breaking news
Hyderabad E Champions
-
ఘనంగా ముగిసిన టీజీ20 లీగ్... విజేతగా హైదరాబాద్ (ఫొటోలు)
-
టీజీ20 లీగ్ విజేతగా హైదరాబాద్
టీజీ20 లీగ్ ఆరంభ ఎడిషన్ (2026) విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు అవతరించింది. ఇవాళ (జులై 12) జరిగిన ఫైనల్లో ఆ జట్టు అన్విత ఖమ్మం ఏసెస్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఖమ్మంను 157 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. అనంతరం లక్ష్యానఇన 17.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. రాణించిన జైస్వాల్మికిల్ జైస్వాల్ (39 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. ఆఖర్లో విద్యానంద రెడ్డి (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మిగతా ఆటగాళ్లలో పరాస్ రాజ్ 3, పి రెడ్డి 15, జి కృష్ణా రెడ్డి 3, హిమతేజ 31, సహేంద్ర మల్లు 11, వి రెడ్డి అమిస్థపురం 1 (నాటౌట్) పరుగు చేశారు.స్టార్ బ్యాటర్ మిలింద్ సహా హర్షిత్ రాజ్ డకౌట్లయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. మెహతా, దేవ్గౌడ్ తలో 2, రాధోడ్ ఓ వికెట్ పడగొట్టారు.విజయతీరాలకు చేర్చిన వైష్ణవ్158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ ఆదిలోనే వికాస్ రెడ్డి (4) వికెట్ కోల్పోయినప్పటికీ.. అభిరథ్ రెడ్డి (48), అశ్విన్ (36) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరు కూడా ఔటయ్యాక వైష్ణవ్ రెడ్డి (41 నాటౌట్) గెలుపు బాధ్యతలను భుజాలకేసుకొని హైదరాబాద్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి ప్రణవ్ (19 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు మరో 14 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరి, ఛాంపియన్గా అవతరించింది. -
TG20 Final: రాణించిన జైస్వాల్.. ఖమ్మం నామమాత్రపు స్కోర్
ఇవాళ (జులై 12) జరుగుతున్న టీజీ20 లీగ్-2026 ఫైనల్లో ఖమ్మం ఏసెస్-హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదారాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.హైదరాబాద్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది.మికిల్ జైస్వాల్ (39 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. ఆఖర్లో విద్యానంద రెడ్డి (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మిగతా ఆటగాళ్లలో పరాస్ రాజ్ 3, పి రెడ్డి 15, జి కృష్ణా రెడ్డి 3, హిమతేజ 31, సహేంద్ర మల్లు 11, వి రెడ్డి అమిస్థపురం 1 (నాటౌట్) పరుగు చేశారు. స్టార్ బ్యాటర్ మిలింద్ సహా హర్షిత్ రాజ్ డకౌట్లయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. మెహతా, దేవ్గౌడ్ తలో 2, రాధోడ్ ఓ వికెట్ పడగొట్టారు.తుది జట్లు..హైదరాబాద్: అభిరథ్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, వైష్ణవ్ రెడ్డి, యశ్వీర్ గౌడ్, గుడుగు గణేశ్, ప్రణవ్ వర్మ, అజయ్ దేవ్గౌడ్, అరవింద్, షణ్ముఖ్ అశ్విన్, అఖిల్ రాథోడ్, దేవ్ మెహతాఖమ్మం: మిలింద్ (కెప్టెన్), సహేంద్ర మల్లు, హర్షిత్, వేద్ రెడ్డి, షేక్ అజహర్, విద్యానంద రెడ్డి, జీఎస్కే రెడ్డి, హిమతేజ, పరాస్ రాజ్, ప్రతీక్ రెడ్డి, మికిల్ జైస్వాల్ -
ఖమ్మంపై గెలుపు.. హైదరాబాద్దే టైటిల్
