబాటు యత్నం భగ్నం
కొటొనౌ: పశ్చిమ ఆఫ్రికా దేశం బెనిన్లో ఆదివారం జరిగిన తిరుగుబాటు యత్నం విఫలమైంది. ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ ఉదయం కొందరు సైనికులు దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను అస్థిరపరిచేందుకు ప్రయత్నించారు. అయితే, బెనిన్ సైనిక బలగాలు, వాటి నాయకత్వం, తమ ప్రమాణానికి కట్టుబడి ఉన్నాయి. దేశం కోసం నిలబడ్డాయి. కుట్రను భగ్నం చేశాయి’అని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతకుముందు, మిలటరీ కమిటీ ఫర్ రీ¸ఫౌండేషన్ అని చెప్పుకుంటూ కొందరు సైనికులు ప్రభుత్వ టీవీలో తిరుగుబాటు ద్వారా ప్రభుత్వాన్ని రద్దు చేశామని ప్రకటించుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ పాస్కల్ టిగ్రిని మిలటరీ కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్ష భవనం పరిసరాల్లో కాల్పులు శబ్దాలు వినిపించాయి. ఈ పరిణామాల నడుమ అధ్యక్షుడు పాట్రిస్ టలోన్ ఎక్కడున్నారనేది తెలియరాలేదు. కొద్దిసేపు ప్రభుత్వ టీవీ, రేడియో సిగ్నళ్లు ఆగిపోయాయి. అనంతరం ప్రసారాలు తిరిగి మొదలయ్యాయి. బెనిన్లో తిరుగుబాటు వార్తలపై ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్(ఎకోవాస్) స్పందించింది. బెనిన్లోని పాస్కల్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించింది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచి్చంది. 2016 నుంచి అధికారంలో కొనసాగుతున్న పాస్కల్ వచ్చే మార్చిలో అధ్యక్ష ఎన్నికల అనంతరం వైదొలగాల్సి ఉంది. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన బెనిన్లో తరచూ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. 1991 నుంచి దేశంలో స్థిరత్వం నెలకొంది. టలోన్ పార్టీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రొమువాల్డ్ వడగ్ని వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయి. ప్రతిపక్ష నేత రెనాడ్ అగ్బొజోకు తగినంత మంది మద్దతు తెలపలేదనే కారణంతో అధికారులు అనర్హుడిగా ప్రకటించారు. 2024లో తిరుగుబాటుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై టలోన్ సన్నిహితులిద్దరికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత నెలలో దేశ పార్లమెంట్ అధ్యక్షుడి పదవీ కాలాన్ని ఐదు నుంచి ఏడేళ్లకు పెంచింది. అయితే, రెండు పర్యాయాలు మాత్రమే పనిచేయాలనే నిబంధన విధించింది. మరో పశ్చిమాఫ్రికా దేశం గినియా బిస్సావులో ఇటీవల సైనిక తిరుగుబాటు జరగడం తెల్సిందే.
కింగ్ చార్లెస్ సర్ప్రైజ్.. క్రిస్మస్ సందడి షురూ!
లండన్: ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలకు సిద్ధమవుతోంది. షాపింగ్ సెంటర్లు, వీధులు, ఇళ్లు క్రిస్మస్ లైట్లు, అలంకరణలు పండుగ థీమ్లతో మెరిసిపోతున్నాయి. ఇదే సమయంలో బ్రిటన్ దేశాధినేత, కామన్వెల్త్ దేశాల అధిపతి కింగ్ చార్లెస్ అతని సతీమణి క్వీన్ కెమిల్లాలు తమ 2025 అధికారిక క్రిస్మస్ కార్డును విడుదల చేసి, పండుగ సీజన్ ప్రారంభాన్ని ప్రకటించారు.ఈ కార్డులో క్రిస్మస్ నేపథ్యానికి బదులుగా, ఈ జంట ఇటీవల ఇటలీ సందర్శన సందర్భంగా తీసిన ఫొటో ఉంది. ఇది ఫోటోగ్రాఫర్ క్రిస్ జాక్సన్ తీసిన ఈ చిత్రం. రోమ్లోని విల్లా వోల్కోన్స్కీలో కింగ్ చార్లెస్ (77), క్వీన్ కెమిల్లా (78)లు ప్రశాంత వదనంతో ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. గత ఏప్రిల్లో వారి 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోటో తీశారు. ఈ ఫొటోలో క్వీన్ కెమిల్లా.. అన్నా వాలెంటైన్ రూపొందించిన తెలుపు,లేత గోధుమ రంగు కోటు ధరించి కనిపిస్తుండగా, కింగ్ చార్లెస్ నీలిరంగు చారల సూట్లో హుందాగా కనిపిస్తున్నారు. కార్డు లోపల ఈ జంట తమ హృదయపూర్వక సందేశాన్ని ‘మీకు హ్యాపీ క్రిస్మస్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలియజేస్తూ సంతకాలు చేశారు.2005లో వివాహం చేసుకున్న ఈ రాజ దంపతులు, తమ 20 ఏళ్ల బంధాన్ని ఇటలీలో జరుపుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు, వారు పురాతన రోమన్ ఆక్వా క్లాడియా దగ్గర తీయించుకున్న ఫోటోలను విడుదల చేశారు. 20 సంవత్సరాల తమ వైవాహిక జీవన మైలురాయి గురించి క్వీన్ కెమిల్లా మాట్లాడుతూ, తమ బంధం అపురూపమైనదన్నారు. ఈ క్రిస్మస్ కార్డు కేవలం శుభాకాంక్షలను మాత్రమే కాకుండా, ఈ రాజ దంపతుల మొదటి పర్యటన, వారి 20 ఏళ్ల వివాహ బంధంలోని మధుర స్మృతులను తెలియజేసింది. ఇది కూడా చదవండి: ఈయన క్లబ్లోనే మంటలు.. షాకిస్తున్న ఓనర్ బ్యాక్గ్రౌండ్
మరోసారి బద్ధలైన కిలౌయా అగ్నిపర్వతం.. వీడియో వైరల్
లాస్ ఏంజెల్స్: హవాయిలోని కిలౌయా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగిసిపడుతోంది. 100 అడుగుల ఎత్తు వరకు లావా చిమ్ముతోంది. ప్రపంచంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో ఒకటైన కిలౌయా విస్ఫోటనం.. ఏడాది క్రితం (2024 డిసెంబర్ 23న ప్రారంభమైంది. ఇప్పటి వరకు కిలోవేయ అగ్నిపర్వతం 38 సార్లు బద్ధలైంది.ఉత్తర వాయువ్య భాగం నుంచి ప్రస్తుతం సుమారు 50-100 అడుగులు(15-30 మీటర్లు) ఎత్తులో నిరంతర లావా ఎగసిపడతోందని యూఎస్ జియోలాజికల్ సర్వీసెస్ హవాయియన్ వల్కానో అబ్జర్వేటరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అగ్నిపర్వత వాయువు, బూడిద వల్ల స్థానిక విమానాశ్రయాలు ప్రభావితమయ్యే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు.🌋✨ Kīlauea is putting on a MASSIVE show today!Lava fountaining from the Halema‘uma‘u crater hit 1000+ ft (300 m) this morning during episode 38 — powerful enough to destroy a USGS camera less than a mile away. 😳A dramatic plume is shooting 20,000+ ft into the sky, with… pic.twitter.com/LTtKUWbDV8— mamtesh manohar (@DataIsKnowldge) December 7, 2025
జాతీయం
‘ఇదొక మంత్రం’.. ‘వందేమాతరం’చర్చలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వందేమాతరం, వేదకాలాన్ని గుర్తు చేస్తుందివందేమాతరం గీతం మన స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పాట...త్యాగం ,తపస్సుకు మార్గాన్ని చూపించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోరాటం ఏదో ఒక భూమి కోసం మాత్రమే కాదని వందేమాతరం మనకు అర్థమయ్యేలా చేసిందన్నారు. వందేమాతరం మన వేద కాలాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ భూమి నా తల్లి అని, నేను ఈ భూమికి పుత్రుడిని అని చెబుతుంది. వందేమాతరం మాతృభూమికి సంబంధించిన పాట అని ఆయన కొనియాడారు.వందేమాతరం రుణాన్ని సమిష్టిగా అభినందించేందుకే, ఈ పాట కారణంగానే మనమందరం ఇక్కడ ఉన్నాము. వందేమాతరం రుణాన్ని గుర్తించాల్సిన పవిత్ర సందర్భమిది అన్నారు మోదీ. 2047 నాటికి పూర్తి స్వావలంబన దిశగాదేశాన్ని నలుదిక్కులనుంచి ఏకంచేసింది. మళ్ళీ ఐక్యమై అందరితో కలిసి కదలాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పాట మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి మనకు స్ఫూర్తిని ,శక్తినివ్వాలి. 2047 నాటికి మన దేశాన్ని స్వావలంబనగా మరియు అభివృద్ధి చెందేలా చేయాలనే సంకల్పాన్ని మనం పునరుద్ఘాటించాలి" అని మోదీ పేర్కొన్నారు.జిన్నాకు వత్తాసు పలికారు, వందేమాతర గీతానికి ద్రోహం చేశారుభారత జాతీయ గీతాన్ని 50 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష పార్టీ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని అణచివేశారు. దేశభక్తులను జైళ్లలో నెట్టిన ఎమర్జెన్సీ మన దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అన్నారు మోదీ. ఇప్పుడు మనకు వందేమాతరం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని తెలిపారు.ముస్లింలకు నచ్చదనే కారణంగా జవహర్లాల్ నెహ్రూ - 'వందేమాతరం'ను వ్యతిరేకించడంలో ముహమ్మద్ అలీ జిన్నాను అనుసరించారని ఆరోపించారు. 1937లో మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ వందేమాతరం గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిందనీ, అయితే దానిని వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూలు వత్తాసు పలికి ఈ గీతం నుంచి కొన్ని పంక్తులను తొలగించారని విమర్శించారు. ‘వందేమాతరం అనేది ఒక మంత్రం.. నినాదం.. ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిని, ప్రేరణను ఇచ్చింది. త్యాగానికి, తపనకు మార్గాన్ని చూపింది. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకకు మనం సాక్షులుగా మారడం గర్వకారణం. ఇది ఒక చారిత్రక క్షణం. పలు చారిత్రక సంఘటనలను మైలురాళ్లుగా జరుపుకుంటున్న కాలం ఇది. ఇటీవలే మనం 75 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. దేశం.. సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకుంటోంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో వందేమాతర గీతంపై చర్చను ప్రారంభిస్తూ పేర్కొన్నారు. #WATCH | PM Narendra Modi says, "There is no leadership and opposition here. We are here to appreciate and accept the debt of Vande Mataram collectively. It is because of this song that we are all here together. It is a sacred occasion for all of us to acknowledge the debt of… pic.twitter.com/B4KvoXd5Wn— ANI (@ANI) December 8, 2025వలస పాలనలో బ్రిటిష్ వారు భారతీయులు ‘గాడ్ సేవ్ ది క్వీన్’ను పాడాలని ఆశించారు. కానీ దేశం ‘వందేమాతరం’ ద్వారా తన సొంత గొంతును వినిపించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన దేశభక్తి గీతం బ్రిటిష్ ఆధిపత్యానికి శక్తివంతమైన ప్రతిస్పందన అని ఆయన అభివర్ణించారు. భవిష్యత్ తరం ఈ చర్చ నుండి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. బ్రిటిష్ వారు తమ విభజించు-పాలించు విధానాన్ని బెంగాల్ నుండి ప్రారంభించారని, కానీ ‘వందేమాతరం’ స్ఫూర్తి వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసిందన్నారు. ‘వందేమాతరం’ బ్రిటిష్ పాలనకు తగిన సమాధానంగా మారింది. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం వలస పాలనలో ఉంది. 100వ వార్షికోత్సవంలో దేశం అత్యవసర పరిస్థితిలో ఉంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2025లో జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. వందేమాతర గీతాన్ని 1870లలో బంకిం చంద్ర ఛటర్జీ సంస్కృతీకరించిన బెంగాలీలో రాశారు. ఇది తొలుత 1882లో ఛటర్జీ బెంగాలీ నవల ఆనంద్మఠ్లో భాగంగా ప్రచురితమయ్యింది. లక్షలాది మంది వందేమాతరం జపిస్తూ, స్వాతంత్ర్యం కోసం పోరాడినందునే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని ప్రధాని పేర్కొనన్నారు. ఈరోజు మనం జాతీయ గీతాన్ని గుర్తు చేసుకోవడం ఈ సభలో మనందరికీ గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు తమ ‘గాడ్ సేవ్ ది క్వీన్’ అనే గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ‘వందేమాతరం’ రాశారని ప్రధాని తెలిపారు.‘వందేమాతరం’ దేశభక్తి నినాదం కంటే మించినదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది స్వాతంత్ర్య పోరాట సమయంలో శక్తివంతమైన యుద్ధ నినాదంగా పనిచేసిందని, ఈ నినాదం భారతీయులలో ధైర్యం, ఐక్యత, ధిక్కారాన్ని రేకెత్తించిందని, వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేసే ర్యాలీలకు పిలుపుగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. ‘వందేమాతరం’ దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దానిలోని భావోద్వేగ, సాంస్కృతిక ప్రభావానికి ప్రపంచంలో మరొకటి సాటిలేదని ప్రధాని పేర్కొన్నారు. గాంధీజీ ‘వందేమాతరం’ను జాతీయ గీతంతో సమానం చేశారని, నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనిని వ్యతిరేకించారని, ముహమ్మద్ అలీ జిన్నా అభిప్రాయాలతో ఏకీభవించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ వందేమాతరంను రాజీ పడటం కింద భావించిందని ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం 150 వసంతాల వందేమాతర గీతంపై ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ చర్చ లోక్సభలో 10 గంటలపాటు సాగనుంది. ఈ పాట మూలాలు, స్వాతంత్ర్య పోరాట సమయంలో దాని ప్రాముఖ్యత, భారతదేశ సాంస్కృతిక, జాతీయ గుర్తింపుపై వందేమాతర గీతం ప్రభావాన్ని మరోమారు పరిశీలించనున్నారు.
