breaking news
CJP Protest
-
స్వతంత్ర భరద్వాజ్ అరెస్టు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఓ విద్యార్థి తండ్రిపై తాను దాడి చేశానని, తల పగులగొట్టానని చెప్పుకున్న హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని బులంద్ షెహర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అంతకుముందు ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, ఎంపీ పప్పు యాదవ్లతో కలిసి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. స్వతంత్ర భరద్వాజ్ను అరెస్టు చేయాలని పట్టుబట్టారు. 72 గంటల్లో అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సీజేపీ కార్యకర్తలు నిరసన విరమించారు. తర్వాత గంటల వ్యవధిలోనే స్వతంత్ర భరద్వాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది? పేపల్ లీకేజీపై జంతర్మంతర్ వద్ద విద్యార్థులు జూన్ 23న ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని నిషూ ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్ ఫోన్లో రికార్డు చేస్తుండగా వాగ్వాదం మొదలైంది. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనపై దాడి చేశారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. తన తలపై పిడిగుద్దులు కురిపించారని, ఇనుప కడియం లాంటి గట్టి వస్తువుతో కొట్టారని సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆయన తలపై రెండు బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాడికి పాల్పడిన స్వతంత్ర భరద్వాజ్, సూరజ్ కుమార్లపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడిన ఒక పాడ్కాస్ట్ క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో భరద్వాజ్ తనను తాను కట్టర్ హిందూ(కరుడుగట్టిన హిందువు)గా చెప్పుకున్నాడు. సంజయ్ కుమార్ పుర్రెను తాను పగలగొట్టినట్లు బయటపెట్టాడు. ‘‘ఈ నేరం ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుందో మీకు తెలుసా? సెక్షన్ 307. నిషూ ఆజాద్ తండ్రికి 60 కుట్లు పడ్డాయి. అతడిని అంబులెన్స్లో తరలించారు. తన తండ్రికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ బయట నిలబడి అతడి కుమార్తె నిషూ ఆజాద్ అంటోంది. కానీ, నన్ను కనీసం జైలులో కూడా పెట్టలేదు. ఈ విషయం ప్రపంచానికి తెలియాలి. రాత్రంతా నేను బయట తిరుగుతూనే ఉన్నాను. నాకు హనుమంతుని ఆశీస్సులు ఉన్నాయి. కపిల్ మిశ్రా నాకు అన్నయ్య అవుతారు. కపిల్ మిశ్రా ఫోన్ చేయడం వల్లే నేను విడుదలయ్యానని అంటుంటారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా నాకు అన్నయ్యే. మీకు ఎంతమంది నాయకులు తెలుసు? మోదీజీ తెలుసా? మోదీజీ కూడా నాకు అన్నయ్యే. అందరి మద్దతు నాకు ఉంది’’అని భరద్వాజ్ ఆ వీడియోలో చెప్పడం కనిపిస్తోంది. దీంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచి్చంది. భరద్వాజ్ను అరెస్టు చేయాలని సీజేపీ కార్యకర్తలు శుక్రవారం ఆందోళనకు దిగారు. విద్యారి్థని నిషూ ఆజాద్ కూడా పాల్గొన్నారు. భరద్వాజ్ను ఎందుకు జైలులో పెట్టలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు అతనికి రాజకీయ రక్షణ లభిస్తోందని ఆరోపించారు. రాజకీయ జోక్యం ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. అతడిని అరెస్టు చేసినట్లు స్పష్టంచేశారు. ఆత్మరక్షణ కోసమే దాడి స్వతంత్ర భరద్వాజ్ మొదటి వీడియో వైరల్ అయిన తర్వాత మరో వీడియో వెలుగులోకి వచి్చంది.వాస్తవానికి ఆత్మరక్షణ కోసమే తాను దాడికి దిగాల్సి వచి్చందని ఇందులో అతడు వివరణ ఇచ్చాడు. ‘‘ఒకవేళ నేను ఆత్మరక్షణలో భాగంగా వ్యవహరించి ఉండకపోతే ఆ గుంపు నన్ను కొట్టి చంపి ఉండేది. నా ప్రాణాలు కచి్చతంగా పోయేవి. జంతర్మంతర్ వద్ద నిరసనకారులపై నేను దాడి చేయడానికి ప్రయత్నించలేదని నిరూపించడానికి వీడియో సాక్ష్యం ఉంది’’అని పేర్నొన్నాడు. -
‘నన్ను టార్గెట్ చేస్తే.. మళ్లీ కొడతా’ : స్వతంత్ర భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ (NEET) నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్త తండ్రిపై దాడి చేసిన కేసులో నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ తన వైఖరిని సమర్థించుకుంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అతని ఒక పాడ్కాస్ట్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సీజేపీ అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది.అయితే ఈ సందర్భంగా స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడుతూ సీజేపీ నిరసనలతో విద్యార్తుల గుంపు తనపై దాడి చేసి కొట్టి చంపేలా (Lynching) ప్రవర్తించడంతో, తనను తాను రక్షించుకోవడానికే తన చేతికి ఉన్న లోహపు కడా (Iron Bracelet)తో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ తలపై కొట్టానని తెలిపాడు.“I Cracked His Head. Still Never Went Jail.” Then He Named Powerful Politicians As Protection #SwatantraBhardwaj is heard allegedly claiming that he attacked the father of a protester, causing severe head injuries that required around 60 stitches. pic.twitter.com/sdydrSQzlm— Genzdigest (@genzdigest) September 3, 2026పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు వైరల్"నేను అతని(నిషు ఆజాద్ తండ్రి) పుర్రె పగలగొట్టాను, చావు బతుకుల మధ్య అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనికి 60 కుట్లు పడ్డాయి... నిజానికి నాపై సెక్షన్ 307 (హత్యాయత్నం) పడాలి, కానీ పోలీసులు నన్ను అరెస్ట్ కూడా చేయలేదు, రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను ఒక్క రోజులోనే విడుదలయ్యాను. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ , మోదీ కూడా నాకు అన్నయ్యలే. అందరి మద్దతు ఉంది" అంటూ గర్వంగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అయితే ఇది వివాదాస్పద మవ్వడంతో, ఆ మాటలను సరదాగా అన్నానని మాట మార్చాడు. అంతేకాదు పాడ్కాస్ట్లో తన మాటల్ని వక్రీకరిస్తున్నారంటూ మాట మార్చడంతోపాటు, ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కామెంట్ చేయడం వైరల్గా మారింది. మళ్లీ తనను చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నిస్తే, చేతి కడియంతో మళ్లీ కొడతానని హెచ్చరించడం కలకలం రేపింది.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలుకాగా స్వతంత్ర భరద్వాజ్ వ్యాఖ్యలకు నిరసనగా సీజేపీ భీమ్ ఆర్మీ నిరసన చేపట్టింది. CJP ప్రతినిధి సౌరవ్ దాస్, కో-కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భరద్వాజ్ను వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై హత్యాయత్నం, SC/ST చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట భారీ ధర్నా చేపట్టారు. ఫలితంగా భరద్వాజ్పై హత్యాయత్యం కేసు నమోదైంది. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని సీజేపీకి పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు -
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
సాక్షి, న్యూఢ్లిల్లీ: జూలై 23న జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన హిందుత్వ కార్యకర్తగా చెప్పుకునే స్వతంత్ర భరద్వాజ్కు భారీ షాక్ తగిలింది. స్వతంత్ర భరద్వాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం (సెక్షన్ 307) , SC/ST చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నాయకులు, ఇతర కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. సీజేపీ సహ-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ సహా నిరసనకారులు, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భరద్వాజ్పై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడ పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.నీట్ (NEET) నిరసనల సమయంలో CJP కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై దాడి చేశానిని, అంతేకాకుండా తాను “తలను పగలగొట్టానని, తగిన చర్యలు తీసుకోకుండా రాజకీయ నేపథ్యం వల్ల తప్పించుకున్నానని” ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది. దీంతో భరద్వాజ్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే తొలుత బలహీనమైన సెక్షన్లు పెట్టడంతో సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం పోలీసులతో గంటల తరబడి చర్చలు జరిపిన తర్వాత, నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్ఐర్లో ఎస్సీ/ఎస్టీ చట్టానికి సంబంధించిన సెక్షన్లను చేర్చారు. 'హత్యాయత్నం' (attempt to murder) అభియోగాన్ని చేర్చవచ్చా లేదా అని నిర్ధారించడానికి వైద్య పరీక్ష కూడా నిర్వహించనున్నారు. అత్యాచార బెదిరింపులకు సంబంధించి నిషు చేసిన ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించారు.నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ఈ సందర్భంగా నిషు ఆజాద్ తండ్రి సంజయ్ ఆజాద్ మాట్లాడుతూ FIRలో చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చాలన్న తమ డిమాండ్ను ఢిల్లీ పోలీసులు అంగీకరించారని తెలిపారు. నిందితులను 72 గంటల్లోగా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితులు అరెస్టు అవుతారనే విషయంలో ఢిల్లీ పోలీసులపైనా, రాజ్యాంగంపైనా తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.#WATCH | At Parliament Street PS in Delhi, CJP's Nishu Azad's father, Sanjay Azad, says, "Delhi Police have accepted our demand to include the relevant sections of the law in the FIR. The police have said that the accused will be arrested in 72 hours. We have full faith in the… https://t.co/z6HJt2azvf pic.twitter.com/yjnLnKLT4H— ANI (@ANI) September 4, 2026 “Addl DCP made a commitment that charge of attempt to murder will be added to Sanjay Azad's existing FIR by evening along with SC/ST Act, Section 308 and 351.We were assured that Swatantra Bhardwaj will be arrested within 72 hours.”- CJP's Saurav Das who led at Parliament… pic.twitter.com/qEXiqbBUfI— News Arena India (@NewsArenaIndia) September 4, 2026CJP నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసులు అధికార బీజేపీ ఒత్తిడికి లొంగి భరద్వాజ్పై తగిన చర్యలు తీసుకోలేదని, దళిత కుటుంబానికి చెందిన సంజయ్, ఆయన కుమార్తెపై జరిగిన దాడిని తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.మాటమార్చిన స్వతంత్ర భరద్వాజ్ మరోవైపు స్వతంత్ర భరద్వాజ్ స్పందిస్తూ, తాను ఆత్మరక్షణ (Self-defence) కోసమే తిరగబడ్డానని, తన దగ్గర దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. 10-15 మంది చుట్టుముట్టడంతో ఆత్మరక్షణ కోసం ప్రయత్నించినప్పుడు అతని తలకు దెబ్బ తగిలిందన్నారు. రాహుల్ గాంధీ ,ఇతరులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పాడ్కాస్ట్ క్లిప్ నకిలీదని, పోడ్కాస్ట్లో తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలు -
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు
-
సీజేపీ నిరసనకారులకు సుప్రీంకోర్టు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు కానున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన సీజేపీ నిరసనలపై దేశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్లను నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2,873 నేరచరిత్ర కలిగిన వారి నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుపై పోలీసులకు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలరని చెప్పింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలనే షరతుకి లోబడి ఆర్టికల్ 142 కింద ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నామని, ఈ విధానాన్ని రాష్ట్రాలు సైతం పాటించవచ్చని పేర్కొంది.‘సెప్టెంబర్ 5 ర్యాలీ’ రద్దువిద్యార్థులపై కేసుల ఉపసంహరణతో కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. మరోవైపు, అంతకుముందు ఎఫ్ఐఆర్ల రద్దుకు సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు ఢిల్లీ , బిహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర పోలీసులు. రెండు పక్షాలు పరస్పర నమ్మకంతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని సీజేఐ చెప్పారు. విద్యార్థులను ప్రత్యర్థులుగా భావించడం లేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. -
‘కాక్రోచ్’ పార్టీ సిద్ధాంతాలు ఏమిటి?!
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనేది నిజానికి ఒక రాజకీయ పార్టీ కాదు. అట్లా మారే ఆలోచన కూడా లేదని, సమాజాన్ని వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడిని సృష్టించే ఉద్యమంగా మాత్రమే కొనసాగదలచుకున్నామని ఆ సంస్థ నిర్వాహకులు పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ సిద్ధాంతాలు ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తూనే ఉండటం గమనార్హం. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. సిద్ధాంతా లనేవి పార్టీలకు మాత్రమే ఉండాలా? సీజేపీ వంటి ఉద్యమాలకు ఉండవా? ఉండకూడదని, ఉండవని ఎవరైనా సూత్రీకరిస్తే అది పొరపాటు అవుతుంది. ఈ మాట అనుకున్న తర్వాత రెండు ప్రశ్నలకు జవా బులు చెప్పుకోవాలి. ఒకటి, అసలు సిద్ధాంతాలు అంటే ఏమిటి? రెండు, ఆ ప్రకారం సీజేపీకి సిద్ధాంతాలు అనదగ్గవి ఉన్నాయా, ఉంటే ఏమిటవి? అదే విధంగా ఈ తరహా ప్రశ్నలు ఎదురైనప్పుడు సీజేపీ నిర్వాహకులు ఇస్తున్న సమాధాన మేమిటి? సిద్ధాంతం అనే మాటకు స్థూలమైన నిర్వచనం ఏమంటే ఒక వ్యక్తికి, లేదా పార్టీకి, లేదా సంస్థకు సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల, అందుకు పరిష్కారాల పట్ల, భవిష్యత్తు పట్ల, దాని కోసం ఏమి చేయాలనే విషయమై తనదైన అవగాహన, కార్యాచరణ మార్గం ఉండటం. సిద్ధాంతం అనేది ఏ రంగం విషయంలోనైనా ఉంటుంది. ఇక్కడ సందర్భం సీజేపీ అయినందున సామాజిక రంగం గురించి చెప్పుకుంటున్నాము. సిద్ధాంతాలన్నవి రాజకీయ పార్టీలకే పరిమితం కానక్కర లేదని, సంస్థలకు కూడా ఉండవచ్చు నని, ఉండాలి కూడానని అనుకుంటున్నాము గనుక, ఇపుడు సీజేపీ గురించి విచారిద్దాము.ప్రకటన, పత్రం కనిపించని పోరాటంకొద్దిరోజుల క్రితం ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీజేపీ నిర్వాహకులు ఈ ప్రశ్నకు స్వయంగా చెప్పిన సమాధానం ఈ విధంగా ఉంది. ప్రశ్న: మీ సిద్ధాంతం మితవాదమా, మధ్యే మార్గమా, లేక వామపక్షమా? జవాబు: మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని మొదటి నుంచి చెబుతున్నాం. ప్రశ్న: రాజ్యాంగానిది మధ్యే మార్గమంటారు కదా? జవాబు: ఏదైనా కావచ్చు. కానీ మాది రాజ్యాంగ మార్గం. సమానత్వ హక్కులు, భావప్రకటనా స్వాతంత్య్రం, విద్యాహక్కులు, శాంతియుతంగా నిరసన ప్రకటించే హక్కు వగైరాలు. ఇటువంటివి అనేకం రాజ్యాంగంలో ఉన్నాయి. వాటిని సరిగా పాటించినట్లయితే మన దేశం చాలా ముందుకు పోతుంది. మేము సెక్యులర్. మావి ప్రజాస్వామిక విలువలు. ఛానల్ చర్చ ఒకే ప్రశ్నతో క్లుప్తంగా ముగిసినందున సీజేపీ ఆలోచనలు పూర్తి రూపంలో వెల్లడి కాలేదనాలి. ఇతరత్రా కూడా వారు దీనిపై ఒక ప్రకటనగాని, పత్రంగానీ విడుదల చేయలేదు. సంస్థ ఆరంభమైన మొదటి రోజు నుంచే వారు కార్యక్రమాలలో తలమునకలుగా ఉండటం అందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం ఉద్యమం వేడిలో నిర్వాహకులు చెప్పే కొద్ది మాటలు, చేసే కొద్ది కార్యక్రమాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. ముందుకు సాగిన కొద్దీ, ఇతర సామాజిక అంశాలపైనా దృష్టి పెట్టగలమంటున్నందున వాటి గురించి కూడా పలు ప్రశ్నలు ముందుకు వస్తాయి. అందువల్ల సీజేపీ, రాగల రోజులలో ఈ ప్రశ్నలపై దృష్టి పెట్టడం అవసరం అవుతుంది. సంస్థ నాయకుల నుంచి ఇంతవరకు వినవచ్చిన మాటలను, వారి కార్యక్రమాలను గమనించినపుడు వారి ఆలోచనలు, లేదా స్థూలమైన రీతిలో సిద్ధాంతాలు అనదగ్గ వాటిపై కొన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ అయిన అభిజీత్ దీప్కే అమెరికా నుంచి వచ్చి విమానాశ్రయం నుంచే భారత రాజ్యాంగాన్ని పైకెత్తి చూపటం చేశారు. జంతర్ మంతర్ ఆందోళన పొడవునా తనతోపాటు పలువురు ఇతర ఆందోళనకారులు అదే పని చేశారు. ఇదే ధోరణి ఇతర రాష్ట్రాలలోనూ కనిపించింది. ఈ స్ఫూర్తి ఎంతగా వ్యాపించిందంటే, ఇటీవల పట్నాలో పోలీసులు అదుపు లోకి తీసుకున్న ఆరేళ్ల పేద పిల్లవాడు ఆదిత్య రాజ్యాంగం గురించి, అంబేడ్కర్ గురించి మాట్లాడటం విన్నాము.రాష్ట్రాలకూ వ్యాపిస్తున్న ఆందోళనలుమొదటి రోజు నుంచే అభిజీత్ అనేకమార్లు గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, భగత్సింగ్ల ప్రస్తావనలు, కొద్దిసార్లు సుభాష్ బోస్ ప్రస్తా వన చేస్తున్నారు. వారి మార్గాన్ని అనుసరిస్తామన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలిచ్చారు. రైతాంగానికి సంఘీభావం ప్రకటించి వారిని తమకు మద్దతు తెలుపవలసిందిగా ఆహ్వానించటంతో పాటు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల వ్యవసాయ రంగానికి కలిగే నష్టాలపై వారు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు ప్రతినిధులను పంపారు. సీజేపీ మొదటినుంచే లేవనెత్తిన అంశాలలో మత రాజకీయాల పట్ల కూడా నిరసనలు కనిపించాయి. ఇపుడు పైన ప్రస్తావించిన ఛానల్ ఇంటర్వ్యూలోనూ అభిజీత్ తాము సెక్యులర్ వాదులమని ప్రకటించారు. ఈ అంశాలకే పరిమితం కాని నిర్వాహకులు పలు ప్రజాస్వామ్య సంబంధమైన సమస్యలను కూడా లేవనెత్తారు. అవి కోర్టులు, ఎన్నికల సంఘం సవ్యంగా పనిచేయక పోవటం, పార్టీ ఫిరాయింపులు, ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలకు జవాబుదారీతనం, పారదర్శకత లేకపోవటం, ప్రశ్నిస్తే ముద్రలు వేసి అణచివేయటం, అవినీతి, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ధనిక– పేద తారతమ్యాలు మొదలైనవి అందులో ఉన్నాయి. ఈ ఉద్యమ వాతావరణం క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది.శూన్యాన్ని పూరించే శక్తి కాగలదా? ఇవన్నీ గమనించినపుడు సీజేపీది ఏ సిద్ధాంతమని భావించ వలసి ఉంటుంది? మితవాదమా, మధ్యేవాదమా, వామపక్ష వాదమా, లేక అసలు ఏ వాదమూ లేనిదనా? వారు తమది రాజ్యాంగ వాదమన్నారనుకోవాలి. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన విషయాలు రెండు న్నాయి. సీజేపీ నాయకులను ప్రశ్నించిన ఛానల్ యాంకర్ అన్నట్లు భారత రాజ్యాంగం మధ్యేమార్గానిది ఎంతమాత్రం కాదు. అంబేడ్కర్, నెహ్రూలు సారథ్యం వహించిన ఆ గ్రంథం సోషలిస్టు, లేదా వామపక్షపు మొగ్గు గల మధ్యేమార్గ లక్షణాలు కలది. ఇపుడు సీజేపీ నిర్వాహకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ అవే లక్షణాలతో ఉన్నాయి. ఇది మొదటి విషయం కాగా, స్వాతంత్య్రా నంతరం అందుకు వారసత్వం తీసు కున్నామన్న కాంగ్రెస్ ఆచరణలో విఫలమైంది. ఆ పార్టీ స్థానంలో అదే వారసత్వాన్ని కొనసాగిస్తామన్న జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు కూడా విఫలమయ్యాయి. ఆ శూన్యంలోకి బీజేపీ అనే మితవాద పార్టీ ప్రవేశించింది. ప్రస్తుతం అది కూడా ప్రజాదరణను క్రమంగా కోల్పోతున్నది. భారతదేశపు వర్తమాన సమాజం ప్రగతిశీలమైన సమ్మిళిత వ్యవస్థను కోరుతోంది. అదే ఆ సమాజపు అవసరం, సహజ స్వభావం. అటువంటి స్థితిలో దేశం ఎదుర్కొంటున్న శూన్యాల మధ్య, సీజేపీ వంటిది ఆ శూన్యాన్ని పూరించగల శక్తిగా ఎదగగలదా, ఎదిగితే బాగుండుననే ఆలోచనలు ఒక చిన్న స్థాయిలో మొదలవుతున్నాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
కాక్రోచ్లపై దండయాత్రలా!
దేశ రాజధానిలోని జంతర్మంతర్లో జెన్ జీ సాగించిన ఉద్యమం తర్వాత బీజేపీ, ఆరెస్సెస్లతోపాటు రాజకీయ పక్షాలన్నీ మేల్కొన్నాయి. ఆ తరానికి చేరువకావటానికి... దాని ఆశలేమిటో, ఆకాంక్షలేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించటం మొదలెట్టాయి. ఇవన్నీ ఆశావహమైన మార్పులకు సంకేతంగా అందరూ భావించారు. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఈ ఉద్యమాన్ని పాఠశాలలకు సైతం విస్తరించాలని సంకల్పించి, ‘స్కూల్ ఠీక్ కరో’ పేరిట వివిధ రాష్ట్రాల్లో బడుల స్థితిగతులు బయటపెట్టేందుకు నడుం కట్టింది. కానీ చాలాచోట్ల దానికెదురవుతున్న ఆటంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. రాజస్థాన్లో జైపూర్ సమీపంలోని రాంపురా కన్వర్పురా గ్రామంలో పట్టుమని పదిమంది కూడా లేని సీజేపీ బృందంపై గ్రామస్థులమని చెప్పుకున్నవారు రాళ్లతో దాడిచేశారు. ఒకరి చేయి విరగ్గొట్టారు. మహిళల్ని కూడా మినహాయించలేదు. వాహనాలు ధ్వంసం చేశారు. గొడ్లపాకలో నడుస్తున్న ఈ బడి గురించి ఒక చానెల్లో వచ్చిన కథనంతో జెన్ జీ ఆ గ్రామానికి వెళ్లింది. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లోనూ ఇంతే. ఒక పాఠశాల వీడియో తీసేందుకు అనుమతి కోరిన సీజేపీ కార్యకర్త ఇంటిపై గుంపు దాడిచేసి అతన్ని కొట్టబోగా, అడ్డొచ్చిన అతని తండ్రి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్లో బడి పిల్లల్ని రెచ్చగొడుతున్నారంటూ పలు జిల్లాల్లో అనేకమందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. శిథిలావస్థలో ఉన్న బడుల్ని చూపించిన యూట్యూబర్లపై కేసులు పెట్టారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ సీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.ఈ పాలకులకు ఏమైంది? బడి బాగులేదంటే, ఉపాధ్యాయుల కొరత ఉందంటే, బడుగుల పిల్లలకు నాసిరకం చదువులే దక్కుతున్నాయంటే వీరెందుకు ఉలిక్కిపడు తున్నారు? బయటి ప్రపంచానికి తెలియకూడదని ఎందుకంత ఆత్రం? నిజానికి జంతర్ మంతర్ ఆందోళన ముగియటానికి కొంచెం అటూ ఇటూగా జెన్ ఆల్ఫా పిల్లలు రోడ్డెక్కారు.లక్నో శివారులో ఒక బడినుంచి వెల్లువలా బయటికొచ్చిన ఆడపిల్లలు రహదారిని దిగ్బంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. పిల్లలు ఏకరువుపెట్టిన సమస్యలు, వారి భావోద్వేగాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించలేదు. ఆ వెంటనే నలుగురు కొత్త టీచర్లొచ్చారు. ఈమధ్య జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిందేమిటి? రాష్ట్రాల్లో పాలకులు చేస్తున్నదేమిటి? ‘ఒక రోజు, ఒక యూనివర్సిటీ’ కార్యక్రమం చేపట్టాలని కేంద్రమంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, పనితీరు స్థానిక ప్రతినిధులద్వారా తరచు తెలుసుకోవాలని కోరారు. అదే పని సీజేపీ చేస్తే తప్పేమిటి? సమస్యలేమిటో, పిల్లలు పడుతున్న బాధలేమిటో బయటి ప్రపంచానికి చెప్పడంకాక, వారివల్ల ఇంకేం జరుగుతుందని ప్రభుత్వాలు వణుకుతున్నాయి? స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలవుతున్నా ఒకే ఒక్క గదితో, అయిదు తరగతులకు ఒకే టీచర్తో కొన్ని బడులు నడుస్తున్నాయంటే వింతకాదా? దేశంలో ఏకంగా 29 లక్షలమంది పిల్లలు చదువుకునే బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలు! బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఇతరచోట్ల సైతం ఇలాంటి దుఃస్థితే.ఆంధ్రప్రదేశ్లో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరూ కోరకుండానే రూ. 11,700 కోట్లతో ‘మన బడి: నాడు–నేడు’ కార్యక్రమం కింద వేలాది పాఠశాలలకు సౌకర్యవంతమైన భవంతులు నిర్మించింది. కార్పొరేట్లను తలదన్నే సదుపాయాలు కల్పించింది. 38,059 బడుల రూపురేఖల్ని మార్చింది. మరిన్ని పాఠశాలలకు విస్తరించాల్సివున్న తరుణంలో... కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త నిర్మాణాల సంగతలావుంచి, మెరుగుపడిన బడుల్ని కాస్తా నాశనం చేసిపెట్టింది. అందుకే సీఎంలంతా తమ నిర్వాకాన్ని సమీక్షించుకుని దిద్దుబాటుకు సిద్ధపడాలి. లక్ష్య నిర్దేశం చేసుకుని బడుల్ని బాగుచేస్తామని హామీ ఇవ్వాలి. అధికారం ఉందికదా అని పోలీసులతో, రౌడీలతో బెదరగొడదామనుకుంటే ఆ చర్యలు వికటిస్తాయి. మూర్ఖత్వాన్ని వదులుకుని సావధానంగా ఆలోచించటం... రేపటి పౌరుల శ్రేయస్సుకోసం సరైన నిర్ణయాలు తీసుకోవటం అవసరమని గుర్తించాలి. -
CJP లాఠీ ఛార్జ్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
-
జంతర్ మంతర్ ఘటనలపై ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిశీలించాలని సోమవారం హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఆదేశించింది. ఈ అంశంపై త్వరితగతిన మధ్యంతర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యవహారాన్ని ప్రస్తావించింది. జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల హింస, బలప్రయోగం ఆరోపణలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ.. మహిళా నిరసనకారులపై హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణలను ప్రత్యేకంగా పరిశీలిస్తుందని సీజేఐ తెలిపారు.స్వయంగా విచారణ చేపట్టాలని అభ్యర్థనమహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోషల్ మీడియాలో, ఇతర వేదికల్లో మహిళలు పోలీసుల చేత వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.బాధిత మహిళలు నేరుగా కమిటీకి ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అవసరమైతే జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో వాటిని స్వీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.నోడల్ అధికారుల ద్వారా ఫిర్యాదుల స్వీకరణదీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వుల్లో మహిళలపై జరిగినట్లు ఆరోపిస్తున్న వేధింపులు, దాడుల అంశాలను ప్రాధాన్యంగా పరిశీలించాలని కమిటీకి సూచించినట్లు తెలిపారు. కమిటీ చైర్పర్సన్కు నోడల్ అధికారులను నియమించే అధికారం ఇచ్చినట్లు చెప్పారు. నోడల్ అధికారుల నియామకం పూర్తయిన తర్వాత బాధితులు ఎలా ఫిర్యాదు చేయాలి, ఏ విధానంలో ఫిర్యాదులు స్వీకరించాలి అనే అంశాలను కమిటీ ప్రకటిస్తుందని వెల్లడించారు.జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీజంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పోలీసుల హింస, నిరసనకారుల చర్యలపై వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఐదుగురు సభ్యులతో హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. పోలీసుల అధిక బలప్రయోగం, మహిళా నిరసనకారులపై లక్ష్యంగా జరిగినట్లు ఆరోపిస్తున్న హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన వంటి అంశాలను పరిశీలించనుంది.మహిళల ఆరోపణలపై అత్యవసర నివేదికమహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలను సాధారణ అంశంగా కాకుండా ప్రత్యేక ప్రాధాన్యంతో విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.జంతర్ మంతర్ ఘటనలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం ఇప్పుడు కీలకంగా మారింది. బాధిత మహిళలకు ఫిర్యాదు చేసే స్పష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేయడం, ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపడం కమిటీ ముందున్న ప్రధాన బాధ్యతగా మారింది. -
“విశ్వాసఘాతం” అంటూ సీజేపీ కామెంట్స్.. మళ్లీ నిరసనలు?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించనుంది. జూలై 25న దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనను విరమించుకునేలా చేసిన కేంద్రం హామీలపై ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది. హామీల నుంచి వెనక్కి తగ్గే ప్రయత్నం జరిగితే అది దేశ యువతకు “విశ్వాసఘాతం”గా మారవచ్చని ఆ సంస్థ హెచ్చరించింది.నిరసనకారులతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా తెలియజేయలేదని సీజేపీ తెలిపింది. హామీల అమలును సాధించేందుకు అన్ని మార్గాలను కార్యవర్గం పరిశీలిస్తుందని, మరోసారి శాంతియుత దేశవ్యాప్త ఆందోళన చేపట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తుందని పేర్కొంది.“ఈ దేశ యువతకు ప్రభుత్వం మాట ఇవ్వడంతో సీజేపీ విశ్వాసంతో తన ఆందోళనను విరమించుకుంది. ఆ ‘మంచి విశ్వాసాన్ని’ బలహీనతగా భావించేందుకు మేము అనుమతించం” అని సీజేపీ తెలిపింది. సోమవారం జరిగే సమావేశం ఫలితానికి సిద్ధంగా ఉండాలని విద్యార్థులు, యువత, మద్దతుదారులు, స్వచ్ఛంద కార్యకర్తలను సీజేపీ కోరింది.ఆగస్టు 18న సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల సమగ్ర జాబితాను కోరిన కొన్ని రోజుల తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది. సీజేపీ ప్రకారం, కేసులను కొట్టివేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమ అధికారాలను వినియోగించే విషయాన్ని పరిశీలించేందుకు కేంద్రం ఆ జాబితాను అందించాలని సుప్రీంకోర్టు మూడు సార్లు కోరింది.కేంద్ర ప్రభుత్వం ఈ హామీ ఇవ్వలేదు “సుప్రీంకోర్టు పదేపదే ఈ జాబితాను కోరినప్పటికీ, దానిని అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వలేదు” అని సీజేపీ తెలిపింది. హామీలను “బలహీనపరచడం, ఆలస్యం చేయడం, వేరే విధంగా అర్థం చేసుకోవడం లేదా గౌరవించకపోవడం” వంటి ఏ ప్రయత్నాన్నైనా దేశ యువతకు “విశ్వాసఘాతం”గా పరిగణిస్తామని సీజేపీ పేర్కొంది.ఆందోళన విరమించిన సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం యువతను “మోసం చేస్తున్నట్లు” కనిపిస్తోందని ఆ సంస్థ సహ కన్వీనర్ సౌరవ్ దాస్, న్యాయ వ్యవహారాల విభాగం ప్రధాన బాధ్యురాలు రత్నా సింగ్ విచారణ అనంతరం ఆందోళన వ్యక్తం చేసినట్లు సీజేపీ తెలిపింది.ఆ హామీల్లో ఆందోళనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవడం లేదా కొట్టివేయడం, విద్యార్థులు, శాంతియుత నిరసనకారులపై భవిష్యత్తులో శిక్షాత్మక చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడం, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మేలో నీట్-యూజీ పరీక్ష రద్దైన తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించడం ఉన్నాయి.ఇదిలా ఉండగా, నిరసనల సమయంలో ఢిల్లీ పోలీసు సిబ్బంది ప్రశాంతంగా ఉండాలని, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని, తమ ప్రవర్తనను నమోదు చేసి పరిశీలించే అవకాశం ఉందని భావించాలని తాజా మార్గదర్శకాల్లో సూచించారు. గత నెల సీజేపీ జంతర్ మంతర్ ఆందోళన సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సూచనలు జారీ అయ్యాయి.నిరసనకారులతో వాగ్వాదానికి దిగకుండా, వారి ఎగతాళి, పాటలు, ప్లకార్డులు లేదా రెచ్చగొట్టే ప్రయత్నాలకు స్పందించకుండా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. అనారోగ్యానికి గురైన లేదా గాయపడిన నిరసనకారులకు సహాయం చేయడం, అంబులెన్సులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ప్రపంచం ముందు భారత్ తలెత్తుకు నిలబడేలా.. 4 నెలల్లో.. -
రిజర్వేషన్లపై చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు.. ఇదేమీ దానం కాదు..
రిజర్వేషన్ల రద్దు డిమాండ్లతో దేశంలో మరోసారి చర్చ మొదలైన వేళ.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఎవరు అడిగినా రిజర్వేషన్లను రద్దు చేయలేం.. ఇది ఎవరో ఇచ్చే దానం కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు’ అంటూ ఆయన తేల్చిచెప్పారు. జంతర్మంతర్ వద్ద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న సమయంలో చిరాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు.. రిజర్వేషన్ వ్యవస్థపై మరోసారి తీవ్ర చర్చకు తెరతీశాయి.పాట్నా విమానాశ్రయంలో ఢిల్లీకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన చిరాగ్.. తరతరాలుగా సామాజిక వివక్షకు గురైన వర్గాలను సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే రిజర్వేషన్ల ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వం తన ఇష్టానుసారం ఇచ్చే రాయితీగా రిజర్వేషన్లను చూడకూడదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలను రాజ్యాంగం గుర్తించిందని, వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు ఒక మార్గంగా కల్పించిందని చిరాగ్ పేర్కొన్నారు. సమాజంలో ఇప్పటికీ సామాజిక వివక్షకు సంబంధించిన ఘటనలు జరుగుతున్నాయని.. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పలేమని అన్నారు. అందుకే సామాజిక న్యాయంపై చర్చ కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.జంతర్మంతర్ వద్ద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యార్థులపైనా చిరాగ్ స్పందించారు. వారు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారని, వారి అభిప్రాయాలను వినాల్సిన అవసరం ఉందన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని, నిరసనకారులతో మాట్లాడితే రిజర్వేషన్ల వెనుక ఉన్న ఉద్దేశం, అవి ఎందుకు కొనసాగాల్సి వస్తుందో వివరించవచ్చని చెప్పారు. రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలపై కూడా చిరాగ్ స్పందించారు. నిరసనకారుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని చర్చకు అవకాశం కల్పించాలన్న ధోరణిని వ్యక్తం చేశారు.తేజస్వీకి కౌంటర్.. ఇదిలా ఉంటే బీహార్ ఆర్థిక పరిస్థితిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపైనా చిరాగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ప్రతిపక్షం ఆధారాలతో తమ అభ్యంతరాలను ప్రస్తావించాల్సిందని అన్నారు. కేవలం ఆరోపణలు చేయడం కాకుండా.. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కూడా ప్రతిపక్ష బాధ్యతేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, అభివృద్ధిని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చిరాగ్ తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు ఉన్న ‘డబుల్ ఇంజిన్’ పాలనతో బీహార్ ఆర్థికంగా మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
CJP అభిజిత్ దీప్కేకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లోకి నో ఎంట్రీ?
న్యూఢిల్లీ: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కన్వీనర్ అభిజీత్ దీప్కేపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని లాతూర్లో అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు రావడంతో, అభిజీత్ దీప్కేతో పాటు పార్టీ కార్యకర్త అజింక్య షిండే, ఇతర సీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే విధంగా అనుమతి లేకుండా పాఠశాలలను సందర్శించడాన్ని నిషేధం విధించింది. లాతూర్ జిల్లాలోని ఔసా సమీపంలో ఉన్న జవాలిలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో, అధికారిక విధులకు ఆటంకం కలిగించారని, ఉపాధ్యాయులను బెదిరించారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సయ్యద్ షంషాద్బానో ఖైరతాలీఫిర్యాదుతో అభిజీత్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.దీప్కేపై ఆరోపణలు దీప్కే, ఇతరులపై ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, దాడి చేయడం, బలప్రయోగం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, దీప్కే, అతని సహచరులు అధికారుల అనుమతి లేకుండా పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించారని ఆరోపణలు ఉన్నాయి. వారు విద్యార్థులతో కలిసి కూర్చుని పాఠశాల పరిస్థితులపై ప్రశ్నలు వేసినట్లు సమాచారం. వారు విద్యా, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.సీజేపీ నాయకుడు తమ పర్యటన, విద్యార్థులతో సంభాషణకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కూడా ఫిర్యాదులో వెల్లడించారు. దీప్కే తన పర్యటన సందర్భంగా మరో పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చి తరగతి గదులలో కూర్చోబెట్టారని, తద్వారా జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా, ఉపాధ్యాయులను సస్పెండ్ చేయిస్తానని ఆయన బెదిరించినట్లు కూడా పేర్కొన్నారు.👉ఇదీ చదవండి: సీజేపీ ఎఫెక్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి!‘స్కూల్ థీక్ కరో’ ప్రచారందేశ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న ప్రారంభించిన తమ 'స్కూల్ థీక్ కరో' ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సౌకర్యాలలో సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా ఉన్న ఈ కార్యక్రమం, దీప్కే స్వగ్రామమైన హింగోలిలో ప్రారంభమైంది. అప్పటి నుండి సీజేపీ సభ్యులు వివిధ రాష్ట్రాల్లోని అనేక పాఠశాలలను సందర్శించారు, అయితే కొన్ని చోట్ల వీరు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. శుక్రవారం జైపూర్లోని రాంపురా కన్వర్పురాలో ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తున్నప్పుడు సీజేపీ బృందంపై దాడి చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, ముంబైలో విద్యా శాఖ సీజేపీ వాలంటీర్లను అనుమతి లేకుండా మున్సిపల్ పాఠశాలల్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. -
పెల్లెట్ గన్ వివాదం: సాహిల్తో కలిసి రాహుల్గాంధీ ధర్నా, కేసులపై డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ శుక్రవారం నాడు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) కార్యాలయంలో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. ఈ సం దర్భంగా పోలీస్ స్టేషన్ వెలుపల ధర్నా (సీట్-ఇన్) నిరసన తెలిపారు. నిరసనకారులపై దాడులు చేసిన అధికారులపై కేసులు నమోదయ్యే వరకు తాను పోలీస్ స్టేషన్లోనే ఉంటానని, న్యాయం కోరుతూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు. అయితే దీనికి పోలీసులు నిరాకరించడంతో, అతను డీసీపీ సెంట్రల్ సచిన్ శర్మను కలిసి కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలు కోరారు.జులై 20న జరిగిన 'జెన్ జీ' (Gen Z) నిరసనలో పెల్లెట్ గన్ దాడిలో గాయపడిన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్తో కలిసి ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడానికి నిరాకరిస్తున్నారని సాహిల్ ఆరోపించడంతో ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi arrived at the DCP Office at the Parliament Street Police Station to file a complaint. More details awaited. pic.twitter.com/YC7GiXCw7h— ANI (@ANI) August 21, 2026రాహుల్ గాంధీ, సాహిల్ . ఇతరులతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కి రావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించడంతో, రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ బయట కూర్చుని ధర్నా నిర్వహించారు.జులై 20న జరిగిన 'సంసద్ చలో' మార్చ్ సమయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది పెల్లెట్ తుపాకులు ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, తాము పెల్లెట్ గన్లను ఉపయోగించలేదని దిల్లీ పోలీసులు పలుమార్లు ఖండించగా, సీఆర్పీఎఫ్ (CRPF) దీనిపై ఎలాంటి స్పందనా లేదు.(14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’) -
రాజస్థాన్లో ఉద్రిక్తత : 24 గంటల్లో 'జంతర్ మంతర్ 2.0' సీజేపీ హెచ్చరిక
జైపూర్, రాజస్థాన్: స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలలను బాగు చేయండి) ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రాజస్థాన్లో చేపట్టిన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు దాడిచేయడంపై సీజేపీ స్పందించింది. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, ఇతరులపై అమానుషంగా దాడిచేయడాన్ని,వాహనాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. తమపై ఎటాక్ చేసిన దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని రాజస్థాన్ పోలీసులను డిమాండ్ చేసింది. లేదంటే 24 గంటల తర్వాత రాజస్థాన్లో 'జంతర్ మంతర్ 2.0' ప్రారంభమవుతుంది; ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని హెచ్చరించింది. అయితే ఈ విషయంలో గ్రామస్తులను మాత్రం వేధించకూడదని స్పష్టం చేసింది. ఇందులో గ్రామస్తుల ప్రమేయం ఏమీ లేదనీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. గ్రామ పాఠశాలను సందర్శించిన సందర్భంగా జరిగిన ఘర్షణ వాతావరణంపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ స్పందిస్తూ , "ప్రజలు, యువత , విద్యార్థులలో ఆగ్రహం ఉంది. ప్రభుత్వం దానిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించడం, ఫోటోలు తీయడం లేదా నివేదికలు ప్రచురించడం వంటివి చేయరాదని జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తప్పబట్టారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలను జారీ చేయడం సరైనది కాదన్నారు. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న పరిస్థితిని, సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టడానికి బదులుగా, ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి చేటున్నారు. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించకుండా లేదా ఫోటోలు తీయకుండా ప్రజలను అడ్డుకోలేరన్నారు. వాస్తవానికి, ప్రభుత్వం వార్తలను అణచివేయడానికి , ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ <राजस्थान पुलिस को 24 घंटों का समय दिया गया है इन गुंडों को गिरफ्तार करें,बिना गांव वालो को परेशान किए इसमें गांव वालो का कोई योगदान नहीं है24 घंटे निकलने के बाद राजस्थान में शुरू होगा जंतर मंतर 2.0 , जो आगे होगा उसकी जिम्मेदार हम नहीं होंगे@Cockroachisback#schoolThikKaro pic.twitter.com/kRyFncu9Sj— Cockroach Janta party (@IAMVICKYFANS) August 21, 2026 కాగా సీజేపీ ప్రచారంలో భాగంగా జయపూర్ జిల్లాలోని బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాంపురా కన్వర్పురా గ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేయడానికి వచ్చిన కార్యకర్తలను గ్రామస్తులు, సీజేపీ బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. సీజేపీ బృందం రాకముందే గ్రామస్తులు ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం సీజేపీ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీజేపీ కార్యకర్తలను గ్రామంలోనికి రానీయకుండా అడ్డుకుని, అక్కడినుంచి పంపించివేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.గతంలో సీజేపీ నిర్వహించిన తనిఖీల నేపథ్యంలో, రాజస్థాన్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు మరియు మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంపై సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని దాచి పెట్టేందుకే విద్యాశాఖ మంత్రి ఇలాంటి ఆంక్షలు విధిసస్తోందని, తమ ప్రచారం ఆగదని పేర్కొన్నారు. 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు.#WATCH | Attack on Cockroach Janta Party (CJP) team in Jaipur village | Jaipur, Rajasthan: Congress MLA Sachin Pilot says, "State Govt has issued a fresh order that no journalist can enter a school, no photos can be taken, and nothing can be reported. They want to keep their… pic.twitter.com/Q4NTYATzVe— ANI (@ANI) August 21, 2026 ప్రస్తుతం ఈ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారి మూతపడటంతో, సమీపంలోని పశువుల కొట్టంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, స్థానిక ప్రయత్నాలతోనే పాఠశాలను బాగు చేసుకోవచ్చని గ్రామస్తులు, భాజపా కార్యకర్తలు తెలిపారు. అనంతరం వారు పాఠశాల వెలుపల ధర్నా చేపట్టి నినాదాలు చేశారు.సీజేపీ కార్యకర్త శివాంగి శర్మ మాట్లాడుతూ, "మమ్మల్ని ఉగ్రవాదులని, నక్సల్స్ అని అంటూ మా కార్యకర్తలపై దాడి చేశారు. ఈ బయటివాళ్ళు... లోపలివాళ్ళు... ఏంటిది... ఇది ఒకే దేశం. మేము ఏ పార్టీ నుంచో గానీ, మరో దేశం నుంచో గానీ రాలేదు. మేము మన సొంత దేశపు బిడ్డల గురించి మాట్లాడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్తో కలిసి రాహుల్గాంధీ ధర్నామరోవైపు తాము బీజేపీ కార్యక్తలం కాదని, సీజేపీ కార్యకర్తలే తమ కార్లను ధ్వంసంచేసుసుకున్నారని తెలిపారు. తమ పాఠశాలను బాగు చేసుకునే పనులను ఇప్పటికే ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఈ ఘటన గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని బగ్రూ డీఎస్పీ ధర్మేంద్ర శర్మ తెలిపారు.(14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’) -
గో బ్యాక్ సీజేపీ.. తరిమికొట్టిన గ్రామస్తులు!
కాక్రోచ్ జనతా పార్టీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ జైపూర్లో ఓ ప్రభుత్వ పాఠశాల పరిశీలనకు వెళ్లిన ఆ సంస్థ సభ్యుల్ని కొందరు అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పిడిగుద్దులతో తరిమి కొట్టారు. వాహనంలో వెళ్తున్న సమయంలో రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది.సీజేపీ దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో పేరిట ఓ ఉద్యమం నడుపుతోంది. ఇందులో భాగంగా.. జైపూర్ రాంపురా–కన్వర్పురా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితులను పరిశీలించేందుకు ఆ సంస్థ బృందం వెళ్లింది. గత కొంతకాలంగా ఆ స్కూల్లో పశువుల పాక నడుస్తోందన్నది సీజేపీ ప్రధాన ఆరోపణ. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల పరిస్థితి, బోధనా సౌకర్యాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా కూడా పాల్గొనాల్సి ఉంది.Very satisfying face off 🤣🤣🤣Rajasthan showing the way. Dipke got taste in Jaipur and now Ranka and team again in Rajasthan 🔥🤲🏻 pic.twitter.com/37rDnrgPov— Lala (@FabulasGuy) August 21, 2026VIDEO | Jaipur, Rajasthan: Cockroach Janata Party (CJP) co-convenor Ashutosh Ranka and others chased away by locals as they tried to visit Bagru village. Shivangi Sharma, CJP worker, says, "They attacked our workers, saying we are terrorists, Naxals. What is this outsider...… https://t.co/MqgiMSCt8R pic.twitter.com/U3VjdVgrl4— Press Trust of India (@PTI_News) August 21, 2026🇮🇳 #Breaking: #Villagers reportedly chased #CJP protestors down and beat them, while their vehicles were also attacked and car windows were smashed during the confrontation in #Jaipur .The incident reportedly took place during a CJP team’s visit to a government #school .… pic.twitter.com/XyAY8uHGzV— pradhyumn sharma (@pradhyu78651514) August 21, 2026అయితే.. ఆ సమయంలో కొందరు వాళ్లను అడ్డుకుని దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ పరిణామాలపై రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనపై అశుతోష్ రాంకా స్పందిస్తూ.. తమను అడ్డుకున్న వారు గ్రామస్తులు కాదని, బీజేపీ పంపించిన వ్యక్తులని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. "బీజేపీ పంపించిన గూండాలు" అంటూ విమర్శలు చేశారు.#WATCH | Jaipur, Rajasthan: CJP National Spokesperson Ashutosh Ranka says, "The entire country saw BJP's hooliganism live today. Stone pelting was already happening there but the Police remained mute spectators. Police said that they won't do anything. This has been done at the… pic.twitter.com/pYPCh3UCOP— ANI (@ANI) August 21, 2026ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికే తాము తనిఖీలు చేపడుతున్నామని సీజేపీ నేతలు తెలిపారు. అయితే సమస్యలను బయటకు రానివ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పాఠశాలల పరిస్థితిపై ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.అబ్బే జరిగింది అది కాదు: స్థానికులుఅయితే స్థానికుల్లో కొందరు మాత్రం సీజేపీ ఆరోపణలను ఖండించారు. పాఠశాలను కూల్చివేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానంతోనే తాము వ్యతిరేకించామని తెలిపారు. ‘‘వాళ్లు 250 మంది వచ్చారు. వాళ్లు చెబుతున్న దాంట్లో నిజం కూడా లేదు. ఆ పాఠశాలలో 20 నుంచి 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరమ్మతుల కోసం రూ. 12 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. బీజేపీనో, కాంగ్రెస్సో, మరేయితర రాజకీయ పక్షమో ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు. మా ఊరి అంశాన్ని రాజకీయం చేయొద్దని మేం అనుకుంటున్నాం. వాళ్లు నిరసన పేరిట స్కూల్కు నష్టం కలిగిస్తే ఎలా? విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పాఠశాల రక్షణ కోసం నిలబడ్డాం’’ అని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాదు.. తాము దాడి చేశామన్న దాంట్లో నిజం లేదని కూడా అంటుఉన్నారు.#WATCH | Jaipur, Rajasthan: A villager, Anu Sharma, says, "We opposed them because they are attempting to teardown this school...About 20-25 students come here to study. Where will they go?..We won't let them teardown the school. Funds (for repair) have already been… pic.twitter.com/kk86lCPUS4— ANI (@ANI) August 21, 2026స్కూల్ తనిఖీలపై సర్కారీ ఆంక్షలుఈ వివాదానికి కొద్ది రోజుల ముందే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం.. ఓ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని ఆదేశించింది. విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. అనధికారికంగా ఎవరూ పాఠశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.ప్రతిపక్షాల విమర్శలుప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత టీకారామ్ జూల్లీ.. ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించకుండా అడ్డుకునేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చారని ఆరోపించారు. ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఇదీ చదవండి: మంత్రుల కుక్కలకు మెరుగైన వసతులున్నాయి! -
విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన వివాదాస్పద జీవోను.. బుధవారం వెనక్కి తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలంటూ అంతకు ముందు జారీ చేసిన జీవోలో దుమారం రేపింది. ఆగస్టు 14న విజయ్ ప్రభుత్వం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో.. లెఫ్ట్ పార్టీలతో పాటు సీపీజే నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనాలనే ఆసక్తికి విద్యార్థులు, యువత ‘లోనుకాకుండా’ చర్యలు తీసుకోవాలని పాఠశాలలు, కళాశాలలకు సూచించింది. ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలుఇటీవల పరీక్షలు, విద్యా సంబంధిత అంశాలపై దేశవ్యాప్తంగా జెన్జెడ్, జెన్ఆల్ఫా విద్యార్థుల నిరసనలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీపీజే ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు యువత పోరాటాలకు మద్దతుగా మాట్లాడిన సీఎం విజయ్.. మొన్న స్వాతంత్ర్య దినోత్సవంలోనూ వణక్కం జెన్జీ అంటూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం అంతకు ఒక్కరోజు ముందు ఈ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.సీజేపీ తీవ్ర అభ్యంతరం.. ఆగ్రహంఈ ఉత్తర్వులపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ సహ కన్వీనర్ సౌరవ్ దాస్.. విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. విద్యార్థులు, యువత తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం అర్థరహితమైన, అహేతుకమైన చర్య అని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీజేపీ, లెఫ్ట్ పార్టీలను ‘అరాచకానికి ఏజెంట్లు’గా బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం అభివర్ణించారు.విజయ్ ప్రభుత్వానికి లెఫ్ట్ మద్దతు..మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు జూన్లో లెఫ్ట్ పార్టీలు బేషరతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా నిలిచింది. దీంతో కాంగ్రెస్, వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంది.ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీల ఆందోళనలకూ విద్యార్థులు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనే హక్కు, వారిని రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉంచే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. వివాదాస్పద ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తాజా రాజకీయ పరిణామంగా మారింది.ఇటు సీపీజే పేరుపైనా వివాదంఇదిలా ఉండగా.. తమిళనాడులో కాక్రోచ్ జనతా పార్టీ పేరు పైనా వివాదం నడుస్తోంది. ఆ పేరుతో ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీని నమోదు చేయాలని న్యాయవాది సి. బ్రహ్మ బాలసుబ్రమణియం నేతృత్వంలోని బృందం జూన్లో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సంస్థ.. అభిజిత్ దీప్కేకు చెందిన సీపీజేకు భిన్నమైనదని బ్రహ్మ బాలసుబ్రమణియం వాదిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
సీజేపీ దాస్ ఇంటికి పోలీసులు.. బీజేపీ ప్లాన్ మార్చిందా?
పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. పోలీసులు తమ కుటుంబాన్ని ప్రశ్నల పేరుతో భయబ్రాంతులకు గురిచేశారని దాస్ ఆరోపించగా.. పోలీసు శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో చేపట్టే సాధారణ భద్రతా చర్యల్లో భాగంగానే ఇంటికి వెళ్లామని స్పష్టం చేసింది.పోలీసులు తమ కుటుంబం వద్దకు వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగారని దాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇది కేవలం సాధారణ విచారణ కాదని, తనను మౌనం చేయించేందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు. పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఎందుకు భయపెడుతోందని దాస్ ప్రశ్నించారు. ఈ చర్య వెనుక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? అసలు ఇలాంటి విచారణకు చట్టపరమైన ఆధారం ఏమిటని నిలదీశారు. తనను బెదిరించి మౌనం చేయించాలని చూస్తే అది సాధ్యం కాదని, ఇలాంటి చర్యలు తమ పోరాట సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.అంతేకాదు, రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరికి వచ్చి అక్కడి హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్తో సమావేశమైన విషయాన్ని కూడా దాస్ ప్రస్తావించారు. ఆ సమావేశంలోనే తన కుటుంబాన్ని సందర్శించే నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే, పోలీసుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. దాస్ బంధువుల ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం నిజమేనని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకు ముందు భద్రతా చర్యల్లో భాగంగా కీలక మార్గాల సమీపంలో నివసించే ప్రజల ఇళ్లను పోలీసులు సందర్శించడం సాధారణమేనని చెప్పారు.#Alert🚨Two hours ago, the Pondicherry Police showed up at my family’s home and subjected them to all kinds of questioning. Why this harassment, @PuducheryPolice? Who ordered this and for what purpose? Is this the legal procedure? Why is the BJP government in Pondicherry…— Saurav Das (@SauravDassss) August 12, 2026ముఖ్యమైన రూట్లకు సమీపంలో నివసించే ప్రజలను కలిసి కొన్ని వివరాలు తెలుసుకోవడం, భద్రతకు సంబంధించిన సాధారణ ప్రశ్నలు అడగడం పోలీసుల రొటీన్ ప్రక్రియలో భాగమని అధికారి వివరించారు. దీంతో ఒకే ఘటనపై రెండు భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. దాస్ మాత్రం దీన్ని రాజకీయ బెదిరింపుగా చూస్తుండగా.. పోలీసులు మాత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు చేపట్టే సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమని చెబుతున్నారు. ఇక దాస్ చేసిన వ్యాఖ్యలు పుదుచ్చేరి రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అమిత్ షా పర్యటనను ఈ ఘటనతో ముడిపెడుతూ ఆయన ప్రశ్నలు లేవనెత్తడంతో రాజకీయ కోణం కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పుదుచ్చేరిలో హాట్ టాపిక్గా మారింది. -
టీజీ మోహన్దాస్ అరెస్ట్
తిరువనంతపురం: మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్దాస్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని కూవపదంలో తన నివాసంలో ఉన్న ఆయనను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి తిరువనంతపురం సైబర్ పోలీస్ స్టేషన్కు ఆయనను తరలించారు. ఆయనను ఈ రోజు సాయంత్రం సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారని పోలీసులు తెలిపారు. ఆయన నివాసం నుంచి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటిని కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపుతామని తెలిపారు. తదుపరి దర్యాప్తు జరిపిన తర్వాత మోహన్దాస్పై మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది.నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల పోరాటంపై మోహన్దాస్ (TG Mohandas) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ చానల్ ‘పత్రిక’లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ మాటలు మాట్లాడారు. తానే గనక తాను నియంత్రించే బాధ్యతలో ఉండి ఉంటే విద్యార్థి ఆందోళనకారులపై భద్రతా బలగాలతో కాల్పులు జరిపించి చెదరగొట్టే వాడినని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా యువతలు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడారు. మహిళా ఆందోళనకారులను "అత్యాచారాలను ఇష్టపడే మహిళలు" అంటూ వ్యాఖ్యానించారు. వారిపై సామూహిక అత్యాచారాలు జరుగుతాయంటూ నోరు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై గత నెల చివరి వారంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అరెస్టు జాప్యంపై విమర్శలుమోహన్దాస్ను అరెస్ట్ చేయడంలో యూపీఎఫ్ ప్రభుత్వం తాత్సారం చేసిందని ప్రతిపక్ష ఎల్డీఎఫ్ ఆరోపించింది. గత నెలలో కేసు నమోదైతే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. మోహన్దాస్ అరెస్ట్ విషయంలో పోలీసులు చట్టప్రకారమే ముందుకు వెళ్లారని హోం మంత్రి రమేష్ చెన్నితాల చెప్పారు. ఇదే అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకునే సామర్థ్యం కేరళ పోలీసులకు ఉందని వ్యాఖ్యానించారు. చదవండి: 'ఆమెకు ఏమైనా జరిగితే సుప్రీంకోర్టు జడ్జిదే బాధ్యత'ఆర్ఎస్ఎస్తో సంబంధం లేదుతమ సంస్థతో మోహన్దాస్కు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రకటించింది. తమ సంస్థలో ఎలాంటి పదవిలో గానీ, బాధ్యతలో గానీ ఆయన లేరని దక్షిణ కేరళం ప్రాంత సహ కార్యవాహ కె.బి. శ్రీకుమార్ తెలిపారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలతో తమకు సంబంధం లేదన్నారు. ఇటువంటి అభిప్రాయాలను ఆర్ఎస్ఎస్ అత్యంత తీవ్రంగా ఖండింస్తుందని చెప్పారు. -
విపక్షాల ఒత్తిళ్లతో దిగొచ్చిన కేంద్రం!
నీట్ అభ్యర్థుల నిరసనలు, ఢిల్లీలో చోటుచేసుకున్న పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించేందుకు సిద్ధమైంది. ఈ అంశంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటన చేయనున్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆయనకు స్పీకర్ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమయ్యాయి. అదే రోజు నీట్ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ క్రమంలో పెలెట్ గన్స్ సైతం ప్రయోగించారనే విమర్శలు వెల్లువెత్తాయి.మొదట రాజీనామా డిమాండ్నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో తొలుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే మంత్రి రాజీనామా తర్వాత కూడా నిరసనలు ఆగలేదు. విద్యార్థులపై పోలీసుల చర్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనజంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ యాక్షన్పై హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. “అమిత్ షా ఎక్కడ?” అంటూ పార్లమెంట్ లోపల, బయట నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టాయి. కేంద్రం పరిధిలో ఉన్న ఢిల్లీలో ఆయన ఆదేశాల మేరకే విద్యార్థులపై లాఠీలు ఝులిపించారని రాహుల్ గాంధీ సైతం ఆరోపణలు గుప్పించారు. ఆయన(షా) సభకు రావడానికి భయపడుతున్నారని.. ఈ అంశంపై కేంద్రం మౌనం వీడాలని ప్రతిపక్షాలు పదేపదే డిమాండ్ చేశాయి.ఆగస్టు 13తో ముగియనున్న సమావేశాలువర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై స్పందించేందుకు ముందుకొచ్చింది. విద్యార్థుల నిరసనలు, ఢిల్లీలో పోలీసుల వ్యవహారశైలి, ప్రభుత్వ చర్యలపై అమిత్ షా ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
‘జెన్జీ’ని తప్పుదోవ పట్టించారు.. రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్
సంబల్పూర్: నీట్ పేపర్ లీకేజీ వివాదంలో తన పదవికి రాజీనామా చేయడంపై మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ పేపర్ లీకేజీలో జెన్జీని తప్పుదోవ పట్టించారని.. అందులో తాను బాధితుడినయ్యానని వ్యాఖ్యానించారు.సంబల్పూర్లో జరిగిన పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం ముదిరిన తీరును చూస్తే కొంతమంది వ్యక్తులు జెన్జీని తప్పుదోవ పట్టించే ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల అసంతృప్తిని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాడుకోవాలని చూశారు.అందుకే యువత ఆకాంక్షలను గుర్తించి, వారి ఆందోళనలను పరిష్కరించాలని తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో నా వ్యక్తిగత గౌరవానికి నేనెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మోదీ నా ప్రతిపాదనకు అంగీకరించి, ఆ తర్వాత స్వయంగా ఆయనే పిల్లలతో మాట్లాడారు అని పేర్కొన్నారు.జులై 25న సమర్పించిన తన రాజీనామా లేఖలోని అంశాలను ఆయన గుర్తుచేశారు. ఈ ఆందోళనలను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకుండా ఉండటానికి, దేశ ఐక్యతను కాపాడటానికి, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకే తాను మంత్రి పదవిని వదులుకున్నట్లు స్పష్టం చేశారు. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం వెంటనే స్పందించిందని, దర్యాప్తును సిబిఐకి అప్పగించి, వివాదాస్పద పరీక్షను రద్దు చేసి జూన్ 21న తిరిగి నిర్వహించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
'జెన్ జీ' పై ఎంపీ కంగనా రనౌత్ యూటర్న్: ఆసక్తికర వ్యాఖ్యలు
నీట్ అవకతవకలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనల సందర్బంగా యువతరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్( Kangana Ranaut) ఇపుడు యూ టర్న్ తీసుకోవడం నెట్టింట సంచలనంగా మారింది. జెన్ జీకాదు జనరేషన్ గట్టర్గా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆమె 'జెన్ జీ' (Gen Z )ని భారతదేశపు గొప్ప బలంగా అభివర్ణించడం సంచలనం రేపుతోంది. జార్ఖండ్లో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు ఎంతో శాంతియుతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని ఉదాహరణగా చెప్పడం గమనార్హం. దీంతో నిన్నటి దాకా యువతపై నోరు పారేసుకున్న కంగనాలో వచ్చిన మార్పు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ,సినీ నటి కంగనా రనౌత్ శుక్రవారం యువతపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇప్పటికా వారిని మురికితరం అంటూ విరుచుకు పడిన ఆమె, ఇప్పుడు అదే యువతను దేశానికి బలం, గర్వకారణం అంటూ కొనియాడారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన మండి లోక్సభ ఎంపీ, ఒకే మాటతో మొత్తం తరాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలను తోసిపుచ్చారు. కేవలం "10-15 మంది" మాత్రమే మొత్తం తరానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని, కానీ 'జెన్-జెడ్'లోని అత్యధికులు దేశానికి సానుకూలమైన రీతిలో తమవంతు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిరసనల్లో కొద్దిమంది చేసే అభ్యంతరకర లేదా హానికర ప్రవర్తన ఆధారంగా మొత్తం తరాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనతప్రభుత్వంలో 'జెన్-జెడ్' కూడా ఒక భాగం. వారి ఆకాంక్షలే మా ప్రభుత్వం ఇన్నాళ్లుగా నెరవేరుస్తూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉండటానికి ఈ తరం ఇచ్చిన మద్దతే (మ్యాండేట్) కారణం అంటూ కంగనా మాట మార్చటం విశేషం. దేశానికి పతకాలు సాధించిపెడుతున్న యువ క్రీడాకారులు తమ విజయాలను ప్రధానమంత్రికి, దేశానికి అంకితం చేస్తున్నారని కొనియాడారు. కేవలం కొద్ది మంది మాత్రమే జెన్-జీ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటూ విపక్షాలు రభస సృష్టిస్తున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు, చేస్తున్న పనులతో వారు ఏకీభవించకుండా వినాశకర ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కాగా, గతవారం సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనలను ఉద్దేశించి కంగనా ఇన్స్టాగ్రామ్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పద మయ్యాయి. నిరసనల్లోని యువతుల భాష, ప్రవర్తనను విమర్శిస్తూ ఆమె ఆ తరాన్ని 'జెనరేషన్ గట్టర్' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె జెన్ జీ యువతకు మద్దతుగా మాట్లాడటం గమనార్హం. ఇదీ చదవండి: అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ -
సీజేపీ కొత్త మిషన్.. నేడు భారీ ప్రకటనపై దేశవ్యాప్త ఉత్కంఠ!