టీజీ20 లీగ్ విజేతగా హైదరాబాద్టీజీ20 లీగ్ ఆరంభ ఎడిషన్ (2026) విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు అవతరించింది. ఇవాళ (జులై 12) జరిగిన ఫైనల్లో ఆ జట్టు అన్విత ఖమ్మం ఏసెస్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన హైదరాబాద్ ఖమ్మంను 157 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. అనంతరం లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్7.4వ ఓవర్- 69 పరుగుల వద్ద హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. విద్యానంద్ రెడ్డి బౌలింగ్లో అశ్విన్ (36) ఔటయ్యాడు.ధాటిగా ఆడుతున్న అభిరథ్158 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు రెండో ఓవర్లోనే వికాస్ (4) వికెట్ కోల్పోయినప్పటికీ.. ధాటిగా ఆడుతుంది. మరో ఓపెనర్ అభిరథ్ రెడ్డి (23) బ్యాట్ ఝులిపిస్తున్నాడు. అతడికి అశ్విన్ (16) కూడా సహకరిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత హైదారాబద్ స్కోర్ 44-1గా ఉంది. హైదరాబాద్ ముందు నామమాత్రపు టార్గెట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం హైదరాబాద్ ముందు 158 పరుగుల నామమాత్రపు టార్గెట్ ఉంచింది. ఖమ్మం తరఫున మికెల్ జైస్వాల్ (65) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. ఆఖర్లో విద్యానంద రెడ్డి (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. స్టార్ బ్యాటర్ మిలింద్ డకౌట్ కాగా.. హిమతేజ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. మెహతా, దేవ్గౌడ్ తలో 2, రాధోడ్ ఓ వికెట్ పడగొట్టారు. 16 ఓవర్ల తర్వాత ఖమ్మం స్కోర్ 122-5జైస్వాల్ (60), మల్లు (2) బ్యాటింగ్ఆటకు అంతరాయంస్టేడియంలో ఓ ఫ్లడ్లైట్ సమస్య తలెత్తడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.నిలకడగా ఆడుతున్న హిమతేజ, జైస్వాల్11 ఓవర్ల తర్వాత ఖమ్మం స్కోర్ 76-3గా ఉంది. హిమతేజ (32), జైస్వాల్ (18) నిలకడగా ఆడుతున్నారు. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఖమ్మంఖమ్మం జట్టు 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మెహతా బౌలింగ్లో 3 బంతుల వ్యవధిలో ఖమ్మం జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. పి రెడ్డి (15), కృష్ణా రెడ్డి (4) ఔట్ కాగా.. హిమతేజ (2), జైస్వాల్ (0) క్రీజ్లో ఉన్నారు. 5.3 ఓవర్ల తర్వాత ఖమ్మం స్కోర్ 27-3గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన ఖమ్మం1.4వ ఓవర్- రెండో ఓవర్లోనే ఖమ్మం జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పి రాజ్ (3) దేవ్ గౌడ్ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 3.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 19-1గా ఉంది. పి రెడ్డి (12), జి కృష్ణా రెడ్డి (2) క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్టీజీ20 లీగ్-2026 ఫైనల్లో అన్విత ఖమ్మం ఏసెస్-హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదారాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..హైదరాబాద్: అభిరథ్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, వైష్ణవ్ రెడ్డి, యశ్వీర్ గౌడ్, గుడుగు గణేశ్, ప్రణవ్ వర్మ, అజయ్ దేవ్గౌడ్, అరవింద్, షణ్ముఖ్ అశ్విన్, అఖిల్ రాథోడ్, దేవ్ మెహతాఖమ్మం: మిలింద్ (కెప్టెన్), సహేంద్ర మల్లు, హర్షిత్, వేద్ రెడ్డి, షేక్ అజహర్, విద్యానంద రెడ్డి, జీఎస్కే రెడ్డి, హిమతేజ, పరాస్ రాజ్, ప్రతీక్ రెడ్డి, మికిల్ జైస్వాల్ -
క్వాలిఫయర్-2లో కరీంనగర్ ఓటమి.. ఫైనల్కు హైదరాబాద్
తెలంగాణ టీ20 లీగ్-2026లో కరీంనగర్ డైమండ్స్ పోరాటం ముగిసింది. శుక్రవారం ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 8 వికెట్ల తేడాతో కరీంనగర్ పరాజయం పాలైంది. దీంతో కరీంనగర్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టగా.. హైదరాబాద్ జట్టు ఆదివారం అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుతో ఫైనల్లో తలపడేందుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ సింహా(38) టాప్ స్కోరర్గా నిలవగా.. శుభమ్ శర్మ(31), సాత్విక్ రెడ్డి(28) రాణించారు.కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ పది పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్, షణ్ముఖ, ప్రణవ్ తలా రెండు వికెట్లు సాధించారు.అనంతరం భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి(45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 82) టాప్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి(45) రాణించాడు. కరీంనగర్ బౌలర్లలో ఆఖిల్, శుభమ్ తలా వికెట్ సాధించారు. -
హైదరాబాద్తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన కరీంనగర్
Update: హైదరాబాద్తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. కరీంనగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ సింహా(38) టాప్ స్కోరర్గా నిలవగా.. శుభమ్ శర్మ(31), సాత్విక్ రెడ్డి(28) రాణించారు.కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ పది పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్, షణ్ముఖ, ప్రణవ్ తలా రెండు వికెట్లు సాధించారు.తొలుత బ్యాటింగ్ చేయనున్న కరీంనగర్తెలంగాణ టీ20 లీగ్-2026లో మరో కీలక మ్యాచ్కు తెరలేచింది. క్వాలిఫయర్-2లో భాగంగా ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్ , హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కరీంనగర్ డైమండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలిమినేటర్లో రంగారెడ్డిని చిత్తు చేసిన కరీంనగర్ డైమండ్స్.. ఇప్పుడు క్వాలిఫయర్-2లో అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు క్వాలిఫయర్-1లో ఖమ్మం చేతిలో ఖంగుతిన్న హైదరాబాద్ జట్టు తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.తుది జట్లుకరీంనగర్ డైమండ్స్: తన్మయ్ అగర్వాల్ (సి), సాత్విక్ రెడ్డి, హెచ్కె సింహా, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, నారాయణ తేజ, శుభం శర్మ, అఖిల్ కుమార్ సంకోజు, రత్లావత్ దినేష్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీష్ కుమార్హైదరాబాద్ ఈ ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, యశ్వీర్ గౌడ్, గడుగు గణేష్, వైష్ణవ్ రెడ్డి ఎ, ప్రణవ్ వర్మ, పి అరవింద్ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్ -
హైదరాబాద్ టీమ్కు షాక్.. ఫైనల్కు దూసుకెళ్లిన ఖమ్మం
తెలంగాణ టీ20 (TG20)-2026లో అన్విత ఖమ్మం ఏసెస్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో 10 పరుగుల తేడాతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ను ఓడించిన ఖమ్మం.. టీజీ20లో ఫైనల్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. క్వాలిఫయర్-1లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఖమ్మం బ్యాటర్లలో మికిల్ జైశ్వాల్ కేవలం 34 బంతుల్లో 4 ఫోర్లు,7 సిక్స్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు జీఎస్కే రెడ్డి(40), పరాస్ రాజ్(32) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో ఆఖిల్ రాథోడ్ రెండు, షణ్ముఖ, ప్రణవ్, అజయ్, దేవ్ తలా వికెట్ సాధించారు.అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి(1) ఆరంభంలో ఔటైనప్పటికి మరో ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి(27 బంతుల్లో 69) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఖమ్మం బౌలర్లలో సహేంద్ర మల్లు మూడు, వేద్ రెడ్డి రెండు వికెట్లు సాధించారు. కాగా శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2లో కరీంనగర్ డైమండ్స్తో హైదరాబాద్ తలపడనుంది. -
హైదరాబాద్తో మ్యాచ్.. ఖమ్మంకు భారీ షాక్