గోవా ప్రమాదం: తొలిసారి స్పందించిన నైట్క్లబ్
గోవా: గోవాలోని నార్త్ గోవా నైట్క్లబ్ ‘బిర్చ్ బై రోమియో లేన్’లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం క్లబ్ యజమాని సౌరభ్ లూత్రా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.తాజాగా క్లబ్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. జరిగిన ప్రాణనష్టంపై తాము తీవ్రంగా చలించిపోయామని విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చింది. కాగా క్లబ్ వ్యవహారాలను చూస్తున్న మేనేజర్ భరత్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత, లూత్రా అదృశ్యం చర్చనీయాంశమైంది. భారతదేశం అంతటా 50 రెస్టారెంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్న లూత్రా, ‘రోమియో లేన్’, ‘బిర్చ్ అండ్ మామాస్ బుయోయి’కి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాగా గోవాకు చెందిన సామాజిక కార్యకర్త తాహిర్ నోరోన్హా మాట్లాడుతూ లూత్రా.. గోవాకు అరుదుగా వస్తుంటాడని, చట్టపరమైన చర్యలకు దూరంగా ఉంటూ, అన్నింటికీ తన ప్రతినిధులను పంపుతాడన్నారు. క్లబ్ సిబ్బంది మాట్లాడుతూ లూత్రా నెలకు ఒకసారి మాత్రమే క్లబ్ను సందర్శిస్తారని, ఉద్యోగులతో అరుదుగా మాట్లాడతారని తెలిపారు. పరారీలో ఉన్న లూత్రో కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. Goa restaurant fire that claimed 25 lives | Saurabh Luthra, owner of Birch restaurant, issues a statement following the deadly fire that broke out in the restaurant on 7 December. pic.twitter.com/EFh9HZl35V— ANI (@ANI) December 8, 2025అగ్నిప్రమాదం జరిగిన సమయంలో సుమారు 100 నుండి 200 మంది డ్యాన్స్ ఫ్లోర్లో ఉన్నారని సమాచారం. మంటలు చుట్టుముట్టడంతో, ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు వంటగదివైపునకు పరుగెత్తారు. అక్కడే వారు సిబ్బందితో పాటు చిక్కుకుపోయారు. కాగా గోవా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. యజమాని సౌరభ్ లూత్రాను, అతని సోదరులను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.ఈ క్రమంలో లూత్రా కోసం దేశవ్యాప్తంగా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అగ్నిప్రమాదానికి దారితీసిన సంఘటనల పూర్తి క్రమాన్ని, భద్రతా ఉల్లంఘనలను అధికారులు పరిశీలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో క్లబ్లో సరైన నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు.ఇది కూడా చదవండి: తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!
తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!
న్యూఢిల్లీ: గోవాలో ఎంజాయ్ చేసేందుకు తొలిసారిగా వెళ్లిన ఢిల్లీకి చెందిన ఒక కుటుంబానికి తీరని విషాదం ఎదురయ్యింది. జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందాలని ఆశపడుతూ, సాగిన వారి పర్యటన చివరికి వారిని మృత్యు ఒడికి చేర్చింది. ఆదివారం తెల్లవారుజామున ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్, ఆయన భార్య భావన, ఆమె సోదరీమణులు అనిత, కమల, సరోజ్లతో పాటు కమల భర్త నవీన్, పిల్లలు కలిసి గోవా ట్రిప్కు బయలుదేరారు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున క్లబ్లో సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో టిఫిన్ చేసి, తిరిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఎలాగోలా బయటకు పరుగుపెట్టిన భావన, తన సోదరీమణులు లోపల చిక్కుకోవడాన్ని గమనించి ఉలిక్కిపడింది.మరోవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెడుతున్న జనాన్ని చూసి కూడా.. భావన తన అక్కాచెల్లెళ్లను కాపాడేందుకు ధైర్యంగా మంటల్లోకి వెళ్లారు. వినోద్ కుమార్ కూడా ఇదే ప్రయత్నంలో భావన వెంట వెళ్లారు. అంతకంతకూ ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగకు తోడు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో వారు కూడా ఆ మంటల మధ్యలో చిక్కుకున్నారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు సోదరీమణులు.. అనిత, కమల, సరోజ్, భావన భర్త వినోద్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. భావన మాత్రం ఎలాగోలా బయటపడగలిగారు.కుటుంబంలో నలుగురు మరణించిన విషయం తెలియడంతో ఢిల్లీలోని కరావాల్ నగర్లోని వారి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ విషయాన్ని ఆ ఇంటి పెద్ద అయిన వృద్ధురాలికి ఇంకా చెప్పలేదని కుటుంబ స్నేహితుడు హరీష్ సింగ్ తెలిపారు. ‘వారు గోవాకు వెళ్లడం ఇదే మొదటిసారి. వారంతా చాలా ఉత్సాహంగా వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వారి తల్లి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఆమెకు ఈ విషయం చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాం’ అని సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. గోవా నైట్క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు
బెళగావిలో భీకరమే
బెళగావి శివార్లలోని సువర్ణసౌధ అసెంబ్లీ భవనంలో నేటి (సోమవారం) నుంచి రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 10 రోజుల పాటు జరిగే సమావేశాలకు భారీ పోలీసు బందోబస్తుతో పాటు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కుర్చీ మార్పిడి గొడవ మధ్యలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లకు ఆయుధం చిక్కినట్లయింది.శివాజీనగర: బెళగావిలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతాయనడంలో సందేహం లేదు. అతివృష్టి, రైతులకు నష్టాలు, చెరకు రైతుల ఆందోళనలు చర్చకు రాబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి దుమ్మెత్తిపోయాలని ప్రతిపక్షాలు ఆతృతగా ఉన్నాయి. మొక్కజొన్న, ఉల్లిగడ్డలు, ఎండుమిరప ధరలు తగ్గిపోవడం, అన్నదాతలకు పరిహారంలో లోపాలు, గ్యారంటీ నిధులలో జాప్యం, ఉత్తర కర్ణాటక వెనుకబాటు, అభివృద్ధి కార్యక్రమాలకు సొమ్ములు రాకపోవడం, బెంగళూరుతో సహా రాష్ట్రంలో వరుసగా ఏటీఎంలు, బ్యాంకుల్లో దోపిడీ పర్వాలు సైతం సిద్దరామయ్య ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా మారే అవకాశముంది. ఢీ అంటే ఢీ సువర్ణసౌధలో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సమాయత్తమైంది. సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చింది. దీంతో ఢీ అంటే ఢీ అనేలా అసెంబ్లీ జరగనుందని అంచనాలున్నాయి. ముఖ్యమంత్రి మార్పిడి రాజకీయం కోలాహలం రేకెత్తించవచ్చు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే విజయేంద్ర తదితరులు బెళగావికి చేరుకున్నారు. వివిధ హోటళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు బస ఏర్పాటైంది. హోరెత్తనున్న ఆందోళనలు ప్రజా, రైతు సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సువర్ణగార్డన్, అలారవాడ వద్ద ధర్నాలకు స్థలం కేటాయించారు. బీజేపీ, జేడీఎస్ నేతలు చెరకు, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలని 9న సువర్ణసౌధ ముట్టడి నిర్వహిస్తారు. ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, రైతులు, ప్రజలు ఇలా అనేక వర్గాలవారు సౌధ ముందు ఆందోళనలకు సిద్ధమయ్యారు.ప్రత్యేక రాష్ట్ర వాదనలురాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తే అవకాశముంది. యాదగిరి, కలబుర్గి, కొప్పళ, బళ్లారి, విజయనగర, బీదర్, రాయచూరు, బాగల్కోట, బెళగావి, ధార్వాడ, గదగ్, హావేరి, దావణగెరె జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, కాబట్టి ప్రత్యేక రాష్ట్రం చేయడం అవసరమని హస్తం ఎమ్మెల్యే రాజు కాగె ఇటీవల డిమాండ్ చేశారు. పాలకులు ఈ ప్రాంతాలపై సవతి ప్రేమను చూపిస్తున్నారని దుయ్యబట్టారు. జనాభా పెరిగేకొద్దీ రాష్ట్రాలను విభజించాల్సిన అవసరముంది. భవిష్యత్తులో కర్ణాటకను రెండు, ఉత్తరప్రదేశ్ను 5, మహారాష్ట్రను 3 రాష్ట్రాలుగా విభజించక తప్పదని, బెళగావి అసెంబ్లీపై ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేస్తామని ఎమ్మెల్యే భరమగౌడ చెప్పారు.గతంలో లేనంత భద్రత అసెంబ్లీతో పాటు పరిసరాలలో మునుపెన్నడూ ఏర్పాటు చేయని పోలీస్ భద్రతను ఈసారి చేపట్టారు. బెళగావి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో హై అలర్ట్ను ప్రకటించారు. స్థానిక మరాఠా సంఘాలపై ఓ కన్నేశారు. 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 మంది ఐపీఎస్లు మకాం వేశారు.
