TG20 Final: రాణించిన జైస్వాల్‌.. ఖమ్మం నామమాత్రపు స్కోర్‌ | TG20 2026 Final: Hyderabad E Champions Restricted Anvita Khammam Aces to 157 runs | Sakshi
Sakshi News home page

TG20 Final: రాణించిన జైస్వాల్‌.. ఖమ్మం నామమాత్రపు స్కోర్‌

Jul 12 2026 9:46 PM | Updated on Jul 12 2026 9:46 PM

TG20 2026 Final: Hyderabad E Champions Restricted Anvita Khammam Aces to 157 runs

ఇవాళ (జులై 12) జరుగుతున్న టీజీ20 లీగ్‌-2026 ఫైనల్లో ఖమ్మం ఏసెస్‌-హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్లు తలపడుతున్నాయి. హైదారాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

హైదరాబాద్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది.

మికిల్‌ జైస్వాల్‌ (39 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. ఆఖర్లో విద్యానంద రెడ్డి (20 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. మిగతా ఆటగాళ్లలో పరాస్‌ రాజ్‌ 3, పి రెడ్డి 15, జి కృష్ణా రెడ్డి 3, హిమతేజ 31, సహేంద్ర మల్లు 11, వి రెడ్డి అమిస్థపురం​ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. 

స్టార్‌ బ్యాటర్‌ మిలింద్‌ సహా హర్షిత్‌ రాజ్‌ డకౌట్లయ్యారు. హైదరాబాద్‌ బౌలర్లలో యశ్‌వీర్‌ గౌడ్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. మెహతా, దేవ్‌గౌడ్‌ తలో 2, రాధోడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

తుది జట్లు..
హైదరాబాద్‌: అభిరథ్‌ రెడ్డి (కెప్టెన్‌), సాయి వికాస్‌ రెడ్డి, వైష్ణవ్‌ రెడ్డి, యశ్వీర్‌ గౌడ్‌, గుడుగు గణేశ్‌, ప్రణవ్‌ వర్మ, అజయ్‌ దేవ్‌గౌడ్‌, అరవింద్‌, షణ్ముఖ్‌ అశ్విన్‌, అఖిల్‌ రాథోడ్‌, దేవ్‌ మెహతా

ఖమ్మం: మిలింద్‌ (కెప్టెన్‌), సహేంద్ర మల్లు, హర్షిత్‌, వేద్‌ రెడ్డి, షేక్‌ అజహర్‌, విద్యానంద రెడ్డి, జీఎస్‌కే రెడ్డి, హిమతేజ, పరాస్‌ రాజ్‌, ప్రతీక్‌ రెడ్డి, మికిల్‌ జైస్వాల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement