breaking news
TG20 League
-
టీజీ20 లీగ్లో ఆటగాళ్ల సందడి...స్పెషల్ అట్రాక్షన్గా తిలక్ వర్మ (ఫొటోలు)
-
‘భవిష్యత్తు బాగుంటుంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్ మున్ముందు పెద్ద స్థాయికి చేరే అవకాశం ఉందని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తాము జత కట్టామని వరంగల్ వారియర్స్ సహ యజమాని వరుణ్ జూపల్లి అన్నారు. ఎంతో మంది ప్రతిభ గల యువ ఆటగాళ్లు సరైన అవకాశం ఎదురు చూస్తున్నారని, తొలి సీజన్లో ఇప్పటి వరకు లభిస్తున్న స్పందనను చూస్తే లీగ్ విజయవంతమైనట్లుగా చెప్పవచ్చని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘మా సన్నిహితులు అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్లోని ఒక జట్టులో సహ యజమానిగా ఉన్నారు. ఆ కారణంగా టీజీ టి20లో టీమ్ను కొనుగోలు చేయాలనే ఆలోచన కలిగింది. క్రికెట్పై ఆసక్తితో పాటు మన వద్ద జరుగుతున్న టోర్నీలో భాగమైతే బాగుంటుందని ముందుకు వచ్చాం. ఇందులో లాభాల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. రాబోయే సీజన్లలో లీగ్ మరింత పెద్ద స్థాయికి చేరుతుంది’ అని వరుణ్ వ్యాఖ్యానించారు. టోర్నీలో తమ తొలి మ్యాచ్లో అనూహ్యంగా ఓడినా... వరంగల్ టీమ్ అన్ని విధాలా పటిష్టంగా ఉందని వరుణ్ చెప్పారు. ముఖ్యంగా పేరాల అమన్ రావు అద్భుత ప్రదర్శనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘అమన్ సూపర్ షాట్స్ ఆడాడు. సాధికారికంగా అతను బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే ఐపీఎల్లోకి ఎందుకు ఎంపికయ్యాడో తెలుస్తుంది. అమన్ మాత్రమే కాకుండా ఇతర కుర్రాళ్లపై కూడా మాకు నమ్మకం ఉంది. లీగ్లో వారియర్స్ మంచి ఫలితాలు సాధించడం ఖాయం’ అని వరుణ్ వెల్లడించారు. బీసీసీఐ అనుమతించిన నిబంధనల ప్రకారం భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉండటంతో తొలి మ్యాచ్ ఆడలేదని... తర్వాతి మ్యాచ్లలో అతను బరిలోకి దిగుతాడని వరుణ్ స్పష్టం చేశారు. -
త్యాగరాజన్ ఆల్రౌండ్ షో.. ఫాల్కన్స్పై రైజర్స్ ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా ఇవాళ (జూన్ 23) రాత్రి జరిగిన మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రైజర్స్.. ఫాల్కన్స్ను 164 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. అనంతరం రైజర్స్ బ్యాటర్లు మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు (5 వికెట్ల నష్టానికి). కెప్టెన తనయ్ త్యాగరాజన్ బంతితో (4-0-36-3), బ్యాట్తో (11 బంతుల్లో 21) సత్తా చాటి రైజర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.రాణించిన బౌలర్లుతనయ్ త్యాగరాజన్ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్ పట్టి ఫాల్కన్స్ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఫాల్కన్స్ ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసిన విక్రమ్ నాయక్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్ అగర్వాల్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.శుభారంభం అందించిన ఓపెనర్లు165 పరుగుల లక్ష్య ఛేదనలో రైజర్స్ ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆరోన్ జార్జ్ (27), అరవెల్లి అవనీశ్ (25) మెరుపు ఇన్నింగ్స్లతో గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ఆదిత్య (12), అలంక్రిత్ (9) నిరాశపరిచినా.. రాకేశ్ (38 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి రైజర్స్ను గెలుపుతీరాలకు చేర్చాడు. అతనికి తనయ్ త్యాగరాజన్, నితిన్ యాదవ్ (28 నాటౌట్) సహకరించారు. ఫాల్కన్స్ బౌలర్లలో వరుణ్ 2 వికెట్లు పడగొట్టగా.. రవితేజ, అబ్బాస్, అశ్విన్ రామ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
మెదక్ ఫాల్కన్స్పై రంగారెడ్డి రైజర్స్ గెలుపు
మెదక్ ఫాల్కన్స్పై రంగారెడ్డి రైజర్స్ గెలుపుతొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. రంగారెడ్డి రైజర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గెలుపు దిశగా రంగారెడ్డి రైజర్స్165 పరుగుల లక్ష్య ఛేదనలో రంగారెడ్డి రైజర్స్ గెలుపు దిశగా సాగుతోంది. 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన ఆ జట్టు.. మరో 36 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది. సత్తా చాటిన త్యాగరాజన్.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన ఫాల్కన్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్ పట్టి ఫాల్కన్స్ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఫాల్కన్స్ ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసిన విక్రమ్ నాయక్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్ అగర్వాల్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 5 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్5 బంతుల వ్యవధిలో ఫాల్కన్స్ 2 వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్మూడో బంతికి త్యాగరాజన్ నమన్ అగర్వాల్ను (37) ఔట్ చేయగా. 16వ ఓవర్ తొలి బంతికే వరుణ్ను (1) అరుణ్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కోలుకున్న ఫాల్కన్స్5 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఫాల్కన్స్ తిరిగి కోలుకుంది. 12 ఓవర్లలో ఆ జట్టు మూడే వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్ (31), నమన్ అగర్వాల్ (21) ఫాల్కన్స్ను ఆదుకున్నారు. 3 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న మెదక్ ఫాల్కన్స్ కష్టాలు ఎదుర్కొంటుంది. 55 ఓవర్లలో ఆ జట్టు 51 పరుగులు చేసినప్పటికీ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత తనయ్ త్యాగరాజన్ బౌలింగ్లో శృన్జిత్ రెడ్డి క్లీన్ బౌల్డ్ కాగా.. ఆతర్వాత రవితేజ (6), పూర్ణచంద్ రావ్ (38) పెవిలియన్కు చేరారు. రవితేజను తనయ్ జడ్డూ ఔట్ చేయగా.. త్యాగరాజన్ పూర్ణచంద్ ఆట కట్టించాడు. తొలి వికెట్ కోల్పోయిన ఫాల్కన్స్2.3వ ఓవర్- 26 పరుగుల వద్ద మెదక్ ఫాల్కన్స్ తొలి వికెట్ కోల్పోయింది. తనయ్ త్యాగరాజన్ బౌలింగ్లో శృన్జిత్ రెడ్డి (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా ప్రణవ్ రంగారెడ్డి రైజర్స్- మెదక్ ఫాల్కన్స్ మంగళవారం రాత్రి తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మెదక్ ఫాల్కన్స్ బ్యాటింగ్కు దిగింది.తుది జట్లు..రంగారెడ్డి రైజర్స్: తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్ఘీస్, అవనీశ్ రావ్ (వికెట్కీపర్), అలంక్రిథ్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితీశ్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, తనయ్ జడ్డూ, ఆర్యన్ కరియప్పమెదక్ ఫాల్కన్స్: రవితేజ (కెప్టెన్), సాయి పూర్ణానంద్ రావ్, శృన్జిత్ రెడ్డి, విక్రమ్ నాయక్ (వికెట్కీపర్), సూర్య తేజ, సాయి వరుణ్, జంగం బన్ని, అశ్వినన్ రామ్, నమన్ అగర్వాల్, సయ్యద్ ఘజా అబ్బాస్, మధుకర్ మన్నే -