ఎన్ఆర్ఐ
గ్రామాలను దత్తత తీసుకున్న శంకర నేత్రాలయ USA మిల్వాకీ దాతలు
శంకర నేత్రాలయ USA నిర్వహించిన మిల్వాకీలో ఒక చిరస్మరణీయ రాత్రి, అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు మద్దతుగా $50,000(రూ. 43 లక్షలు) దాక సేకరించారు. భారతదేశంలోని పేద వర్గాలకు కంటి శస్త్రచికిత్సలు చేయడానికి రూపొందించబడిన అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ USA లైట్ మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించడంతో పెవాకీలోని విస్కాన్సిన్ హిందూ దేవాలయం సంస్కృతి, కరుణల శక్తిమంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఈ కార్యక్రమం దాదాపు ౩50 మంది ప్రేక్షకులతో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంలో సమాజం, కళ, సేవ, శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్-మిల్వాకీ సత్య జగదీష్ బాదం ఇలా పంచుకున్నారు. “మిల్వాకీ సేవా స్ఫూర్తితో పసిగడుతుంది. ఈ రాత్రి, మేము కలిసి వచ్చాం. కేవలం సేకరించడానికికాదు, ఉమ్మడి ఉద్దేశ్యం ద్వారా జీవితాలను ప్రకాశవంతం చేయడానికి.” "శంకర నేత్రాలయ USA టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లోకి తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. దృష్టి లోపాలతో బాధపడుతున్న నిరుపేద వ్యక్తులకు సేవ చేయాలనే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మిల్వాకీ నుంచి ఉత్సాహభరితమైన మద్దతు మాకు ప్రోత్సాహాన్నిచ్చింది" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందూర్తి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో..పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ సత్య జగదీష్ బాదం, కమిటీ సభ్యులు డాక్టర్ హరి బండ్ల, పోలిరెడ్డి గంటా, చాప్టర్ లీడ్స్ మహేష్ బేలా మరియు అర్జున్ సత్యవరపు, వాలంటీర్లు ఆనంద్ అడవి, సాయి యార్లగడ్డ, రవి నాదెళ్ల, శ్రీని కిలిచేటి, చండీ ప్రసాద్, క్రాంతి మల్రెడ్డి, గుప్తా కళ్లేపల్లి, పవన్ శ్రీభాష్యం, విజయ్ వల్లూరి, చంద్రశేఖర్ గుడిసె, కరుణాకర్ రెడ్డి దాసరి, రత్నాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, కొండారెడ్డి, వెంకట్ శశి కొద్దంరెడ్డి, వౌనద్ శవధరి, వెంకట్ జాలరి రెడ్డి రెడ్డి, గోపాల్ గారు, రాజా బాబు నేతి, విక్రాంత్ రెడ్డి, గోపాల్ సింగ్, శ్రీనివాస్ నిమ్మ, రంజిత్, శ్రావణి మీసరగండ, వాసవి బాదం, ప్రీతి, కీర్తి, లావణ్య, సునీత, పావని గంట, చంద్రిక, సంతోషి, భాను, సరోజిని, కావ్య వి, రాధిక పెబ్బేటి, శరణ్య రాఘవ, శరణ్య జాలరి, కిరణ్య జ్ఙాపక ముత్తూరు, డీఎస్ రెడ్డి, రవి కుమార్ గుంత, రమేష్ పుసునూరు, శ్రీనివాస్ యూర్కేరి, ప్రమోద్ అల్లాణి, పవన్ జంపాని, ప్రీతి శర్మ, అనిల్ పబ్బిశెట్టి. రాజ్ వధేరాజ్, యాజులు దువ్వూరు, ఫణి చప్పిడి, దుర్గ, ధనలక్ష్మి, కార్తీక్ పాసెం, భారతి కొల్లి, ఉమాదేవి పువ్వాడి, దుర్గా బండారుపల్లి, వెంకట కుందూరి, డా. రెడ్డి ఊరిమిండి, మూర్తీ రేకపల్లి,శ్యాంఅప్పాలి, వంశీ ఏరువారం, రత్నకుమార్కవుటూరు, త్యాగరాజన్, దీన్ దయాళన్, సురేశ్ కుమార్లు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన బృందం శంకర నేత్రాలయ సేవా లక్ష్యం పట్ల అంకితభావం, సహకారం, భాగస్వామ్య నిబద్ధతను ఉదహరించారు. చంద్ర మౌళి తమ వందన సమర్పణలో కార్యక్రమ వ్యాఖ్యాతలు మాలతి కర్రి, శ్రీ వల్లిల సహకారాన్ని గుర్తించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు .
సింగపూర్లో కార్తీకమాస స్వరారాధన
సింగపూర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సాంస్కృతిక సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారథి", ఈ పవిత్ర కార్తీకమాస సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో శనివారం "కార్తీకమాస స్వరారాధన" అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach)బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే సింగపూర్ గాయని గాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కానీ ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడడం చాలా అభినందనీయం" అని తెలియజేశారు.డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ ప్రసంగంలో మాట్లాడుతూ కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరిస్తూ, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.సంస్థ ప్రధాన నిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభా సమన్వయం చేయగా, సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సభలో, సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు. వానిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండడం విశేషం.కల్చరల్ టీవీ సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం ఎప్పటివలే అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది. (చదవండి: జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు)
ఆస్ట్రేలియా ఎన్నారైల మద్దతు చిరస్మరణీయం:లక్ష్మీపార్వతి
సిడ్నీ: వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా ఎన్నారై వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ఆమె పార్టీ నాయకుడు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్పై మీరు చూపిన ఆధారాభిమానానికి పార్టీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. మీ మద్దతు చిరస్మరణీయంగా నిలుస్తుంది’అని పేర్కొన్నారు. ‘మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమలో చాలామంది మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఆ రుణం తీర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ వైఎస్ జగన్కు మద్దతుగా ఉంటాం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, దూడల కిరణ్ రెడ్డి, నరెడ్డి ఉమా శంకర్, కృష్ణ చైతన్య కామరాజు, నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాలో లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీ శ్రేణుల ఘనస్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం బ్రిస్బేన్లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు.
క్రైమ్
మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు
వింటర్ చైల్డ్, పర్వత మనిషి తనకు తాను గర్వంగా అభివర్ణించుకున్న ఒక పర్వాతారోహకురాలు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసింది. ఈ ఘటన పర్వతారోహకుల ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ విషాదానికి ఆమె ప్రియుడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందంటే..కెరిస్టీన్ గుర్ట్నర్ అనే33 ఏళ్ల ఆస్ట్రియన్ మహిళ 39 ఏళ్ల ప్రియుడు థామస్ ప్లాంబర్గర్తో ఎత్తైన శిఖరం గ్రాస్గ్లాక్నర్ను అధిరోహించారు. థామస్ అనుభవజ్ఞుడైన గైడ్ కూడా. ఈ జంట అనుకున్న దానికంటే రెండు గంటలు ఆలస్యంగా ఆ అవరోహణను ప్రారంభించారు. -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు హరికేన్-పవర్ విండ్స్ లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గుర్ట్నర్ అలసిపోయిన గుర్ట్నర్ 150 అడుగుల దిగువన దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే ఆమెను గైడ్ చేసి సాయం చేయాల్సిన ప్లాంబర్గర్ నిర్లక్ష్యంగా వదిలేశాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివౌక్ సంచిని ఉపయోగించలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కొన్ని గంటల తరువాత గానీ రెస్క్యూ సర్వీసులను సంప్రదించలేదు. పైగా మొదటి కాల్ తర్వాత తన ఫోన్ను సైలెంట్లో పెట్టుకున్నాడు. దూర నుంచి ఒక హెడ్టార్చ్తప్ప ఇంకేమీ వెబ్ క్యామ్లో కనిపించలేదు.మరోవైపు తీవ్రమైన గాలుల కారణంగా మరుసటి రోజు ఉదయం దాకా రెస్క్యూ బృందాలు గుర్ట్నర్ను చేరుకోలేకపోయాయి. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. దీంతో ప్లాంబర్గర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.స్నేహితురాలిలా కాకుండా, ఆల్పైన్ హై-ఎలిట్యూడ్ టూర్లతో ఇప్పటికే చాలా అనుభవమున్న వ్యక్తిగా, టూర్ను ప్లాన్ చేశాడు కాబట్టి,బాధ్యతాయుతమైన గైడ్గా వ్యవహరించాలని ఇన్స్బ్రక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. తీవ్ర నిర్లక్ష్యంతో నరహత్యకు పాల్పడ్డాడని, దోషిగా తేలితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దురదృష్టవశాత్తూ జరిగినవిషాదకరమైన ప్రమాదమని ప్లాంబర్గర్ న్యాయవాది వాదిస్తున్నాడు. ఈ కేసును 2026, ఫిబ్రవరి 19న, ఇన్స్బ్రక్ ప్రాంతీయ కోర్టులో విచారించ నున్నారు. గుర్ట్నర్ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆన్లైన్ స్మారక పేజీని ఏర్పాటు చేశారు. అద్భుతమైన మహిళ అంటూ కెర్స్టిన్ గుర్ట్నర్కు అనేకమంది నివాళులర్పించారు. పలు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.
కులం కాటుకు ఎంటెక్ విద్యార్థిని బలి
ఒంగోలు టౌన్: కులం కాటుకు మరో యువతి బలైంది. ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డయింది. దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి సూసైడ్ నోట్ ప్రకారం వివరాలివీ.. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంకు చెందిన మైరాల నళిని, మహేంద్ర నగర్కు చెందిన సింగోలు శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. నీవు లేకపోతే బతకలేనని చెప్పిన శ్రీనివాస్ నళినిని అన్ని విధాలా వాడుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. నీ కులం వేరు నా కులం వేరు.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడంలేదంటూ ఫోన్ కట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో శ్రీనివాస్తో మాట్లాడదామని శనివారం అతడి ఇంటికి వెళ్లింది. ‘శ్రీనివాస్ మాలలో ఉన్నాడు.. ఇంట్లోకి రావద్ద’ని అతని తల్లిదండ్రులు నళినిని బయట నుంచే పంపించేయడంతో ఇక శ్రీనివాస్తో తన పెళ్లి జరగదని ఆందోళనకు గురైన నళిని ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని మరణించింది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ చూపరులను కలచివేస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన నళిని ఎంటెక్ చదివింది. తండ్రి దేవదానానికి నలుగురు ఆడపిల్లలు ఉండగా వారిలో ముగ్గురికి వివాహమైంది. నళిని మూడో సంతానం. వన్ టౌన్ సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. దళిత హక్కుల సంఘం నాయకులు నీలం నాగేంద్రం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. నళిని మృతికి కారణమైన శ్రీనివాస్ మీద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
స్పా ముసుగులో వ్యభిచారం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు. ⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు.
నా కూతురు మృతికి అల్లుడే కారణం
దుబ్బాకరూరల్: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో జరిగింది. ఎస్ఐ కీర్తి రాజ్ వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుష్మ(32)ను పన్నెండేళ్ల క్రితం శ్రీకాంత్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కొంత కాలంగా భర్త, అత్తామామల నుంచి పలు రకాలుగా వేధింపులు ఎక్కువయ్యాయి. తల్లిదండ్రులకు తరుచు తెలుపడంతో నచ్చజెప్పేవారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ బాబు కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీడియోలు
Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్
ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ
Maoist Leader: మావోలకు భారీ ఎదురుదెబ్బ 3 కోట్లు రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సరెండర్
ఛీ.. ఛీ.. మీరు రాష్ట్రానికి పట్టిన. రామ్మోహన్ నాయుడు, లోకేష్పై రెచ్చిపోయిన KA పాల్
Kethireddy Pedda Reddy: అంతా మీ ఇష్టమా! తాడిపత్రి మీ అడ్డా కాదు
ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!
వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు
Tadepalli : పోలీసుల ఓవర్ యాక్షన్ విద్యార్థి నేతలను లారీ ఎక్కించి..!
Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్పేయి విగ్రహం చిచ్చు