పరీక్షల పేపర్ లీకుల ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ప్రధాన స్వరంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన తదుపరి కార్యాచరణపై కీలక ప్రకటనకు సిద్ధమవుతోంది. ఉద్యమ భవిష్యత్ దిశ, దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలను గురువారం వెల్లడించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో గత రెండు రోజులుగా జరిగిన కీలక సమావేశాల అనంతరం ఈ ప్రకటన రానుంది. సంస్థ నాయకత్వం ఉద్యమం తదుపరి దశకు సంబంధించి సమగ్ర రోడ్మ్యాప్ సిద్ధం చేసినట్లు సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియో సందేశంలో రంకా మాట్లాడుతూ.. ‘దేశంలో వ్యవస్థాగత మార్పు కోసం మేము భారీ పోరాటాన్ని ప్రారంభించాం. ఈ ఉద్యమంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి’ అని అన్నారు. మద్దతుదారుల నుంచి సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా వచ్చిన వేలాది సూచనలు, అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం చేయబోయే ప్రకటనలో ఉద్యమం ఎటువైపు సాగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు.కాగా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసంలో దాదాపు ఏడు గంటల పాటు వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించడం, విద్యార్థి సంఘాలతో బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేయడం, వివిధ రాష్ట్రాల్లో విద్యా సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, సీజేపీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా మారే ఆలోచనలో లేదని నాయకత్వం స్పష్టం చేసింది. విద్యా రంగ సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే సామాజిక, ప్రజా ఉద్యమ వేదికగా కొనసాగాలని నిర్ణయించినట్లు తెలిపింది.‘మేము రాజకీయ పార్టీ ప్రారంభించడం గురించి ఆలోచించడం లేదు. ప్రజలకు న్యాయవ్యవస్థ, రాజకీయ నాయకులు, మొత్తం వ్యవస్థపై నమ్మకం తగ్గింది. మేము ఒక సమూహంగా పనిచేస్తాం’ అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. విద్యా సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పేపర్ లీకుల నివారణ, విద్యార్థుల సంక్షేమం, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం వంటి అంశాలే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యాలని సీజేపీ నాయకత్వం వెల్లడించింది. తమ ఉద్యమం మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా కొనసాగుతుందని, అహింసా మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం చేస్తామని సంస్థ తెలిపింది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ విద్యా రంగ మార్పుల కోసం పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తమ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమంలో కీలక మైలురాయిగా సీజేపీ అభివర్ణించింది. అయితే తమ పోరాటం ఒక్క సంఘటనతో ఆగిపోదని, దేశ విద్యా వ్యవస్థలో విస్తృత మార్పులు వచ్చే వరకు కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చింది. గురువారం సీజేపీ చేయనున్న ప్రకటనలో దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలు, కొత్త కార్యక్రమాలు, విద్యార్థి ఉద్యమాలతో అనుసంధానం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పేపర్ లీకుల అంశంతో ప్రారంభమైన ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎంతటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
నమ్మకం పోయింది.. వాంగ్చుక్ సంచలన ఆరోపణలు
ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 రోజుల నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా జరిగిన పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కేంద్రం సమక్షంలోనే దీక్ష విరమించాలన్నది తన ఉద్దేశం ఏమాత్రం కాదని.. ఆ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటున్నారాయన. అయితే ఆ ఘటన తర్వాత ఎవరి నమ్మాలో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు.ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో జరిగిన అర్ధరాత్రి భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీక్ష విరమణ సమయంలో తీసిన ఫొటోలను వెంటనే విడుదల చేయబోమని మంత్రులు తనకు హామీ ఇచ్చారని, అయితే ఆ మాటను తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.“అందరి సమక్షంలో ప్రకటించాలని కోరా”దీక్ష విరమణను కేవలం అధికార పార్టీ కార్యక్రమంలా చూపించకూడదని తాను భావించినట్లు వాంగ్చుక్ తెలిపారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి ప్రతినిధులు కూడా పాల్గొన్న తర్వాతే ఈ విషయాన్ని ప్రకటించాలని కోరినట్లు చెప్పారు. “విపక్ష నేతలు, విద్యార్థి నాయకులతో కలిసి ఉమ్మడిగా ప్రకటన చేద్దామని చెప్పాను. ఫొటోలు కూడా అందరి భాగస్వామ్యంతోనే విడుదల చేయాలని కోరాను. దీనికి వారు అంగీకరించారు” అని వాంగ్చుక్ పేర్కొన్నారు. ఈ అంగీకారానికి ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు కూడా సాక్షులుగా ఉన్నారని ఆయన తెలిపారు.“కొన్ని నిమిషాల్లోనే ఫొటోలు బయటకు వచ్చాయి”అయితే తనతో జరిగిన అంగీకారం కొద్ది నిమిషాల్లోనే తనకు షాక్ తగిలిందని అన్నారు. “కొద్ది నిమిషాల తర్వాత ఆ ఫొటోలు టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయనితో ఐబీ అధికారి వచ్చి నాకు చెప్పారు. దీంతో నేను తీవ్ర నిరాశకు గురయ్యా. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం.. నమ్మకాన్ని దెబ్బతీసింది అని ఆయన అన్నారు.రాహుల్ గాంధీతోనూ సంప్రదింపులు..తన భార్య గీతాంజలి అంగ్మో.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మాట్లాడి, ఆయన చేతుల మీదుగా దీక్షను ముగించే అవకాశం ఉందా అని ప్రయత్నించారని వెల్లడించారు. అయితే అందుకు రాహుల్ గాంధీ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తన భార్యపై కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వచ్చాయని, వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని వాంగ్చుక్ పేర్కొన్నారు.డీల్ చేసుకోవాలనుకుంటే..తన దీక్ష ముగింపు విషయంలో ప్రభుత్వంతో రహస్య ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలను వాంగ్చుక్ ఖండించారు. “నాకు ఏదైనా ఒప్పందం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే 26 రోజుల పాటు దీక్ష చేసే అవసరం లేదు. అంతకంటే పెద్ద అవకాశాలు నాకు ఉండేవి” అని అన్నారు. తనకు పదవులు లేదంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదని, ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యమని స్పష్టం చేశారు.26 రోజుల దీక్ష.. 10 కేజీల బరువునీట్ వ్యవహారంలో అవకతవకలు, పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ సోనమ్ వాంగ్చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటికే నిరసనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఆయన సంఘీభావం తెలపగా.. ఆయన దీక్షకు ఆ సంస్థ కూడా మద్దతు తెలిపింది. అయితే క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం, కోర్టు జోక్యంతో బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆపై.. నిరసనకారులెవరూ ఆయన్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయనను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు, ఫాస్ట్ట్రాక్ కోర్టుల అంశంపై వీడియో సందేశం ఇచ్చిన తర్వాత జూలై 24న వాంగ్చుక్ తన 26 రోజుల దీక్షను విరమించారు. అయితే దీక్ష విరమణ సమయంలో కేంద్ర మంత్రులు ఆయనకు సూప్ అందిస్తున్న ఫొటోలు బయటకు రావడం వివాదాస్పదంగా మారింది. ఆయన కేంద్రంతో డీల్ కుదుర్చుకున్నాడంటూ సంచలన ఆరోపణలు దిగారు కొందరు ఆందోళనకారులు. ఈ వ్యవహారంపై వాంగ్చుక్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. -
ప్రశాంత్ కిశోర్ విజయం వెనుక సీజేపీ వ్యూహం?
బిహార్: పట్నాలోని అత్యంత కీలకమైన బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) సంచలన విజయం బిహార్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే ఏకంగా 19,324 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ చారిత్రాత్మక విజయం వెనుక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమం, అభిజీత్ దీప్కే నాయకత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమ ప్రభావం బలంగా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.పీకే ఘనవిజయం: వాస్తవ గణాంకాలుమొత్తం 32 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిశాక, ప్రశాంత్ కిశోర్ 64,151 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హా 44,827 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 19,324 ఓట్ల భారీ తేడాతో బీజేపీని ఓడించడం ద్వారా పీకే.. ఆ పార్టీకి ఉన్న ఇమేజ్ను బద్దలు కొట్టారు. ఈ ఫలితం బీహార్ రాజకీయాల్లో యువత ఆలోచనా సరళిలో వస్తున్న మార్పులకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.30 ఏళ్ల కోట ఎలా కూలింది?బాంకీపూర్ సీటు గత మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని స్థానంగా ఉంది. చివరిసారిగా ఈ సీటును సీనియర్ బీజేపీ నేత నితిన్ నవీన్ గెలుచుకున్నారు. అలాంటి దుర్భేద్యమైన కోటలో ఉప ఎన్నికల ఓటమి సాధారణమైనది కాదు. ఈ సీటును గెలవాలంటే అసాధారణమైన ప్రజా వ్యతిరేకత లేదా కొత్త రాజకీయ సమీకరణాలు అవసరం. ఇప్పుడు అదే జరిగింది.సీజేపీ ఉద్యమం: కీలక మలుపుఈ విజయంలో సీజేపీ పాత్రపై విస్తృత చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అభిజీత్ దీప్కే నేతృత్వంలో 37 రోజుల పాటు జరిగిన నీట్ వ్యతిరేక ఉద్యమం యువతలో అలజడిని సృష్టించింది. పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటం ప్రభావం బీహార్ యువతపై గట్టిగా పడింది. ఈ ఉద్యమానికి యువత నుండి లభించిన భారీ మద్దతు, అదే సమయంలో ఉద్యమకారులపై జరిగిన పోలీస్ లాఠీచార్జి.. విద్యార్థులు, వారి కుటుంబాల ఆగ్రహానికి కారణమయ్యాయి.విద్యార్థుల ఆగ్రహం ఓట్ల రూపంలో?బాంకీపూర్ పట్నా విద్యా రంగానికి ప్రధాన కేంద్రం. ఇక్కడ విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోచింగ్ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పేపర్ లీక్ సమస్య, ఉపాధి అవకాశాలు ఈ వర్గపు ఓటర్లకు అత్యంత ప్రధానమైన అంశాలు. సీజేపీ ఉద్యమం లేవనెత్తిన అంశాలు నేరుగా వీరి గురించే ఉన్నాయి. ఈ విద్యార్థి ఉద్యమం పెద్ద సంఖ్యలో యువకులను రాజకీయంగా క్రియాశీలకంగా మార్చింది. ఈ ఆగ్రహం మొత్తం జన్ సురాజ్ పార్టీకి అనుకూలంగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.పాత ఓటు బ్యాంకు మూడ్ మారిందా?ఈ ఉప ఎన్నికలో కేవలం యువ ఓటర్లు మాత్రమే కాదు, సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా కదిలినట్లు తెలుస్తోంది. బీజేపీకి సంప్రదాయ మద్దతుదారులుగా భావిస్తున్న కొన్ని వర్గాలు కూడా మార్పును ఆకాంక్షిస్తూ జన్ సురాజ్కు మద్దతు ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ పీకే ఖాతాలోకే చేరాయని స్పష్టమవుతోంది.పోలింగ్ శాతం ప్రభావంఈ ఉప ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం కూడా ఫలితాన్ని ప్రభావితం చేసిందనేది మరో వాదన. తక్కువ పోలింగ్ ఉన్నప్పుడు, స్పష్టమైన అజెండాతో పోరాడే, ఐక్యంగా ఉండే ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సీజేపీ ఉద్యమం ద్వారా యువతలో ఏర్పడిన ఐక్యత, వారు అనుసరించిన వ్యూహం ఈ తక్కువ పోలింగ్ శాతంలో వారికి లాభం చేకూర్చి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ బాంకీపూర్ ఉప ఎన్నిక బీహార్ రాజకీయాల్లో పేపర్ లీక్, ఉద్యోగ భర్తీ వంటి అంశాలు ఇకపై ప్రధాన ఎజెండాగా మారబోతున్నాయనే సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చింది.ఇది కూడా చదవండి: మనిషి డీఎన్ఏలో అజ్ఞాత పూర్వీకుల ఆనవాళ్లు! -
‘మోదీనే బెస్ట్’ అంటూ వ్యాఖ్యలు.. సీజేపీ నేత దాస్ ‘పోస్ట్’ కలకలం
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్కు సంబంధించిన 2015 నాటి ఓ పాత సోషల్ మీడియా పోస్ట్ మళ్లీ వైరల్గా మారింది. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విమర్శలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుండటంతో, సౌరవ్ దాస్ గత వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు.2015లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి సౌరవ్ దాస్ చేసిన పోస్టులో, "ఆప్కు ఏమైంది? పూర్తిగా మారిపోయింది. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. మీరు కూడా కాంగ్రెస్లాగే మారిపోయారు. మోదీజీ చాలా మెరుగైన నాయకుడు... ఆయనే బెస్ట్" అని పేర్కొన్నారు. ఆ పోస్టు స్క్రీన్షాట్లు ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పాత పోస్టును ఆధారంగా చేసుకుని నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గతంలో మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండడాన్ని ప్రస్తావిస్తుండగా, మరికొందరు రాజకీయ నాయకుల అభిప్రాయాలు కాలక్రమేణా మారవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.Whats wrong with AAP?completely changed. Double standards. U too are like congress. modiji is far better.. the best one. @ArvindKejriwal— Saurav Das (@SauravDassss) December 19, 2015సౌరవ్ దాస్ ప్రస్తుతం అభిజీత్ దిప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాలు, విద్యా సంస్కరణలు తదితర అంశాలపై పార్టీ తరఫున తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవల సీజేపీ కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వంపై పార్టీ వైఖరి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన పాత సోషల్ మీడియా పోస్టులు కూడా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న ఈ పాత పోస్టుపై సౌరవ్ దాస్ గానీ, సీజేపీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే, 2015లో చేసిన ఆ వ్యాఖ్యలపై ఆయన ప్రస్తుత వైఖరి ఏమిటన్న విషయంపైనా ఎలాంటి స్పష్టీకరణ వెలువడలేదు. -
అమిత్ షా ఎక్కడ?!
జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య వ్యవహారం పార్లమెంట్ను కుదిపేస్తోంది. ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా వాయిదాల పర్వం(ఇవాళ కూడా) కొనసాగుతోంది. అయితే అమిత్ షా గైర్హాజరీని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాన అస్త్రంగా చేసుకోగా.. బీజేపీ మాత్రం ఆరోపణలను ఖండిస్తోంది.విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు అనవసర బల ప్రయోగం జరిపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా చలో సంసద్ ర్యాలీ సమయంలో లాఠీలు, పెల్లెట్ గన్స్ వినియోగించారనే ఆరోపణలపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయని, అందుకే ఘటనకు బాధ్యత హోంమంత్రి అమిత్ షాదేనని విపక్ష నేతలు అంటున్నారు.“అమిత్ షా సమాధానం చెప్పాలి”పరీక్షల సంస్కరణ బిల్లు చర్చ సందర్భంగా లోక్సభలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై పోలీసు చర్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన.. హోంమంత్రి అనుమతి లేకుండా ఇలాంటి పరిణామాలు ఎలా చోటుచేసుకున్నాయని నిలదీశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. వారిపై బలప్రయోగం చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అమిత్ షాపై ఉందని పేర్కొంటూ.. ఆయన సభకు రాకపోవడంపై కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.కేంద్రం వాదన ఏంటి?అయితే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. నిరసనల సమయంలో పోలీసులు సంయమనం పాటించారని, ఎలాంటి అనవసర బలప్రయోగం జరగలేదని చెబుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు.. రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా విపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.మళ్లీ రంగంలోకి CJPమరోవైపు నీట్ నిరసనలకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ ఇంకా నెరవేరలేదని ఆ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కేంద్రానికి మరో సవాల్గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసుల ఉపసంహరణ, విద్యార్థులపై చర్యలపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలను మళ్లీ ఉధృతం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.షా మౌనం చర్చనీయాంశంనీట్ నిరసనల వ్యవహారంలో ఇప్పటివరకు అమిత్ షా ప్రత్యక్షంగా స్పందించకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన గైర్హాజరీని విపక్షాలు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక కారణాన్ని వెల్లడించలేదు. మరోవైపు CJP తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.విద్యార్థులపై పోలీసు చర్యల ఆరోపణలు.. అమిత్ షా మౌనం.. కేసుల ఎత్తివేత డిమాండ్.. ఈ మూడు అంశాలు కేంద్రంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో హోంమంత్రి స్పందిస్తారా? రాజకీయ రగడ మరింత కొనసాగుతుందా?? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
ఇక కేసు లేనట్లే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మైనర్ బాలికకు ఊరట లభించింది. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. జంతర్ మంతర్లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో భాగంగా వైరల్ అయిన వీడియోలో బాలిక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.తొలుత నోయిడా పోలీసులు ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ ఫిర్యాదులో ఆమెను 25 ఏళ్ల మహిళగా పేర్కొన్నారు. అనంతరం సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలో తాను కేవలం 15 ఏళ్ల బాలికనని, ఇతరుల ప్రభావంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె వెల్లడించింది. “నేను చేసినది క్షమించరాని తప్పు. చాలా చెడ్డ మాటలు మాట్లాడాను. ఇది నా మొదటి, చివరి తప్పు. దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నాను” అంటూ ఆ బాలిక వీడియోలో పేర్కొంది.మోదీ క్షమాభిక్ష.. మారిన పరిణామాలుఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. తనను దూషించిన వారిని క్షమిస్తున్నట్లు తెలిపారు. “అలాంటి పిల్లలను కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం వల్ల పరిస్థితులు మారవు. వారిని క్షమించాలని కోరుకుంటున్నాను” అని మోదీ పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలోనూ బాలికపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కూతురిని క్షమించాలని తల్లి విజ్ఞప్తిబాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. “మోదీ గారు గొప్ప మనసుతో నా కుమార్తెను క్షమించారు. ఆమెకు కొత్త జీవితం ఇచ్చారు. చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నాను” అని ఆమె తెలిపారు. అంతేకాకుండా 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించాలని ప్రధానిని కోరారు. చిన్నారులు సులభంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.CJP నిరసనల నేపథ్యంలో ఘటననీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఐదు వారాలకు పైగా నిరసనలు నిర్వహించింది. ఎక్కువగా విద్యార్థులు ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడంతో గత నెలలో ఈ నిరసనలను విరమించారు. అయితే నిరసనల సమయంలోనే నోయిడాకు చెందిన బాలిక.. రెచ్చిపోయి మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఓ సుప్రీం కోర్టు లాయర్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ప్రధాని క్షమాభిక్ష.. పోలీసుల నిర్ణయం.. మైనర్ బాలికకు భారీ ఊరట లభించినట్లయింది. -
నిరసనలపై బీజేపీ మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: జంతర్మంతర్లో ఇటీవల జరిగిన విద్యార్థులు, సీజేపీ నిరసన కార్యక్రమంపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిరసనలో పాల్గొన్న వారిలో విద్యార్థుల కంటే "పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు" ఎక్కువ మంది ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైనా తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా మీడియాతో మాట్లాడిన బిధూరి మాట్లాడుతూ.. ‘జంతర్మంతర్లో జరిగిన నిరసనలో విద్యార్థుల కంటే పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు ఎవరనేది మీకు తెలుసు’ అని అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ.. "ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను దేశ ప్రధాని గురించి అలాంటి భాష మాట్లాడమని ప్రోత్సహించరు. మోదీ జీని దూషించే వారు పంక్చర్ వేసేవాళ్ల పిల్లలు లేదా వారి కుటుంబాలకు చెందినవారే" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.నీట్ (NEET) అంశాన్ని అడ్డం పెట్టుకుని కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జనరేషన్-జెడ్ (Gen Z) యువతను తప్పుదోవ పట్టించాయని బిధూరి ఆరోపించారు. ‘నీట్ సమస్య పేరుతో కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జంతర్మంతర్ వద్ద యువతను సమీకరించాయి. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం, పార్లమెంట్పై దాడికి ప్రయత్నించడం, దేశంలో అశాంతి సృష్టించడమే వారి లక్ష్యం’ అంటూ ఆయన అన్నారు.జెన్-జెడ్కు అవగాహన కల్పించాలి..గత 12 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులు, అభివృద్ధి, అంతకుముందు 12 ఏళ్ల పరిస్థితుల గురించి యువతకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బిధూరి పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిన జనరేషన్-జెడ్ను సరైన మార్గంలోకి తీసుకురావాలి. గత 12 ఏళ్లలో దేశంలో ఏం జరిగిందో, అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో వారికి వివరించాలని అన్నారు. అయితే, రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈసారి కూడా నిరసనలో పాల్గొన్న వారిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశముంది. -
ముఖేశ్ ఖన్నాకు ఇచ్చిపడేసిన సీజేపీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేశ్ ఖన్నా తమపై చేసిన వ్యాఖ్యలకు కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలకు నిరసన తెలిపిన వారికి మద్దతు ఇచ్చిన యువతపై బెదిరింపులకు దిగడాన్ని తిప్పికొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న యువతకు ఉద్యోగాలు రావని, ప్రభుత్వం సాయం అందని ముకేశ్ ఖన్నా హెచ్చరించారు. అంతేకాదు వారిని మురికి కాలువలోని పురుగులుగా ఆయన వర్ణించారు. సీజేపీ ట్రాప్లో పడొద్దని పిల్లలకు సూచించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టడంతో పాటు ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా షేర్ చేశారు.''ఇంట్లోకి బొద్దింకలు వస్తే, మనం ఏం చేస్తాం?? వాటిని వెతికి పట్టుకుంటాం, పైకి ఎత్తి బయట పడేస్తాం. వీరితో కూడా అలాగే చేయండి. కొంత మంది పిల్లలు ప్రలోభాలకు లొంగిపోయి, ఆవేశంలో అన్ని రకాల తప్పుడు, నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. వారికి ఇదే నా హెచ్చరిక.. మీ మాటలు చరిత్రలో లిఖించబడ్డాయి. వారితో తిరగడం ద్వారా, మీరు మిమ్మల్ని మీరే ఒక మురికి కాలువలోని పురుగులుగా మార్చుకున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది!!ఏ పోలీసులూ మీకు సహాయం చేయరు. చాలామంది మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి సంకోచిస్తారు. ప్రభుత్వ సహాయం నిలిపివేయబడుతుంది. మీకు కొన్ని వీసాలు కూడా రాకపోవచ్చు!! మీరు ఇప్పటికే మీ కుటుంబం దృష్టిలో పడిపోయారు! అందుకే, మీరు వారి బారి నుండి ఎంత త్వరగా తప్పించుకుంటే అంత మంచిది. నాకు మీ గురించి ఆందోళనగా ఉంద''ని ఎక్స్లో పేర్కొన్నారు.మాకు మీరు తెలియదుముఖేశ్ ఖన్నా వ్యాఖ్యలను సీజేపీ తిప్పికొట్టింది. తాము జెనజీ తరానికి చెందిన వాళ్లమని మీ గురించి మాకు తెలియదు అనే అర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. ''క్షమించండి, మేము జెన్జీ. మేము స్పైడర్మాన్, బాట్మాన్, మార్వెల్స్ చూశాం. మీ గురించి మాకు తెలియదు. కాబట్టి మీ జ్ఞానాన్ని మీ జేబులోనే ఉంచుకోవాల''ని ఎక్స్లో సీజేపీ జవాబిచ్చింది. కాగా, శక్తిమాన్ పాత్రతో ముఖేశ్ ఖన్నా సినిమా రంగంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు అదే తరహాలో సీజేపీ కౌంటర్ ఇచ్చింది.Sorry , but we are Gen-z हम spiderman, batman, Marvels देखते हैं Animes देखते हैं ! हम आपको नहीं जानते ! So please keep your knowledge in your pocket. https://t.co/OdQp0Pe25M— Cockroach Janta Party (@shah34516) August 1, 2026చదవండి: ఈ20 ఇథనాల్ పెట్రోల్ స్కామ్ను బయటపెడతా -
రుచికా సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. క్రిమినల్ కేసుపై CJP సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యువతి రుచికా సింగ్పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్రంగా తప్పుబట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సమర్థించలేమని స్పష్టం చేసిన ఆయన, అలాంటి సందర్భాల్లో క్రిమినల్ చర్యలకు బదులుగా పరువు నష్టం దావా వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించాలని సూచించారు.జూలై 23న జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న రుచికా సింగ్ ప్రధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ పరిణామంపై స్పందించిన సౌరవ్ దాస్, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే విధంగా క్రిమినల్ చట్టాలను వినియోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.‘రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యలు తప్పు కావచ్చు. అవి చాలామందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. కానీ కేవలం అలాంటి భాష వాడినందుకు ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదు. అలాంటి సందర్భాల్లో పరువు నష్టం దావా వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ విచారణ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది యువతకు ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన అన్నారు.అయితే యువ నిరసనకారులు తమ అసమ్మతిని వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని, ఉపయోగించే పదాల విషయంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని కూడా దాస్ సూచించారు. ప్రజాప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పోలీసులు రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాలను దుర్వినియోగం చేయరాదని ఆయన హెచ్చరించారు. ‘క్రిమినల్ న్యాయ వ్యవస్థను ఇలాంటి సందర్భాల్లో వినియోగించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. పోలీసులు శాంతంగా వ్యవహరించాలి. యువతపై వేధింపులు ఆగాలి’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఘజియాబాద్కు చెందిన స్మృతి సింగ్ ఫిర్యాదు మేరకు జూలై 29న గౌతమ్ బుద్ధ నగర్లోని ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రధానమంత్రి రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయని, ద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేశారు.జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రకారం, నేరం ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత అధికార పరిధి ఉన్న పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేస్తారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకుంది. 36 రోజుల పాటు కొనసాగిన నిరసనలు కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రధాన డిమాండ్లను అంగీకరించిన అనంతరం జూలై 25న ముగిశాయి. -
కాక్రోచ్లు ఏం చేశారో చూడండి.. ఢిల్లీ పోలీసుల కుటుంబాల ఆవేదన
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు కర్కశంగా వ్యవహరించారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. గాయపడిన పోలీసుల కుటుంబాలు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణల్లో పోలీసులపై కూడా తీవ్ర దాడులు జరిగాయని ఆరోపిస్తూ బాధిత సిబ్బంది కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తమవాళ్లపై జరిగిన దాడులకు కూడా న్యాయం కావాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఉదయం సంచలన ప్రెస్మీట్ నిర్వహించారు. జంతర్ మంతర్ ఆందోళనల్లో గాయపడిన పోలీసుల కుటుంబాలు ఘటనకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వాళ్ల కుటుంబ సభ్యులు.. అసాంఘిక శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటివరకు విద్యార్థులపై పోలీసుల చర్యల గురించే ఎక్కువగా చర్చ జరిగిందని, కానీ విధి నిర్వహణలో గాయపడిన పోలీసుల పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి.నా తండ్రిని ఈడ్చుకెళ్లి కొట్టారు.. ఢిల్లీ పోలీస్ ఏఎస్ఐ కుమార్తె మాట్లాడుతూ తన తండ్రిపై జరిగిన దాడిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి గతంలో 15 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో మెరైన్ కమాండోగా పనిచేశారని, అనంతరం ఢిల్లీ పోలీస్లో చేరారని తెలిపారు. #WATCH | Delhi | Daughter of a Delhi Police SI (Sub-Inspector) who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "...Before joining the police, my father served as a Marine Commando in the Indian Navy. He dedicated 15 years of his life to the… pic.twitter.com/aevnbcdNyQ— ANI (@ANI) July 31, 2026“జంతర్ మంతర్ వద్ద బ్యారికేడ్ల దగ్గర విధుల్లో ఉన్న సమయంలో ఓ గుంపు ఆయనను ఈడ్చుకెళ్లింది. దాదాపు మూక దాడికి గురయ్యారు. స్పృహ కోల్పోయి ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో నాలుగు గంటలు ఉన్నారు” అని ఆమె తెలిపారు. “రాత్రి 10 గంటలకు సహచర పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. ఆయన యూనిఫాం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆ దృశ్యం మా కుటుంబానికి ఎప్పటికీ మర్చిపోలేని బాధ” అని చెప్పారు. తన తండ్రి తలకు నాలుగు కుట్లు పడ్డాయని, అయినప్పటికీ “ఇవి విధిలో భాగమే” అంటూ కుటుంబాన్ని ధైర్యం చెప్పారని ఆమె పేర్కొన్నారు.‘సోషల్ మీడియాలో మమ్మల్ని నేరస్థులుగా చూపిస్తున్నారు’పోలీసులపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో నా తండ్రినే నేరస్థుడిగా చూపిస్తున్నారు. కానీ దాడికి గురైన మా కుటుంబానికి కూడా న్యాయం కావాలి. మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి” అని ఏఎస్ఐ కుమార్తె అన్నారు. గాయపడిన పోలీసుల కుటుంబాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయని తెలిపారు.‘రాళ్ల దాడిలో నా భర్త హెల్మెట్ పగిలిపోయింది’మరో ఏఎస్ఐ భార్య సీమ మాట్లాడుతూ.. 33 ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న తన భర్త జులై 20న జంతర్ మంతర్ వద్ద విధుల్లో ఉన్నారని చెప్పారు. ఆందోళనకారుల సంఖ్య పెరిగిందని, కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని భర్త తనకు చెప్పారని తెలిపారు.VIDEO | Wife of a Delhi Police ACP who sustained injuries during the clash between police and CJP protesters in Delhi on July 20, says, "When he returned home late on the night of July 20 with injuries, it was an extremely painful and traumatic moment for me and my two-year-old… pic.twitter.com/l6YllUXHS3— Press Trust of India (@PTI_News) July 31, 2026“ఆందోళనకారులు పూల కుండీలు, చెప్పులు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. నా భర్త ధరించిన హెల్మెట్ రాళ్ల దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. హెల్మెట్ లేకపోతే ఆయన ప్రాణాలతో ఉండేవారు కాదేమో” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.‘సీనియర్ అధికారులను కాపాడుతూ గాయపడ్డారు’మరో ఏఎస్ఐ కుమారుడు లక్ష్య మాట్లాడుతూ.. తన తండ్రి సీనియర్ అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో రాళ్ల దాడికి గురయ్యారని ఆరోపించారు. “తలపై రాయి తగలడంతో నాలుగు కుట్లు పడ్డాయి. ఆన్లైన్లో చూస్తే పోలీసులపై మాత్రమే విమర్శలు కనిపిస్తున్నాయి. మా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు” అని అన్నారు.#WATCH | Delhi | A family member of a Delhi Police official who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "This was not a student protest; rather, there were mischievous elements who tried to sabotage and discredit the students' protest and… pic.twitter.com/qfyP8CawD4— ANI (@ANI) July 31, 2026రెండు వాదనలు.. వీడియోలు వైరల్జంతర్ మంతర్ ఆందోళనపై ఇప్పటివరకు ప్రధానంగా విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. లాఠీచార్జ్, అరెస్టులు, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసుల కుటుంబాలు విడుదల చేసిన వీడియోలు, చేసిన ఆరోపణలు ఘటనకు మరో కోణాన్ని చూపిస్తున్నాయి. ఆందోళన సమయంలో పోలీసులు కూడా దాడులకు గురయ్యారా? లేక బలప్రయోగం అంశం ఎంతవరకు సమంజసం? అన్నదానిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో విద్యార్థులు, పోలీసులు ఇద్దరి వాదనలు పరిశీలించి నిష్పక్షపాత విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్?
ఢిల్లీలోని జంతర్ మంతర్లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని.. ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని’’ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి.. జూలై 23-24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని.. యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ఫోన్లతో వీడియోలు తీసిన మరింత రెచ్చిగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్చందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.జీరో ఎఫ్ఐఆర్ నమోదుసుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో.. సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. ఎవరీ అమ్మాయి?.. జంతర్ మంతర్ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక.. విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె.. ఇలా అభ్యంతరక వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఢిల్లీ పోలీసులకు బదిలీజంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో నోయిడాలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్ఎస్ఓ (Intelligence Fusion and Strategic Operations) పరిశీలిస్తోంది. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులుఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువునష్టం కలిగించే కంటెంట్ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ (X) వేదికకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం లేదంటే వాటి యాక్సెస్ను నిలిపివేయడం, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. -
మోదీ మంచి ఇన్ఫ్లుయెన్సర్.. కంగనా లైట్: అభిజిత్ దీప్కే
ప్రధాని నరేంద్ర మోదీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ మాంచి ఇన్ఫ్లుయెన్సర్ అంటూ ప్రశంసలు గుప్పించారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనలు, కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంతో.. దీప్కే సెటైరిక్ వ్యాఖ్యలే చేశారు.రాజకీయ నేతగా కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా బాగా రాణిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ.. ప్రధాని పదవి నుంచి తప్పుకుని ఆ రంగంలో కొనసాగాలంటూ వ్యంగ్యంగా సూచించారు. ఢిల్లీ నిరసనలు, అనారోగ్యం నుంచి కోలుకున్నాక తన స్వస్థలమైన మహారాష్ట్రకు తిరిగి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే.. ప్రధాని మోదీ మంచి ఇన్ఫ్లూయెన్సర్గా పని చేస్తున్నారని, అయితే దేశ పాలన బాధ్యతలను మరొకరికి అప్పగించాలని వ్యాఖ్యానించారు.🚨 BREAKING 🚨Abhijeet Dipke asks PM Modi to resign, & become full-time INFLUENCER 🤯🗣️"He is doing good as an influencer— I think he should STEP DOWN, & someone else should take over governance." pic.twitter.com/o2r8hoG9x0— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) July 29, 2026"మోదీ ఇప్పుడు ఇన్ఫ్లూయెన్సర్గా మారాలి. ఆ పని ఆయన చాలా బాగా చేస్తున్నారు. ప్రధాని పదవి వదిలి ఇంకొక నాయకుడు దేశాన్ని నడిపే అవకాశం ఇవ్వాలి" అని అన్నారు. నీట్ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించినప్పటికీ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించి వేధిస్తున్నాయని దీప్కే ఆరోపించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వెంటనే ఆపాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారని గుర్తుచేసిన దీప్కే.. అయితే మొదటి విచారణకే సీబీఐ న్యాయవాది హాజరు కాకపోవడంతో కేసు వాయిదా పడిందని ఎద్దేవా చేశారు. మాటలకు, చేతలకు పొంతన ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.అదే నిజమైతే హోం మంత్రి ఫెయిల్ అయినట్లే!పెల్లెట్ గన్స్ వాడడం నా కళ్లారా చూశా. చాలా మంది కళ్లు పోయాయి. బిహార్లో ఏకంగా ఏకే47 ఎక్కుపెట్టారు. కసబ్లాంటి ఉగ్రవాదులపై ఎక్కుపెట్టాల్సిన ఏకే-47ను విద్యార్థులపై గురి పెట్టారు. బీజేపీలోకి రమ్మని నన్ను బెదిరిస్తున్నారు. అమిత్ షా చెప్పడం వల్లే పెల్లెట్ గన్స్ వాడి ఉండొచ్చు. ఢిల్లీ పోలీసులు అమిత్షాకే రిపోర్ట్ చేస్తారు. ఇది అమిత్ షాకు తెలియదంటే హోం మంత్రిగా ఆయన ఫెయిల్ అయినట్లే!. 'ఆగ్రహం ఇంకా చల్లారలేదు'కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా.. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని దీప్కే అన్నారు. ఆగ్రహం వ్యక్తిగతంగా మంత్రి మీద కాదని, ప్రభుత్వ వైఖరిపైనేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం యువత మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై వేధింపులు కొనసాగితే ఉద్యమం మరింత పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభిస్తామని దీప్కే స్పష్టం చేశారు. "ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. దేశ భవిష్యత్తు. భవిష్యత్తును ఇలా ఇబ్బంది పెడితే.. అవసరమైతే ఈ ప్రభుత్వాన్నే మార్చే స్థాయిలో ఉద్యమం చేస్తాం" అని హెచ్చరించారు.పెల్లెట్ గన్స్.. చర్యలు తీసుకోవాలిజంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించిన ఘటనపై కూడా దీప్కే స్పందించారు. ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా సరే.. అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయినా, మరెవరైనా అయినా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రధాన్కు సన్మానం చేయడంపై.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్లో ఆయనకు బీజేపీ సభ్యులు సన్మానం చేయడాన్ని కూడా దీప్కే తప్పుబట్టారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో రాజీనామా చేసిన మంత్రిని సత్కరించడం సరికాదని వ్యాఖ్యానించారు.కంగనా.. లైట్నీట్ ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దీప్కే.. ఆమెను "పార్ట్టైమ్ రాజకీయ నాయకురాలు"గా అభివర్ణించారు. తాను సీరియస్ రాజకీయ నాయకుల వ్యాఖ్యలకే స్పందిస్తానని చెప్పి ఆమె విమర్శలను తేలికగా కొట్టిపారేశారు. -
పెల్లెట్ గన్స్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్మంతర్లో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ వినియోగంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న వేళ.. ఈ అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్ గన్స్ను ఉపయోగించడంలో తప్పేం లేదని స్పష్టం చేసింది. అయితే..పెల్లెట్ గన్స్ను పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్ను కోర్టు అంగీకరించలేదు. బదులుగా, అసాధారణ (exceptional), అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే జూలై 20న జంతర్మంతర్లో విధుల్లో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డును (అమ్యూనిషన్ లాగ్) భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. నిరసనల్లో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.పోలీసుల అధికారాలపై కోర్టు వ్యాఖ్యలుపెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. నిరసనలు హింసాత్మకంగా మారి, దుండగులు చొరబడి పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు చట్టబద్ధంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని పేర్కొంది. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలు ఫలించకపోతే, అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో పోలీసులు బుల్లెట్లను కూడా ఉపయోగించేందుకు చట్టం అవకాశం ఇస్తుందని.. అలాంటప్పుడు ప్రాణాంతకం కాని (Non-lethal) పెల్లెట్ గన్స్ను పూర్తిగా నిషేధించాలని ఎలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. అదే సమయంలో.. వాటి వినియోగంపై స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయమూ వ్యక్తం చేసింది.గాయపడిన వారికి చికిత్స తప్పనిసరినిరసనల సమయంలో ఎవరైనా గాయపడితే వారికి తక్షణమే నాణ్యమైన వైద్య చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జంతర్ మంతర్ ఘటనలో గాయపడిన నిరసనకారులందరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.సీఆర్పీఎఫ్ నివేదిక ఏమంటోంది?ఇదిలా ఉండగా, జంతర్మంతర్ వద్ద పోలీసు చర్యపై సీఆర్పీఎఫ్ అంతర్గత విశ్లేషణలో అన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) పాటించినట్లు పేర్కొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మొదట ప్రజలను చెదరగొట్టేందుకు హెచ్చరికలు జారీ చేయడం, అనంతరం టియర్ గ్యాస్, లాఠీచార్జ్ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతోనే పంప్ యాక్షన్ గన్ ద్వారా పెల్లెట్ గన్స్ను వినియోగించినట్లు నివేదిక వెల్లడించింది.ఇద్దరికీ గాయాలుఈ ఘటనలో ముగ్గురి నుంచి ఐదుగురు నిరసనకారులు పెల్లెట్ల కారణంగా గాయపడినట్లు సమాచారం. మరోవైపు, 47 మంది RAF సిబ్బంది కూడా గాయపడగా, వారిలో ఆరుగురికి తలకు తీవ్ర గాయాలు అయినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది.సిబ్బందికి అండగా డీజీసీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీ.పీ. సింగ్ తన సిబ్బందికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల భద్రత, దేశ ప్రయోజనాల దృష్ట్యా విధి నిర్వహణలో అధికారులు తీసుకున్న నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తానని, చట్టబద్ధంగా విధులు నిర్వర్తించే సిబ్బంది ఎలాంటి భయాందోళనలు లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు.కాగా, నీట్ నిరసనల్లో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారంటూ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాయపడిన ఓ విద్యార్థిని చూపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. దీంతో ఈ అంశం పార్లమెంట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ రాజకీయ వివాదం నడుమే సుప్రీంకోర్టు అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా తప్పుబట్టలేమని, వాటిపై సంపూర్ణ నిషేధం అవసరం లేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సీజీపీ రీఎంట్రీ హెచ్చరిక.. జంతర్మంతర్ వద్ద హైఅలర్ట్
ఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరిగిన నిరసనల్లో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించకపోతే మరోసారి ఆందోళన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రదర్శనల సమయంలో నిరసనకారులు నిర్ణీత ప్రాంతం దాటి వెళ్లకుండా ఉండేందుకు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన మెటల్ బ్యారికేడ్లను ఇనుప కడ్డీలతో వెల్డింగ్ చేసినట్లు సమాచారం.భవిష్యత్తులో ఆందోళనలు జరిగితే బ్యారికేడ్లను తొలగించడం లేదా ముందుకు కదలడం సాధ్యం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, ఇతర భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. సీజీపీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది.36 రోజుల ఆందోళన.. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజీపీ గతంలో జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం జూలై 25న ఆందోళన విరమించింది. అయితే నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమన్న హామీని కేంద్రం ఉల్లంఘించిందని సీజీపీ ఆరోపించింది. అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరోసారి రోడ్డెక్కుతామని హెచ్చరించింది.సీజీపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తాజాగా మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా ఉల్లంఘించిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారని, అరెస్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, అదుపులో ఉన్న నిరసనకారుల విడుదల, కొత్త క్రిమినల్ కేసుల నమోదును నిలిపివేయడం, ఒప్పంద వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారా?సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే మరో ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల్లో అసంతృప్తి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు సహాయం చేసేందుకు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ సెల్ ఏర్పాటు చేసినట్లు సీజీపీ ప్రకటించింది. అలాగే సాక్ష్యాల సేకరణ కోసం ‘సాక్షి’ అనే ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కూడా కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు రూ.1 కోటి నిధిని ప్రకటించినట్లు సమాచారం. -
‘‘రష్యాలో 4 నెలలుగా ఉన్నా.. నీట్ నిరసన కేసులో నా పేరు పెట్టారు’’
పట్నా: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు సంబంధించిన కేసులో తన పేరు చేర్చారని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యానని బిహార్కు చెందిన ఓ యువకుడు చెప్పాడు. బిహార్లోని కిషన్గంజ్కు చెందిన మహ్మద్ సదాఖత్ తాను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నానని పేర్కొన్నాడు.“జూలై 24న నీట్ లీక్కు వ్యతిరేకంగా ఎల్ఆర్పీ చౌక్ వద్ద నిరసన జరిగింది. ఆ కేసులో బహదూర్గంజ్ అడ్మినిస్ట్రేషన్ నా పేరు చేర్చింది. నేను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నాను” అని సదాఖత్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు.“నేను రష్యాలో ఉండడంతో నా పేరును అక్కడి నుంచి తొలగించాలని అడ్మినిస్ట్రేషన్ను కోరుతున్నాను. అలా చేస్తే వారికి రుణపడి ఉంటాను” అని అతడు కోరాడు. అతడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పటికీ దాని ప్రామాణికతను స్వతంత్రంగా ఇప్పటివరకు ఏ మీడియా కూడా నిర్ధారించలేకపోయింది.పోలీసులు ఏమన్నారు?కిషన్గంజ్ పోలీసు సూపరింటెండెంట్ హరి మోహన్ శుక్లా స్పందిస్తూ... వైరల్ వీడియోలోని వ్యక్తిపై కేసు నమోదైందా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించలేదు, ఖండించలేదు. సదాఖత్ వీడియోపై అడిగిన ప్రశ్నకు హరి మోహన్ స్పందిస్తూ.. “నిరసనలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉన్నవారు పోలీసులను సంప్రదించవచ్చు. పరిష్కారం పొందవచ్చు” అని చెప్పారు.బిహార్ పోలీసుల అధికారిక ఎక్స్ ఖాతా గతంలో ఈ వైరల్ వీడియోపై స్పందిస్తూ, విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అయితే ఆ పోస్టు ఇప్పుడు కనిపించడం లేదు. తొలగించినట్టు తెలుస్తోంది.విద్యార్థులపై కేసులు ఉపసంహరించనున్న ప్రభుత్వంముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం... నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమైన సీజేపీ ఆందోళనలు చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీశాయి.రాష్ట్ర హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 26 ఉదయం 6 గంటల కంటే ముందు జరిగిన ఘటనలకు సంబంధించి నమోదైన “అన్ని ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులు” ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ కేసుల్లో అరెస్టైన వారందరినీ వెంటనే విడుదల చేయాలని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.मोहम्मद सदाकत 4 महीने से रूस में हैं। बिहार पुलिस ने स्टूडेंट प्रोटेस्ट में उनके खिलाफ भी FIR दर्ज कर दी है !! pic.twitter.com/jEDqWs27ck— Sachin Gupta (@Sachingupta) July 29, 2026 -
‘నా వ్యాఖ్యల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను’
సాక్షి,ఢిల్లీ: లోక్సభలో తనకు మాట్లాడే అవకాశం లేదని తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, క్షమాపణలు చెప్పబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు. బుధవారం రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యకు కేంద్రహోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలి. పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులను చావబాదారు. పెల్లెట్ గన్ తగిలి ఓ యువకుడు కన్ను పోవాల్సిన పరిస్థితి వచ్చింది.మహిళలు, మైనర్లపై కూడా దాడులు చేశారు. పోలీసులకు అమిత్షా ఆదేశాలైనా ఇచ్చి ఉండాలి.. ఆయనకు తెలియకుండా జరిగుండాలి’అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీల నిరసనల సందర్భంలో, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల కాల్పులు, లాఠీఛార్జీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ఆదేశాలు ఇచ్చారనడానికి రాహుల్ గాంధీ దగ్గర ఏవైనా రాతపూర్వక ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని, లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సభకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, అలాంటప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. -
జంతర్ మంతర్ లో లాఠీ ఛార్జ్.. పోలీసులకు సుప్రీం నోటీసులు
-
“అరెస్టుల్లో తప్పేముంది?”.. విద్యార్థి నిరసనలపై నడ్డా కౌంటర్
నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రభుత్వ చర్యలను సమర్థించారు. నిరసనలు చేపట్టినప్పుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థి నిరసనలపై పోలీసులు బలప్రయోగం చేశారని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. నిరసనకారులపై చర్యలు తీసుకున్న వారిపై ఎందుకు చర్యలు లేవని.. వాళ్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.దీనిపై స్పందించిన నడ్డా.. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవడం వారి బాధ్యత అని అన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొనే వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.Union Minister JP Nadda on Wednesday defended the Delhi Police action at the CPI(M) headquarters, calling it a "normal law and order situation" and accusing the Opposition of politicising the incident. Responding in the Rajya Sabha after CPI(M) MP John Brittas raised the issue,… pic.twitter.com/i2yzjYApeE— The Siasat Daily (@TheSiasatDaily) July 29, 2026నిరసనలు చేస్తే చర్యలు సహజమేవిద్యార్థి ఉద్యమాలపై మాట్లాడిన నడ్డా.. యాక్టివిజంలో పాల్గొనేవారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ.. చట్ట పరిమితులను దాటితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్న నడ్డా.. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా విద్యార్థి కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో తరగతి గది నుంచి రెండుసార్లు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.‘నేనూ అరెస్టయ్యా..’‘‘నేను కూడా విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను. ఎమర్జెన్సీ సమయంలో క్లాస్రూమ్ నుంచి రెండుసార్లు నన్ను పోలీసులు తీసుకెళ్లారు’’ అని నడ్డా పేర్కొన్నారు. అయితే అప్పటి పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ఉద్యమాల్లో పాల్గొంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇటీవల విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని డిమాండ్ చేశారు. అయితే నడ్డా మాత్రం పోలీసుల చర్యలను సమర్థించారు. చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వ, పోలీసు వ్యవస్థల బాధ్యత అని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
రైతు సంఘాలతో సీజేపీ దోస్తీ.. సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ: రైతు సంఘాలు- కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సంయుక్తంగా ఉద్యమించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన ఆందోళనల తర్వాత, సీజేపీ ఇప్పుడు మరింత విస్తృత కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ నేతలు ప్రముఖ రైతు నాయకుడు రాకేశ్ టికైత్ను కలిసి ఏకతాటిపై నిలిచే విషయమై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రాధాన్యంత సంతరించుకున్నాయి.‘ఇండియా టుడే’ నివేదిక ప్రకారం, ఈ భేటీలో సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా సహా పలువురు నేతలు, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ పాల్గొన్నారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సీజేపీ వెల్లడించింది. దీని ద్వారా రైతులు, విద్యార్థులు, యువతను ఒకే వేదికపైకి తీసుకురావాలని యోచిస్తున్నారు. దేశంలోని రైతులు, యువత, విద్యార్థులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి నిలదీయాలని రాంకా పేర్కొన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.మరోవైపు, రాజస్థాన్లోని అల్వార్ పరిసర ప్రాంతాల్లో జూలై 30న భారీ మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీకి తరలివస్తున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణపై రైతులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని, గతంలో జరిగిన చర్చల సమయంలో ఇచ్చిన హామీలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒప్పందాలను గౌరవించకపోతే, అన్ని ఎఫ్ఐఆర్లను బేషరతుగా రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో మరోసారి ఉద్ధృతమైన ఆందోళనలు చేపడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. -
కాక్రోచ్ నిరసనల ఎఫెక్ట్.. ఢిల్లీ వీధుల్లో టెన్షన్!
నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త వివాదం మొదలైంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, భద్రతా సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరికొన్ని వీడియోలు చర్చకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు నీట్ పేపర్ లీక్, పరీక్షా వ్యవస్థలో లోపాలపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అనంతరం నిరసనలపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు జరిగినట్టు తాజాగా వీడియోలు బయటకు వస్తున్నాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.As Soon as Dharmendra Pradhan’s Resignation is Confirmed……• Sonam Wangchuk has left.• Abhijeet Deepke and Saurabh Das are celebrating.Meanwhile, in Delhi, the Sangh Parivar has put their most Notorious and Riotous Group, the Bajrang Dal, out on the Streets.They are… pic.twitter.com/yLa72eEdBA— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 28, 2026ఇటీవల సత్యం పండిట్ అనే వ్యక్తి ఇద్దరు నిరసనకారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన వీడియో చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు చూపించే మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో చిత్రీకరించినట్లు చెబుతున్న ఓ వీడియోలో, మైక్ పట్టుకున్న ఓ వ్యక్తి కొందరు నిరసనకారులను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తూ నిలదీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అతడి మెడపై చేయి వేసి మాట్లాడుతున్నట్లు, క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది.जो काॅकरोच जंतर-मंतर पर सनातन धर्म और मोदी जी को गाली दे रहे थे उनकी दिल्ली मेट्रो में जमकर धुलाई हो रही है...🤣😏 pic.twitter.com/XHtgERs9Hx— राजपूत सवित सिंह (@Savit12) July 29, 2026 మరో వీడియోలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు వెంబడించి కొట్టినట్లు, తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక వీడియోలో ఓ మహిళను పలువురు వ్యక్తులు చుట్టుముట్టి ప్రశ్నిస్తూ, ఆమెను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై నిరసనలకు మద్దతు ఇస్తున్న వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని లేదా విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమని, నిరసనకారులను బెదిరించడం, దాడి చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొంటున్నారు.బీజేపీ అనుకూల వర్గాల వాదనమరోవైపు, బీజేపీకి మద్దతు ఇస్తున్న వర్గాలు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, పోలీసులపై అనుచిత నినాదాలు చేసినట్లు చూపించే కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిరసనల పేరుతో చట్టపరమైన, సామాజిక పరిమితులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేశాయి. అయితే, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాల్సింది చట్టపరమైన వ్యవస్థ మాత్రమేనని, వ్యక్తులు లేదా ప్రైవేట్ గుంపులు స్వయంగా చర్యలకు దిగడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.THIS IS SHAMEFUL !!!If this is what young Indians have to face simply for supporting a protest then what kind of democracy are we becoming?This video appears to show Satyam Pandit confronting and slapping two youths on their way to the Jantar Mantar protest has sparked… pic.twitter.com/8zDPBMb1at— Ravi Prakash Official (@raviprakash_rtv) July 26, 2026ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు. అదే సమయంలో నిరసనల సమయంలో హింస, బెదిరింపులు, దాడులు లేదా చట్ట ఉల్లంఘనలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు, న్యాయ వ్యవస్థలపై ఉంటుంది. కాగా, నీట్ నిరసనలు ముగిసినా, వాటి చుట్టూ రాజకీయ వాదోపవాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు నిరసనకారులపై దాడుల ఆరోపణలు, మరోవైపు నిరసనల్లో జరిగిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. The police have started their job. The Students movement is over. Now who will come forward to help these students?Unity of students is required. #cjpprotesters #india #arrested #students #police pic.twitter.com/6o7LxWowhb— भारतीय (@ramanswall) July 27, 2026 -
‘గూగుల్లో వెతికా.. ఎంత పనికిమాలినోడివో!’
జెన్-జీ నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఉన్న బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. తాజాగా సీజీపీ (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను విమర్శించిన సౌరవ్ దాస్కు కౌంటర్గా.. అతడిని ‘‘పనికిమాలినోడు, ఉద్యోగం లేనివాడు’’ అంటూ మండిపడ్డారు. తన కెరీర్ విజయాలను ప్రస్తావిస్తూ విమర్శలకు బదులిచ్చారు.సౌరవ్ దాస్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కంగనా.. ‘‘గూగుల్లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు. అతనో పనికిమాలినోడు అని అర్థమైంది. అలాంటి వ్యక్తి తనను తాను విద్యార్థి అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అతడి వయసులోనే నేను రెండు జాతీయ అవార్డులు సాధించాను’’ అని పేర్కొన్నారు.నటిగా, ఎంపీగా నా ప్రయాణం వేరుతాను కేవలం రాజకీయ నాయకురాలిని మాత్రమే కాదని కంగనా అన్నారు. నటిగా, చిత్ర నిర్మాతగా, స్క్రీన్రైటర్గా, వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణం కొనసాగిందని తెలిపారు. ‘‘కొత్త ఎంపీగా బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి ఎదురైంది. ఎందుకంటే నేను ఫిల్మ్మేకర్, పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా కూడా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ డిమాండ్లో ఉండటం అంటే ఏమిటో సౌరవ్ దాస్ లాంటి వారు అర్థం చేసుకోలేరంటూ విమర్శించారు.‘ముందు నైపుణ్యం నేర్చుకో’సౌరవ్ దాస్ను ఉద్దేశించి కంగనా మరింత ఘాటుగా స్పందించారు. ‘‘నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. నువ్వు కేవలం పనికిమాలిన వ్యక్తివి. ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.జెన్-జీ నిరసనలపై కంగనా వ్యాఖ్యలునీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలపై కంగనా గతంలో తీవ్రంగా స్పందించారు. ‘‘నా జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదు. జెన్-జీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయి. వారు మాట్లాడే విధానం, ఉపయోగించే భాష నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ విమర్శించారు. ‘‘ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు? ఎవరు పెంచుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలుకంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గఢీ స్పందిస్తూ.. జెన్-జీ యువత నుంచి కంగనాకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా కంగన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందేందుకు ఒక మహిళా ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.సౌరవ్ దాస్ కౌంటర్కంగనా వ్యాఖ్యలకు ముందు సౌరవ్ దాస్ కూడా ఆమెపై విమర్శలు చేశారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘కంగనాను ఆమె సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరు. ఆమెను సీరియస్గా తీసుకోనప్పుడు మేమెందుకు తీసుకోవాలి?’’ అని అన్నారు. జెన్-జీ, జెన్ ఆల్ఫా తరాలు కంగనా వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ‘‘జెన్-జీ ఈ దేశానికి మీకంటే ఎక్కువ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంపై మళ్లీ నమ్మకం కలిగించే పని యువత చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనలతో మొదలైన వివాదంనీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సీజీపీ కీలక పాత్ర పోషించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆందోళనల తర్వాత కేంద్రం కొన్ని డిమాండ్లను అంగీకరించింది. బాధిత కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పరిణామాల తర్వాత అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశమైంది.కొనసాగుతున్న మాటల యుద్ధంనిరసనలు ముగిసినా.. కంగనా, సీజీపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఒకవైపు కంగనా నిరసనకారుల తీరును ప్రశ్నిస్తుండగా.. మరోవైపు సీజీపీ నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా సౌరవ్ దాస్పై కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. -
నిరసనలకు ‘సుప్రీం’ ఛత్రం!
ఉద్యమించటం, నిరసనలు వ్యక్తం చేయటం నేరమన్న అభిప్రాయం వ్యవస్థల్లో నరనరానా వ్యాపించింది. ఒక బ్యానర్తోనో, ఒక జెండాతోనో, నిర్దిష్టమైన ఎజెండాతోనో జనం రోడ్లపైకి రాగానే లాఠీలు పైకి లేవడం, బాష్పవాయు గోళాలు వర్షించడం... ఉద్యమకారుల్ని ఈడ్చుకెళ్లడం, పిడిగుద్దులు, బూటుకాళ్లతో తన్నడాలు రివాజయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమంలోనైతే పెల్లెట్లనుంచి ఏకే–47 బుల్లెట్ల వరకూ కనబడటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం శాంతియుత నిరసనలపట్ల ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ మార్గదర్శ కాలు జారీచేస్తామనటం స్వాగతించదగింది. నిరసనలు రాజ్యాంగం ప్రసాదించిన హక్కనీ, వాటిని నిరాకరించటం సరికాదనీ వ్యాఖ్యానించింది. పాలకులూ, వారిని సమర్థించే కొన్ని వర్గాలూ ఈ సంగతి మరిచి చాన్నాళ్లయింది. ఉద్యమాలూ, నిరసనలను ఏవగించుకునే జాతీయ మీడియా చానెళ్లకు కూడా కొదవలేదు. దగ్గర వాటర్ బాటిళ్లు తప్ప మరేం లేని 15, 16 ఏళ్ల పిల్లల్ని... అందునా ఆడపిల్లల్ని గూండాలుగా అభివర్ణించే స్థాయికి అవి దిగజారాయి. ఆడపిల్లల ఛాతీపై చేతులువేసి నెట్టడం, చెంపదెబ్బలు కొట్టడం, లాఠీలతో మోదటం ఏ రకంగా సమర్థనీయం? వారు కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదే! విధి నిర్వహణలోవున్న పాత్రికేయుల్నీ, పక్కన నిలబడి చూస్తున్నవారినీ కూడా తలలు పగలగొట్టారు. పెల్లెట్లతో గాయపరిచారు. ఇలా అతిగా ప్రవర్తించిన సిబ్బంది మాస్క్లు, స్వెట్టర్లు ధరించి వివరాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ కేసులో వెలువరించిన తీర్పులో చట్టబద్ధమైన విధి నిర్వహణలో ఉండే ప్రతి పోలీసు అధికారి తప్పనిసరిగా తమ గుర్తింపు తెలిసేలా ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అటుపై అది సీఆర్పీసీలో 41–బి సెక్షన్గా, ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్–36గా చేరింది. బలప్రయోగం చేయటానికి రాజ్యానికున్న అధికారం తాలూకు బాధ్యతను నిర్దిష్టంగా గుర్తించదగిన వ్యక్తికి ఆపాదించగలిగేలా ఉండాలన్న రాజ్యాంగపరమైన హామీ ఇది.పెద్దయెత్తున జనం పాల్గొనే ఆందోళనల్లో నేరగాళ్లు చొరబడే అవకాశాలు లేకపోలేదు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశాలు తోసిపుచ్చలేం. అలాంటివారిని గుర్తించి అదుపు చేయటానికే సాధారణ దుస్తుల్లో పోలీసు సిబ్బంది ఉంటారు. అంతకన్నా ముందు నిరసన జరిగే ప్రాంతాన్ని నిరంతరం నిఘా కళ్లు చూస్తుంటాయి. అలాంటపుడు ఊరేగింపు జరపాలని సీజేపీ నిర్ణయించిన రోజు వేకువజామున జంతర్మంతర్లో పెద్ద పెద్ద రాళ్లతో కూడిన ట్రక్కు, అప్పటికే పూర్తిగా ధ్వంసమైన వాహనం ఎలా చేరాయి? అప్రమత్తంగా ఉన్న కార్యకర్తలు వెనువెంటనే వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అప్పుడైనా చర్యలుంటే పోలీసులపై జరిగాయంటున్న దాడులకు ఆస్కారం ఉండేది కాదు. కానీ అటుతర్వాత విచక్షణారహితంగా ఉద్యమకారుల్ని కొట్టారు. తలలకు గాయాలై నెత్తురోడుతున్నవారు అనేకమంది వీడియోల్లో కనబడ్డారు. కొందరికి చేతులు విరిగాయి. లాఠీచార్జి చేసేటపుడు మోకాలు దాటి పై భాగంలో కొట్టడం చట్టవిరుద్ధం.ఈ నెల 25న బిహార్ బంద్ సందర్భంగా శివాన్ జిల్లాలో ఉద్యమకారులతో ఘర్షణ చోటుచేసుకున్నప్పుడు ఒక కానిస్టేబుల్ ఏకే–47తో కాల్పులు జరుపుతూ కెమెరాలకు చిక్కాడు. 15 యేళ్ల బాలుడితోసహా ముగ్గురు గాయపడ్డారని అంటున్నా పోలీసులు మాత్రం ఆ కాల్పులవల్ల ఎవరూ గాయపడలేదంటున్నారు. నిరాయుధ పౌరులపై మిలిటరీ గ్రేడ్ ఆయుధాలు ఉపయోగించరాదన్న ప్రాథమిక పరిజ్ఞానం కూడా అతగాడికి లేదని అర్థమవుతుంది. అతన్ని సస్పెండ్ చేశారు సరేగానీ... కనీస అవగాహన లేనివారికి ఇటువంటి ప్రమాదకర ఆయుధాలు ఎలా ఇచ్చారన్నది తేల్చాలి. మొన్న శుక్రవారం విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల ‘చలో లోక్భవన్’లో సైతం ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఏపీలో అమలయ్యేది రెడ్ బుక్ రాజ్యాంగం కనుక విద్యార్థి సంఘాల కండువాలేసుకుని మరీ పోలీసులు దాడిచేశారు. యువకుల్ని బూటుకాళ్లతో తన్ని, పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచారు. రోడ్డుపై పడేసి కొట్టారు. ఇలా ఆటవిక ప్రవృత్తి మితిమీరుతున్న దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం శుభ పరిణామం. -
కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర పరిణామాలు.. కేంద్రానికి CJP మరో వార్నింగ్
-
జంతర్ మంతర్ లాఠీఛార్జిపై సీజేఐ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళనకారులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన అత్యున్నత న్యాయస్థానం.. ఇలాంటి ఘటనల్లో బాధ్యతను నిర్ధారించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.“ఎవరు అతిగా బలప్రయోగం చేశారో తేల్చాలి. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేస్తుంది. బాధ్యతను నిర్ణయించకుండా చేసే దర్యాప్తునకు అర్థం లేదు” అని మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉందిప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని సుప్రీంకోర్టు సీజేపీ ధర్మాసనం గుర్తు చేసింది. ఆందోళనలను ఎదుర్కొనే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధానాల్లో మార్పులు అవసరమని పేర్కొంది. పోలీసులు గతంలో కోర్టులు సూచించిన మార్గదర్శకాలను పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. నిరసనల సమయంలో పోలీసుల వ్యవహారశైలికి సంబంధించి కొత్త ప్రొటోకాల్ అవసరమని సూచించింది. 2018లో ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. టియర్ గ్యాస్, లాఠీచార్జి, నియంత్ర పద్ధతులపై సమగ్ర విధానం రూపొందించాలి అని పేర్కొంది. జులై 20న ఉద్రిక్తతలుజులై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా(చలో సంసద్) వెళ్లేందుకు CJP నేతృత్వంలో నిరసనకారులు ప్రయత్నించిన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీలు ఉపయోగించారు. ఈ క్రమంలో ఘర్షణలు చోటుచేసుకుని పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పెల్లెట్ గన్స్ వాడకంపై ఆగ్రహంపోలీసుల దాడిలో ఓ యువకుడు కంటి చూపు కోల్పోయిన ఘటనను పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు, చిన్నారులపై కూడా లాఠీచార్జి జరిగిందని.. యూనిఫాంలో లేకుండా సివిల్ డ్రెసులో ఉన్నవాళ్లూ దాడులు చేశారని.. ఎలక్ట్రిక బ్యాటన్లు, ఎలక్ట్రిక్ షీల్డ్లు వాడారని తెలిపారు. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యల్లో అతిగా బలప్రయోగం జరిగిందా? అనే అంశంపై పూర్తి స్థాయి విచారణ అవసరమని తెలిపారు. మాజీ న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు?ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించింది. జంతర్ మంతర్ ఘటనలో ఎవరి తప్పు ఎంత ఉందో బయటకు రావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పోలీసులకు కీలక సందేశంనిరసనలు, ఆందోళనలు ప్రజాస్వామ్యంలో భాగమని గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. వాటిని నియంత్రించే క్రమంలో పోలీసులు చట్టపరమైన పరిమితులు దాటకూడదని సూచించింది. జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం వ్యాఖ్యలు.. నిరసనల నిర్వహణ, పోలీసుల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. -
యువతరం రోడ్డెక్కితే.. దేశానికి హెచ్చరికేనా?
-
జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీచార్జ్ : ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి దిగారనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. లాఠీ చార్జి ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించి కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సి కీలక వ్యాఖ్యలు చేసింది. జూలై 25న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఎన్హెచ్ఆర్సి ఢిల్లీ పోలీస్ కమిషనర్కు నోటీసులు పంపుతూ, దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ప్రజా నిరసనల సమయంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణపై ఈ ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కమిషన్ సుమోటోగా స్వీకరిస్తోందని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది.శాంతియుత నిరసన ప్రాథమిక హక్కు, శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని సహేతుక పరిమితులు మాత్రమే విధించాలి కానీ, నిరసనకారులపై మితిమీరిన బలప్రయోగం కూడదని కమిషన్ వ్యాఖ్యానించింది. లాఠీచార్జి అనంతరం వారికి అందించిన వైద్య సహాయం తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈఘటనపై సీసీటీవీ ఫుటేజ్ రికార్డు అందజేయాలని కూడా ఆదేశించింది. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాల ప్రకారం భారత్ పాటించాల్సిన బాధ్యతలకు విరుద్ధం" అని ఆర్డర్లో పేర్కొంది. జులై 20వ తేదీన జరిగిన ఘటనపై రెండు వారాల్లో సవివర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులిచ్చింది.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్కు హ్యాట్సాఫ్నిరసనకారులకు అయిన గాయాల వివరాలతోపాటు, గాయపడిన విద్యార్థులకు వైద్య సహాయం అందిందో లేదో తెలిపే సమాచారం. నిరసన సమయంలో గుంపును అదుపు చేయడానికి అనుసరించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలు, ఇంకా ఉపయోగించిన బలప్రయోగం సమర్థనీయమైనదా మరియు పరిమితులకు లోబడి ఉందా అనినిర్ధారించడానికి ఏమైనా విచారణ ప్రారంభించారా అనే వివరాలు కూడా సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.కాగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలపై అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీఇచ్చిన పిలుపుతో జూన్ నెలలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జూలై 20న పార్లమెంట్కు "సంసద్ చలో" పిలుపు తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీనికి ఎలాంటి అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ , ఇతర బలప్రయోగ చర్యలకు దిగారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గామారడంతో కమిషన్ స్పందించింది. ఇదీ చదవండి: రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ! -
చివరి నిమిషంలో కేంద్రం ప్లాన్ బెడిసి కొట్టిందా?
నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం.. మరో ఆసక్తికర మలుపు తిరిగింది. రాజీనామా కంటే ముందే కేంద్రం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించకుండా.. ఆయన శాఖను మార్చే ప్రతిపాదనను కేంద్రం చేసిందట. ఇదే విషయాన్ని ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా ద్వారా ప్రకటించగా.. అది వాస్తవమేనన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం, సీజేపీ మధ్య జరిగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు సమావేశమైన సమయంలో.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం. మిగతా రెండు డిమాండ్లను ఎలాంటి షరతుల్లేకుండా అంగీకరిస్తూ.. ఈ ఒక్క డిమాండ్ విషయంలోనే పంతం వీడాలని కోరినట్లు సమాచారం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు దాన్ని తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలుగులోకి వచ్చింది.ఒక మంత్రిని కొనసాగించాలా? లేదంటే శాఖ మార్చాలా? అన్నది ప్రధానమంత్రి పరిధిలోని నిర్ణయమని కేంద్ర ప్రతినిధులు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. కేవలం శాఖ మారిస్తే సరిపోదని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న సీజేపీనీట్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని సీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించాలంటే నాయకత్వ మార్పు అవసరమని వాదించింది. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించలేదని తెలుస్తోంది. ఇటు రాహుల్ కూడా.. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక. ఆయన రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అనైతికం. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆయన శాఖను మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. కానీ, ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. లేకుంటే ఆందోళనలను విరమించం అని రాహుల్ గాంధీ ఆ సమయంలో మీడియా ద్వారా వెల్లడించారు. అటు నిరసనకారులు.. ఇలా విపక్షాలు . రాజీనామాపైనే పట్టుబట్టడంతో చివరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.రాజీనామా తర్వాత రాజకీయ వేడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీయే నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రతిపక్షాలు.. ఆయన రాకపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ప్రసంగం ఇచ్చారు. ఉద్యమం తర్వాత కొత్త దశధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ.. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశం మరో వివాదంగా మారింది. దీనిపై కేంద్రంతో చర్చలు జరిపిన సీజేపీ.. కేసుల ఉపసంహరణ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతోంది. మొత్తంగా నీట్ వివాదం కేవలం పరీక్షల నిర్వహణ అంశానికే పరిమితం కాకుండా.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల వరకు ప్రభావం చూపింది. -
LIVE: మళ్లీ అదే రిపీట్ అవుతుంది..!
-
నీట్ ఉద్యమంలో మిడ్నైట్ ట్విస్ట్!
న్యూఢిల్లీ: నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరో కీలక మలుపు తిరిగింది. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశంపై కేంద్రంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో ప్రభుత్వం అర్ధరాత్రి కీలక చర్చలు జరిపింది. ఈ సమావేశం అనంతరం నిరసనకారులకు రక్షణ కల్పించేలా మరిన్ని రాష్ట్రాల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సీజేపీ వెల్లడించింది.“ఏ ఒక్క నిరసనకారుడిని ఒంటరిగా వదిలిపెట్టం. అందరం కలిసి ఉన్నాం” అని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై తమకు ఉన్న అనుమానాలను చర్చల్లో ప్రస్తావించామని, వాటిపై స్పష్టమైన హామీలు లభించాయని పేర్కొన్నారు.#Important: 1 AM update.Hours after our press conference, Government’s representatives met us. The meeting lasted for 2-3 hours. They shared copies of the Bihar and Assam notifications guaranteeing FIR withdrawals, no action in future, and release of all detainees and… pic.twitter.com/G7WcHHcfAs— Saurav Das (@SauravDassss) July 27, 2026 2–3 గంటల పాటు సాగిన అర్ధరాత్రి భేటీసోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ ప్రెస్మీట్ తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు తమను కలిశారని, దాదాపు 2–3 గంటల పాటు చర్చలు సాగాయని తెలిపారు. బిహార్, అస్సాం ప్రభుత్వాలు నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవన్న హామీలకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను ప్రభుత్వం తమకు అందించిందని చెప్పారు. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ–ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కూడా ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“హామీలు అమలవుతాయా?”చర్చల అనంతరం విడుదల చేసిన వీడియో సందేశంలో సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీల అమలుపై తమకు ఆందోళన ఉందని స్పష్టం చేశారు. “చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతాయేమోనన్న భయాన్ని ప్రభుత్వ ప్రతినిధుల ముందు పెట్టాం. అందుకు ప్రతిగా బిహార్ హోం శాఖ జారీ చేసిన ప్రకటనను వారు చూపించారు. అందులో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లు ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని పేర్కొన్నారు” అని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రక్షణ కల్పించేలా నోటిఫికేషన్లు జారీ చేయడంపై చర్చ జరిగినట్లు వెల్లడించారు.మళ్లీ ఉద్యమం హెచ్చరికతో కదిలిన ప్రభుత్వంకేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ మరోసారి ఆందోళన బాట పట్టే హెచ్చరికలు చేసింది. ఒప్పందం ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు కొనసాగుతున్నాయని పేర్కొంది. బిహార్, బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారని సీజేపీ ఆరోపించింది. వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించింది.బిహార్, అస్సాం తర్వాత రాజస్థాన్ హామీఇప్పటికే బిహార్, అస్సాం ప్రభుత్వాలు నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన కేసులపై ఉపశమనం కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి. అరెస్టైన వారిని విడుదల చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చర్యలు ఉండవని హామీ ఇచ్చాయి. తాజాగా రాజస్థాన్లోనూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ లభించిందని సీజేపీ తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని, ఇకపై కూడా నమోదు చేయబోమని అధికారులు స్పష్టం చేసినట్లు పేర్కొంది.నీట్ పోరాటం ముగిసినట్లే!నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తాత్కాలికంగా ముగిసింది. అయితే నిరసనకారులపై కేసులు, అరెస్టుల అంశం కొత్త వివాదానికి దారితీసింది. తాజా చర్చలతో తాత్కాలికంగా ఆందోళన సద్దుమణిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల ఉపసంహరణ, విద్యార్థుల రక్షణపై అధికారిక ప్రకటనలు రావడమే కీలకంగా మారింది. -
ఢిల్లీ నిరసనలపై ఫేస్ స్కాన్ ఆపరేషన్
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్ ‘చలో సంసద్ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జంతర్ మంతర్ దగ్గర గత వారం జరిగిన ఉద్రిక్త ఆందోళనలకు సంబంధించిన వందలాది గిగాబైట్ల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ.. సీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులకు, సీజేపీ మద్దతుదారులకు మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే.సుమారుగా 100 సీసీటీవీ వీడియో క్లిప్లలో నిరసనకారులు.. భద్రతా వలయాలను ఛేదించడం, పోలీసు సిబ్బందిపై దాడి, రాళ్లు రువ్వి ఆస్తులను ధ్వంసం చేయడం రికార్డయింది. ఇప్పటివరకు ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్) ద్వారా 2,873 మంది నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించారు. వీరిలో 989 మందిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ, పోక్సో చట్టం కింద నమోదైన కేసులతో సహా పలు తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇందులో 101 మంది హత్య కేసుల్లో, 284 మంది దొంగతనం కేసుల్లో.. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న 92 మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులు చేయడం, బారికేడ్లను బద్దలు కొట్టడం, రాళ్లు రువ్వడం, పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, వాహనాలను ధ్వంసం చేయడం, వాహనాల లోపల ఉన్న పోలీసులపై దాడి చేయడం, నిరసన మార్గంలో ఉన్న ప్రజా ఆస్తులను, దుకాణాలను ధ్వంస చేయడం వంటి ఘటనలు పలు ప్రదేశాల్లో సీసీటీవీలలో రికార్డయ్యాయి. కొన్ని ఫుటేజీలలో గుంపుగా బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగడం, జూలై 20న సంసద్ మార్గ్ వద్ద పలు చోట్ల రాళ్లు రువ్విన దృశ్యాలు ఉన్నాయి.అదే రోజు.. జంతర్ మంతర్ సమీపంలో పోలీసులు లోపల కూర్చున్నప్పటికీ, గుంపు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేసి, ఒక పోలీసు వాహనాన్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నించింది. టాల్స్టాయ్ మార్గ్ వద్ద ఒక వాహనానికి నిప్పు పెట్టడం, బస్సు టైర్లను పంక్చర్ చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. పోలీసు సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు జరిగినట్లు పలు వీడియోలు స్పష్టంగా చూపుతున్నాయని వర్గాలు తెలిపాయి. గాయపడిన ఒక మహిళా పోలీసు అధికారిని ఆమె సహచరులు సురక్షిత ప్రాంతానికి తరలించడం కనిపించింది.సంసద్ మార్గ్ వద్ద గుంపు ఒక పోలీసును చుట్టుముట్టి దాడి చేసింది. గాయపడిన పోలీసు సిబ్బంది యూనిఫామ్లపై రక్తం కారుతున్న అనేక క్లిప్లు ఉన్నాయి. ఢిల్లీ పోలీసుల ప్రకారం సుమారు 200 మంది పోలీసులు గాయపడ్డారు. జూలై 22న రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్లో పోలీసు అధికారులు నంద్కిషోర్, వివేక్ భగత్లపై జరిగిన దాడులు నమోదయ్యాయి. కొంతమంది నిరసనకారులు కెమెరా ముందు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను సేకరించి తదుపరి చర్యల నిమిత్తం విశ్లేషిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. వీటిలో కన్నాట్ ప్లేస్లో ఓ మహిళ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, సంసద్ మార్గ్ వద్ద ఓ వ్యక్తి పార్లమెంటు గురించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోలీసులపై ఒక మహిళ బూతులు తిట్టిన దృశ్యాలు ఉన్నాయి. -
ఇవాళే డెడ్లైన్! కేంద్రానికి సీజేపీ మరో వార్నింగ్
నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరోసారి ఉత్కంఠకు దారితీస్తోంది. కేంద్రంతో చర్చల అనంతరం ఆందోళనను విరమించిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు ఆ హామీలు అమలు కావడం లేదని ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో కేంద్రానికి మరోసారి అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేరుస్తూ ఇవాళ గనుక రాతపూర్వక హామీ ఇవ్వకుంటే.. మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించింది. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జులై 25న తాత్కాలికంగా ముగిసింది. అదే సమయంలో ఈ నిరసనలకు మద్దతుగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యమించారు. అయితే వాళ్లపైనా ఆయా చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నీట్ నిరసనలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మళ్లీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో జరిగిన చర్చల్లో.. నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారని సీజేపీ పేర్కొంది. ఆ తర్వాత కూడా బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల అరెస్టులు కొనసాగుతున్నాయని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారంటూ ఆరోపించింది.‘‘హామీ ఉల్లంఘిస్తే నమ్మకద్రోహమే’’సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు కేంద్రానికి డిమాండ్లు పెట్టారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చిన హామీలపై లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు కాకపోతే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చర్చలను నమ్మి ఉద్యమాన్ని విరమించారని.. ఇప్పుడు మాట తప్పడం లక్షలాది మంది యువత నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.వార్నింగ్ ఎఫెక్ట్.. బిహార్ ప్రభుత్వ హామీసీజేపీ హెచ్చరికల తర్వాత బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 26 సాయంత్రం 6 గంటల వరకు నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేస్తామని, భవిష్యత్తులోనూ వారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది.బిహార్లో నిరసనల సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. మొత్తం 335 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆందోళనల సమయంలో హింస, ఆస్తుల నష్టం, పోలీసులపై దాడుల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.ఏకే-47 ఘటనపై దుమారంబిహార్లోని సివాన్లో నిరసనల సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. జేపీ చౌక్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఆందోళనల్లో మొత్తం 694 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 339 మందిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనల్లో పోలీసు అధికారులు సహా 91 మంది గాయపడ్డారని, 14 ప్రభుత్వ వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.బెంగాల్లోనూ కేసులు.. 16 మంది అరెస్టుఇటు పశ్చిమ బెంగాల్లో నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోల్కతాలోని డొరినా క్రాసింగ్ వద్ద అనుమతి లేకుండా గుమిగూడి, పోలీసులపై రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరారని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుల ఉపసంహరణపై బెంగాల్ ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కొన్ని కేసుల విషయంలో నేరుగా ఉపసంహరణ సాధ్యం కాకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.అసోంలోనూ అరెస్టులు.. కేసుల ఉపసంహరణకు నిర్ణయంఅసోంలోనూ నిరసనలకు సంబంధించి చర్యలు తీసుకున్నారు. ప్రజా శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణలతో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ద్వారా నిరసనకు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే.. సీజేపీ హెచ్చరికల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన ఐదు కేసులను ఉపసంహరించేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అరెస్టైన 13 మందిని విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలిపింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవని స్పష్టం చేసింది.ఢిల్లీ, మధ్యప్రదేశ్లో సోషల్ మీడియాపై నిఘాఇదిలా ఉండగా.. నిరసనల సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపినట్లు సమాచారం. మధ్యప్రదేశ్లోని నివారీ జిల్లాలో ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్పై మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ, ఢిల్లీ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.ముంబైలో కొనసాగుతున్న పోలీసుల నోటీసులుసీజేపీ ప్రకటన తర్వాత కూడా.. ముంబైలో కొంతమంది నిరసనకారులకు పోలీసుల నోటీసులు కొనసాగుతున్నాయి. కేసుల దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అధికారికంగా కేసుల ఉపసంహరణ ఉత్తర్వులు వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.విద్యార్థుల న్యాయ పోరాటానికి సిబల్ చేయూతనీట్ నిరసనల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముందుకొచ్చారు. సీజేపీ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ ఫండ్కు రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయవాదులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.పైన పేర్కొన్న రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లో నీట్ నిరసనలకు సంబంధించి కేసులు, అరెస్టుల ప్రక్రియ కొనసాగింది. అయితే కేవలం ప్రకటనలతోనే ఈ వివాదం ముగిసిపోతుందా? కేసుల ఉపసంహరణ, అరెస్టయిన విద్యార్థుల విడుదల అంత సులువైన ప్రక్రియేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు, దర్యాప్తు దశలో ఉన్న కేసులు, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు కీలకంగా మారాయి.తమ డిమాండ్లు నెరవేరకపోతే మళ్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు దిగుతామని సీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి? విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? లేక ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి దారితీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్రం తదుపరి చర్యలపైనే నీట్ ఉద్యమం భవిష్యత్ ఆధారపడి ఉంది. -
ప్రపంచ వ్యాప్తంగా వైరలైన ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు..
ముంబై: ఇటీవల జరిగిన జెన్-జీ ప్రొటెస్ట్లో ముంబైలో ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్ను అడ్డుకుని నిరసనకు ప్రతీకగా నిలిచిన మోడల్ రియా అహిర్ ఇప్పుడు తనపై ఆన్లైన్ వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను పోలీసు వ్యాన్ను అడ్డుకున్న ఘటన తర్వాతి నుంచి బెదిరింపులు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నానంటూ ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని, తన పోస్టులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై విద్వేష ప్రచారం సాగుతోందని, ఇందులో పరువునష్టం, బెదిరింపులు, మహిళలపై ద్వేషపూరిత దూషణలు, డీప్ఫేక్ వీడియోలు ఉన్నాయని కూడా ఆరోపించారు.వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. పరువునష్టం కలిగించే పోస్టుల స్క్రీన్షాట్లు, యూఆర్ఎల్లు, ఇతర ఆధారాలను కూడా సమర్పించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.జూలై 22న ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ సమీపంలో రియా అహిర్ పోలీసు వ్యాన్ను అడ్డుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్పై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులను ఆ వ్యాన్లో తీసుకెళ్తున్నారు.బూడిద రంగు హూడీ ధరించి, పోలీసు వ్యాన్ బానెట్పై చేయి ఉంచి ధైర్యంగా నిలబడ్డ ఆమె దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో తాను సహజసిద్ధంగా స్పందించానని రియా అహిర్ చెప్పారు."పోలీసులు తప్పు చేస్తున్నారని నాకు తెలుసు కాబట్టే నేను అలా చేయగలిగాను. మీ హక్కుల గురించి మీకు తెలుసుండాలి" అని తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనది సహజ స్పందన మాత్రమేనని, కానీ ప్రజలు దాన్ని అసాధారణ ఘటనగా చూడటం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. -
విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కేసులు పెడతాం
-
మరో సంచలనం.. సీజేపీ కీలక నిర్ణయాలు.. మళ్లీ ఆందోళనలు?
న్యూఢిల్లీ: విద్యార్థులపై దాడులు చేసిన పోలీసులపై కేసులు పెడతామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది. న్యూఢిల్లీలో ఆ పార్టీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చర్చల సమయంలోనూ కేసులు ఎత్తేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమకు తెలిపారని చెప్పారు.ఒప్పందం అమలు చేయకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని కేంద్రానికి సీజేపీ వార్నింగ్ ఇచ్చింది. ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్కు ఉద్దేశించి ఎక్స్లో కూడా సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా ఓ పోస్ట్ చేశారు. బిహార్, పశ్చిమ బెంగాల్లో విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో పోలీసులు దాడులు చేయడాన్ని ప్రస్తావించారు."జేపీ నడ్డా, జితేంద్ర సింగ్.. ఆందోళనకారులపై పోలీసు చర్యలు ఉండవని జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని మేము గమనిస్తున్నాం. బిహార్, బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వందలాది మందిపై నిఘా పెట్టి వేధిస్తున్నారు. ఆందోళనకారులకు లాజిస్టిక్స్ సాయం అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలను ఢిల్లీలో అదుపులోకి తీసుకుంటున్నట్టు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. ఆందోళనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించాలి. విద్యార్థులను విడుదల చేయాలి. ఇకపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, భాజపా మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదు. మా ఒప్పందానికి అనుగుణంగా ఇదంతా అమలు కావాలి. లేదంటే మేము మళ్లీ ఆందోళనలో కూర్చోవాల్సి వస్తుంది. చట్టపరమైన కేసులపై రాతపూర్వక ఒప్పందాన్ని భారత ప్రభుత్వంతో నిర్ణయించిన గడువులతో పాటు రేపటిలోగా మాకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం" అని రాంకా తెలిపారు.జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఈ ఆందోళన విరమించారు. ఆ సమయంలో సీజేపీ, ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్తో జరిగిన ఒప్పందంలో కేసులు ఎత్తివేయడం, పోలీసుల వేధింపులు అడ్డుకోవడం, ప్రశ్నపత్రాల లీక్లను అరికట్టే చట్టం తీసుకురావడం వంటి అంశాలకు ప్రభుత్వం అంగీకరించింది.అంతకుముందు రోజే సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్.. అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేసి, ఎఫ్ఐఆర్లను ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరారు."అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం జరుగుతోందని మాకు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. ఇది మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది" అని దాస్ తెలిపారు. -
విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలి.. ఇన్ని రాష్ట్రాల్లో నిరసనలు
కేంద్ర విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలు పంజాబ్, ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల విద్యామంత్రులు రాజీనామా చేయాలన్న డిమాండ్ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అంశం ఒక్క పరీక్షకే లేదా ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నో పరీక్షలతో ఈ విషయం ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అంశంపై నిరసనలు కొనసాగుతున్నాయి.లక్నోలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ ఘటనల్లో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేశారని, ఇలాంటి ఆరోపణలు వచ్చిన రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖ మంత్రులు అదే విధంగా బాధ్యత వహించి, వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు అంటున్నారు.పంజాబ్లో రెండుసార్లు నిర్వహించిన ప్రభుత్వ నియామకాల అంశంపై కూడా రాజకీయ వేడి పెరిగింది. పంజాబ్లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలి దళ్ పార్టీలు భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నాపత్రం లీక్ అంశంపై నిలదీస్తున్నాయి.పంజాబ్లో వరుసగా పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని, హైటెక్ పద్ధతిలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ జరగలేదని, సమయానికి నకలు మాఫియాను బయటపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఫార్మసీ విభాగం, వ్యవసాయ శాఖకు చెందిన రెండు కేసుల చుట్టూనే ఈ వివాదం కొనసాగుతోంది. ఈ కేసుల వల్ల పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.ఫార్మసీ ఆఫీసర్ పరీక్ష: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 454 ఫార్మసీ ఆఫీసర్ల నియామకానికి ఇటీవల బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పరీక్షలో సుమారు 7,000 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే స్పెషల్ కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీసుల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఫరీద్కోట్, ఫిరోజ్పూర్, కోట్ కపూరా పరీక్ష కేంద్రాలపై దాడులు చేశాయి.ఈ ఘటనలో 28 మంది అభ్యర్థులతో పాటు మొత్తం 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థులు తలపాగా, సాక్స్, లోదుస్తుల్లో చిన్న బటన్లు, వైర్లెస్ బ్లూటూత్ పరికరాలు దాచుకుని వచ్చారు. ఫిరోజ్పూర్లోని ఒక పరీక్ష కేంద్రం నుంచి పెన్ కెమెరాతో ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా బయటకు పంపారు. అక్కడ హరియాణా, రాజస్థాన్ నుంచి నిర్వహిస్తున్న కంట్రోల్ రూమ్ ద్వారా అభ్యర్థులకు సమాధానాలు చెబుతున్నారు.ఈ ముఠా ఒక్కో అభ్యర్థి నుంచి 3.5 లక్షల నుంచి 13 లక్షల రూపాయలు వసూలు చేస్తోందని సమాచారం. దీన్ని నేరుగా ప్రశ్నపత్రం లీక్, వ్యవస్థ వైఫల్యంగా పేర్కొంటూ రాష్ట్ర ఆరోగ్యమంత్రి, విద్యామంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఇది పరీక్షకు ముందు జరిగిన ప్రశ్నపత్రం లీక్ కాదని, పరీక్ష ప్రారంభమైన తర్వాత రియల్ టైమ్లో జరిగిన హైటెక్ లీక్ అని, దాన్ని సమయానికి గుర్తించి అడ్డుకున్నామని పంజాబ్ పోలీసులు, అధికారులు చెబుతున్నారు.వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షలో వివాదంవ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో వ్యవసాయ అభివృద్ధి అధికారి నియామక పరీక్షపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ పరీక్ష ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయిందని ప్రతిపక్షం, ముఖ్యంగా శిరోమణి అకాలి దళ్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రం సెట్లు లీక్ అయ్యాయని, తర్వాత విషయాన్ని దాచిపెట్టేందుకు అసాధారణంగా గ్రేస్ మార్కులు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్షపై పారదర్శక విచారణ జరిపి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ పట్టభద్రులు, యువ అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. ఇవేగాక, పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లోనూ విద్యా శాఖ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. -
కేంద్రంపై ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె పోస్టుల దుమారం
సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ చేసిన సోషల్ మీడియా పోస్టులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ఆమె చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.ఇటీవల దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, వాటిపై పోలీసుల చర్యల నేపథ్యంలో స్నిగ్ధ తన సోషల్ మీడియా ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాత్మక పోస్టులు చేశారు. "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో జరుగుతున్న నిరసనకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీసుకున్న ఫొటోలను ఆమె పంచుకోవడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఒక కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ "రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలా?" అంటూ చేసిన సెటైరికల్ పోస్టు కూడా నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ పోస్టులను కొందరు ప్రభుత్వంపై విమర్శగా చూస్తుండగా, మరికొందరు రాజకీయ వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు.కేశినేని స్నిగ్ధ చేసిన పోస్టులు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉండటమే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా కొనసాగుతుండగా, ఆ పార్టీ ఎంపీ కుమార్తె కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే, ఇవి కేశినేని స్నిగ్ధ వ్యక్తిగత సోషల్ మీడియా పోస్టులు మాత్రమే. ఈ పరిణామంతో టీడీపీ అధికారిక వైఖరి ఏమిటనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. అయితే, ఇప్పటివరకు ఈ పోస్టులపై టీడీపీ పార్టీ గానీ, ఎంపీ కేశినేని చిన్ని గానీ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అలాగే, బీజేపీ నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. -
లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపుతూ పోలీసులు మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించలేరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ నిరసనల సందర్భంగా వారిపై పోలీసుల చర్యల విషయమై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కేవలం నిరసన జరుగుతోందనే కారణంతోనే లాఠీచార్జ్ చేయలేరు. ఎక్కడైనా పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడితే దానిని అరికట్టాల్సిందే. ప్రతి పౌరుడి హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రానిదే.ఈ విచారణలో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి మాట్లాడుతూ..‘విద్యార్థుల భద్రత ఎంత ముఖ్యమో, పోలీసుల భద్రత కూడా అంతే ముఖ్యం. నిరసనకారులు పోలీసులపై కూడా దాడులకు పాల్పడకూడదు. పోలీసుల చర్యలకు సంబంధించి తగిన ఎస్ఓపీలు ఎందుకు లేవో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరవచ్చు" అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో నిరసనల్లోకి ఆకతాయిలు, సామాజిక విద్రోహ శక్తులు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిరసనకారులు కూడా హింసకు తావులేకుండా ఆత్మనియంత్రణ, క్రమశిక్షణ పాటించడం అత్యంత కీలకమని పేర్కొంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల వ్యవహార శైలిపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. -
విద్యార్థులపైకి తూటాలా.. మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్
ఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, బీహార్లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారని రాహుల్ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల మొత్తం వ్యవస్థ అత్యంత కఠినంగా, అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్.. ‘బీహార్లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.छात्रों के ख़िलाफ़ पूरा का पूरा सिस्टम ही जानलेवा है।खबर आ रही है कि बिहार में प्रदर्शन कर रहे छात्रों पर AK-47 से गोलियाँ चलाई गई हैं और सैकड़ों छात्रों को गिरफ़्तार करके उनपर FIR की जा रही है।मोदी जी, कहाँ गया आपका वादा कि छात्रों पर कोई FIR नहीं की जाएगी और उन्हें रिहा कर… https://t.co/c7zdyyeLA0— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2026ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, బీహార్లో ఏకే-47లు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ.. ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ విద్యార్థులపైన కాదు అని డిమాండ్ చేశారు.అయితే, పోలీసుల చర్యలు చట్టపరమైన పరిస్థితుల నేపథ్యంలోనే జరిగాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీహార్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసులు అధికారి ఏకే-47 పట్టుకుని నిరసనకారులపైకి ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసింది. -
విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం.. కేంద్రానికి మరో పరీక్ష!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానుండగా, విద్యార్థి నిరసనలు, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితిలో లేదు.జూలై 20న జరిగిన సీజేపీ చలో సంసద్ నిరసన సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడులు చేశారన్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా లేవనెత్తుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారన్న ఆరోపణలపై అమిత్ షాకు లేఖ రాశారు. 19 ఏళ్ల విద్యార్థి సహిల్ లోచాబ్ ఒక కంటిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ, ఇలాంటి బలప్రయోగానికి అనుమతి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సాధారణ దుస్తుల్లో కనిపించిన వ్యక్తులు విద్యార్థులను లాఠీలతో కొట్టిన ఘటనపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.Another disturbing video from the CJP "Sansad Chalo" protest is circulating online.Protesters allege that, after lathi charges and tear gas, pellet guns were also used during the crackdown.#संसद_मार्च#cjp_पार्टी pic.twitter.com/6IrdPuAQss— Zo World (@ZoWorldd1) July 22, 2026మరోవైపు, రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఉపనేత సాగరికా ఘోష్ రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. విద్యార్థులపై జరిగిన దాడులపై సభలో తక్షణమే చర్చ జరపాలని ఆమె కోరారు. అయితే, నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)పై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం సీఆర్పీఎఫ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి నేరాలకు మరింత కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. సవరణ బిల్లు ప్రకారం, వ్యక్తులకు కనిష్ఠ జైలు శిక్షను మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు, గరిష్ఠ శిక్షను పది సంవత్సరాలకు పెంచనున్నారు. గరిష్ఠ జరిమానాను రూ.50 లక్షలకు పెంచడంతో పాటు, సేవలందించే సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా, నిర్వాహకులకు కఠిన శిక్షలు, వ్యవస్థీకృత ప్రశ్నాపత్రాల లీకేజీ నేరాలకు మరింత కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు చేర్చారు. అలాగే కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.ఇక కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఇథనాల్ మిశ్రమ ఇంధనం (E20) కారణంగా వాహనాలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ ఈ నెల 31న ఢిల్లీలో మరో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. -
పవన్ కు బిగ్ షాక్.. Gen-Z తిరుగుబాటు.. జనసేనపై సోషల్ మీడియాలో వార్
-
భారత జెన్-జీకి పాక్, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే..
భారత జెన్-జీని తరచూ మొబైల్లో ఎక్కువ సమయం గడిపే తరం, ప్రతి విషయాన్నీ మీమ్స్గా మార్చే తరం, తీవ్రమైన అంశాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టని తరంగా భావించేవారు. కానీ గత నెల రోజులుగా అదే బలహీనతలు వారి అతిపెద్ద బలంగా మారాయి. వరుసగా సాగిన విద్యార్థి ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో సంప్రదాయ రాజకీయ ప్రకటనల స్థానంలో మీమ్స్ వచ్చాయి. ఇన్స్టా రీల్స్ ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి.ఈ ఉద్యమం ఇప్పుడు భారత్కే పరిమితం కాలేదు. పొరుగు దేశాల్లో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. జెన్-జీ దృష్టి త్వరగా మళ్లిపోతుందని సాధారణంగా చెబుతుంటారు. కానీ భారత్లో జరిగిన ఈ ఉద్యమం శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ యువత దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ దేశాల్లో గతంలో కూడా యువజన ఉద్యమాలు జరిగాయి. అందువల్ల భారత్లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై అక్కడ ప్రత్యేక ఆసక్తి కనిపించింది.దీనిపై పాకిస్థాన్ యువతి ఒకరు మాట్లాడుతూ.. "ఇలా చేస్తుంటే ప్రేమలో పడిపోతానేమో... మీరు ఇంత బాగా చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను?" అని అన్నారు. భారత జెన్-జీ చూపించిన ధైర్యం, ఐక్యత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. సరిహద్దులు వేరు కావచ్చు. కానీ ఈ తరం ఆలోచనలు, ఉత్సాహం ఒక్కటేనని చెప్పారు. పాకిస్థాన్కు చెందిన పలువురు యువకులు అవకాశం వస్తే తామూ భారత విద్యార్థుల్లాగే వీధుల్లోకి వచ్చేవాళ్లమని అన్నారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. "కాక్రోచ్ జనతా పార్టీ చాలా కూల్గా ఉంది. వారు అవసరానికి మించి సీరియస్గా ఉండరు. అదే నాకు నచ్చింది. జెన్-జీకి సాటి ఎవరూ లేరు" అని చెప్పాడు.ఒక ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయేవాళ్లం ముంబైలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా అతను ప్రస్తావించాడు. అందులో పోలీసులు విద్యార్థులను వాహనంలో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి ఎవరో నిశ్శబ్దంగా తాళం తీసేయడంతో విద్యార్థులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరో పాకిస్థాన్ యువకుడు మాట్లాడుతూ.. భారత విద్యార్థులు మతం, కులానికి అతీతంగా ఐక్యంగా నిలిచారని, కానీ పాకిస్థాన్లో ప్రజలు పంజాబీ-పష్తూన్, సున్నీ-షియా వంటి విభజనల్లో ఉన్నారని అన్నాడు."అదే భారత్ జెన్-జెడ్ అతిపెద్ద బలం. పాకిస్థాన్ జెన్-జీ అంత సులభంగా ఒక్కటవుతుందని నాకు అనిపించడం లేదు." భారత్ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్ కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "మా దేశాన్ని నడపడానికే మా దేశం వద్ద డబ్బు లేదు. భారత ఉద్యమానికి ఎలా నిధులు ఇస్తాం?" అని అన్నాడు.బిలాల్ హసన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘‘భారత్లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ పాకిస్థాన్లో చాలా సందర్భాల్లో ప్రజలను నేరుగా తీసుకెళ్లి అదృశ్యం చేస్తారు’’ అని చెప్పారు. పాకిస్థాన్లో చాలామందిని "ఒక ప్లేట్ బిర్యానీ"కే కొనుగోలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.శ్రీలంక యువతపై ప్రభావంభారత విద్యార్థి ఉద్యమం శ్రీలంక యువతపై కూడా ప్రభావం చూపింది. 2022లో శ్రీలంక యువత ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత రాజపక్స ప్రభుత్వం అధికారాన్ని వీడింది. ఇప్పుడు శ్రీలంకలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై కార్టూన్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా వచ్చాయి. ప్రముఖ కార్టూనిస్ట్ అవంతా ఆర్టిగాలా పంచుకున్న వ్యంగ్య చిత్రంలో ప్రభుత్వం "బొద్దింకలను" అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, భారత్ ఇళ్లలో వాడే "లక్ష్మణ రేఖ" కూడా వాటిని ఆపలేకపోయినట్టు చూపించారు.భారత్ ఉద్యమంలో ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం ముంబైకి చెందిన రియా అహీర్ పోలీసు వాహనం ముందు చేతులు చాపి నిలిచిన ఫొటో. చాలామంది దీన్ని 1989 తియానన్మెన్ స్క్వేర్లోని ప్రసిద్ధ "ట్యాంక్ మ్యాన్" చిత్రంతో పోల్చారు. శ్రీలంక లా కాలేజీ విద్యార్థిని స్వస్థిక అరులింగం ఫేస్బుక్లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ "వైబింగ్ ఎట్ అనదర్ లెవల్" అని రాశారు. 2022 శ్రీలంక ఉద్యమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బువాంకా పెరేరా ఇన్స్టాగ్రామ్లో భారత యువతకు సందేశం పంపారు."శ్రీలంక నుంచి ప్రారంభమై ఆసియా అంతటా వ్యాపించిన యువజన ఉద్యమాల జ్వాల భారత్ను చాలాకాలం తాకలేదనిపించింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం, దేశ వ్యవస్థాపకులు కలలు కన్న భారత్ కోసం భారత యువత పోరాడుతుండటం చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. నేపాల్ యువత మద్దతునేపాల్లో కూడా భారత్ జెన్-జీ ఉద్యమంపై సానుకూల స్పందనలు వచ్చాయి. కాఠ్మాండూ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా మాట్లాడుతూ.. భారత విద్యార్థుల ఆగ్రహం పూర్తిగా సమంజసమని, దాన్ని అతిగా స్పందించారని చెప్పలేమన్నారు. "వీధుల్లో విద్యార్థులను చూసినప్పుడు నా మనసు అప్పుడూ బాధపడింది. ఇప్పుడూ బాధపడుతోంది" అని చెప్పారు. 2025లో నేపాల్ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అది కూడా యువత శక్తికి ఉదాహరణగా నిలిచి చివరకు కేపీ ఓలీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసిందని అన్నారు.జెన్-జీ నుంచి ప్రపంచం నేర్చుకుంటోంది..ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం తొలిసారి భారత్ జెన్-జీ మీమ్స్, నినాదాలు, వైరల్ వీడియోలను చూసి నవ్వడమే కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా ప్రారంభించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన స్పందనలు చూస్తే, భారత్ విద్యార్థి ఉద్యమం సరిహద్దులు దాటి యువతకు స్ఫూర్తిగా మారిందని తెలుస్తోంది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్కు చెందిన పలువురు యువకులు భారత విద్యార్థుల ఐక్యత, ధైర్యం, సృజనాత్మక నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమానికి కొత్త ఆదర్శంగా అభివర్ణించారు. -
మీమ్ నుంచి మహా ఉద్యమంగా..
-
బోసిపోయిన జంతర్ మంతర్
-
'నో చెప్పలేం'.. రాజకీయ ఎంట్రీపై కాక్రోచ్ జనతా పార్టీ బిగ్ హింట్!
ఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్-యూజీ పేపర్ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఈ చారిత్రాత్మక విజయం అనంతరం..ఓ జాతీయ మీడియా సంస్థ ..‘సీజేపీ ప్రతినిధుల్ని మరి మీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా?’..అని అడగ్గా.. భారత్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి దేనినైనా పూర్తిగా కొట్టిపారేయలేం’ అంటూ సీజేపీ నాయకత్వం తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే బలమైన హింట్ ఇచ్చింది.ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించిన వెంటనే జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తమ ఉద్యమ భవిష్యత్తు గురించి, అలాగే తమ బృందం భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందా అనే అంశాలపై మాట్లాడారు.ఇప్పుడు నా మనసులో ఉన్న ఏకైక ఆలోచన ఇంటికి వెళ్లి నిద్రపోవడం, కాస్త విశ్రాంతి తీసుకోవడం,నా కుటుంబాన్ని కలవడం మాత్రమే. గత కొన్ని నెలలుగా నేను ఇంటికి దూరంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటూ గత రెండు నెలల్లో జరిగిన పరిణామాల గురించి ఆలోచించుకోవాలని అనుకుంటున్నాను. ఇదంతా మా అందరికీ ఒక పెద్ద అనుభూతిని కలిగించే విషయం. ఇది గర్వపడాల్సిన సమయం. ఊరట పొందే సమయం ఇది. ఆ తర్వాత, పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం’ అని రంకా చెప్పారు.ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేస్తున్నారా అని అడిగినప్పుడు ‘భారత్లో దేనికీ నో అని చెప్పకూడదనేదే నా అభిప్రాయం అని ఆయన బదులిచ్చారు. అయితే, రాజకీయాలు సీజేపీ బృందం తక్షణ లక్ష్యం కాదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.ప్రస్తుతం మా దృష్టి చాలా స్పష్టంగా ఉంది. ఈ ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే 750-800 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ వాటిలో ఏదీ యువత ఆకాంక్షలను నెరవేర్చ లేకపోతోంది. అధికారంలో ఏ పార్టీ లేదా నాయకుడు ఉన్నా సరే వారు యువత కోసం పనిచేసేలా వారి డిమాండ్లను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అదే మా ప్రస్తుత అజెండా’ అని దాస్ చెప్పారు. -
కాక్రోచ్ గెలిచింది... పదవి నుంచి తప్పుకున్న ధర్మేంద్ర ప్రధాన్
-
'కాక్రోచ్' గెలిచింది
న్యూఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరూపించింది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతరాన్ని ఉద్యమం వైపు మళ్లించి అనుకున్నది సాధించింది. సీజేపీ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. గత పది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల కలత చెందానని ఆయన చెప్పారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నానని స్పష్టంచేశారు. ఇప్పటి పరిస్థితిని దేశ విద్రోహ శక్తులు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వొద్దన్న కారణంతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యువతకు ప్రధాన్ లేఖ రాశారు. ఢిల్లీలో పరిణామాలు శనివారం చకచకా జరిగిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. కేంద్రం, సీజేపీ చర్చలు సఫలం మరోవైపు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. సీజేపీ లేవనెత్తిన మరో రెండు కీలక డిమాండ్ల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, నిరసనకారులపై కేసులు కొట్టివేయాలని సీజేపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వం అందుకు అంగీకారం తెలియజేసింది. మొత్తానికి మూడు కీలకమైన డిమాండ్లు నెరవేరడంతో కాక్రోచ్ జనతా పారీ్టలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. ఆశించిన లక్ష్యం నెరవేరడంతో.. 49 రోజులుగా సాగుతున్న పోరాటాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిరసన ప్రదేశాల నుంచి అందరూ శాంతియుతంగా వైదొలగాలని ఆ పార్టీ నేత సౌరవ్ దాస్ కోరారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నడ్డా వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని తెలిపారు. అయితే, ఎంత ఇస్తారన్నది ఆయన పేర్కొనలేదు. శనివారం జంతర్మంతర్ వద్ద విద్యార్థుల సంబరాలు జంతర్మంతర్ వద్ద సంబరాల హోరు కేంద్ర మంత్రి రాజీనామా చేసిన సంగతి తెలియడంతో జంతర్మంతర్ వద్ద శనివారం పండుగ వాతావరణం నెలకొంది. నిరసనకారులు త్రివర్ణ పతాకాలు చేతబూని, కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ‘చక్ దే ఇండియా’వంటి పాటలు వినిపిస్తుండగా, వారు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది. చాలామంది డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలను, పోస్టర్లను ప్రదర్శించారు. మంత్రి రాజీనామాను తమ పోరాటానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జంతర్మంతర్ వద్ద జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనుకున్నది చేసి చూపించామని చెప్పారు. భయపడకపోతే గెలవవచ్చనడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామే నిదర్శనమని స్పష్టంచేశారు. సోనమ్ వాంగ్చుక్ సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. శాంతి, సహనం, పట్టుదలకు దక్కిన విజయం అని తేల్చిచెప్పారు. సీజేపీకి, దేశంలోని జెన్ జెడ్కి అభినందనలు తెలియజేశారు. అవినీతికి ప్రతీక ప్రధాన్ ప్రధాని మోదీ మొండితనం ఓడిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ‘విక్టరీ ఆఫ్ ట్రూత్’గా అభివర్ణించారు. ‘‘యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. లాఠీలు, పెల్లెట్ గన్లతో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’అని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన.. ప్రభుత్వాన్ని ఎవరూ తమ సొంత జాగీరులా నడపలేమని బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి హెచ్చరిక జారీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక అని అని మండిపడ్డారు. ఆయన వెళ్లిపోవడం మంచిదేనని చెప్పారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై జరిగిన అకృత్యాలకు గాను ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప విజయం, దేశ ప్రజలందరికీ అభినందనలు’’అని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
‘సంపూర్ణ క్రాంతి’ సైరన్!
‘‘పదండి ముందుకు, పదండి తోసుకు – ప్రభంజనం వలె హోరెత్తండి’’... శ్రీశ్రీ కవితావేశానికి దృశ్యరూపంలా కనిపించింది ‘కాక్రోచ్’ల కదనోత్సాహం. ఎండుగడ్డి మైదానంలో నిప్పు రవ్వలా నిద్రాణమైన జన చేతనను రగిలించగలిగింది. 1974లో స్వాతంత్య్ర సమరయోధుడు జేపీ నాయకత్వంలో నడిచిన ‘సంపూర్ణ క్రాంతి (టోటల్ రివోల్యూషన్) ఛాయలు ఈ ఉద్య మంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. నిరంకుశ పాలన వైపు అడుగులేస్తున్న అధికార కూటమికీ, పక్షవాతం సోకిన ప్రధాన ప్రతిపక్షానికీ కాక్రోచ్ ఉద్యమం గట్టి సవాల్నే విసిరింది. ఉద్యమ స్వభావాన్ని, దాని గమనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమయంలోనే గుర్తించగలిగారు. ఫలితంగా శనివారం మధ్యాహ్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయనే వ్యక్తిగతంగానే తీసుకున్నారని జాతీయ మీడియాకు లీకులందాయి. బహుశా ఆయన ప్రతిష్ఠను నిలబెట్టడం కోసం వీటిని ప్రసారం చేసి ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల విజయాల కీలక పాత్రధారుల్లో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒకరు. ఆయన గౌరవాన్ని కాపాడటం పార్టీ బాధ్యత కూడా. సంపూర్ణ క్రాంతి ఉద్యమం మాదిరిగా దేశ వ్యాప్తంగా విస్తరించే లక్షణాలను కాక్రోచ్ ఉద్యమంలో గుర్తించి నందువల్ల దీనికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టాలని ప్రధాని భావించి నట్టు సమాచారం.ధరేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను తొలి దశలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి నిర్ణయాలను మార్చుకునే లక్షణం పన్నేండేళ్ల పాలనా కాలంలో ఎన్డీఏకు ఎప్పుడూ లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా పంజాబ్ రైతులు చేసిన చరిత్రాత్మక పోరాటంపై స్పందించడానికి మోదీ సర్కార్ సుదీర్ఘ సమయాన్ని తీసు కున్నది. అంతర్జాతీయ క్రీడా యవనికపై దేశ ప్రతిష్ఠను ఇనుమ డింపజేసిన మహిళా మల్లయోధుల ఆక్రందన అరణ్యరోదనగా మారింది తప్ప ఎన్డీఏ సర్కార్ చలించలేదు. పౌరసత్వ చట్టం దగ్గర నుంచి అనేకానేక అంశాల్లో కేంద్రం ప్రజా ఉద్యమాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘కాక్రోచ్’ల పార్లమెంట్ ముట్టడి జరిగిన మూడు రోజుల్లోనే ప్రధానమంత్రి రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలను చేపట్టారు.ఈ నెల 23న ఆందోళనపై తొలిసారిగా ఆయన నోరు విప్పారు. పేపర్ లీకేజీ ఘటనల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్టు అర్ధరాత్రి ట్వీట్ చేశారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవితవ్యం కంటే ఇంకేదీ ముఖ్యం కాదని కూడా అందులో పేర్కొన్నారు. 24న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇటువంటి నేరాలకు సంబంధించి చట్టానికి మరింత పదును పెడుతూ తీర్మానించారు. సీజేపీ ప్రతినిధులు పెట్టిన గడువు లోపల 25 మధ్యాహ్నం మంత్రి రాజీనామా నిర్ణయం వెలువడింది. ఈ మూడు రోజులుగా కేంద్రమంత్రులు సీజేపీ ప్రతి నిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సీజేపీ పెట్టిన డిమాండ్లలో మంత్రి రాజీనామా ముఖ్యమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం, ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయడం మిగిలిన రెండు డిమాండ్లు. వీటిని కూడా కేంద్రం అంగీకరించినట్టు సమాచారం.విద్యార్థులపై జరిగిన పాశవిక లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా సీజేపీ డిమాండ్ చేసింది. మంత్రి రాజీనామాతో యువజనోద్యమం ముగిసిపోలేదనీ, విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగేవరకూ కొనసాగు తుందనీ కాక్రోచ్ ప్రతినిధులు విజయోత్సవం సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నా, దీక్షా కార్యక్రమాల విరమణపై నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కంటే ఎక్కువగా అప్రదిష్ట మూటకట్టుకున్నది గోదీ (పెంపుడు) మీడియా.ఏన్డీఏ కూటమిలో అప్రకటిత భాగస్వాములుగా పెంపుడు మీడియా, యెల్లో మీడియా వగైరాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూలై 20న జరిగిన కాక్రోచ్ల పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పెంపుడు మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువజనం తరలి వస్తారని అది ఊహించలేకపోయింది. పోలీసు దమనకాండకు ఎదురొడ్డి నిలబడతారని కూడా అంచనా వేయలేకపోయింది. ఈ ఉలికి పాటు నుంచి తెప్పరిల్లిన తర్వాత సన్నాయి నొక్కులు ప్రారంభించింది. తరలివచ్చిన ఝంఝూమారుత యువ కెరటాలను ‘నీట్ పరీక్ష’ పరిధిల్లోనే బంధించడానికి తాపత్రయపడింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని ధర్మపన్నాగాలను వల్లె వేసింది. జవాబుదారీతనం ఒక కనీస ప్రజాస్వామిక ధర్మమనే విషయాన్ని విస్మరించి మంత్రి రాజీనామా డిమాండ్ను తప్పుపట్టింది. తాడూ బొంగరం లేని పార్టీ పిలుపునిస్తే ఇంత జనసందోహం పోగవడం వెనుకనున్న ‘అదృశ్య శక్తుల’ కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. మీడియా పక్షపాతాన్ని నిలదీసిన యువకులను అరాచక శక్తులుగా చిత్రించారు. నవతరం యువతుల ధైర్యసాహసాలకూ, మొహమాటమెరుగని ముక్కుసూటి తనానికీ వాట్సాప్ యూనివర్సిటీ పెడార్థాలు తీసింది.ఆన్లైన్లో మొదలైన కాక్రోచ్ పార్టీ పిలుపునిస్తే లక్షలాది మంది స్పందించడం పట్ల ప్రభుత్వం, పెంపుడు మీడియాలే కాదు, ప్రతిపక్షం కూడా అవాక్కయింది. పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే పాలక కూటమి అందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. యాభయ్యేళ్ల కింద దేశంలో సంపూర్ణ క్రాంతి ఉద్యమంనాటి పరిస్థితులే నేటి యువజనో ద్యమం పరిస్థితులు కూడా. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ ప్రతిష్ఠ పెరిగింది కానీ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సరకుల ధరలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలింది. రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంలో గతంతో పోలిస్తే అవినీతి ప్రబలింది. దీనికి తోడు ఎదురులేదన్న ధీమాతో అధికార పార్టీలో, అధినాయకత్వంలో నియంతృత్వ ధోరణులు ప్రబలాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా గుజరాత్ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనను బిహార్ అందిపుచ్చుకున్నది.అనంతరం జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో అది సంపూర్ణ క్రాంతి ఉద్యమంగా పరిణామం చెంది ఎమర్జెన్సీ విధింపునకు, తదనంతరం ఇందిరాగాంధీ ఓటమికి దారితీసింది. 1974 నాటి పరిస్థితులు మరింత దారుణంగా ఇప్పుడు పరిణమించాయి. విద్యారంగంలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ ప్రబలింది. ఈ ప్రైవేటీకరణ భూతంలేని ఆ రోజుల్లోనే సంపూర్ణ క్రాంతి డిమాండ్లలో అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే అంశం ప్రముఖంగా చోటుచేసుకున్నది. ఇప్పుడు దేశంలో మెజా రిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేని పరి స్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ స్కూళ్లను దిగజార్చుతున్నాయి. 2014 నుంచి నేటివరకు దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఒక కోటి పద్దెనిమిది లక్షలు తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో 88 లక్షల మంది పెరిగారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు పెట్టడం జాతీయ వార్తగా మారింది. వాస్తవాలు ఇలా వుంటే... ఇప్పుడు కొత్తగా లోకేశ్ సారథ్యంలో ప్రభుత్వ స్కూళ్లు నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నట్టు రంప చోడవరం సభలో చంద్రబాబు కళ్లార్పకుండా చెప్పేశారు. తల్లికి వందనం ఐడియా కూడా లోకేశ్దే నన్నట్టుగా ఆయన మాట్లా డారు. పెద్ద నాయకుడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అలా మాట్లాడితే ‘అతన్నెవరికైనా చూపించండర్రా’ అంటారు. జగన్ మోహన్రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం అనుమతులు తీసుకోకుండా 1,800 మెడికల్ సీట్లను ఏపీ విద్యార్థులకు దూరం చేసి వారి కలలను భగ్నం చేశారు. ఇలాంటి పరిస్థితులే కదా కాక్రోచ్ల పుట్టుకకు దారితీసేది!దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగం పరిస్థితి కూడా నిరాశా జనకంగానే ఉన్నది. యూజీసీ గ్రాంట్లకు భారీగా కత్తెర వేసి విశ్వవిద్యాలయాల నాణ్యతా ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు పెరిగాయి. అవి కాసుల కోసం పని చేస్తాయి తప్ప పరిశోధనల కోసం పాకులాడవు కదా! ఉన్నత విద్యారంగంలో కూడా ప్రమాణాలు గణనీయంగా పడిపోతు న్నాయి. లక్షల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. పట్టభద్రుల నిరు ద్యోగితా శాతం దేశంలో ముప్పయి శాతం దాటింది. నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో దూరం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో కొనలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యో గులుగా మిగిలిపోతున్నారు. విద్యారంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభంలో కోట్లాది మంది చిక్కుకొని పోయారు.సంక్షోభానికి మరోకోణం అవినీతి. రాష్ట్రాల వారీగా నిక్షేపంగా జరుగుతున్న మెడికల్ అడ్మిషన్ల విధానాన్ని ఉద్దరిస్తామని చెప్పి కేంద్రీకరించారు. వ్యవస్థాగత బలంలేని టెస్టింగ్ ఏజెన్సీకి ప్రతిష్ఠాత్మక సంస్థల అడ్మిషన్ల బాధ్యతను అప్పగించారు. ప్రైవేట్ సంస్థలకు కీలకమైన పనులను ఔట్ సోర్సింగ్ చేసే పద్ధతి వల్ల అవకతవకలకు రాచబాట ఏర్పడింది. ఫలితంగా లక్షలాది విద్యా ర్థుల కలలు కల్లలవుతున్నాయి. ఈ పూర్వరంగంలో ప్రధాన్ రాజీనామాతోనే ఈ సంక్షోభం తొలగిపోదు. సంపూర్ణ క్షాళన కోసం యువతరం ఉద్యమించడం అనివార్యం. ఇవాళ కాక పోయినా రేపైనా ఈ సంపూర్ణ క్రాంతిరథం కదలక తప్పదు.ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అవకతవకలపై ప్రతిపక్ష నేత అందజేసిన సాక్ష్యాలను యువతరం అందిపుచ్చుకోవలసి ఉన్నది. మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందకుండా చేసిన నిర్వాకంపై ఎలు గెత్తవలసి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం తోడుగా ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తీ ఏమార్చ లేదని ఈ పరిణామం రుజువు చేసింది. జెన్జీగా పిలుచుకుంటున్న నవతరం మొబైల్ ఫోన్లలో మునిగిపోయి స్తబ్ధుగా మారిపోయిందనే అభిప్రాయం శుద్ధ తప్పని తేలి పోయింది. అవసరం వస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారని రుజువైంది. కాక్రోచ్ ఆందోళనకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి దోహద పడిన సోనమ్ వాంగ్చుక్, ఒక సెటైర్ను వైల్డ్ ఫైర్గా మార్చగలిగిన అభిజిత్ దీప్కే, 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా సివంగిలా రణగర్జనలు చేసిన నేహా బోరా, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పోలీస్ వ్యాన్ ఎదురుగా నిలబడి అమరత్వానికి సిద్ధపడిన రియా అహిర్, వాటర్ కెనాన్లను గేలిచేస్తూ వాటికింద డ్యాన్సులు చేసిన బిహారీ విద్యార్థులు, తోడేళ్ల మంద ఎదుట తొడగొట్టినట్టు లాఠీచార్జీలను సవాల్ చేసిన యువతీ యువకులందరూ ఈ ఉద్యమంలో హీరోలే! రాబోయే సంపూర్ణ విప్లవానికి వేగుచుక్కలు వారే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ!
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సీజేపీ విధించిన 72 గంటల డెడ్లైన్, యువత నుంచి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత.. మోదీ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసింది.నిన్న శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో జరిగిన రెండో విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయితే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చిచెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకునేందుకు 72 గంటల గడువు ఇస్తున్నామని.. లేనిపక్షంలో జూలై 20 నాటి తరహాలో మరోసారి పార్లమెంట్ ముట్టడికి దిగుతామంటూ సీజేపీ హెచ్చరించింది.నడ్డా, జితేంద్ర సింగ్ తాము నాయకత్వాన్ని సంప్రదించి ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత తెలియజేస్తామని మాత్రమే బదులిచ్చారు. విఫలమైన చర్చల అనంతరం.. నడ్డా, జితేంద్ర సింగ్లు పరిణామాలపై హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి. తెరవెనుక చర్చలు జరుగుతుండగానే, నిరసనకారులకు గట్టి సంకేతం పంపే ప్రయత్నంగా విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన 47 మంది అధికారులను తొలగించింది.ఎన్టీఏ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని నియమించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం, పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం సహా పరీక్షా విధానంలో సంస్కరణలను కూడా కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చర్యలేవీ నిరసనకారులను సంతృప్తి పరచలేకపోయాయి.శనివారం మధ్యాహ్నం కేంద్రం సీజేపీతో చర్చల ముందు.. నడ్డా, జితేంద్ర సింగ్లు మళ్లీ అమిత్ షాను కలిశారు. అదే సమయంలో ప్రధాన్ తన రాజీనామాను ప్రధాని మోదీకి పంపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త ప్రసారం కావడం ప్రారంభమైన తర్వాతే నడ్డా, జితేంద్ర సింగ్.. సీజేపీ ప్రతినిధులను మళ్లీ కలిశారు. మూడో విడత చర్చలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరిగాయి.ఒక వైపు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు దేశవ్యాప్తంగా బలపడుతున్న యువత ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. ఈ కేవలం రాజకీయ ఆందోళన కాకుండా భవిష్యత్ తరానికి సంబంధించిన యువ ఉద్యమం కావడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం వెనుకాడింది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించారు. ప్రధాన్ నిష్క్రమణతో సీజేపీ పట్టువీడింది. తన ఆందోళనను విరమించింది.ఆందోళనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని.. నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నరేంద్ర మోదీ హయాంలో ప్రజా వ్యతిరేకతతో ఒక సీనియర్ మంత్రి పదవి కోల్పోవడం అత్యంత అరుదైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని చాలామందిని ఇది ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వరకు తమ సీనియర్ మంత్రుల్లో ఒకరిని వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఏమాత్రం లేవు. అయినప్పటికీ కేవలం 24 గంటల్లోపే ప్రధాన్ రాజీనామా చేశారు. ఆందోళనకారులతో ప్రభుత్వం మళ్లీ చర్చలు ప్రారంభించింది. చర్చలు సఫలం కావడంతో సీజేపీ తన నిరసనను ముగిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ సమయంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
కేంద్ర మంత్రులతో CJP సంచలన ప్రెస్ మీట్
-
ప్రియమైన బొద్దింకలారా కంగ్రాట్స్.. CJPకి ప్రకాష్ రాజ్ విషెస్
-
అభిజీత్ దీప్కే తల్లి అనిత భావోద్వేగభరిత కామెంట్స్
ముంబై: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తల్లి అనితా దీప్కే ఇంటి వద్ద స్వీట్లు పంచుకున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఇది మా జీవితంలో అద్భుతమైన రోజు. చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన నిజాయితీతో చేసిన కృషికి చివరకు ఫలితం దక్కింది. తాను పెట్టిన డిమాండ్ నెరవేరాల్సిందేనని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదే పట్టుదలతో చివరి వరకు పోరాడాడు. మొదట్లో మేము చాలా భయపడ్డాం. తల్లిదండ్రులుగా మాకు చాలా భయం వేసేది. జైపూర్లో అతనిని చెంపదెబ్బ కొట్టినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. ఆ రాత్రంతా మేము నిద్రపోలేకపోయాం. అతను తిరిగి వచ్చిన తర్వాత స్వీట్లు పంచి, అందరం కలిసి ఘనంగా సంబరాలు జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఈ విజయంతో చాలా ఆనందంగా ఉంది. పిల్లలంతా ఇప్పుడు విముక్తి పొందారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. చాలా, చాలా సంతోషంగా ఉంది. అభిజీత్ గురించి చాలా గర్వంగా ఉంది. అభిజీత్ చాలా మంచి పని చేశాడు. మధ్యలో అతనిపై దాడి చేసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఏమవుతుందో అని చాలా ఆందోళన పడ్డాను. అతనికి చెంపదెబ్బలు కొట్టినప్పుడు చాలా బాధగా అనిపించింది. జూన్ 7 నుంచి మా ఇంట్లో ప్రశాంతతే లేకుండా పోయింది. అందరం తీవ్ర ఆందోళనలోనే ఉన్నాం. నాకు టైఫాయిడ్ కూడా వచ్చింది. నా కుమారుడు చాలా గొప్ప పని చేశాడు. అతని వయసు కేవలం 29 సంవత్సరాలు. అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పని చేశాడు. అతని గురించి నాకు చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చెప్పాలనుకోవడం లేదు. ప్రభుత్వం విద్యార్థుల మాట విని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం. ఇప్పటివరకు అభిజీత్తో మాట్లాడలేదు. ఫోన్ చేస్తూనే ఉన్నాం కానీ కలవలేదు. తర్వాత టీవీ ఆన్ చేశాం. ఈ రోజంతా టీవీలో అతని గురించే చూస్తున్నాం. నా బిడ్డ ఈ రోజు ఇంత పెద్ద పని చేశాడనే గర్వం కలిగింది. అందరూ చాలా టెన్షన్లో ఉన్నారు. కానీ ఒక యువకుడు ఇంత పెద్ద పని చేసి చూపించాడు. చాలామంది అతడిని ప్రశంసిస్తున్నారు. ఈ రోజు అతడు ఇంటికి రాడు. ఇంకా చికిత్స కొనసాగుతోంది. ఎలా ఉంటుందో తెలియదు. రేపు వెళ్లి అభిజీత్ను తీసుకురావాలని అనుకుంటున్నాం. పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం’’ అని తెలిపారు. -
ఆందోళన విరమించిన సీజేపీ
ఢిల్లీ: కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్మంతర్ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు.ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందన్న సీజేపీ.. ఆందోళన విరమించాలని నిర్ణయించింది. జంతర్మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్న సీజేపీ.. నాలుగు వారాల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. సీజేపీ 3 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ఒప్పుకుంది. త్వరలోనే పరిహారం కూడా చెల్లిస్తామని వెల్లడించింది.వాంగ్చుక్ మాట్లాడుతూ.. నవభారత్కు ఇదొక శుభపరిణామంగా అభివర్ణించారు. యువతకు అభినందనలు తెలిపిన ఆయన.. విద్యారంగంలో సమూల మార్పులు రావాలన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని వాంగ్చుక్ కోరారు. -
2018 తర్వాత, ఇలా రిజైన్ చేసిన తొలి కేంద్ర మంత్రి ఈయనే
సాక్షి,న్యూఢిల్లీ: సీజేపీ ఆందోళనల నేపథ్యంలోఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీమానా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించారు. అలాగే తన లేఖ కాపీని మంత్రి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ధర్మేంద్ర రాజీనామాకు దారితీసిన పరిస్థితులతో పాటు, 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలతో అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీనామా అంశం ఇపుడు నెట్టింట హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు దేశ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లకుండా చూడటం, జాతీయ ఐక్యతను కాపాడటం తన బాధ్యత. భారతీయ విద్యార్థుల భవిష్యత్తు సుదీర్ఘ న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు ప్రశాంతంగా తమ చదువులపై, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించాను అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయాంలో ఒక మంత్రి ప్రజల లేదా విపక్షాల నిరసనల కారణంగా రాజీనామా చేయడం అత్యంత అరుదైన పరిణామం. గత చరిత్రను పరిశీలిస్తే, 2018 తరువాత అప్పటి కేంద్ర సహాయ మంత్రి ఎమ్జే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు? 2018 ఎమ్జే అక్బర్మోదీ హయాంలో వివాదాలు ఎదురైనప్పటికీ మంత్రులు రాజీనామా చేయరని, ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే #MeToo ఉద్యమంలో పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలతో 2018లో కేంద్ర సహాయమంత్రిగా ఎమ్జే అక్బర్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన అక్బర్, "ఆరోపణలు వైరల్ ఫీవర్లా మారాయి" అని వ్యాఖ్యానించారు. అయితే, వ్యక్తిగత హోదాలో కోర్టులో న్యాయపోరాటం చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి, పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం జరుగుతున్న పోరాటానికి ఒక మైలురాయిగా నిలిచింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP), విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలకు ఈ రాజీనామా ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. -
నీట్ బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
-
GEN- Z కేంద్రంకు మా సత్తా ఏంటో చూపించాం..!
-
GEN-Z సంబరాలు ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి..
-
రాజీనామా డిమాండపై భిన్నాభిప్రాయాలు.. బీజేపీకి ఉన్న సమస్య ఏంటి? మాట జారడమే ముంచేసిందా
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్ చుక్ రియాక్షన్
-
ప్రజా ఉద్యమాలకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వాలు
ప్రజా ఉద్యమాలు.. ప్రభుత్వాల నిర్ణయాలను మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన జన్ లోక్పాల్ ఉద్యమం నుంచి, నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఏడాదికిపైగా సాగిన చారిత్రాత్మక పోరాటం వరకు.. ప్రజల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. తాజాగా.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతున్న నిరసనలు మరోసారి ప్రజా ఉద్యమాల శక్తిపై చర్చకు తెరలేపుతున్నాయి.👉2011లో అన్నా హజారే చేపట్టిన ఉద్యమం జన్ లోక్ పాల్ బిల్లు అవినీతి వ్యతిరేక పోరాట చేశారు. రామ్ లీలా మైదానంలో 13 రోజుల పాటు నిరవధిక నిరహార దీక్ష చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తలొగ్గి జన్ లోక్ పాల్ బిల్లు తీసుకోచ్చింది.👉2012 డిసెంబర్ 15 ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక ఆత్యాచార ఘటన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా ఆందోళన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి నిర్భయ చట్టాన్ని తీసుకోచ్చింది👉కేంద్ర ప్రభుత్వం 2020లో తెచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఏడాది పాటు సాగిన ఈ చారిత్రాత్మక పోరాటానికి తలొగ్గి, నవంబర్ 2021లో కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను అధికారికంగా రద్దు చేసింది.👉నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యావ్యవస్థలో పారదర్శకత, బాధ్యత కోరుతూ జంతర్ మంతర్ వేదికగా నిరసనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తలొగ్గడంతో చివరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది. -
అంబేద్కర్ ఫోటో ఫ్రేమ్ తో CP లీడర్స్ సంబరాలు
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత అభిజిత్ ఫస్ట్ రియాక్షన్
-
ఇది రా GEN-Z పవర్.. అనుకున్నది సాధించిన CJP.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
CJP సంబరాలు.. మా యుద్ధం ఇంకా పూర్తికాలేదు..!
-
సీజేపీ ప్రభంజనం ఇలా మొదలైంది.. ఇది ఇక ఆగదు
వ్యంగ్యంగా పుట్టింది... విప్లవంగా మారింది. ఒక పోస్టుతో మొదలైన ఉద్యమం లక్షలాది యువత గొంతుకగా నిలిచింది. జంతర్ మంతర్ నుంచి దేశమంతా ప్రతిఘటన జ్వాలలు రగిలించి, అధికారాన్ని ప్రశ్నించే యువశక్తికి ప్రతీకగా ఎదిగింది. కాక్రోచ్ జనతా పార్టీ... యువత ఆగ్రహాన్ని జాతీయ ఉద్యమంగా మలిచిన విప్లవ చరిత్రగా నిలిచింది.‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఈ వ్యాఖ్య సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఆ వ్యాఖ్య వల్లే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకొచ్చింది. సుప్రీంకోర్టులో మే 15న సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి బెంచ్ జరిపిన విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ ఆ వ్యాఖ్యల ప్రభావం ఏ మాత్రమూ తగ్గలేదు. అప్పట్లో తన వ్యాఖ్యల గురించి సూర్యకాంత్ మాట్లాడుతూ... మీడియా తన వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసిందని తెలిపారు. తాను నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చలేదని, నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియా వంటి వాటిలోకి వచ్చిన వారిని తప్పుబట్టానని చెప్పారు. ఓ పనికిమాలిన కేసులో విచారణ జరుపుతున్న సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని ఆయన తెలిపారు. వృత్తిలో... ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అటువంటివారే సోషల్ మీడియా, ఆర్టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని తెలిపారు తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని సూర్యకాంత్ పలుసార్లు తెలిపినప్పటికీ ఆయన కామెంట్లను యువత సీరియస్గా తీసుకుంది.‘‘బొద్దింకలు’’ కామెంట్లతో కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకే విచిత్రంగా జరిగింది. ఇది సాంప్రదాయ రాజకీయ పార్టీ కాదు. ఇది వ్యంగ్య (సటైరికల్) ఉద్యమంగా ప్రారంభమై, తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమానికి ప్రతీకగా మారింది. దీని ఆవిర్భావం, పరిణామం, ప్రభావం ఇలా ఉన్నాయి. 2026లో వరుసగా వెలుగులోకి వచ్చిన నీట్ ప్రశ్నపత్రం లీకులు, పరీక్షల నిర్వహణపై ఆరోపణలు, నిరుద్యోగ యువతలో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో కొందరు యువ కార్యకర్తలు, సామాజిక మాధ్యమాల సృష్టికర్తలు కలిసి ఒక వ్యంగ్య రాజకీయ వేదికను ప్రారంభించారు.ప్రజలు రాజకీయ పార్టీలపై నమ్మకం కోల్పోయారని, అవినీతి వ్యవస్థను ఎద్దేవా చేయాలనే ఉద్దేశంతో "కాక్రోచ్ జనతా పార్టీ" అనే పేరు పెట్టారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత అణచివేత జరిగినా ఉద్యమం ఆగదనే సంకేతంగా కాక్రోచ్ అనే పేరును పెట్టారు.సీజేపీని ఎవరు ప్రారంభించారు? సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే. ఆయన 30 ఏళ్ల రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహకర్త. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో చదువుతున్న సమయంలోనే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2026 మే 16న ఆయన ఎక్స్లో కేవలం ఆరు పదాలతో ఒక పోస్టు చేశారు. "What if all cockroaches come together?" ("బొద్దింకలంతా ఒక్కటైతే?") ఆ పోస్టు కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. అదే సీజేపీ ఉద్యమానికి బీజం వేసింది.ఆ తర్వాత ఏం జరిగింది?ఢిల్లీకి చెందిన యూట్యూబర్ మేఘనాథ్ ఎస్ ఆ పోస్టును చూసి, మరో స్నేహితుడితో కలిసి కృత్రిమ మేధ సాయంతో "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో ఒక వ్యంగ్య వెబ్సైట్ రూపొందించారు. అది లక్షలాది మంది యువతకు ఒక వేదికగా మారింది.ఎక్స్ ఖాతాలో ఎంతమంది చేరారు?ప్రారంభ రోజుల్లోనే సీజేపీ ఎక్స్ ఖాతాకు మిలియన్ల మందికి పైగా చేరారు. అనంతరం ప్రభుత్వ చర్యలతో ఆ ఖాతాను భారత్లో నిలిపివేశారు. ఇన్స్టాగ్రామ్లో అయితే మరింత భారీ స్పందన వచ్చింది. కొన్ని రోజుల్లోనే 22 మిలియన్ మంది అనుచరులు చేరారు. ఆ తర్వాత అది 25 మిలియన్లకు పెరిగింది.ఉద్యమంలో ప్రముఖంగా కనిపించిన వ్యక్తులు..అభిజీత్ దిప్కే – వ్యవస్థాపకుడు, జాతీయ కన్వీనర్.సోనం వాంగ్చుక్ – ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేసిన పర్యావరణ ఉద్యమకారుడు.మేఘనాథ్ ఎస్ – ఉద్యమాన్ని ఆన్లైన్లో వ్యాపించడంలో కీలక పాత్ర పోషించిన యూట్యూబర్.నకుల్ ధుల్ – నిరసనలకు సంబంధించిన వీడియోలతో వైరల్ అయిన కంటెంట్ సృష్టికర్త.ఆయేషా ఖాన్ – ఉద్యమానికి మద్దతుగా ప్రచారం చేసిన యువ కార్యకర్త.మొదట సామాజిక మాధ్యమాల్లో చిన్న ప్రచారంగా మొదలైన సీజేపీ ఉద్యమం కొన్ని రోజుల్లోనే వేలాది మంది విద్యార్థులను ఆకర్షించింది. నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యార్థుల ఆత్మహత్యల సమస్యను సీజేపీ ఎత్తిచూపింది. దీనికి పరిష్కారం కోసం విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసన ప్రారంభించారు.వారి ప్రధాన డిమాండ్లుసీజేపీ తాజాగా డిమాండ్ల జాబితా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి (పూర్తైంది)ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి – పెండింగ్నిరసనల్లో పాల్గొన్న ఏ విద్యార్థిపైనా చర్యలు తీసుకోకూడదు – పెండింగ్ఆర్ఏఎఫ్, ఢిల్లీ పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి – పెండింగ్.ఉద్యమంలో కీలక పరిణామాలుజంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు చేరారు."చలో పార్లమెంట్" పిలుపుతో భారీ ర్యాలీ చేపట్టారు.ఢిల్లీ పోలీసులు పలుమార్లు నిరసనకారులను అడ్డుకున్నారు.లాఠీచార్జ్, వాటర్ కానన్ల ప్రయోగం జరిగింది.వందలాది మంది అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.కొన్ని సమయాల్లో మెట్రో స్టేషన్లు మూసివేశారు.కొన్ని సమయాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ప్రముఖుల మద్దతు దక్కిందిఉద్యమానికి ప్రముఖుల మద్దతు పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారుసామాజిక కార్యకర్త అన్నా హజారే మౌన ఆందోళన నిర్వహించారు.పలువురు ప్రతిపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు.దేశ విదేశాల్లోని విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.అంతర్జాతీయంగానూ స్పందన వచ్చిందిపాక్లోనూ ఇలా..భారత్లో జరుగుతున్న ఈ నిరసనలు పాకిస్థాన్ సహా పలు దేశాల్లో చర్చనీయాంశమయ్యాయి.పాకిస్థాన్కు చెందిన కొందరు పాత్రికేయులు, కంటెంట్ సృష్టికర్తలు భారత విద్యార్థుల ఉద్యమాన్ని ప్రశంసిస్తూ వీడియోలు విడుదల చేశారు."భారత్లో యువత ఇలా పోరాడుతోంది... మన దేశంలో ఎందుకు జరగడం లేదు?" అనే చర్చ పాకిస్థాన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.సీజేపీ ఏం సాధించింది? నీట్ ప్రశ్నపత్రం లీకుల అంశం జాతీయ చర్చగా మారింది.పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.విద్యా వ్యవస్థలో సంస్కరణలపై విస్తృత చర్చ జరిగింది.ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాయి.దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్యత పెరిగింది.విదేశీ మాధ్యమాలు కూడా ఈ ఉద్యమాన్ని ప్రస్తావించాయి.ఉద్యమం కోరిన అన్ని డిమాండ్లు నెరవేరాయిముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారుపరీక్షా సంస్కరణలు వంటి డిమాండ్లు నెరవేరుతున్నాయివిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చివరకు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ తొలి ప్రధాన డిమాండ్ నెరవేరింది. విద్యార్థుల ఉద్యమం దేశవ్యాప్తంగా ఒత్తిడి తీసుకురావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాజీనామాను తమ పోరాటానికి తొలి విజయంగా సీజేపీ ప్రకటించింది. మిగిలిన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది.సీజేపీ ఎందుకు ప్రత్యేకం?సాధారణ రాజకీయ పార్టీలా కాకుండా, వ్యంగ్యాన్ని ఆయుధంగా తీసుకుని యువతను పెద్ద ఎత్తున ఒక వేదికపైకి తీసుకురావడం సీజేపీ ప్రత్యేకత. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తూ, నిరసనలను సృజనాత్మకంగా నిర్వహించడం వల్ల ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో కూడా దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి ఉద్యమాలకు సాధారణంగానే అంతు అనేది ఉండదు. -
Big Breaking : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
-
వీడియోలు కాదు, యాక్షన్ కావాలి : రాహుల్ గాంధీ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై దేశ రాజదాని నగరం న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ,విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విడుదల చేస్తున్న వీడియోలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీడియోలు కాదు, విద్యార్థులపై కోరుతున్న డిమాండ్లపై చర్యలు కావాలి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దాడికి గురైన విద్యార్థులకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.23 రోజులుగా నిరాహార దీక్ష చేసిన విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థ అవినీతికి ప్రతీక అని విమర్శించారు. ఆయనను వేరే శాఖకు మార్చడం కాకుండా, ప్రభుత్వం నుంచే పూర్తిగా తొలగించాలని (మంత్రివర్గం నుండి తీసేయాలని) విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.మోదీ రాత్రివేళల్లో చేసే వీడియో సందేశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులకు ప్రధాని హామీలు, వీడియోలు వద్దని, తక్షణ చర్యలే కావాలని స్పష్టం చేశారు.मोदी जी, करोड़ों छात्रों का भविष्य बर्बाद करने के बाद अब आधी रात की Reel से उनका वक़्त बर्बाद मत कीजिए।प्रधान बर्ख़ास्त। दोषियों पर कार्रवाई। छात्रों से माफ़ी।इससे कम कुछ भी मंज़ूर नहीं। pic.twitter.com/RWrLLDD0WC— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 అలాగే ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ ప్రయోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన ఒక విద్యార్థిని చూపిస్తూ... విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులే ఈ దేశపు భవిష్యత్తు అని మోదీ దేశానికి గతం అని గతం ఎన్నటికీ భవిష్యత్తును ఓడించలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా AISA ప్రతినిధి నేహా బోరా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో విద్యా వ్యవస్థపై చర్చలు జరిపినట్లు తెలిపారు. కాగా నీట్ 2026 పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి మోదీ గురువారం అర్ధరాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సీజేపీ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. ఆయన రాజీనామాతో సీజేపీ పోరాటం ఫలించింది. సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశా. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు.‘‘భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు.. వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం...జంతర్-మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించాను...నరేంద్ర మోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.pic.twitter.com/VSArqS98OJ— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026 -
ఢిల్లీ షట్ డౌన్..! ఇంటర్నెట్ కట్... మెట్రో స్టేషన్లు క్లోజ్
-
సీజేపీ ఆందోళన ఎఫెక్ట్.. మెట్రోస్టేషన్లుక్లోజ్.. నెట్ కట్
-
నీట్ సెగ.. ధర్మేంద్ర ప్రధాన్పై కీలక నిర్ణయం?
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం వరుస చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో మార్పులు, ఉన్నతాధికారుల బదిలీలు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. నిరసనలు మాత్రం తగ్గడం లేదు. కీలకమైన మూడు డిమాండ్లలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానేనని అటు విద్యార్థి సంఘాలు.. నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటేనే తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదని సమాచారం. ఇదే ప్రధాన ఎజెండాగా నిన్న కేబినెట్ భేటీలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వివాదం నేపథ్యంలో ఆయన్ని మరో శాఖకు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా శాఖ మార్పును పరిశీలిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ ఉదయం ప్రెస్మీట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. నీట్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించిన ఆయన.. మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు ఆయనను కేబినెట్ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పైగా ఈ వ్యవహారంపై తనకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు చేయడంతో లాభం లేదని.. మంత్రిని తొలగించి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.#WATCH | LoP, Lok Sabha, Rahul Gandhi says, "...Students have three demands, and these are not negotiable demands... The first demand is that the Education Minister, who is corrupt, incompetent, and misaligned, has to be sacked... There's some talk going on in Mr. Modi's cabinet… pic.twitter.com/hKoXOQ4SSz— ANI (@ANI) July 25, 2026మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ వివాదం నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఏలోని 47 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ వివాదం వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించింది.అయితే ఈ చర్యలు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం సరిపోదని, రాజకీయ బాధ్యత కూడా ఉండాలని సీజేపీ, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్పై మాత్రం విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు జరుగుతుందా? లేదంటే ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విద్యార్థులు రాజీనామా డిమాండ్పై పట్టుబడుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నీట్ వివాదం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
కాక్రోచ్ దెబ్బకు బీజేపీ డౌన్! ఉద్యమంపై పవన్ కామెంట్స్ రగడ
-
ఎన్డీయే మంత్రి కూతురు.. కేంద్రంపై నిరసన స్వరం
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతుండగా.. తాజాగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.అస్సాం రెవెన్యూ మంత్రి కేశబ్ మహంతా కుమార్తె దిబిసా మహంతా గువాహటిలో జరిగిన విద్యార్థుల నిరసనలో పాల్గొందంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాచల్ ప్రాంతంలో గురువారం నిర్వహించిన ఈ ఆందోళనలో ఆమె విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.దిబిసా మహంతా నిరసనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసోం గణ పరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా.. బీజేపీ నేతృత్వంలోని అసోం ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. మిత్రపక్ష ప్రభుత్వంలో భాగమైన సీనియర్ నేత కుమార్తె.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై డిమాండ్లతో జరుగుతున్న నిరసనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కూతురి నిరసనపై తండ్రి స్పందించాల్సి ఉంది. అయితే ఢిల్లీలో కొనసాగుతున్న నీట్ నిరసనలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం తాజాగా స్పందించారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, వారి డిమాండ్లు, వాదనలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం అసోం వరదలతో తీవ్రంగా ప్రభావితమైందని, ప్రకృతి విపత్తుపై కూడా అందరూ దృష్టి పెట్టాలని కోరారు.ఇదిలా ఉండగా, నీట్ నిరసనలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు.. ఆందోళనలకు మద్దతుగా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నారు. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నీట్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో నిరసనకారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.#WATCH: Assam Cabinet Minister Keshab Mahanta's daughter, Dibisa Mahanta, was among those who joined the CJP protest in Guwahati, where demonstrators demanded education reforms and the resignation of Union Education Minister Dharmendra Pradhan.#Assam #CJPProtest… pic.twitter.com/CJP2hjZFIc— Northeast Now (@NENowNews) July 24, 2026 -
జంతర్మంతర్లో ఇన్ఫెక్షన్ల కలకలం.. తల్లడిల్లిపోతున్న విద్యార్థులు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్మంతర్లో నీట్-యూజీ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న ఆందోళనకారుల ఆరోగ్యం క్షీణిస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత, వర్షం, రద్దీతో కూడిన వాతావరణంలో ఆందోళన కొనసాగిస్తుండటంతో పలువురు విద్యార్థులలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, గొంతు నొప్పి, తల నొప్పి, గాయాలతో తల్లడిల్లిపోతూ వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వాలంటీర్ వైద్యులు తెలిపారు.నిరసనకారులు రోజంతా బహిరంగ ప్రదేశాల్లోనే గడుపుతూ, నేలపైనే నిద్రపోతున్నారని, సరైన విశ్రాంతి, పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు వెల్లడించారు. పంజాబ్కు చెందిన ‘ఫైవ్ రివర్స్ హార్ట్ అసోసియేషన్’ వాలంటీర్ డాక్టర్ శిల్ప మాట్లాడుతూ, ఇప్పటికే 200 మందికి పైగా జ్వరం, గొంతునొప్పి, తలనొప్పికి మందులు అందించినట్లు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న వృద్ధులు కొందరు తమ దీర్ఘకాలిక మందులను పోగొట్టుకోవడంతో, మధుమేహం, రక్తపోటు సమస్యలతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కిక్కిరిసిన జనసమూహం మధ్య దగ్గు, తుమ్ములు వంటి వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు వైద్య బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి.భోజనం సరిగా చేయకపోవడం వల్ల ఆందోళనకారులలో నీటి శాతం తగ్గిపోయి (డీహైడ్రేషన్) వాంతులు, కడుపులో తిప్పడం వంటి సమస్యలు వస్తున్నాయి. దీనిని నివారించడానికి వాలంటీర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. సమీప వైద్య కళాశాలల వైద్యులు కూడా తమ విధులను ముగించుకుని ఇక్కడ సేవలు అందిస్తున్నారు. పౌరులు సైతం మందులు, ప్రథమ చికిత్స సామగ్రిని విరాళంగా అందజేస్తున్నారు.మరోవైపు తొక్కిసలాటల్లో గాయపడిన వారు, నొప్పులతో వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జూలై 20 నాటి నిరసనలో గాయపడిన కొందరు వెంటనే చికిత్స తీసుకోకపోవడంతో గాయాలు ఇన్ఫెక్షన్గా మారినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షల్లో అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. -
నీట్ లీకేజీ రచ్చ.. హీరోయిన్ జ్యోతిక ఆసక్తికర పోస్ట్!
నీట్ పేపర్ లీక్ వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సినీ తారలు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, అదితిరావు హైదరీతో పాటు పలువురు సినీ తారలు విద్యార్థులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా దక్షిణాది స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ కూడా విద్యార్థుల ఆందోళనకు తన మద్దతు తెలిపారు. నీట్ పేపర్ లీక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు.‘నేను విద్యార్థులు, దేశ భవిష్యత్తు తరపున నిలబడతా. నేను ప్రజాస్వామ్య భారతదేశానికి మద్దదు ఇస్తున్నా. విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని కోరున్నా. తల్లులుగా మా పిల్లలను ‘సోనమ్ వాంగ్చక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్లా గా పెంచాలని కోరుకుంటున్నాం. జెన్ జీ చేస్తున్న పోరాటం చూసి గర్వంగా ఉంది. భయం లేకుండా ఉద్యమం చేస్తున్న సీజేపీకి ధన్యవాదాలు. జైహింద్’అని జ్యోతిక తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
చర్చల్లో బిగ్ ట్విస్ట్.. కేంద్రానికి షాకిచ్చిన సీజేపీ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మధ్య మూడో విడత చర్చలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. రాజీనామాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే చర్చలను కొనసాగించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని శనివారం తేల్చిచెప్పింది.సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమకు చర్చలకు అతీతమైన అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే తదుపరి చర్చలకు అర్థం ఉండదని స్పష్టం చేశారు.Dharmendra Pradhan’s resignation is NON-NEGOTIABLE.If it’s a no from the government, there’s no point of further discussion.— Ashutosh Ranka (@AshutoshRanka) July 25, 2026‘ముందు రాజీనామా.. ఆ తర్వాతే చర్చలు’నీట్ సహా పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం జరగనున్న మూడో విడత చర్చలకు ముందు సీజేపీ చేసిన ఈ ప్రకటనతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో సీజేపీ తన ప్రధాన డిమాండ్పై మరింత కఠిన వైఖరి ప్రదర్శించింది.రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలతఇప్పటికే జరిగిన చర్చల్లో సీజేపీ చేసిన మూడు ప్రధాన డిమాండ్లలో రెండు అంశాలపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయకూడదన్న డిమాండ్పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలన్న డిమాండ్ఈ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇందుకోసం ఈ మధ్యాహ్నం వరకు కేంద్రం గడువు కోరింది. అయితే రాజీనామాపై స్పష్టత ఇచ్చాకే చర్చలను ముందుకు తీసుకెళ్తామని సీజేపీ ఇప్పుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.రాజీనామాకు నో?మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని, అది బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల అభిప్రాయం. పరీక్షల నిర్వహణలో లోపాలను సరిదిద్దడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో సంస్కరణలు చేపట్టడమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్న సీజేపీప్రధాన్ రాజీనామాపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని సీజేపీ హెచ్చరిస్తోంది. చర్చల ఫలితం ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంతో ప్రారంభమైన ఆందోళనలు ప్రస్తుతం కేంద్రం–సీజేపీ మధ్య ప్రతిష్టంభనకు దారితీశాయి. ఈ నేపథ్యంలో మూడో విడత చర్చలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
కాక్రోచ్ ఉద్యమం వెనుక పూర్తి కథ ఇదే !
-
సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నిర్ణయం వల్లనే ఈ ఉద్యమం మొదలయింది..! కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది...?
-
మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీ
సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామంటూ సీజేపీ వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదని.. ఈ విజయం విద్యార్థులందరిందని సీజేపీ పేర్కొంది. సీజేపీ నిరసనలు.. అప్డేట్స్..విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి: రాహుల్విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించిందివిద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందేదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించిందివిద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారువిద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి నీట్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: జేపీ నడ్డాత్వరలోనే పరిహారం ఇస్తాంనిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాంసీజేపీ ప్రతిపాదించిన సంస్కరణలను పరిశీలిస్తాంమూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీవిద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిప్రధాన్ రాజీనామాతో మా మొదటి డిమాండ్ నెరవేరిందివిద్యార్థులపై కేసు ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిపరిహారంపై కూడా స్పష్టత ఇచ్చిందివిద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలిఆందోళన విరమించిన సీజేపీసీజేపీ, కేంద్ర మధ్య ముగిసిన చర్చలుసీజేపీ ప్రతినిధులతో చర్చించిన నడ్డా, జితేంద్రసింగ్దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలుచర్చల్లో పాల్గొన్న జేపీ నడ్డా, జితేంద్ర సింగ్సీజేపీ నుంచి హాజరైన సౌరవ్ దాస్, అశుతోష్లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరిన సీజేపీసెంట్రల్ ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లువిద్యార్థుల ఆందోళన విరమణతో మెట్రో స్టేషన్లు రీఓపెన్ఢిల్లీలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలుఢిల్లీకి బయల్దేరి రావాలని ఫడ్నవీస్, షిండేలకు పిలుపుమరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పిలుపుఇది ప్రజాస్వామ్య విజయం మల్లికార్జున ఖర్గేఇప్పటికైనా విద్యా వ్యవస్థను సరిదిద్దాలియువత ధైర్యంగా పోరాడిందిఢిల్లీ:ప్రధాని మోదీతో అమిత్ షా భేటీతాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు కాసేపట్లో కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలుమిగతా రెండు డిమాండ్లను నెరవేర్చాలంటున్న సీజేపీప్రజాస్వామ్యం గెలిచింది: వాంగ్చుక్శాంతికి, సహనానికి చెందిన విజయం ఇదిఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలిఇకపై కేంద్ర బాధ్యతాయుతంగా వ్యహరించాలిసీజేపీ, జెన్ జీలకు ధన్యవాదాలు జంతర్మంతర్ దగ్గర విద్యార్థుల సంబరాలుఒక డిమాండ్ నెరవేరింది: సీజేపీమిగతా 2 డిమాండ్లు నెరవేరే వరకు వేచి ఉందాంవిద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యం గెలిచింది: సీజేపీకేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీవిద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదుఈ విజయం విద్యార్థులందరిదికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామాసీజేపీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామారాజీనామా లేఖను ప్రధానికి పంపిన ధర్మేంద్ర ప్రధాన్జంతర్మంతర్ సమీపంలో ఉద్రిక్తతపోలీసులపై రాళ్లురువ్విన ఆందోళనకారులుఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగంజంతర్మంతర్లో కొనసాగుతున్న సీజేపీ నిరసనలు ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్జంతర్ మంతర్ను ముట్టడించడం ఆపండిదీక్షా స్థలికి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దునిరసనకారులకు ఆహారం, మందులు చేరనివ్వాలిజంతర్ మంతర్ ముట్టడిని ఎత్తివేయాలని డిమాండ్ఢిల్లీ పోలీసుల సంచలన ప్రకటనజంతర్మంతర్ హింసాత్మక ఘటనలపై పోలీసుల ప్రెస్మీట్అందులో చాలా వరకు ఫేక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయిసోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేశారుదీని వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉందిపాక్ నుంచి ఏఐ వీడియోలను క్రియేట్ అయ్యాయి400కి పైగా పాక్ హ్యాండిల్స్ను బ్లాక్ చేశాంఏఐ కట్టడికి కృషి చేస్తున్నాంఏఐ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయిరేపు దేశవ్యాప్త నిరసనలను సీజేపీ పిలుపుమరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సీజేపీరేపు సాయంత్రం 6గం. క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపుఇవాళ చర్చలు ఉంటాయా? ఉండవా? అనేదానిపై నెలకొన్న అనిశ్చితిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకలేకపోతే.. మోదీనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్కేంద్రంతో చర్చకు ముందు సీజేపీ కీలక ట్వీట్రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదునిర్ణయం తీసుకోకపోతే.. చర్చలు కొనసాగించడంలో అర్థం లేదు“వాళ్లు అడిగే పరిస్థితి రాకముందే.. ఇప్పటికి బాధ్యత తీసుకుని స్వయంగా రాజీనామా చేసి ఉండాల్సింది.” అంటూ మరో ట్వీట్మధ్యాహ్నం 3.30గం. కు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ భేటీ!నిన్న గంటన్నరపాటు జరిగిన చర్చలుకీలక డిమాండ్పై కొలిక్కి రాని చర్చలుఇవాళ ఏ నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రులుమంత్రి రాజీనామాపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతి చేస్తామని ప్రకటనजिम्मेदारी लेकर बिना मांगे ही अब तक इस्तीफा दे देना चाहिए था 🥺— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 సీజేపీ నిరసనలకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతుసీజేపీ నిరసనలకు ప్రొఫెసర్, తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం మద్దతువిద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందిపేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధానే కారణంకచ్చితంగా ఆయన రాజీనామా చేయాలిసీజేపీ నిరసనలకు రాహుల్ గాంధీ సంఘీభావంశనివారం.. మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ ప్రధాని అర్ధరాత్రి పూట వీడియోలు చేస్తున్నారు.. ఏం లాభం?ఢిల్లీ పోలీసులు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారులాఠీలతో తలలు పగలకొట్టారుపిల్లలపై దాడి చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేధర్మేంద్రను ప్రధాని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలినీట్ లీక్పై విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలిఅవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీకధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారుఆయన్ని మరో శాఖకు మార్చాలని అనుకుంటున్నారుఆయన శాఖ మార్చడం కూడా ఆమోద యోగ్యం కాదుఎంత బెదిరించినా.. జంతర్ మంతర్నుంచి విద్యార్థులు కదలరుయువతకు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు టైఫాయిడ్తో బాధపడుతున్ను కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేచికిత్స తీసుకుంటున్న సీజేపీ చీఫ్శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న యువతకు ధన్యవాదాలుఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే కేంద్రం తప్పకుండా దిగి వస్తుందిధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి తప్పకుండా రాజీనామా చేస్తారుపోరాటం ఇలాగే కొనసాగించాలని సూచనకోలుకోగానే తాను చేరతానని వ్యాఖ్యమోహన్ భగవత్ పరోక్ష వ్యాఖ్యలుఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలునేటి యువత దారితప్పిన వారు కాదని, వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భగవత్యువతకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా.. వారితో చర్చలు జరపాలని సూచనకొత్త తరం ఎక్కువగా ప్రశ్నలు అడుగుతోందని, వారికి సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని వ్యాఖ్యయువతకు మార్గనిర్దేశం చేయాలే తప్ప.. వారి అభిప్రాయాలను అణచివేయకూడదన్న ఆరెస్సెస్ చీఫ్“ఆదేశాలు కాదు.. చర్చలు, నియంతృత్వం కాదు.. ఏకాభిప్రాయం” అనే సందేశం ఇచ్చిన మోహన్ భగవత్యువత విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే సంభాషణ(మాటలు, చర్చల) ద్వారానే సాధ్యమని ఆసక్తికర వ్యాఖ్యరాజీనామా లేకుండానే దీక్ష విరమణ.. వాంగ్చుక్ వివరణధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మినహా మిగతా వాటికి అంగీకరించిన సోనమ్ వాంగ్చుక్కేంద్ర మంత్రుల సమక్షంలో మొన్న దీక్ష విరమణప్రధాన డిమాండ్ నెరవేరక ముందే దీక్ష విరమించడంపై విమర్శలునిన్న రాత్రి వీడియోలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన వాంగ్చుక్కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ.. 26 రోజుల నిరాహార దీక్షను విరమించినట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు.రాజీనామా తనకు ప్రధాన అంశం కాదని.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు కాకుండా చూడటమే తన ప్రాధాన్యత అని చెప్పారు.ఢిల్లీలోని ‘సీజేపీ’ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని వెల్లడించారు.పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్లపై పార్లమెంట్లో చర్చిస్తామని.. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని తాను చర్చల్లో ప్రస్తావించానని.. కానీ కేంద్రం మరింత సమయం కోరిందని వాంగ్చుక్ తెలిపారు.ప్రధాన్ రాజీనామా చివరికి జరిగే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని.. అందుకే దానిపై పట్టుబట్టలేదని చెప్పారు."నా లక్ష్యం విద్యార్థులు నష్టపోకూడదనేది. వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా చూడటమే అత్యంత ముఖ్యమైన విషయం" అని స్పష్టం చేశారు.దీక్ష విరమణపై వచ్చిన ‘డీల్ కుదిరింది’ అనే ఆరోపణలను వాంగ్చుక్ ఖండించారు."డీల్ చేసుకోవాలనుకుంటే 26 రోజులు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? ఏసీ గదిలో కూర్చునే ఒప్పందం చేసుకునేవాడిని" అని వ్యాఖ్యానించారు.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆస్పత్రికి వచ్చి హామీలు ఇచ్చారని.. అయితే రాతపూర్వక హామీ వచ్చే వరకు దీక్ష విరమించలేదని తెలిపారు.తనతో పాటు పోరాడిన విద్యార్థులు, ఎంపీలు, లద్దాఖ్ ప్రతినిధులు దీక్ష ముగింపు సమయంలో తన వద్ద లేకపోవడం బాధ కలిగించిందని వాంగ్చుక్ అన్నారు. AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026సమగ్ర కథనం కోసం👉 ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్చుక్ చర్చల వేళ సీజేపీ కీలక వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక ప్రకటన.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పష్టత లేకుండా చర్చలు కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టీకరణ.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి డిమాండ్ (నాన్-నెగోషియబుల్) అంటూ సీజీపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా వ్యాఖ్య ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే.. తదుపరి చర్చలకు వెళ్లడంలో ప్రయోజనం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.కేంద్రం, సీజీపీ ప్రతినిధుల మధ్య మూడో విడత సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది.సమగ్ర కథనం కోసం👉 కేంద్రానికి సీజేపీ సంచలన షరతువాంగ్చుక్ వైరల్ వీడియోపై సఫ్దర్జంగ్ ఆస్పత్రి వివరణసోనమ్ వాంగ్చుక్ను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో రికార్డైన దృశ్యాలు బయటకు వైరల్గా మారిన వీడియో‘‘నేను వెళ్తున్నా.. నన్ను అరెస్ట్ చేయండి’’ అని పోలీసులకు సవాల్ విసిరిన వాంగ్చుక్వైరల్ వీడియోపై స్పందించిన సఫ్దర్జంగ్ ఆస్పత్రి జూలై 21న ఆస్పత్రిలోని నో-వీడియోగ్రఫీ జోన్లో రికార్డు చేసినట్లు వెల్లడించింది.వాంగ్చుక్ అనుచరులు ఈ వీడియోను చిత్రీకరించారని స్పష్టీకరణరికార్డు చేసిన వెంటనే కాకుండా శుక్రవారం విడుదల చేశారని స్పష్టం చేసింది.ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించారంటూ వివరణ ఇచ్చిన సర్దర్జంగ్ ఆస్పత్రికేంద్రం–సీజేపీ చర్చలు 3.0.. కీలక పరిణామాలుకేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు నేడు జరగనున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.శుక్రవారం జరిగిన దాదాపు రెండు గంటల చర్చల్లో ఎలాంటి తుది నిర్ణయం రాలేదు.సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం.శాంతియుత నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అంశాలపై సానుకూలత వ్యక్తం చేసింది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం కేంద్రం మరింత సమయం కోరింది.ఇవాళ మధ్యాహ్నం 3గం.లకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ జరగనుందినీట్ నిరసనలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుపేపర్ లీక్ నేరాలకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.పేపర్ లీక్ మాఫియాకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష ప్రతిపాదించారు.నేర తీవ్రత ఆధారంగా శిక్షను 10 ఏళ్ల వరకు పెంచే అవకాశం కల్పించారు.వ్యవస్థీకృత పేపర్ లీక్ రాకెట్లకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.పేపర్ లీక్ కేసుల దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు.కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ చేపట్టనున్నారు.ఈ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మంత్రి రాజీనామాపై ఉత్కంఠ..విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి.రాజీనామా చేయడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల వాదన.ఎన్టీఏ సంస్కరణలు, పరీక్షల వ్యవస్థలో మార్పులే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెబుతోంది.సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తోంది.సీజేపీ హెచ్చరికలు..రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అశుతోష్ రాంకా తెలిపారు.కేంద్రం వైఖరిలో మార్పు లేకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.డిమాండ్లపై అశుతోష్ రాంకా కీలక వ్యాఖ్యలునిన్న జరిగిన సమావేశంలో పరిహారం, చట్టపరమైన కేసులకు సంబంధించిన అంశాలపై సానుకూల స్పందన వచ్చిందన్న రాంగాఈ అంశాలపై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించిందని, ఈరోజు లిఖితపూర్వక ఒప్పందం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాలేదన్నారు.మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని సమాచారం వస్తోందని, అదే జరిగితే సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాంకా అన్నారు.ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్ను పట్టించుకోకుండా రాజీనామాకు నిరాకరిస్తే, తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే సీజేపీ కూడా మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.తమ డిమాండ్పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని అశుతోష్ రాంకా కోరారు.VIDEO | Delhi Jantar Mantar Protest: CJP spokesperson Ashutosh Ranka, says, "In yesterday's meeting, we received a positive response regarding compensation and legal cases. We got an in-principle agreement, and we hope to receive the written agreement today as well. However,… pic.twitter.com/BFvGHOZWBm— Press Trust of India (@PTI_News) July 25, 2026సమగ్ర కథనం కోసం👉: నీట్ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలొచ్చుజంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం..సీజేపీ ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను పెంచారు.నిరసనలకు ప్రధాన వేదిక అయిన జంతర్ మంతర్ ప్రాంతం చుట్టూ అదనపు బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లను భారీ స్థాయి గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించారు.బారికేడ్లు కదలకుండా ఉండేందుకు వాటిని వెల్డింగ్ చేసి మరింత బలోపేతం.పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు.జంతర్ మంతర్ పరిసరాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.శాంతియుతంగా ఆందోళన కొనసాగించేలా పోలీసులు చర్యలు చేపట్టారుPolice Fortifies Jantar Mantar,A six-layer barricade setup is now in place on the road near Jantar Mantar and Jai Singh Marg. An attempt is being made to restrict the protesters to the area. The barricades have been anchored to the ground using iron rods and welding pic.twitter.com/NmwjZOfNPN— Amit Bhardwaj (@AmmyBhardwaj) July 24, 2026ఇంటర్నెట్ నిలిపివేత..సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేతపని చేయని మొబైల్ డేటా సర్వీసెస్బుకింగ్ కానీ క్యాబ్ సర్వీసులు, పని చేయని యూపీఐ పేమెంట్స్ యాప్సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు#WATCH | Security intensified around Jantar Mantar as Delhi Police set up additional barricades that have been interlinked with heavy duty chains and reinforced through welding. pic.twitter.com/I9tNCvGp6X— ANI (@ANI) July 25, 2026 మెట్రో మూసివేత..సీజేపీ నిరసనల నేపథ్యంలో మళ్ళీ మెట్రో స్టేషన్లు మూసివేత18 మెట్రో స్టేషన్లు క్లోజ్ లోక్ కల్యాణ్ మార్గ్రాజీవ్ చౌక్పటేల్ చౌక్రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్బారఖంబా రోడ్సుప్రీం కోర్ట్సేవా తీర్థ్జనపథ్మండి హౌస్సెంట్రల్ సెక్రటేరియట్ఐటీఓఢిల్లీ గేట్ఇంద్రప్రస్థఖాన్ మార్కెట్జోర్ బాగ్శివాజీ స్టేడియంఝండేవాలాన్న్యూ ఢిల్లీకేంద్రం, సీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన..రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ24 గంటల్లో చెబుతామన్న మంత్రులు, నేడు మళ్లీ చర్చలు47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసనధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలుకేంద్ర ప్రభుత్వం, సీజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి.ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠను మిగిల్చాయి.విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా చర్చ నడిచింది.మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టగా.. ప్రభుత్వం 24 గంటల సమయం కోరింది.శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతానంటూ వాయిదా వేసింది. -
ఒక్కరి రాజీనామాతో ఆగదా?: సీజేపీ సంచలన వ్యాఖ్యలు
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, బాధ్యులపై చర్యలు కోరుతూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తోనే ఆగిపోదని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉందని సీజేపీ తాజాగా ప్రకటించింది. కేంద్రంతో నిన్నటి చర్చలు, కొనసాగుతున్న ఆందోళనల నడుమ సీజేపీ ప్రతినిధి(చర్చల) అశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని, ఇది “టైమ్ బాంబ్”లా మారుతోందని.. ఏ క్షణమైనా పేలొచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం త్వరగా స్పందించి విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.‘ఇక డిమాండ్లు మారొచ్చు’సీజేపీ ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తోంది. నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే.. నీట్ మరణాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని.. నీట్ నిరసనల్లో విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని మరో రెండు డిమాండ్లు ఉంచారు. వీటిల్లో.. మంత్రి రాజీనామా అంశంపై కేంద్రం ఒక్కరోజు గడువు కోరింది. ఇవాళ.. సీజేపీ, కేంద్రం మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ఆ భేటీలో కేంద్రం ఏం చెప్పనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో రంకా మాట్లాడుతూ.. అసంతృప్తి క్రమంగా పెరిగితే అది కేవలం ఒక్కరి రాజీనామా డిమాండ్కే పరిమితం కాకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. “ఇక ఈ డిమాండ్ మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది” అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే.. మరిన్ని రాజీనామాలు డిమాండ్ చేసే అవకాశం ఉందన్నట్లు ఆయన మాట్లాడారు. అంతకు ముందు దీప్కే కూడా..విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ నెరవేరిస్తేనే తాము ఆందోళనలను విరమిస్తామని.. అప్పటిదాకా జంతర్ మంతర్లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం మొండిపట్టు పడితే.. అవసరమైన పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ రాజీనామా కూడా డిమాండ్ రావచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. చర్చల్లోనూ కొనసాగుతున్న ప్రతిష్టంభనకేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ, నీట్ వివాదంలో ప్రభావిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై చర్చ జరిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై మాత్రం ఓ కొలిక్కి రాలేదు.నీట్ వివాదం.. బాధ్యతపై పోరునీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు కేవలం పరీక్షల అంశంగా కాకుండా.. ప్రభుత్వ జవాబుదారీతనం, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుండగా.. మరోవైపు నిరసనకారులు వ్యవస్థాపరమైన మార్పులతో పాటు రాజకీయ బాధ్యతను కూడా డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ తాజా వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోసారి రాజకీయ చర్చ మధ్యలోకి తీసుకొచ్చాయి. ఉద్యమం ఏ దిశగా సాగుతుంది.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
జోమాటో నుండి అంత ఫుడ్ ఏవరు పంపారంటే? CJP కి అంతమంది సపోర్ట్ ఎందుకు ?