హైదరాబాద్కు తొలి గెలుపు
తెలంగాణ టీ20 లీగ్-2026లో హైదరాబాద్ ఇ- ఛాంపియన్స్ జట్టు తొలి మ్యాచ్లోనే విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా ఇవాళ (జూన్ 23) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పాలమూరు స్ట్రయికర్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన హైదరాబాద్.. పాలమూరు జట్టును 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ చేసింది. అనుముల విఘ్నేశ్ రెడ్డి (30), రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ చెరో రెండు, శ్రీనికేత్ ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 35 పరుగులు చేసి శుభారంభం అందించగా.. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేశ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. పాలమూరు బౌలర్లలో రిషబ్ బస్లాస్ 2, రవి కిరణ్ ఓ వికెట్ తీశారు. -
పాపం పాలమూరు.. వరుసగా రెండో ఓటమి
తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్- హైదరాబాద్ ఇ- చాంపియన్స్ మంగళవారం తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాలమూరు బ్యాటింగ్కు దిగింది. పాలమూరు ఆలౌట్హైదరాబాద్ బౌలర్ల ధాటికి పాలమూరు 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. అనుముల విఘ్నేశ్ రెడ్డి (30), రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30) ఓ మోస్తరుగా రాణించారు. హైదాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ చెరో రెండు, శ్రీనికేత్ ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ గెలుపునామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. 15.4 ఓవర్లలో పనిపూర్తి చేసింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి తొలి గెలుపు నమోదు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిరథ్ రెడ్డి 35 పరుగులు చేయగా.. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేశ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాలమూరు బౌలర్లలో రిషభ్ బస్లాస్ రెండు, రవి కిరణ్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా సీజన్ ఆరంభ మ్యాచ్లో పాలమూరు ఖమ్మం ఏసెస్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.తుదిజట్లుపాలమూరుఅనుముల విజ్ఞేశ్ రెడ్డి, పృథ్వీ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్), రోహిత్ రాయుడు, నిశాంత్ సేన్ రెడ్డి సీహెచ్, ప్రతీక్ పవార్, మహ్మద్ ఆఫ్రిది అహ్మద్, నిపుణ్ రెడ్డి శవ్వా, రిషభ్ బస్లాస్, కిరణ్, జంబోజు పార్దీబన్.హైదరాబాద్హైదరాబాద్అభిరథ్ రెడ్డి మందాడి (కెప్టెన్), ప్రణవ్ వర్మ, అరవింద్ (వికెట్ కీపర్), సాయి వికాస్ రెడ్డి, శ్రీనికేత్, షణ్ముఖ, అఖిల్ రాథోడ్, గడుగు గణేశ్, అన్విత్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, యశ్వీర్ గౌడ్. -
టైటిల్ ఖమ్మం టీందే..!
-
‘చాలా బాధపడ్డాను.. సత్తా చాటేందుకు ఇదే మంచి సమయం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్ధమాన క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించే అందరి దృష్టిలో పడేందుకు తెలంగాణ టి20 లీగ్ (టీజీ టీ20) తగిన అవకాశం కల్పిస్తోందని పేస్ బౌలర్ సీవీ మిలింద్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్న మిలింద్... టీజీ టి20లో అన్విత ఖమ్మం ఏసెస్ టీమ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్లో విజయంతో ఏసెస్ శుభారంభం చేసింది. 'టోర్నీ తొలి మ్యాచ్లోనే మా జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. తర్వాత మ్యాచ్ల్లోనూ మంచి ఫలితాలు సాధించి ఏసెస్కు టైటిల్ అందించాలని పట్టుదలగా ఉన్నా' అని మిలింద్ చెప్పాడు. ‘ఇతర రాష్ట్రాల టీ20 లీగ్లను చూసినప్పుడల్లా మన వద్ద ఇలాంటి టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అనుకునేవాళ్లం. ఎట్టకేలకు ఇప్పుడు హెచ్సీఏ అధికారికంగా లీగ్ జరపడం సంతోషంగా ఉంది' అని మిలింద్ వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా హెచ్సీఏ లీగ్స్లో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొంటారని... అయితే వారి ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించదని మిలింద్ అభిప్రాయపడ్డాడు. అలాంటి క్రికెటర్లకు తమ సత్తా చాటి మున్ముందు కెరీర్లో ఎదిగేందుకు టీజీ టి20 లీగ్ సరైన వేదిక అని అతను చెప్పాడు. ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ అంశం వేలం, వారికి దక్కిన మొత్తం గురించి కాదు. కుర్రాళ్ల ప్రతిభకు సరైన అవకాశం. ఆటగాళ్ల కోణంలో చూస్తే అన్ని విధాలా లీగ్ సరైన ప్రయత్నం' అని మిలింద్ విశ్లేషించాడు.వ్యక్తిగతంగా చూస్తే తమ ఖమ్మం ఏసెస్ యాజమాన్యం అన్ని విధాలా టీమ్కు అండగా నిలిచిందని మిలింద్ వెల్లడించాడు. 'అన్విత గ్రూప్ సరైన ప్రణాళికతో టీమ్ ను సిద్ధం చేసింది. మేమంతా నగర శివార్లలో పది రోజులకు పైగా జరిగిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొన్నాం. మా టీమ్ యజమాని అనూప్ అక్కడే ఉండి టీమ్ బాండింగ్కు ఎంతో సహకరించాడు.. ఓవరాల్గా కూడా టోర్నీలో ఐపీఎల్ తరహా వాతావరణం కనిపించడం సానుకూలాంశం' అని మిలింద్ విశ్లేషించాడు. -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్ హాంఫట్
తెలంగాణ టీ20 లీగ్ను మెదక్ ఫాల్కన్స్ ఘనంగా ఆరంభించింది. ఉప్పల్ మైదానం వేదికగా వరంగల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఈ విజయంలో మెదక్ కెప్టెన్ తిలక్ వర్మది కీలక పాత్ర. ఈ టీమిండియా సూపర్ స్టార్ విరోచిత శతకంతో చెలరేగాడు. 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతడితో పాటు విక్రం నాయక్ గగులోత్(25), శృజిత్ రెడ్డి(25) రాణించారు. వరంగల్ బౌలర్లలో కులకర్ణి, మన్సూరి తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో కెప్టెన్ అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ సాధించారు. -
TG20 League 2026: తిలక్ వర్మ సూపర్ సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా వరంగల్ వారియర్స్తో మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్, టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ శతక్కొట్టాడు. 259 పరుగుల భారీ లక్ష్య చేధనలో తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో తిలక్ 42 బంతుల్లో తొలి టీజీ 20 సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును తిలక్ విజయ తీరాలకు చేర్చాడు. -
TG20 League: వైభవ్ టీమ్మేట్ విధ్వంసం.. 32 బంతుల్లోనే సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు. మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు విడిచిపెట్టలేదు. 7 ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్లో అతడు 15 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా అమన్ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా అమన్రావ్ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ క్యాంప్లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అమన్ రాజస్తాన్ తరపున అరంగేట్రం చేయనప్పటికి జోఫ్రా ఆర్చర్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్ను నెట్స్లో ఎదుర్కొన్న అనుభవం అతడికి బాగా కలిసొచ్చింది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ సంచలనంతో కూడా డ్రెస్సింగ్ రూమ్ను అమన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వైభవ్ తరహాలోనే టీజీ 20 లీగ్లో అమన్ దుమ్ములేపుతున్నాడు. -
TG20 League 2026: శతక్కొట్టిన తిలక్ వర్మ.. మెదక్ ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.మెదక్ ఫాల్కన్స్ ఘన విజయంఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ తిలక్ వర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్లతో 136) అజేయ సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో మెరిశాడు.విజయం దిశగా మెదక్మెదక్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. 18 ఓవర్లకు స్కోర్: 239/6తిలక్ వర్మ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ 42 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 104 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. మొదక్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు15 ఓవర్ వేసిన అసిఫ్ బౌలింగ్లో మెదక్ రెండు వికెట్లు కోల్పోయింది. అనిష్ రెడ్డి(2), సూర్యతేజ(0) వరుసగా ఔటయ్యారు. తిలక్ 99 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ డౌన్19 పరుగులు చేసిన వరుణ్.. మురుగన్ అభిషేక్ బౌలింగ్లో ఔటయ్యాడు. మొదక్ మూడో వికెట్ డౌన్మెదక్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన తెలుకుపల్లి తేజ.. కులకర్ణి బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు మెదక్ స్కోర్: 159/4తిలక్ హాఫ్ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 23 బంతుల్లోనే మొదటి టీజీ20 ఆర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 8 ఓవర్లకు మెదక్ స్కోర్: 104/2దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి మెదక్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(24), శృంజిత్(16) ఉన్నారు.వరంగల్ భారీ స్కోర్ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో వరంగల్ వారియర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.మూడో వికెట్ డౌన్వరంగల్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సిసోడియా తిలక్ బౌలింగ్లో ఔటయ్యాడు.వరంగల్ రెండో వికెట్ డౌన్వరంగల్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 48 బంతుల్లో 142 పరుగులు చేసిన అమన్రావు పేరాల.. రాహుల్ బౌలింగ్లో ఔటయ్యాడు.లీగ్ తొలి సెంచరీఅమన్రావు 32 బంతుల్లో శతక్కొట్టాడు.వరంగల్ తొలి వికెట్ డౌన్వరంగల్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన హర్షిత్ చౌదరి.. సూర్యతేజ బౌలింగ్లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లలో వరంగల్ స్కోర్: 134-1అమన్ ఫిప్టీవరంగల్ కెప్టెన్ అమన్ రావు పేరాల కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, మూడు సిక్స్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. దీంతో వరంగల్ స్కోర్ పవర్ప్లేలోనే వంద పరుగులు దాటింది.దంచికొడుతున్న వరంగల్ ఓపెనర్లువరంగల్ ఓపెనర్లు అమన్ రావు(22), హర్షిత్(21) దూకుడు ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి వరంగల్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్గా టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు.మరో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్(వరంగల్) మాత్రం ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. టీజీ20 లీగ్ తొలి సీజన్ వేలంలో తిలక్ను రూ.33 లక్షల రికార్డు ధరకు మెదక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తుదిజట్లు వరంగల్ వారియర్స్ అమన్రావు పేరాల (కెప్టెన్), హర్షిత్ చౌదరి, భావేశ్ సేథ్, రుషికేశ్ సిసోడియా, మురుగన్ అభిషేక్, ఆది మణికిరణ్, అనిరుధ్ శ్రీవాస్తవ టీపీ, మహ్మద్ ఆసిఫ్ మన్సూరి, షౌనక్ కులకర్ణి, మహ్మద్ ముదస్సర్ హుస్సేన్, క్రాంతి పల్లెపాటి.మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మ (కెప్టెన్), రవితేజ టి, నమన్ అగర్వాల్, శృజిత్ రెడ్డి, విక్రం నాయక్ గగులోత్, నిమ్మగడ్డ సూర్యతేజ, సాయి వరుణ్ యెర్రమ్, నయని అనీశ్ రెడ్డి, కుంటా రాహుల్, ఘాజి అబ్బాస్ అబేది, మధుకర్ మన్నె. -
తనయ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రంగారెడ్డి ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్ శుభారంభం చేసింది. సోమవారం ఉప్పల్ మైదానం వేదికగా అనురాగ్ నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజయం సాధించింది. నల్గొండ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. రైజర్స్ కెప్టెన్ తన్మయ్ త్యాగరాజన్(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 71 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేశాడు. నల్గొండ బౌలర్లలో వరుణ్ గౌడ్, అనికేత్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.That's one way to finish a game! 💥Nitin Sai Yadav wasted no time to make a telling impact on the chase, cruising away to 2️⃣6️⃣* off just 9️⃣ deliveries to close out the game for his side!#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EDp4AKNMNq— tg20official (@tg20official) June 22, 2026 -
నల్గొండ నామమాత్రపు స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?