తెలంగాణ టీ20 (TG20)-2026లో మరో హైవోల్టేజ్ పోరుకు తెరలేచింది. ఉప్పల్ వేదికగా క్వాలిఫయర్-1లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్కు ఖమ్మం స్టార్ బ్యాటర్ హిమతేజ దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు అందుబాటులో లేనిట్లు తెలుస్తోంది. హిమతేజ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కీలక మ్యాచ్కు అతడు లేకపోవడం ఖమ్మంకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.అతడి స్ధానంలో పరాస్ రాజ్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ఈ రెండు జట్లు లీగ్ స్టేజిలో టేబుల్ టాపర్స్గా నిలిచాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు ఫైనల్లో అడుగుపెట్టేందుకు మరో అవకాశముంటుంది. ఇందులో ఓడిపోయిన జట్టు క్వాలిఫయర్-2లో కరీంనగర్ డైమండ్స్తో తలపడనుంది.తుది జట్లుఅన్విత ఖమ్మం ఏసెస్: వాఫీ డైమండ్ కచ్చి, జీఎస్కే రెడ్డి, పరాస్ రాజ్, మిక్కిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి(వికెట్ కీపర్), చామ వి మిలింద్(కెప్టెన్), సహేంద్ర మల్లు, షేక్ అజర్, విద్యానంద రెడ్డి, వేద్ రెడ్డి, హర్షిత్ సాయి వైహైదరాబాద్ ఈ-ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి(కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, అన్విత్ రెడ్డి, గడుగు గణేష్, ప్రణవ్ వర్మ, వైష్ణవ్ రెడ్డి ఎ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, పి అరవింద్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్ -
నల్గొండ నైట్స్పై హైదరాబాద్ ఇ-చాంప్స్ విజయం
టీజీ20 లీగ్లో హైదరాబాద్ ఇ-చాంపియన్స్ లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆడిన ఏడింటిలోనూ విజయాలు సాధించి టేబుల్ టాపర్గా క్వాలిఫయర్-1లో అడుగుపెట్టింది. సోమవారం ఉప్పల్ వేదికగా నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ చాంపియన్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఇ-చాంప్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. అన్విత్ రెడ్డి (40), అభిరథ్ రెడ్డి (39) రాణించగా, చివర్లో అజయ్ దేవ్ (34 నాటౌట్), వైష్ణవ్ రెడ్డి (16 బంతుల్లో 41 నాటౌట్ , ఒక ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. నల్గొండ బౌలర్లలో శరను నిశాంత్ 2 వికెట్లు తీయగా, ఇయాన్ సతాని, అర్ఫాజ్ అహ్మద్, అనికేత్ రెడ్డి తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. నల్గొండ బ్యాటర్లలో వరుణ్ గౌడ్ (32 బంతుల్లో 53) అర్ధసెంచరీ చేయగా, జశ్వత్ మోతె (36), గౌరవ్ రెడ్డి (25) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో షన్ముక అశ్విన్ 4 వికెట్లు తీయగా, అజయ్ దేవ్, ప్రనవ్ వర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తొలి వికెట్కు జశ్వత్ మోతె, గౌరవ్ రెడ్డిలు 42 పరుగులు జోడించారు. ఆ తర్వాత వరుణ్ గౌడ్ నిలకడగా ఆడడంతో రన్రేట్ ఎక్కడా తగ్గలేదు. చివర్లో హర్షవర్దన్ సింగ్ (11 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులతో నల్గొండ్ నైట్స్ 180 పరుగుల మార్క్ను దాటింది.Game changing over! 🥵🤯A Vaishnav Reddy, where were you throughout this chase?! 💥The batter has killed the game with four huuuuuuuuge 6️⃣s that has completely swung the pendulum in the Champions' favour!#ANKvHEC #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/ViWou61XOI— tg20official (@tg20official) July 6, 2026Oh yes, Abhi! 🫡His intent is clear as day, as Abhirath Reddy is playing the aggressor's role very early in the innings.#ANKvHEC #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/Q4Ux4DxOUn— tg20official (@tg20official) July 6, 2026 -
నల్గొండ భారీ స్కోరు.. హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే?
టీజీ20 లీగ్లో భాగంగా హైదరాబాద్ ఇ-చాంపియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో అనురాగ్ నల్గొండ నైట్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. నల్గొండ బ్యాటర్లలో వరుణ్ గౌడ్ (32 బంతుల్లో 53) అర్ధసెంచరీ చేయగా, జశ్వత్ మోతె (36), గౌరవ్ రెడ్డి (25) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో షన్ముక అశ్విన్ 4 వికెట్లు తీయగా, అజయ్ దేవ్, ప్రనవ్ వర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు.తొలి వికెట్కు జశ్వత్ మోతె, గౌరవ్ రెడ్డిలు 42 పరుగులు జోడించారు. ఆ తర్వాత వరుణ్ గౌడ్ నిలకడగా ఆడడంతో రన్రేట్ ఎక్కడా తగ్గలేదు. చివర్లో హర్షవర్దన్ సింగ్ (11 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులతో నల్గొండ్ నైట్స్ 180 పరుగుల మార్క్ను దాటింది.Jashwanth 🤝 GauravThe Knights' dynamic duo get off to another good start, keeping the scoreboard ticking with regular hit to the fence.#ANKvHEC #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/j8ap7i2zVf— tg20official (@tg20official) July 6, 2026 Goud, that's some serious hitting! 💥Aelgani Varun Goud dug into the bowler and tore him apart in a huge 23 run over!#ANKvHEC #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/RLPTrGcTuP— tg20official (@tg20official) July 6, 2026 -
టాస్ గెలిచిన హైదరాబాద్ ఇ-చాంపియన్స్
టీజీ20 లీగ్లో భాగంగా సోమవారం ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఈ చాంపియన్స్, అనురాగ్ నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరబాద్ ఇ-చాంపియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన ఆరింటిలోనూ విజయాలు సాధించిన హైదరాబాద్ ఇ-చాంపియన్స్ 12 పాయింట్లతో పట్టికలో టాప్లో కొనసాగుతోంది. మరోవైపు నల్గొండ నైట్స్ ఆరు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి నల్గొండ నైట్స్ రెండో స్థానానికి చేరుకోవాలని భావిస్తుండగా, హైదరాబాద్ ఇ-చాంపియన్స్ మాత్రం తమ చివరి మ్యాచ్లోనూ గెలిచి గ్రూప్ టాపర్గా నిలవాలని భావిస్తోంది.తుదిజట్లు:నల్గొండ నైట్స్: జశ్వత్ మోతే, గౌరవ్ రెడ్డి, పి నితీష్ రెడ్డి, రాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, హర్షవర్ధన్ సింగ్ (వికెట్ కీపర్), అర్ఫాజ్ అహ్మద్, దివేష్ సింగ్, ఇల్యాన్ సతాని, ఏలగాని వరుణ్ గౌడ్, శరణు నిశాంత్హైదరాబాద్ ఇ చాంపియన్స్: అభిరత్ రెడ్డి (కెప్టెన్), వికాస్ రెడ్డి , వైష్ణవ్ రెడ్డి (వికెట్ కీపర్), గడుగు గణేష్ న్విత్ రెడ్డి, ప్రణవ్ వర్మ, పి అరవింద్, అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్ -
వరంగల్ను చిత్తు చేసిన హైదరాబాద్
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా బుధవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఇ- చాంపియన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వరంగల్ స్కోరెంతంటే?వరంగల్ ఓపెనర్లలో హర్షిత్ చౌదరి (22) త్వరగానే వెనుదిరగగా.. కెప్టెన్ అమన్ రావు (20 బంతుల్లో 45) రాణించాడు. వన్డౌన్లో వచ్చిన రిషికేత్ 38 పరుగులు చేయగా.. మిగిలిన వారిలో శౌనక్ (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.మురుగన్ అభిషేక్ (4) పూర్తిగా విఫలం కాగా.. ధీరజ్ 18, భవేశ్ 6, ఆది మణి కిరణ్ 5, ముదస్సర్ 3 పరుగులు చేసి నిష్క్రమించారు. క్రాంతి (2), సల్మాన్ అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వరంగల్ తొమ్మిది వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది.హైదరాబాద్ బౌలర్లలో అజయ్ గౌడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్, ప్రణవ్ వర్మ, అభిరథ్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయంలక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ కేవలం 15.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి అజేయ శతకం (43 బంతుల్లో 101)తో అదరగొట్టగా.. గడుగు గణేశ్ అర్ధ శతకం (31 బంతుల్లో 50)తో అలరించాడు. వరంగల్ బౌలర్లలో సల్మాన్ ఖాన్, క్రాంతి, శౌనక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లువరంగల్అమన్ రావు పేరాల (కెప్టెన్), భవేశ్ సేత్ (వికెట్ కీపర్), రిషికేత్ సిసోడియా, హర్షిత్ చౌదరి, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుసేన్, పల్లెపాటి క్రాంతి, సుంకరి ధీరజ్, సల్మాన్ ఖాన్.హైదరాబాద్అభిరథ్ రెడ్డి మందాడి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, గడుగు గణేశ్, వైష్ణవ్ రెడ్డి, ప్రణవ్ వర్మ, అరవింద్ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, ఎంఏ షణ్ముఖ. -
ఖమ్మంపై హైదరాబాద్ ఇ-చాంపియన్స్ విజయం
టీజీ20 లీగ్లో భాగంగా సోమవారం ఉప్పల్ వేదికగా అన్వితా ఖమ్మం ఏసెస్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఇ-చాంప్స్ 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ ఇ-చాంప్స్ పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 212 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన అన్వితా ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితమైంది. కొడిదెల హిమతేజ (64) అర్ధసెంచరీ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో శ్రీనికేత్ మూడు వికెట్లు తీయగా, అజయ్ దేవ్గౌడ్, షణ్ముక అశ్విన్, అన్విత్ రెడ్డి తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఇ-చాంప్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కెప్టెన్ అభిరత్ రెడ్డి (59) హఫ్ సెంచరీతో చెలరేగగా, గుడుగు గణేశ్ (21 బంతుల్లో 44) రాణించాడు. అన్వితా ఖమ్మం బౌలర్లలో వేద్ రెడ్డి, సహేంద్ర మలు, సాకేత్ దాత్రక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
హైదరాబాద్తో మ్యాచ్.. ఖమ్మం కెప్టెన్ సీవీ మిలింద్కు గాయం!
తెలంగాణ ప్రీమియర్ లీగ్లో మరో రసవత్తర పోరుకు తెరలేచింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఖమ్మం ఏసెస్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్కు ఖమ్మం కెప్టెన్ సీవీ మిలింద్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో హిమతేజ ఖమ్మం జట్టును ముందుండినడిపిస్తున్నాడు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు అగ్రస్ధానంలో ఉండగా.. ఖమ్మం నాలుగో స్ధానంలో ఉంది.జట్లు:హైదరాబాద్ ఈ ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి(కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, ప్రణవ్ వర్మ, పి అరవింద్(వికెట్ కీపర్), అన్విత్ రెడ్డి, శ్రీనికేత్, షణ్ముఖ అశ్విన్, గడుగు గణేష్, అజయ్ దేవ్ గౌడ్, అఖిల్ రాథోడ్, వైష్ణవ్ రెడ్డి ఎ.అన్విత ఖమ్మం ఏసెస్ : కొడిమెల హిమతేజ(కెప్టెన్), మిక్కిల్ జైస్వాల్, సాకేత్ ధాత్రక్, ప్రతీక్ రెడ్డి(వికెట్ కీపర్), జీఎస్కే రెడ్డి, సహేంద్ర మల్లు, వాఫీ డైమండ్ కచ్చి, మయాంక్ గుప్తా, మహేష్ విప్పర్ల, వేద్ రెడ్డి, విద్యానంద రెడ్డి -
వికాస్, అభిరథ్ విధ్వంసం.. హైదరాబాద్ హ్యాట్రిక్
టీజీ20 లీగ్ 2026లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా మూడో మ్యాచ్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇవాళ జరిగిన 12వ మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై 46 పరుగుల తేడాతో గెలుపొందింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు అభిరథ్ రెడ్డి (59), వికాస్ రెడ్డి (93) విధ్వంసకర అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో గడుగు గణేశ్ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెదక్ బౌలరల్లో విక్రమ్ నాయక్, ఘాజీ అబ్బాస్ చెరో 2 వికెట్లు తీయగా.. వరుణ్, కార్తీకేయ, రవితేజ, అశ్విన్ రామ్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను మెదక్ కూడా ధీటుగానే ప్రారంభించినప్పటికీ.. 12వ ఓవర్ తర్వాత స్వల్ప విరామాల్లో 6 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. అజయ్ దేవ్ గౌడ్ (4-0-20-4), ప్రణవ్ వర్మ (4-0-35-2) అద్భుతంగా బౌలింగ్ చేసి మెదక్కు దెబ్బకొట్టారు. శ్రీనికేత్, నితన్ నాయక్ తలో వికెట్ తీశారు. మెదక్ బ్యాటర్లలో విక్రమ్ నాయక్ (75) ఒంటరిపోరాటం చేశాడు. వరుణ్ యెర్రమ్ (38), రవితేజ (31), ఇషాన్ శర్మ (27) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో హైదారాబాద్ రన్రేట్ను భారీగా మెరుగుపర్చుకొని పాయింట్ల పట్టికలో సోలోగా అగ్రస్థానంలో నిలిచింది. -
హైదరాబాద్ ఖాతాలో మరో గెలుపు
టీజీ20 లీగ్ 2026లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా మూడో మ్యాచ్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించింది. ఇవాళ జరిగిన 12వ మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై 46 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 240 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన మెదక్ లక్ష్యానికి 47 పరుగుల దూరంలో (194-9) నిలిచిపోయింది. ధీటుగా బదులిస్తున్న మెదక్241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెదక్ ఫాల్కన్స్ ధీటుగా బదులిస్తుంది. 11.3 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఫాల్కన్స్ గెలవాలంటే మరో 51 బంతుల్లో 114 పరుగులు చేయాలి. విక్రమ్ నాయక్ (70) విధంసాన్ని కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా రవితేజ (18) క్రీజ్లో ఉన్నాడు. హైదరాబాద్ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు అభిరథ్ రెడ్డి (59), వికాస్ రెడ్డి (93) విధ్వంసకర అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో గడుగు గణేశ్ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెదక్ బౌలరల్లో విక్రమ్ నాయక్, ఘాజీ అబ్బాస్ చెరో 2 వికెట్లు తీయగా.. వరుణ్, కార్తీకేయ, రవితేజ, అశ్విన్ రామ్ తలో వికెట్ తీశారు. సెంచరీ చేజార్చుకున్న వికాస్ రెడ్డి15.1వ ఓవర్- వికాస్ రెడ్డి సెంచరీ చేజార్చుకున్నాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీకి చేరువలో వికాస్ రెడ్డిఓపెనర్ వికాస్ రెడ్డి సెంచరీ దిశగా సాగుతున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత హైదరాబాద్ స్కోర్ 180-2గా ఉంది. భారీ స్కోర్ దిశగా హైదరాబాద్టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 122-1గా ఉంది. అభిరథ్ రెడ్డి (27 బంతుల్లో 59; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఔట్ కాగా.. వికాస్ రెడ్డి 59, నితిన్ నాయర్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అభిరథ్ రెడ్డి వికెట్ ఘాజీ అబ్బాస్కు దక్కింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 27) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్, హైదారాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.తుది జట్లు..మెదక్ ఫాల్కన్స్: శృంజిత్ రెడ్డి, నమన్ అగర్వాల్, సాయి వరుణ్ ఎర్రమ్, రవితేజ (కెప్టెన్), నౌమాన్ అహ్మద్, ఇషాన్ శర్మ, విక్రమ్ నాయక్ గుగులోత్, బన్నీ జగం, అహ్వినన్ రామ్, సయ్యద్ ఘాజీ అబ్బాస్, కార్తికేయ కాక్హైదరాబాద్ ఈ ఛాంప్స్: అభిరథ్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, అన్విత్ రెడ్డి, షణ్ముఖ అశ్విన్, గణేశ్ గడుగు, నితిన్ నాయక్, అర్వింద్, అజయ్ దేవ్ గౌడ్, ప్రణవ్ వర్మ, అఖిల్ రాథోడ్, శ్రీనికేత్ -
రంగారెడ్డికి తొలి ఓటమి.. హైదరాబాద్కు రెండో గెలుపు
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)-2026లో మరో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రంగారెడ్డి రైజర్స్- హైదరాబాద్ ఇ- చాంపియన్స్ గురువారం ఉప్పల్ వేదికగా తలపడుతున్నాయి. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా... రంగారెడ్డి రైజర్స్ బ్యాటింగ్కు దిగింది.రంగారెడ్డి స్కోరెంతంటే?ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ 35 పరుగులు చేయగా.. అవనీశ్ రావు మెరుపు అర్ధ శతకం (29 బంతుల్లో 53) సాధించాడు. వన్డౌన్ బ్యాటర్ ఆదిత్య జవ్వాజి సైతం హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 58) చేయగా.. త్యాగరాజన్ 22 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో సాయి యాదవ్ (10 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రంగారెడ్డి నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.అభిరథ్ రెడ్డి ధనాధన్లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ ఆదిలోనే ఓపెనర్ వికాస్ రెడ్డి (3).. వన్డౌన్ బ్యాటర్ అన్విత్ రెడ్డి (4) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్, కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదిన అభిరథ్ రెడ్డి.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. రంగారెడ్డి కెప్టెన్ తనయ్ త్యాగరాజన బౌలింగ్లో హితేశ్కు మ్యాచ్ ఇచ్చి 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మిగిలిన వారిలో షణ్ముఖ 30, గణేశ్ 25, యశ్వీర్ 30 పరుగులతో రాణించారు. ఫలితంగా 18 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. కాగా సీజన్లో రంగారెడ్డికి ఇది తొలి ఓటమి కాగా.. హైదరాబాద్కు రెండో గెలుపుసంక్షిప్త స్కోర్లురంగారెడ్డి- 195/4హైదరాబాద్- 198/4 (18)ఫలితం- ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపుతుదిజట్లురంగారెడ్డిఅవనీశ్ రావు అరవెల్లి (వికెట్ కీపర్), తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, అలంకృత్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, రాకేశ్, అరుణ్ కుమార్, పున్నయ్య భువనగిరి, ఆర్యన్ కరియప్ప.హైదరాబాద్అన్విత్ రెడ్డి, అజయ్ దేవ్గౌడ్, అభిరథ్ రెడ్డి (కెప్టెన్), గణేశ్ గడుగు, సాయి వికాస్ రెడ్డి, ప్రణవ్ శర్మ, శ్రీనికేత్, షణ్ముఖ అశ్విన్, అఖిల్ రాథోడ్, యశ్వీర్ గౌడ్. -
హైదరాబాద్కు తొలి గెలుపు
తెలంగాణ టీ20 లీగ్-2026లో హైదరాబాద్ ఇ- ఛాంపియన్స్ జట్టు తొలి మ్యాచ్లోనే విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా ఇవాళ (జూన్ 23) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పాలమూరు స్ట్రయికర్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన హైదరాబాద్.. పాలమూరు జట్టును 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ చేసింది. అనుముల విఘ్నేశ్ రెడ్డి (30), రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ చెరో రెండు, శ్రీనికేత్ ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 35 పరుగులు చేసి శుభారంభం అందించగా.. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేశ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. పాలమూరు బౌలర్లలో రిషబ్ బస్లాస్ 2, రవి కిరణ్ ఓ వికెట్ తీశారు. -
పాపం పాలమూరు.. వరుసగా రెండో ఓటమి
తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్- హైదరాబాద్ ఇ- చాంపియన్స్ మంగళవారం తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాలమూరు బ్యాటింగ్కు దిగింది. పాలమూరు ఆలౌట్హైదరాబాద్ బౌలర్ల ధాటికి పాలమూరు 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. అనుముల విఘ్నేశ్ రెడ్డి (30), రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30) ఓ మోస్తరుగా రాణించారు. హైదాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్వీర్ గౌడ్, ప్రణవ్ వర్మ చెరో రెండు, శ్రీనికేత్ ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ గెలుపునామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. 15.4 ఓవర్లలో పనిపూర్తి చేసింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి తొలి గెలుపు నమోదు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిరథ్ రెడ్డి 35 పరుగులు చేయగా.. అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేశ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాలమూరు బౌలర్లలో రిషభ్ బస్లాస్ రెండు, రవి కిరణ్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా సీజన్ ఆరంభ మ్యాచ్లో పాలమూరు ఖమ్మం ఏసెస్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.తుదిజట్లుపాలమూరుఅనుముల విజ్ఞేశ్ రెడ్డి, పృథ్వీ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్), రోహిత్ రాయుడు, నిశాంత్ సేన్ రెడ్డి సీహెచ్, ప్రతీక్ పవార్, మహ్మద్ ఆఫ్రిది అహ్మద్, నిపుణ్ రెడ్డి శవ్వా, రిషభ్ బస్లాస్, కిరణ్, జంబోజు పార్దీబన్.హైదరాబాద్హైదరాబాద్అభిరథ్ రెడ్డి మందాడి (కెప్టెన్), ప్రణవ్ వర్మ, అరవింద్ (వికెట్ కీపర్), సాయి వికాస్ రెడ్డి, శ్రీనికేత్, షణ్ముఖ, అఖిల్ రాథోడ్, గడుగు గణేశ్, అన్విత్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, యశ్వీర్ గౌడ్.


