తెలంగాణ టీ20 లీగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఈ చాంపియన్స్ తొలి ట్రోఫీ కోసం బరిలో నిలిచాయి.
ఈ నేపథ్యంలో టీజీ టీ20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది జట్ల కెప్టెన్లతో పాటు స్పాన్సర్ శ్రీనిధి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