తెలంగాణ టీ20 లీగ్-2026లో రెండో మ్యాచ్లో భాగంగా రంగారెడ్డి రైజర్స్- నల్గొండ నైట్స్ సోమవారం ముఖాముఖి ఎదురుపడ్డాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్కు దిగింది.నల్గొండ స్కోరెంతంటే?ఈ క్రమంలో రంగారెడ్డి బౌలింగ్ ధాటికి నల్గొండ ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7) విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన నితీశ్ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్ రాహుల్ బుద్ధి మెరుపులు (19 బంతుల్లో 30) మెరిపించాడు.మిగిలిన వారిలో వరుణ్ గౌడ్ (26) రాణించగా.. అర్ఫాజ్ (7), అనికేత్ రెడ్డి (0) ఇలా వచ్చి.. అలా వెళ్లారు. ఇలాంటి దశలో దివేశ్ సింగ్, హర్షవర్దన్ సింగ్ నల్గొండ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. దివేశ్ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా.. హర్షవర్ధన్ సింగ్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు వికెట్లతో చెలరేగగా.. కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ పడగొట్టాడు.తుదిజట్లురంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గిస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృద్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, భువనగిరి పున్నయ్య, ఆర్యన్ కరియప్పనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నివాంత్ శరణు. Update: తనయ్ కెప్టెన్ ఇన్నిం గ్స్.. రంగారెడ్డి ఘన విజయంThat's one way to finish a game! 💥Nitin Sai Yadav wasted no time to make a telling impact on the chase, cruising away to 2️⃣6️⃣* off just 9️⃣ deliveries to close out the game for his side!#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EDp4AKNMNq— tg20official (@tg20official) June 22, 2026 -
నల్గొండను చిత్తు చేసిన రంగారెడ్డి
తెలంగాణ టీ20 లీగ్-2026లో రెండో మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో ఖమ్మం ఏసెస్.. పాలమూరు స్ట్రైకర్స్పై గెలుపొందగా.. తాజాగా సోమవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్- నల్గొండ నైట్స్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్కు దిగింది. నల్గొండ స్కోరెంతంటే?నల్గొండ ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ నితీశ్ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్ రాహుల్ బుద్ధి వేగంగా (19 బంతుల్లో 30) ఆడాడు. వరుణ్ గౌడ్ (26) రాణించగా.. అర్ఫాజ్ (7), అనికేత్ రెడ్డి (0) ఫెయిలయ్యారు. ఇలాంటి దశలో దివేశ్ సింగ్ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా.. హర్షవర్ధన్ సింగ్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. రంగారెడ్డి ఘన విజయంనల్గొండ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి 16.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేయగా.. తనయ్ త్యాగరాజన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితిన్ సాయి యాదవ్ (9 బంతుల్లో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. తుదిజట్లురంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గిస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, భువనగిరి పున్నయ్య, ఆర్యన్ కరియప్పనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, అనికేత్ రెడ్డి, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను. -
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
-
TG20 League: అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం
తెలంగాణ టీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. పాలమూరు బ్యాటర్లలో ఓపెనర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 86) టాప్ స్కోరర్గా నిలవగా.. చైతన్య రెడ్డి(35) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్రెడ్డి రెండు, మిలింద్, వెంకట్, విద్యానంద రెడ్డి తలా వికెట్ సాధించారు.కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఏసెస్ బ్యాటర్లలో ఓపెనర్ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్ మిలంద్(18, ప్రతీక్ రెడ్డి(25) రాణించారు. పాలమూర్ బౌలర్లలో కిరణ్ రెండు, రోహిత్ రాయుడు, అఫ్రిది అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.Juggling act but safe hands! 😮💨Inches away from the boundary rope, Vidyananda Reddy Ellala recovers well to dismiss the opposition skipper.#PSvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/G64zKnQpUw— tg20official (@tg20official) June 21, 2026 -
ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభాపాటవాలను వెలికితీసి, వారికి సరైన శిక్షణనిచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఒలింపిక్స్ బరిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం" అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.ఉప్పల్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్' మెగా టోర్నమెంట్కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ లీగ్ ఒక బలమైన పునాది కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు."గతంలో క్రికెట్ అంటే కేవలం నగరాలకే పరిమితమనే భావన ఉండేది. కానీ, ఆ పరిస్థితులను మారుస్తూ మొదటిసారిగా మా ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించింది. జిల్లాల వారీగా జట్లను (టీమ్లను) ఎంపిక చేసి గ్రామీణ యువతకు ఈ మెగా వేదికను కల్పించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడలను పెద్దపీట వేస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంది" అని భట్టి విక్రమార్క తెలిపారు.గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్బాల్ స్టార్ 'మెస్సి' ఆడిన ఈ ఉప్పల్ స్టేడియం సాక్షిగా.. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వసతులు, అన్ని హంగులతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఒలింపిక్స్ స్థాయి శిక్షణ ఇచ్చేలా తెలంగాణలో ఒక బలమైన క్రీడా వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ 'టీజీ 20 క్రికెట్' హంగామా.. రాష్ట్రంలోని క్రీడాభిమానులకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఈ టోర్నీ విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
అట్టహాసంగా టీజీ20 లీగ్ ఆరంభ వేడుకలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ టీ20 లీగ్ (TG20) తొలి సీజన్ అట్టహాసంగా మొదలైంది. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీజీ టీ20 లీగ్ మంచి అవకాశమని ఈ సందర్భంగా విక్రమార్క పేర్కొన్నారు.ఆయనతో పాటు టీజీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా సంగీత దర్శకుడు తమన్ తన మ్యూజికల్ పెర్ఫార్మెన్స్తో స్టేడియంలో జోష్ నింపారు. ఉర్రూతలూగించే పాటలతో సాగిన డిజిటల్ లేజర్ షో,. సాంస్కృతిక ప్రదర్శనలు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశాయి.No warm-up needed.Thaman set the TG20 stage on fire from the very first beat. 🔥⚡#OpeningCeremony #SreenidhiUniversity #ManaCricketShuru pic.twitter.com/hh8HXB3rl8— tg20official (@tg20official) June 21, 2026 -
పాలమూరు స్ట్రైకర్స్పై ఖమ్మం ఘన విజయం
Palamuru Strikers vs Anvita Khammam Aces Live Updates:. తెలంగాణ టీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. పాలమూరు బ్యాటర్లలో ఓపెనర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 86) టాప్ స్కోరర్గా నిలవగా.. చైతన్య రెడ్డి(35) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్రెడ్డి రెండు, మిలింద్, వెంకట్, విద్యానంద రెడ్డి తలా వికెట్ సాధించారు.పాలమూరు ఐదో వికెట్ డౌన్పాలమూరు ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ప్రతీక్ పవార్.. మిలింద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లకు పాలమూరు స్కోర్: 190/5. పాలమూరు విజయానికి 18 బంతుల్లో 48 పరుగులు కావాలి.పాలమూరు మూడో వికెట్ డౌన్35 పరుగులు చేసిన చైతన్య రెడ్డి.. రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. 14 ఓవర్లకు పాలమూర్ స్కోర్: 167/3పాలమూరు రెండో వికెట్ డౌన్పాలమూరు రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రజ్ఞయ్ రెడ్డి.. వేద్రెడ్డి బౌలింగ్లో ఔటయ్యాడు.పాలమూరు తొలి వికెట్ డౌన్పాలమూరు తొలి వికెట్ కోల్పోయింది. 86 పరుగులు చేసిన విగ్నేష్ రెడ్డి.. వేద్రెడ్డి బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు పాలమూరు స్కోర్: 133/1దూకుడుగా ఆడుతున్న పాలమూరు ఓపెనర్లు238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి పాలమూరు వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో అనుముల విగ్నేష్ రెడ్డి(45), చైతన్య రెడ్డి(7) ఉన్నారు.పాలమూరు టార్గెట్ ఎంతంటే?పాలమూరు స్ట్రైకర్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో అన్విత ఖమ్మం ఏసెస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏసెస్ బ్యాటర్లలో ఓపెనర్ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్ మిలంద్(18, ప్రతీక్ రెడ్డి(25) రాణించారు. పాలమూర్ బౌలర్లలో కిరణ్ రెండు, రోహిత్ రాయుడు, అఫ్రిది అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.GSK aale aale, nahi khelte hai haule haule! 🥵Three 6️⃣s in an over that gave the #AnvitaKhammamAces the very start they needed. 🔥#PSvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/67iEuethQs— tg20official (@tg20official) June 21, 2026మూడో వికెట్ డౌన్ఖమ్మం జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జైశ్వాల్.. అఫ్రిది అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు స్కోర్: 150/3ఖమ్మం రెండో వికెట్ డౌన్ఖమ్మం ఏసెస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కృష్ణ రెడ్డి.. రోహిత్ రాయుడు బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఏసెస్ స్కోర్: 141/2ఖమ్మం ఏసెస్ తొలి వికెట్ డౌన్అన్విత ఖమ్మం ఏసెస్ తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన వాఫీ కచ్చీ.. నిపుణ్ రెడ్డి శవ్వా బౌలింగ్ ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఏసెస్ స్కోర్: 113/1దుమ్ములేపుతున్న ఖమ్మం ఓపెనర్లుఅన్విత ఖమ్మం ఏసెస్ ఓపెనర్లు కృష్ణ రెడ్డి(18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 30), వాఫీ కచ్చీ(24 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 52) దుమ్ములేపుతున్నారు. 7 ఓవర్లకు ఖమ్మం ఏసెస్ స్కోర్: 86/0తెలంగాణ టీ20 లీగ్ తొలి సీజన్కు తెరలేచింది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్లో ఉప్పల్ మైదానం వేదికగా పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుఖమ్మం ఏసెస్కృష్ణ రెడ్డి, వాఫీ కచ్చీ, మిలింద్(కెప్టెన్), జైశ్వాల్, హిమతేజ, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డిపాలమూరు స్ట్రైకర్స్అన్ముల విఘ్నేష్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి(కెప్టెన్), పృథ్వీ రెడ్డి, రోహిత్ రాయుడు, ప్రతీక్ పవార్, మహమ్మద్ అఫ్రీది అహ్మద్, నిపుణ్ రెడ్డి శవ్వా, బుడిది రతన్ తేజ, పి.ఎస్. చైతన్య రెడ్డి, జంబోజు పార్థిపన్, రవి కిరణ్ మజేటి -
తెలంగాణ టి20కి వేళాయె..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక టి20 లీగ్కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆధ్వర్యంలో అధికారికంగా టీజీ టి20 లీగ్ను తొలిసారి నిర్వహించనున్నారు. గతంలో పలు వేర్వేరు లీగ్ టోర్నీలు జరిగినా... బీసీసీఐ అనుమతితో అధికారికంగా టోర్నీని జరపడం ఇదే తొలిసారి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర తదితర అసోసియేషన్లు రాష్ట్ర స్థాయిలో వర్ధమాన క్రికెటర్ల కోసం ఇలాంటి టి20 లీగ్ను నిర్వహిస్తుండగా, ఇప్పుడు హెచ్సీఏ కూడా ఆ జాబితాలో చేరింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నేడు టోర్నీ మొదలు కానుంది. 22 రోజుల పాటు జరిగే టోర్నీలో ఫైనల్ సహా మొత్తం 32 మ్యాచ్లు నిర్వహిస్తారు. జూలై 12న ఫైనల్ జరుగుతుంది. తొలి రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్తో ఖమ్మం ఏసెస్ జట్టు తలపడుతుంది. దీనికి ముందు సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్, జియో హట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 160 మంది ప్లేయర్లు... టీజీ టి20 లీగ్ బరిలో ఎనిమిది జట్లు నిలిచాయి. హైదరాబాద్ ఇ–చాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్, రంగారెడ్డి రైజర్స్, నల్గొండ నైట్స్ టీమ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ టీమ్లకు అభిరథ్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, ప్రజ్ఞయ్ రెడ్డి, రవితేజ, అమన్ రావు, తనయ్ త్యాగరాజన్, రాహుల్ బుద్ధి కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ముందుగా బిడ్ ద్వారా ఎనిమిది మంది ఫ్రాంచైజీలను ఎంపిక చేయగా, ఆ తర్వాత వేలం ద్వారా టీమ్లు ఆటగాళ్లను ఎంచుకున్నాయి.ఒక్కో టీమ్లో 20 మంది ఆటగాళ్ల చొప్పున మొత్తం 160 మంది ప్లేయర్లకు అవకాశం కల్పించారు. వేలంలో అత్యధికంగా టీమిండియా ఆటగాడు తిలక్ వర్మకు రూ.33 లక్షలు దక్కగా, పేసర్ మొహమ్మద్ సిరాజ్కు రూ.14 లక్షలు లభించాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ మిలింద్కు అత్యధికంగా రూ. 17 లక్షలు దక్కాయి. ఆటగాళ్ల కోసం అన్ని జట్లు కలిపి మొత్తం రూ. 4.74 కోట్లు వెచ్చించాయి. అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్ కారణంగా తిలక్, సిరాజ్ ఎన్ని మ్యాచ్లు ఆడతారనే విషయంపై స్పష్టత లేదు. రూ.49 టికెట్... తొలిసారి నిర్వహిస్తున్న లీగ్ కోసం హెచ్సీఏ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా పని చేస్తుండగా, ప్రత్యేక గీతాన్ని కూడా రూపొందించారు. టోర్నీకి శ్రీనిధి యూనివర్సిటీ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి కొందరు న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తడంతో దీనిపై హెచ్సీఏ వివరణ ఇచ్చింది. లీగ్ నిర్వహణకు బీసీసీఐ అధికారికంగా అనుమతి ఇచ్చిందని, బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) పర్యవేక్షణలోనే మ్యాచ్లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఎక్కువ మంది అభిమానులు స్టేడియంలో లీగ్ మ్యాచ్లు చూడటం కోసం కేవలం రూ.49 టికెట్ను అందుబాటులో ఉంచారు. ‘డిస్ట్రిక్ట్ ’ యాప్ ద్వారా ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఫ్రాంచైజీల వివరాలు » కరీంనగర్ డైమండ్స్ – ఈఐపీఎల్ గ్రూప్ అండ్ టిబరుమల్ జ్వెలర్స్ » ఖమ్మం ఏసెస్ – అన్విత గ్రూప్ » పాలమూరు స్ట్రైకర్స్ – వీరభద్ర స్టీల్స్ » మెదక్ ఫాల్కన్స్ – బృంద ఇన్ఫ్రా » వరంగల్ వారియర్స్ – బైన్ గ్లోబల్ రిసోర్సెస్ » రంగారెడ్డి రైజర్స్ – బూరుగు ఇన్ఫ్రా అండ్ ప్రణవ » నల్లగొండ నైట్స్ – కిశోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్æ » హైదరాబాద్ ఇ–చాంపియన్స్– ఉషోదయ ఎంటర్ప్రైజెస్ -
‘బ్యాటింగ్ మా ప్రధాన బలం.. సీక్రెట్ వెపన్ అతడే!’
ఆదివారం నుంచి ఉప్పల్ వేదికగా టీజీ 20 లీగ్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుతో సాక్షి మీడియా ముచ్చటించింది. ఈ నేపథ్యంలో జట్టు బలాలు, బలహీనతలపై ఖమ్మం ఏసెస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అన్ని జట్లతో పోలిస్తే బ్యాటింగ్ తమ ప్రధాన బలమని ఖమ్మం కోచ్ అభిజీత్ పేర్కొన్నారు. అయితే జట్టులో ఉన్న ఒక సీక్రెట్ ఆయుధాన్ని గ్రౌండ్లోనే వాడనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ సీక్రెట్ ప్లేయర్ ఎవరనేది మాత్రం తాము రివీల్ చేయబోవవడం లేదని పేర్కొన్నారు. ఖమ్మం జట్టు కెప్టెన్ సీవీ మిలింద్ మాట్లాడుతూ.. టీ20 20లీగ్ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లకు రంజీల్లోకి వెళ్లడానికి ఇదొక మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్ సహా ఇతర లీగ్స్కు కూడా ఆడేందుకు ఇలాంటి లీగ్లు తమ లాంటి ఆటగాళ్లకు కీలకంగా మారుతుందని తెలిపాడు. తమ జట్టులో లెగ్ స్పిన్నర్గా వేద్రెడ్డి అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నాడని, అతడు తన స్పిన్తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. కార్యక్రమంలో కెప్టెన్ సీవీ మిలింద్తో పాటు వైస్ కెప్టెన్ హిమతేజ, లెగ్ స్పిన్నర్ వేద్ రెడ్డి, ఓపెనర్ ప్రతీక్రెడ్డి పాటు ఇతర క్రికెటర్లు పాల్గొన్నారు. ఇక ఖమ్మం ఏసెస్ జట్టును అన్వితా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక ఖమ్మం ఏసెస్ జట్టు తన తొలి మ్యాచ్ను జూన్ 21న పాలమూరు స్ట్రైకర్స్తో ఆడనుంది. -
TG20: ఎనిమిది జట్లు, ఆటగాళ్ల ధర.. పూర్తి వివరాలు
తెలంగాణలో ప్రతిష్టాత్మక టీ20 లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో టీజీ20 పేరిట జూన్ 21 నుంచి జూలై 10 మధ్య షెడ్యూల్ ఖరారైంది. కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఈ చాంపియన్స్ తొలి ట్రోఫీ కోసం బరిలో నిలిచాయి.ఈ నేపథ్యంలో టీజీ టీ20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది జట్ల కెప్టెన్లతో పాటు స్పాన్సర్ శ్రీనిధి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.ఏ జట్టులో ఎవరు? ధర ఎంత?కరీంనగర్ డైమండ్స్చందన్ సహానీ- రూ. 9.5 లక్షలుఆశిష్ శ్రీవాస్తవ్- రూ. 9 లక్షలుతన్మయ్ అగర్వాల్- రూ. 8 లక్షలురాహుల్ రాదేశ్- రూ. 4.5 లక్షలురత్లావత్ దినేశ్- రూ. 4.5 లక్షలుహృషికేశ్ సింహ- రూ. 3.7 లక్షలుశుభం శర్మ- రూ. 3.5 లక్షలుమహ్మద్ అబ్దుల్ అద్నాన్- రూ. 3 లక్షలుఎన్ సాత్విక్ రెడ్డి- రూ. 2 లక్షలుటీవీఎస్ నారాయణ తేజ- రూ. 2 లక్షలుఅఖిల్ కుమార్ సంకోజు- రూ. 1.5 లక్షలుబి సతీశ్ కుమార్- రూ. లక్షసాయి కార్తికేయ మల్లం- రూ. 95 వేలునిహాల్ రెడ్డి- రూ. 75 వేలుర్యాన్ బిన్ అబ్దుల్లా- రూ. 75 వేలుఆశిష్ అభయ్- రూ. 75 వేలురావూరి సాయి శరణ్- రూ. 75 వేలుపగడాల లోకేశ్- రూ. 75 వేలుయశ్ సత్వాలేకర్- రూ. 75 వేలుచిల్లకూరు లిఖిత్ రెడ్డి- రూ. 75 వేలుఖమ్మం ఏసెస్చామా వ్రజేంద్ర మిలింద్- రూ. 17 లక్షలుహిమతేజ కొడిమెల- రూ. 8 లక్షలుమికిల్ జైస్వాల్- రూ. 6 లక్షలుఅనంత్ ప్రతీక్ రెడ్డి- రూ. 3.75 లక్షలుసాకేత్ ధాత్రక్- రూ. 3.5 లక్షలువఫీ కచ్చి- రూ. 3.25 లక్షలుఖుష్ అగర్వాల్- రూ. 3 లక్షలుమయాంక్ గుప్త- రూ. 3 లక్షలుజీఎస్కే రెడ్డి- రూ. 1.8 లక్షలువిద్యానంద రెడ్డి ఎల్లాల- రూ. 1.7 లక్షలుమహేశ్ విప్రాలా- రూ. 1.3 లక్షలుషేక్ అజర్- రూ. లక్షబద్ది విశాల్ యాదవ్- రూ. 85 వేలుసబవేత్ లోక్నాథ్ నాయక్- రూ. 75 వేలుమగవత్ సిద్ధు నాయక్- రూ. 75 వేలుపారస్ రాజ్- రూ. 75 వేలువేద్ రెడ్డి అమిస్తాపురం- రూ. 75 వేలువివేక్ సింగ్- రూ. 75 వేలుసహేంద్ర మల్లు- రూ. 75 వేలుఆవేజ్ అహ్మద్- రూ. 75 వేలుపాలమూరు స్ట్రైకర్స్రవి కిరణ్ మేజేటి- రూ. 13 లక్షలుప్రజ్ఞయ్ రెడ్డి- రూ. 11 లక్షలురోహిత్ రాయుడు కొలగాని- రూ. 6.5 లక్షలుప్రతీక్ పవార్- రూ. 4.25 లక్షలుపీఎస్ చైతన్య రెడ్డి- రూ. 3.25 లక్షలుఅనుముల విజ్ఞేశ్ రెడ్డి- రూ. 3 లక్షలుఎ. పృథ్వీ రెడ్డి- రూ. 3 లక్షలునిశాంత్ సేన్ రెడ్డి సీఎహెచ్- రూ. 2.3 లక్షలుమహ్మద్ ఆఫ్రిది అహ్మద్- రూ. 2.3 లక్షలురిషభ్ బస్లాస్- రూ. 2 లక్షలుఎం సంహిత్ రెడ్డి- రూ. 2 లక్షలుషేక్ అబ్దుల్ జీషాన్- రూ. లక్షఅశ్వద్ రాజీవ్- రూ. 95 వేలుబూడిది రతన్ తేజ- రూ. 80 వేలుకరణ్ యాదవ్- రూ. 75 వేలుమణికంఠేశ్వర్ రెడ్డి- రూ. 75 వేలుమహ్మద్ షాదాబ్ అహ్మద్- రూ. 75 వేలునిపుణ్ రెడ్డి షవ్వా- రూ. 75 వేలుజంబోజు పార్ధీపన్- రూ. 75 వేలుఎండీ అజారుద్దీన్- రూ. 75 వేలు.మెదక్ ఫాల్కన్స్తిలక్ వర్మ- రూ. 33 లక్షలురవితేజ టి- రూ. 12 లక్షలువిక్రం నాయక్ గుగులోత్- రూ. 1.1 లక్షలుశశాంత్ బుడ్తి- రూ. లక్షనిమ్న నిమగడ్డ సూర్య తేజ- రూ. 85 వేలుహరి ఓం సింగ్- రూ. 75 వేలుఇషాన్ శర్మ- రూ. 75 వేలుబన్నీ జగమ్- రూ. 75 వేలుజయదేవ్ రెండ్ల- రూ. 75 వేలుసాయి పూర్ణానంద్ రావు కాకులమర్రి- రూ. 75 వేలుకుంటా రాహుల్- రూ. 75 వేలుమధుకర్ మన్నె- రూ. 75 వేలునమన్ అగర్వాల్- రూ. 75 వేలునయని అనీశ్ రెడ్డి- రూ. 75 వేలునొమన్ అహ్మద్- రూ. 75 వేలుసయ్యద్ ఘాజి అబ్బాస్- రూ. 75 వేలుసాయి వరుణ్ యెర్రమ్- రూ. 75 వేలుఅశ్వినన్ రామ్ బూర్గుబావి- రూ. 75 వేలుశ్రుజిత్ రెడ్డి- రూ. 75 వేలురంగనాథ్ బీకే- రూ. 75 వేలుహైదరాబాద్ ఈ చాంపియన్స్అభిరథ్ రెడ్డి మందాడి- రూ. 11 లక్షలుఅజయ్ దేవ్ గౌడ్- రూ. 11 లక్షలుఅఖిల్ రాథోడ్- రూ. 1.6 లక్షలుఅన్విత్ రెడ్డి- రూ. 3.5 లక్షలుబాకి హిశాంత్ ప్రేమ్ చరణ్- రూ. 95 వేలుసి. అభినవ్ తేజ్- రూ. లక్షదేవ్ మెహతా- రూ. 75 వేలుగణేష్ గడుగు- రూ. 3.25 లక్షలుగూడెల్లి జశ్వంత్- రూ. 75 వేలుమిర్యాల ప్రత్యుష్ కుమార్- రూ. 75 వేలుఎం.ఎం. చరణ్- రూ. 75 వేలునితిన్ నాయక్- రూ. 75 వేలుపి. అరవింద్- రూ. 1 లక్షప్రణవ్ వర్మ- రూ. 8. 5 లక్షలుసాయి వికాస్ రెడ్డి- రూ. 4.25 లక్షలుఫణ్ముఖ అశ్విన్- రూ. 1.5 లక్షలుశ్రీనికేత్- రూ. 2.3 లక్షలుతరుణ్ రాజన్- 1.6 లక్షలువైష్ణవ్ రెడ్డి ఎ- - రూ. 75 వేలుయశ్వీర్ గౌడ్- రూ. 3 లక్షలునల్గొండ నైట్స్మహమ్మద్ అర్ఫాజ్ అహ్మద్- రూ. 11 లక్షలుఏల్గాని వరుణ్ గౌడ్- రూ. 3.5 లక్షలుఅనికేత్ రెడ్డి- రూ. 4.7 లక్షలుబీరవోలు నాగ సుధాంశ్ రెడ్డి- రూ. 75 వేలుచిన్నట్ల రక్షణ్ రెడ్డి- రూ. 6 లక్షలుచిన్నుగారి రుత్విక్- రూ. 75 వేలుదివేష్ సింగ్ - రూ. 75 వేలుగౌరవ్ రెడ్డి- రూ. 4.5 లక్షలుఇల్యాన్ సథాని- రూ. లక్షజశ్వంత్ మోటే- రూ. 75 వేలుజవ్వాజీ శ్రీకాంత్- రూ. 75 వేలునిశాంత్ శరణు- రూ. 5.5 లక్షలుపట్కూరి నితీశ్ రెడ్డి- రూ. 5.5 లక్షలుప్రణవ్ సూర్యదేవర- రూ. 2.5 లక్షలురాహుల్ బుద్ధి- రూ. 8 లక్షలుషేక్ సమీర్- రూ. 75 వేలుషేక్ సోహైల్- రూ. 75 వేలుటి. హర్షవర్ధన్ సింగ్- రూ. లక్షఉర్వేష్ కక్కడ్- రూ. 75 వేలువిక్రాంత్ రెడ్డి ఎం- రూ. 75 వేలురంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్- రూ. 11 లక్షలుఆరోన్ జార్జ్ వర్గీస్- రూ. 7.5 లక్షలుఅడే సంతోష్- రూ. 90 వేలుఆదిత్య జవ్వాజీ- రూ. 1.6 లక్షలుఆదిత్య మల్హోత్రా- రూ. 85 వేలుఅలంకృత్ రపోలే- రూ. 1.9 లక్షలుఅరవెల్లి అవనీష్ రావు- రూ. 7 లక్షలుఆర్యన్ కారియప్ప- రూ. లక్షబబర్ ఖాన్ బర్కత్ ఖాన్- రూ. 75 వేలుభువనగిరి పున్నయ్య- రూ. 3 లక్షలుసి. హితేష్ యాదవ్- రూ. 2.3 లక్షలుచిమాట శ్రీనాథ్ యాదవ్- రూ. లక్షజ్ఞాన ప్రకాశ్ రెడ్డి- రూ. 4 లక్షలుటి. అరుణ్ కుమార్- రూ. లక్షనానావత్ రాకేష్- రూ. 90 వేలునితిన్ సాయి యాదవ్- రూ. 9 లక్షలురావుల ప్రణవ్ ఆదిత్యం- రూ. 75 వేలుఎస్. వెంకట్ కార్తిక్- రూ. 75 వేలుసచేత్ బింజ్రాజ్కా- రూ. 4 లక్షలుతనయ్ జద్దు- రూ. 75 వేలువరంగల్ వారియర్స్మహ్మద్ సిరాజ్- రూ. 14 లక్షలుఆది మణి కిరణ్- రూ. 85 వేలుఅమన్ రావు పేరాల- రూ. 12 లక్షలుఅమ్గోత్ దివిన్- రూ. 85 వేలుఅనిరుధ్ శ్రీవాత్స టి.పి.- రూ. 2 లక్షలుభావేష్ సేథ్- రూ. 5 లక్షలుహర్షిత్ చౌధరి- రూ. 3 లక్షలుకర్రి సాయి ధనుష్- రూ. 75 వేలుమహమ్మద్ అబ్దుల్ మాలిక్- రూ. 3 లక్షలుమహమ్మద్ ఆసిఫ్ మంసూరి- రూ. 75 వేలుమొహమ్మద్ ముదస్సర్ హుస్సేన్- రూ. 3 లక్షలుమురుగన్ అభిషేక్- రూ. 3 లక్షలుపల్లెపాటి క్రాంతి- రూ. 75 వేలుఋషికేత్ సిసోడియా- రూ. 4.75 లక్షలుఋషిత్ రావు- - రూ. 75 వేలురిత్విక్ గౌడ్- రూ. 75 వేలుసల్మాన్ ఖాన్- రూ. 75 వేలుషౌనక్ కులకర్ణి- రూ. 1.6 లక్షలుశివ రామకృష్ణ తెర్లి- రూ. 75 వేలువైష్ణవ్ విశ్వనాథ- రూ. లక్ష -
TG20: తెలంగాణ టీ20 లీగ్.. బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు)
-
టీజీ టి20 లీగ్కు ఎనిమిది టీమ్లు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ టి20 లీగ్ (టీజీ టి20) ఫ్రాంచైజీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. బిడ్ ద్వారా అధిక మొత్తాలు దాఖలు చేసిన టాప్–8 టీమ్ యాజమాన్యాలను హెచ్సీఏ శనివారం ప్రకటించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతితో తొలిసారి టీజీ టి20 లీగ్ను జరుపుతున్నారు. వచ్చే నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనుండగా, ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయి. లీగ్లో అత్యధికంగా రూ.7 కోట్ల 50 లక్షలకు హైదరాబాద్ టీమ్ను ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. రంగారెడ్డి జట్టును బూరుగు ఇన్ఫ్రా/ ప్రణవ (రూ.7.20 కోట్లు), వరంగల్ జట్టును బెయిన్ గ్లోబల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ.6.55 కోట్లు), మెదక్ టీమ్ను బృంద ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (రూ.6.33 కోట్లు), నల్గొండ టీమ్ను కిషోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ.5.06 కోట్లు) గెలుచుకున్నాయి. కరీంనగర్ జట్టును ఈఐపీఎల్ గ్రూప్ అండ్ టిబరుమల్ (రూ.4.57 కోట్లు), మహబూబ్నగర్ జట్టును వీరభద్ర స్టీల్స్ (రూ.4.50 కోట్లు), ఖమ్మం టీమ్ను అన్విత గ్రూప్ (రూ.4.44 కోట్లు) సొంతం చేసుకున్నాయి.