-
లోపల చర్చలు.. బయట లారీ ఛార్జ్.. మోడీ వీడియో వెనుక బీజేపీ వ్యూహం అదే
-
దద్దరిల్లిన జంతర్ మంతర్.. బొద్దింకల దెబ్బ.. ఢిల్లీ అబ్బ
-
ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్చుక్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్.. తన దీక్ష విరమణపై వస్తున్న విమర్శలకు గట్టిగా స్పందించారు. కేంద్రంతో ‘డీల్ కుదుర్చుకుని’ దీక్ష విరమించారంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన.. అక్కడి నుంచే నేరుగా ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.. ‘‘26 రోజుల పాటు ఆకలితో పోరాడిన తర్వాత కూడా నా నిజాయితీని నిరూపించుకోవాలా?’’ అంటూ ప్రశ్నించారు. తన పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్చుక్ మాట్లాడుతూ.. తన దీక్ష వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.‘నా శరీరం ఎంత నష్టపోయిందో తెలుసా?’దీక్ష విరమణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి వాంగ్చుక్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజా సమస్యల కోసం తాను ప్రాణాలను సైతం పణంగా పెట్టానని తెలిపారు. ‘‘26 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నాను. నా శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఇంత చేసిన తర్వాత కూడా నా నిబద్ధతకు సర్టిఫికెట్ కావాలా?’’ అని ప్రశ్నించారు. తన పోరాటాన్ని, త్యాగాన్ని రాజకీయ లెక్కలతో అంచనా వేయొద్దని కోరారు.ఐసీయూలో వాంగ్చుక్.. 11 కిలోల బరువు తగ్గింపువాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా విమర్శలపై స్పందించారు. 26 రోజుల నిరాహార దీక్ష కారణంగా ఆయన 11 కిలోల బరువు కోల్పోయారని, అందులో కండరాల నష్టం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం వాంగ్చుక్ గురుగ్రామ్లోని మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ‘‘విమర్శించే ముందు ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోండి. 26 రోజుల పాటు ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తికి కనీసం కాస్త సానుభూతి చూపించండి’’ అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026ఎందుకు దీక్ష విరమించారు?నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల సంస్కరణలు, విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ల నుంచి కొన్ని హామీలు రావడంతో గురువారం ఆయన దీక్షను విరమించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోకుండా చూడటం, పరీక్షల సంస్కరణలపై పార్లమెంట్లో చర్చకు అవకాశం కల్పించడం, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాన్ని పరిశీలించడం వంటి హామీలు లభించాయని వాంగ్చుక్ తెలిపారు.విమర్శల మధ్య కొనసాగుతున్న చర్చదీక్ష విరమణ తర్వాత సోషల్ మీడియాలో కొందరు ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. అయితే వాంగ్చుక్ మాత్రం తన పోరాటం వెనుక ఉన్న ఉద్దేశం మారలేదని స్పష్టం చేశారు. ‘‘ఇది వ్యక్తిగత విజయం కోసం చేసిన పోరాటం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన ఉద్యమం’’ అని ఆయన పేర్కొన్నారు. -
సీజేపీ కార్యకర్తల ఆందోళన.. నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు : సీజేఐ
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు, విద్యార్థుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలపై మీడియాలో వస్తున్న కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. కోర్టు సమయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు.ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. దీని వెనుక ఉన్న అసలు సందర్భాన్ని వివరించారు. ఈ పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ వస్తున్న వార్తలను సీజేఐ పూర్తిగా కొట్టిపారేశారు. అత్యున్నత న్యాయస్థానం ఏనాడూ ఏ కేసు విచారణను కూడా తిరస్కరించదు. ప్రజలకు న్యాయం చేసేందుకు మేము 24 గంటలూ అందుబాటులో ఉంటాము అని ఆయన తేల్చి చెప్పారు.అసలు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇస్తూ.. మా ముందుకు అధికారికంగా పిటిషనే రానప్పుడు, మేము దేనిపై విచారణ జరుపుతాము? కేవలం ఒక పేజీ లేఖ ఇచ్చి, దానిపై వెంటనే అత్యవసర విచారణ చేపట్టమంటే కుదరదు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కొన్ని నిర్దిష్ట నిబంధనలు, ప్రక్రియలు ఉంటాయి. వాటిని మేము ఉల్లంఘించలేము. పిటిషన్ను సరైన పద్ధతిలో దాఖలు చేయాలని నేను వారికి చెప్పాను. కానీ వారు తక్షణమే విచారణ కావాలని పట్టుబట్టారు. అందుకే నిబంధనల ప్రకారం సరైన పిటిషన్ ఫైల్ చేయాలని వారికి స్పష్టం చేయాల్సి వచ్చింది అని సీజేఐ వివరించారు.చట్టం అందరికంటే ముందు సుప్రీంకోర్టుకు అత్యున్నతమైనదని, దానిని మనమందరం అనుసరించాల్సిందేనని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు నిబంధనల ప్రకారం సరైన రూపంలో దాఖలైన ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించిందని ఆయన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు, కార్యకర్తలపై పోలీసులు జరిపిన దాడిని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ జరపనుంది. -
విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. పోలీసు ఉద్యోగాలకు గుడ్ బై
న్యూఢిల్లీ: నీట్ అక్రమాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యామంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) పోరాటం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో ఒక్కపక్క చర్చలు జరుపుతూనే ఉద్యమాన్ని నడిపిస్తోంది. మరోవైపు విద్యార్థుల పోరాటానికి దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు వస్తోంది. యువతపై పోలీసుల దమనకాండను ముక్తకంఠంతో అందరూ ఖండిస్తున్నారు. తాజాగా ఇద్దరు పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా తాము ఉద్యోగాలు వదులుకుంటున్నట్టు ప్రకటించారు.ఉత్తరాఖండ్కు చెందిన షేర్ సింగ్ అనే పోలీసు కానిస్టేబుల్ శుక్రవారం ఢిల్లీ జంతర్మంతర్లో తన ఉద్యోగానికి రాజీనామా ప్రకటించారు. ధర్నా వేదికపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. 'పట్వారీ' ఉద్యోగ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కిరాణా దుకాణాల్లో దొరికిందని షేర్ సింగ్ ఆరోపించారు. 2021 నుంచి ఉత్తరాఖండ్లో పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు."ఇది భగత్ సింగ్ దేశం, విప్లవం బాంబులు లేదా పిస్టల్స్ ద్వారా రాదు... మనం ఈ దుర్మార్గులను ఎదుర్కొంటాం. విప్లవం ఆలోచనల నుంచి పుడుతుంది, ఆ ఆలోచనలు ఎప్పటికీ నశించవు" అని ఆయన అన్నారు. ఆ తర్వాత తన పోలీసు బ్యాడ్జ్ను తీసి అభిజిత్ దిప్కేకు అప్పగించారు. అయితే, ఆ కానిస్టేబుల్ను ఇప్పటికే సస్పెండ్ చేశామని ఉత్తరాఖండ్ పోలీసులు తర్వాత తెలిపారు.ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల సమక్షంలో రవి కుమార్ అనే వ్యక్తి ప్రకటించాడు. సెలువులో ఉన్న తనను విధుల్లో చేరాలని పై అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపాడు. "నాకు ప్రభుత్వ నివాసం వద్దు, ప్రభుత్వ వాహనం వద్దు, ప్రభుత్వ జీతం కూడా వద్దు" అని ప్రకటించాడు.మాకు సంబంధం లేదుఢిల్లీ పోలీసులతో రవి కుమార్కు ఎటువంటి సంబంధం లేదని డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రత్యేక విభాగమైన 'ఢిల్లీ హోమ్ గార్డ్స్'లో అతడు వలంటీర్ మాత్రమేనని వెల్లడించింది. దుష్ప్రవర్తన కారణంగా అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపింది. జంతర్ మంతర్ వద్ద కుమార్ చేసిన వ్యాఖ్యలు అతడి వ్యక్తిగత అభిప్రాయాలని, అవి ఢిల్లీ హోమ్ గార్డ్స్, ఢిల్లీ పోలీసులు లేదా ఏ ప్రభుత్వ సంస్థ అభిప్రాయాలు కాదని పేర్కొంది. చదవండి: విద్యార్థుల ఉద్యమం.. తరలివచ్చిన సినీ తారలు -
వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL
-
NTAపై కేంద్రం కీలక ప్రకటన.. 47మందిని తొలగిస్తూ ఉత్తర్వులు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఏ నుంచి 47మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది.పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణల కోసం పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఎన్టీఏ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో జేఈఈ , నీట్ సహా సుమారు 20 జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. -
బొద్దింకలను ఏరిపారేయండి.. మాజీ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంధ్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాక్రోచ్లను శాశ్వతంగా అంతం చేయాలని ప్రధాని మోదీని కోరారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞాఠాకూర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. గతంలో ఎక్కడ బొద్దింకలు కనిపించినా వాటిని చీపురుతో ఊడ్చి పారవేసేవారని, కానీ ఇప్పుడు ఆ చీపురు, బొద్దింక స్నేహితులయ్యాయయని, తద్వారా దేశవ్యాప్తంగా మురికి వ్యాపిస్తోందని అన్నారు. ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దేశ నాయకుడు ఇకపై చీపురును నమ్మకూడదు. దానికి బదులుగా, బొద్దింకలను నిర్మూలించడానికి శాశ్వత ఏర్పాట్లు చేయాలి. దేశాన్ని శుభ్రంగా ఉంచాలి’అని పేర్కొన్నారు.ఠాకూర్ గతంలోనూ తన వ్యాఖ్యల కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఠాకూర్కు లోక్సభ టికెట్ నిరాకరించింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు, అశోక చక్ర గ్రహీత, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరేను, ఠాకూర్ పురాణాల్లోని ప్రతినాయకులైన రావణుడు, కంసుడితో పోల్చారు.26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో కర్కరే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో కర్కరే తనను అన్యాయంగా ఇరికించారని.. తాను శపించడం వల్లే ఆయన చనిపోయారని’ఠాకూర్ ఆరోపించారుమాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్ధోషి2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో మోటర్ సైకిల్కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ప్రగ్యాసింగ్ ఠాకూర్తో సహా ఏడుగురు నిందితులను గతేడాది జూలై నెలలో నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది -
అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సస్పెన్స్ ఒకరోజు గడువు కోరిన కేంద్రం
-
పేపర్ లీక్ చేస్తే.. 10 ఏళ్లు జైలుకే.. మోదీ కేబినెట్ కఠిన నిర్ణయాలు
-
అస్సలు సోనమ్ వాంగ్ చుక్ ఎవరు? : అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు కొత్త రాజకీయ మలుపు తిరిగింది. ఈ పోరాటానికి అసలు నాయకత్వం ఎవరిది? ఉద్యమ క్రెడిట్ ఎవరికి దక్కాలి? అనే అంశాలపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అస్సలు సోనమ్ వాంగ్చుక్ ఎవరు? ఆయన దీక్ష విరమిస్తే ఉద్యమం ఎందుకు ఆగాలి? అంటూ అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ఈ ఉద్యమం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు.వాంగ్చుక్ దీక్ష విరమించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తమ పోరాటం మాత్రం ఆగదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం సోనమ్ వాంగ్చుక్ది కాదు. నాది కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీది కూడా కాదు. ఇది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కొనసాగే ప్రజా ఉద్యమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్మంతర్లో మా ఆందోళన కొనసాగుతుంది’ అని ఆయన వెల్లడించారు.వాంగ్చుక్ నిర్ణయం సరైంది కాదుఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోనమ్ వాంగ్చుక్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. వాంగ్చుక్ను సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పోల్చారు. అన్నా హజారే ఓ దశలో ఉద్యమం తర్వాత మౌనంగా వహించినట్లే ఇప్పుడు వాంగ్చుక్ కూడా అదే దారిలో నడుస్తున్నారు’అని వ్యాఖ్యానించారు.విద్యార్థుల ప్రతినిధులు లేకుండానే ప్రభుత్వ ప్రతినిధులతో మూసి తలుపుల వెనుక సమావేశమై వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వాంగ్చుక్ దీక్షను విరమించారని మసూద్ ఆరోపించారు. ఏ హామీల ఆధారంగా, ఏ పరిస్థితుల్లో దీక్ష విరమించారో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం సోనమ్ వాంగ్చుక్ వంటి నిష్కళంక పర్యావరణవేత్తపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా వాంగ్చుక్ను కలిసి ప్రభుత్వ చర్యలను వివరించారని, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతే ఆయన గౌరవప్రదంగా దీక్షను విరమించారని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.అయితే ఈ వివాదాల మధ్య అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఒక వ్యక్తి నిర్ణయంతో ఉద్యమాలు ముగిసిపోవని, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేవలం పరీక్షల అవకతవకల అంశంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మా డిమాండ్ లు ఇవే.. కేంద్రం చర్చలు... తగ్గని CJP లీడర్లు
-
CJP టీమ్ మొత్తం అరెస్ట్..! ఈ రాత్రికే ముహూర్తం..
-
CJP నిరసనలపై ఉక్కుపాదం NSA చట్టం అమల్లోకి
-
150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్లో మానవత్వపు పరిమళాలు
న్యూఢిల్లీ: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల కోసం నాగాలాండ్కు చెందిన ఒక వ్యక్తి చేసిన వినూత్నసహాయం సోషల్ మీడియాలో పలువురి హృదయాలను గెలుచుకుంది. ఏకంగా 150 పిజాలు ఆర్డర్ చేసి, ఆకలిగా ఉన్నవారికి ఇవ్వండి అంటూ మానవత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలుస్తోంది.నాగాలాండ్కు చెందిన 'ఝా-లౌ' (Zha-Lhou) అనే వ్యక్తి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరి నుంచే డొమినోస్ యాప్ ద్వారా 150 "చీజ్ బర్స్ట్" (Cheese Burst) పిజాలను ఆర్డర్ చేసి నేరుగా జంతర్ మంతర్కే డెలివరీ చేయించారు. జులై 22న కొరియన్ స్వీట్ చిల్లీ, ఫార్మ్హౌస్ రకాలకు చెందిన పిజాలకు మొత్తం బిల్లు రూ. 67,734.18 అయింది. మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేశారు.పిజాలు డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్ ఈ ఆర్డర్ ఎవరికి ఇవ్వాలి? అని ఫోన్ చేసి అడగ్గా, అక్కడ ఇంకా ఆహారం తినకుండా ఆకలితో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే, వారికి ఇచ్చేయండి అని ఝా-లౌ చెప్పారు.అంతేకాదు ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడం వైరల్గా మారింది. "నేను నాగాలాండ్లో ఉన్నాను, వేలాది మంది విద్యార్థులు మంచి భవిష్యత్తు, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్నారు. ప్రత్యక్షంగా అక్కడ ఉండలేకపోయాను, కాబట్టి నా వంతుగా నేను చేయగలిగిన చిన్న సహాయం ఇది" అని ఆయన తన ఇన్స్టాగ్రామ్ (@adiespoems) ఖాతాలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీఅంతేకాకుండా, ప్రశంసల కోసం తాను ఈ పోస్ట్ పెట్టలేదని, ఇతరులకు కూడా తమకు తోచిన రీతిలో సహాయం చేసేందుకు ప్రేరణగా ఉంటుందని మాత్రమే షేర్ చేశానని తెలిపారు. ఆ తర్వాత విద్యార్థుల కోసం మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్ష -
కేంద్రం కీలక నిర్ణయం..10ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా!
సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. ఇకపై పేపర్ లీకేజీకి పాల్పడినట్లు తేలితే ఎంతటి వారైనా పదేళ్ల జైలుశిక్ష, పదికోట్లు జరిమానా విధించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో.. పేపర్ లీక్లు, మోసాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. పేపర్ లీకేజీ పాల్పడిన నిందితులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి వీడియో సందేశంలో దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా చట్టానికి మరింత బలం చేకూర్చింది. రాబోయే మార్పులను వివరిస్తూ పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనను చట్టంలో చేర్చినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తాను ఆదేశించినట్లు ప్రధాని మోదీ గురువారం ఉదయం పోస్ట్ చేశారు. ఈ ఫాస్ట్-ట్రాక్ కోర్టులు మూడు నెలల్లోగా కేసును పరిష్కరించి, శిక్షను ప్రకటించాల్సి ఉంటుంది. పేపర్ లీక్లలో పాల్గొన్న వారికి జైలు శిక్ష,జరిమానాలను కూడా పెంచే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశంలో పేపర్ లీకేజీకి పాల్పడిన నేరస్తులను పట్టుకున్నాం. వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు. విద్యార్థుల ఎడ్యుకేషన్ ఇయర్ వృథా కాకూడదనే వెంటనే నీట్ పరీక్ష నిర్వహించాం. కనీసం 22 లక్షల మంది విద్యార్థులకు సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగించింది.ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి నేను సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశాను. ఆయా శాఖలు తీవ్రంగా శ్రమించి, రాత్రికి రాత్రే దీనికి ఆమోదం తెలిపాయి. రేపు (శుక్రవారం) దీనిపై మంత్రివర్గంలో చర్చ జరుగుతుంది. మంత్రివర్గ సభ్యుల సూచనల అనంతరం దీనికి తుది రూపం ఇస్తారు. పార్లమెంట్ సమావేశాల రెండో వారం ప్రారంభమయ్యే సోమవారం నుంచే, ఆ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రయత్నిస్తాం’అని అన్నారు.ప్రధాని మోదీ వీడియో ప్రకటనపై స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి నొక్కి చెప్పారు. -
ప్రధాని వీడియో సందేశం ఏంటీ? కాక్రోచ్ ఉద్యమం వెసక ఉన్నదెవరు?
-
ఓవైపు చర్చలు.. మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్లో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్ స్ట్రీట్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని శుక్రవారం సీజేపీ చెబుతోంది. నిరసనకారులపై కేసులు తప్పవని, జాతీయ భద్రతా చట్టం (NSA) ప్రయోగిస్తామని, పాస్పోర్టులు సీజ్ చేస్తామని.. అఖరికి అరెస్టులు చేస్తామని హెచ్చరికలు వచ్చినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. విద్యా వ్యవస్థలో మార్పులు, తమపై జరిగిన పోలీసుల చర్యలపై బాధ్యులపై చర్యలు, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో కేంద్రంతో సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.కేంద్రం ప్రయత్నాలుమరోవైపు ఆందోళనను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సీజేపీ ప్రతినిధులతో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి. సీజేపీ తరఫున ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు భేటీ అయ్యారు. ఎలాగైనా ఆందోళనలు విరమింపజేయాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం తమ ప్రధాన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయాన్ని ప్రతినిధులు చర్చలకు వెళ్లే ముందు మీడియాకు స్పష్టం చేశారు. ‘‘మా డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. మాపై లాఠీ చార్జి చేసింది పోలీసులు కాదు.. ఆ ముసుగులో ఉన్న గూండాలు. వాళ్లకు శిక్ష పడాల్సిందే. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం. మా డిమాండ్లు నెరవేరే దాకా పోరాటం ఆపం’’ అని ఆ ఇద్దరు ప్రకటించారు. దీంతో చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నం.. పోలీసుల అప్రమత్తంఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నాం జంతర్ మంతర్ నుంచి కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.కేబినెట్ భేటీఅటు చర్చలు.. ఇటు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. పేపర్ లీకుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ.. అందుకు అవసరమైన చర్యలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు కఠిన శిక్షలతో చట్టం అమలయ్యేలా సంస్కరణల రూపకల్పన దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాంగ్చుక్ దీక్ష విరమించినా.. పోరాటం కొనసాగింపుప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ నేతలు తెలిపారు. వ్యక్తుల దీక్షతో సంబంధం లేకుండా.. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ముందుగా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్సీజేపీ తమ ప్రధాన ఎజెండాను స్పష్టం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. నీట్ సహా పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వివాదాలు, విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చింది. మంత్రి రాజీనామా తర్వాతే విద్యా సంస్కరణలు, ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన అధికారులపై చర్యలు వంటి అంశాలపై చర్చిస్తామని సీజేపీ పేర్కొంది.ఒకవైపు ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుండగా.. మరోవైపు సీజేపీ మాత్రం తమ డిమాండ్ల సాధన వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో పార్లమెంట్ స్ట్రీట్లో కొనసాగుతున్న ఈ నిరసన దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం–సీజేపీ మధ్య జరగనున్న చర్చల ఫలితంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. -
ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే మోదీ పెట్టుకున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత అద్భుత పోరాటం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారు. యువత.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో యువత కదం తొక్కుతున్నారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతున్నారు. మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. యువతపై జరుగుతున్న దాడులు దారుణం. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషం.. పిల్లలపై పోలీసులు దాడులు చేశారు. విద్యార్థులు న్యాయం అడిగితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. యువకులను దారుణంగా కొట్టారు. యువత జవాబుదారీతనం కోరుతున్నారు. ఉద్యమ పార్టీగా మాకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంది.ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారు. ప్రధాని మోదీ కొరివితో తల గోక్కుంటున్నారు. విద్యార్థులు మంత్రి పదవి అడగలేదు. న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నారు. ఢిల్లీలో ఇటీవల ఘటనలు చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ జనరేషన్ చావుకు భయపడే రకం కాదు. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి.. వచ్చాయా?. ఈ జనరేషన్ ఐటీ, ఈడీ సోదాలకు భయపడే వారు కాదు. మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చారు. నేను మోదీని ప్రశ్నిస్తే ఇక్కడున్న కేడీకి ఎందుకంత భయం?. పేపర్ లీక్కు, నాకు సంబంధం ఉందని రేవంత్ అంటున్నాడు. మోదీని ఎదిరించే దమ్ము రేవంత్కు లేదు. పాత కేసులు చూపించి జైల్లో పెడతారని రేవంత్కు భయం ఉంది. ఢిల్లీలో గల్లా పట్టి అడిగే దమ్ము మాకుంది ’ అని వ్యాఖ్యలు చేశారు. -
పోలీసుల కాళ్లు పట్టుకున్న CJP అభిజిత్.. కారణం తెలిస్తే షాక్!
-
కేంద్రం ముందుకు CJP అభిజిత్
-
నీట్ లీక్పై ‘సుప్రీం’ సీరియస్.. కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణలో వరుస లోపాలను ఇకపై కొనసాగించలేమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి సమగ్ర నివేదికలు కోరింది.నీట్ పేపర్ లీక్ కేసును శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం.. ఈ అంశాన్ని అత్యంత దగ్గరగా పర్యవేక్షిస్తామని తెలిపింది. పరీక్షల వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చి, వాటిని సంస్థాగతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో నీట్ను నిర్వహించే ఎన్టీఏకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలినీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణలో తీసుకున్న చర్యలు, భవిష్యత్ సంస్కరణల పురోగతిపై కేంద్రం, ఎన్టీఏ వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానానికి మార్చే అవకాశాలు, డేటా భద్రత వంటి అంశాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం కోరింది. “కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారితే డేటాను ఎలా రక్షిస్తారు?” అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.‘ఇక ఇలా కొనసాగనివ్వం’నీట్ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “వరుస తప్పిదాలను ఇక కొనసాగించలేం. ఈ అంశాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తాం” అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమగ్ర ప్రణాళికను కోర్టు ముందు ఉంచేందుకు మరింత సమయం కావాలని కోరారు.ఇటు హైకోర్టులోనూ.. మరోవైపు నీట్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత అంశం కూడా కోర్టు ముందుకు వచ్చింది. ఇంటర్నెట్ నిలిపివేతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. నిరసనల సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమేనా? అనే అంశంపై కోర్టు పరిశీలించనుంది.ఆందోళనలు.. రాజకీయ వేడినీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఉద్రిక్తత చోటుచేసుకోవడం, పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఇప్పటికే నీట్ లీక్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో.. నీట్ పరీక్షల భవిష్యత్ విధానం, భద్రతా ప్రమాణాలు, సంస్కరణలపై కేంద్రం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది. -
దేశాన్ని కదిలించిన CJP.. రాజీనామా చేసి నిరసనలో పాల్గొన్న పోలీస్ ఉద్యోగి..
-
CJP నిరసనలో చిన్నారి వీడియో వైరల్
-
జంతర్ మంతర్ లో మీమ్స్.. రీల్స్
-
మోదీ వీడియో.. వాంగ్చుక్ దీక్ష విరమణపై సీజేపీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నీట్ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్చుక్ దీక్ష ముగింపుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. వాంగ్చుక్ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్చుక్ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్ పుల్స్టాప్ పెట్టారు. అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. We are relieved and grateful that Sonam sir has ended his hunger strike after 26 days.Thank you, sir, for your extraordinary courage and sacrifice. By putting your own life on the line, you awakened the conscience of an entire nation. Your life is far too precious to this…— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్ వాంగ్చుక్ అనే డీపీని అభిజిత్ ఇంకా ఎక్స్ కొనసాగిస్తుండడం గమనార్హం.కేంద్రం ఇచ్చిన హామీలేంటి?వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.జూన్ 28 నుంచి నిరాహార దీక్షపరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి తరలించి సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలుపరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్కుమార్ను నియమించింది.మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద సమస్య.. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026అలాగే సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.అయితే.. మోదీ ట్వీట్పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్ చేశారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.Don’t insult their intelligence with this pathetic midnight video. 1. Sack Pradhan.2. Punish those who beat students.3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026మాకు రాజీనామానే కావాలిఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్ విషయంలో మాత్రం తలొగ్గే తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. -
ఢిల్లీలో CJP తుఫాన్.. లాఠీ దెబ్బలకు భయపడని Gen-Z.. దద్దరిల్లిన జంతర్ మంతర్
-
విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘సంసద్ చలో’ర్యాలీలో హింస జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని చూడటం తీవ్ర వేదన కలిగించే విషయమని సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవడం కంటే వారి ఉద్దేశాలను ప్రశ్నించడం ఎందుకు సులభంగా అనిపిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆమె గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జంతర్మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనను ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో ఎటువంటి ఆధారాలు లేకుండా ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తొందరపాటు వద్దని సూచించారు. విద్యార్థుల ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిష్టను మీడియాలో మసకబార్చేలా చూపడం ఒక విద్యావేత్తగా తనకు ఎంతో బాధ కలిగిస్తోందని వెల్లడించారు. ఆందోళనకారులు అసాధారణమైన సహనం, క్రమశిక్షణ, సంయమనం ప్రదర్శించారని అంగ్మో కొనియాడారు. అలాగే సమస్యలను ప్రభుత్వం ఆలకించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. సొంత విద్యార్థులనే అంత త్వరగా అపనమ్మకంతో చూసే వ్యవస్థ ఎలాంటిదని తాను తరచుగా ఆలోచిస్తుంటానని ఉద్ఘాటించారు. మన పిల్లలు రక్షణకు అర్హులు అని తేల్చిచెప్పారు. వారిని ప్రతినాయకులుగా చిత్రీకరించవద్దని కోరారు. వారు చెప్పేది అందరూ వినాలని వెల్లడించారు. కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చే కుట్రలతో విద్యార్థులను అణచివేస్తామంటే సహించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. -
నేడు దేశవ్యాప్త నిరసనలు
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, మంత్రి ధర్మేంద్ర రాజీనామా విషయాల్లో ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ సీజేపీ శుక్రవారం దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలకు పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరపాలని ప్రజలను కోరింది. ‘ప్రతి జిల్లాలో ఒక రోజంతా ఒక్కటే డిమాండ్’పేరిట నిరసన ప్రదర్శనలు జరగాలని సీజేపీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకుని తమ ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వ వ్యతిరేక నినదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ముందు జాగ్రత్తగా ఢిల్లీ ప్రభుత్వం ఆ పరిసరాల్లో పెద్దసంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలను మొహరించారు. పలు చోట్ల బ్యారీకేడ్లను పెట్టడంతో కన్నాట్ ప్లేస్ చుట్టూతా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీక్షాస్థలి వైపునకు రాకుండా కొత్త వాళ్లను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఉద్యమంతోసంబంధంలేని ‘బయటి వ్యక్తులు’, గూండాలను బీజేపీ ఇక్కడికి తరలిస్తోందని సీజేపీ ఆరోపించింది. పోలీస్ యూనిఫాం లేని కొందరు పోలీస్ బ్యాటన్లు పట్టుకుని విద్యార్థులను బెదిరిస్తున్న వీడియోను సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్మీడియాలో విడుదలచేశారు. సమీప కన్నాట్ ప్లేస్లోని దుకాణదారులు గురువారం సాయంంత్రం ఆరున్నరకల్లా షాప్లు మూసేశారి న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రతికూల వాతావరణంలోనూ ఉద్యమిస్తున్న విద్యార్థులకు తమ సాయం ఎప్పుడూ ఉంటుందని జంతర్మంతర్ వద్ద జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలు చెలరేగే ఆస్కారముందని, ముందుజాగ్రత్తగా 16 ఢిల్లీ మెట్రోస్టేషన్లను గంటల తరబడి అధికారులు మూసేశారు. 14 గంటల తర్వాత సాయంత్రం రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లను మాత్రం తెరిచారు. అయితే శుక్రవారం అన్ని మెట్రో స్టేషన్లనూ మూసేస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర హోం శాఖ గురువారం జంతర్మంతర్ నుంచి 1.5 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను ఉదయం నుంచి అర్ధరాత్రిదాకా స్తంభింపజేసింది. జూలై 17వ తేదీ నుంచి ఇలా ఇంటర్నెట్ను నిలిపేయడం ఇది ఐదోసారి. వాళ్ల పోస్పోర్ట్లు రద్దు! రణరంగంగా మారిన జూలై 20నాటి పార్లమెంట్ ర్యాలీ ఉదంతంలో పాల్గొన్న నిరసనకారుల పాస్పోర్ట్లు రద్దయ్యే ప్రమాదముందని ఢిల్లీ పోలీస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ రోజు ఛలో సంసద్ ర్యాలీలో క్రియాశీలంగా పాల్గొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని, పోలీసులపై దాడులుచేసిన వారిని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు, భద్రతా బలగాల బాడీకామ్లు, ఇతర సాంకేతిక మార్గాల ద్వారా గుర్తించి వారి పాస్పోర్ట్లను రద్దుచేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల ఉద్యమం.. తరలివచ్చిన మలయాళ నటులు
కొచ్చి: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మలయాళ సినీ పరిశ్రమ సంఘీభావం ప్రకటించింది. కొచ్చిలోని మహారాజాస్ కాలేజీలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీకి మలయాళ సినీ తారలు తరలివచ్చారు. పలువురు నటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన వారు సోషల్ మీడియా ద్వారా తమ సంఘీభావం తెలియజేశారు.నటుడు జోజు జార్జ్ (Joju George), నటి శాంతి బాలచంద్రన్, దర్శకుడు ఆశిక్ అబు, రచయిత ఎన్ఎస్ మాధవన్, ప్రముఖ రచయిత్రి కేఆర్ మీరా ర్యాలీలో పాల్గొని విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. నటి గౌరీ కిషన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, "శాంతియుత స్వరాలను వినండి.. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరి మాట వింటుంది" అని రాసిన ప్లకార్డును ప్రదర్శించారు. నటుడు, ర్యాపర్ బేబీ జీన్ కూడా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.సోషల్ మీడియాలో వెల్లువలా మద్దతుమంగళవారం పలువురు మలయాళ సినీ నటులు సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇంద్రజిత్ సుకుమారన్, మీనాక్షి, కుంచాకో బోబన్, సిజు సన్నీ, రహ్మాన్, వినయ్ ఫోర్ట్, కాలిదాస్ జయరామ్, నస్లెన్, నిఖిలా విమల్, గ్రేస్ ఆంటోనీ, దీపా థామస్, హషీర్ తదితరులు విద్యార్థులకు మద్దతుగా పోస్టులు చేశారు.అంతకుముందు రోజు టోవినో థామస్, పార్వతి తిరువోతు, రీమా కల్లింగల్, విస్మయ మోహన్లాల్ కూడా విద్యార్థుల నిరసనలకు సోషల్ మీడియా ద్వారా మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని టోవినో థామస్ ఖండించారు. పార్వతి తిరువోతు.. ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు ఉందని పేర్కొంటూ జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకున్నారు.చదవండి: నటుడు మాధవన్ గాయబ్.. ఫొటో వైరల్!ఇంద్రజిత్ సుకుమారన్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. అలాంటి నిరసనకారులపై అధికారులు హింసకు పాల్పడకూడదని పేర్కొన్నారు. అణచివేత ఘటనలపై మౌనంగా ఉండకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనల సందర్భంగా గాయపడిన వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.సంఘీభావ సభలు, ర్యాలీలుకేరళలోని పలు ప్రాంతాల్లో కూడా విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా సంఘీభావ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో నీట్ వివాదంపై విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.Joju george..🔥🔥🔥🔥 pic.twitter.com/59zPuj25It— Nani (@Ravanaroy) July 23, 2026 -
సీజేపీ ఆందోళనకారులకు పోలీసులు బిగ్ షాక్.. ఆ పని చేస్తే పాస్పోర్ట్లు రద్దు!
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల్లో.. హింసకు పాల్పడిన వారి పాస్పోర్ట్లను రద్దు చేసే యోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు పీటీఐ నివేదిక పేర్కొంది. నీట్ పేపర్ల లీకేజీలో ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థికి రూ.కోటి చెల్లించాలని సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చలో సంసద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వారి నిరసనలకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ,ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు తోడవ్వడంతో ఉద్యమం ఊపందుకుంది.పలు చోట్ల ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం, పోలీసులపై ఆందోళన కారులు తిరగబడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. యితే, ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు శాంతియుతంగా కాకుండా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా దాడులకు తెగబడిన వారి పాస్పోర్టులు రద్దు చేసే దిశగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఆందోళనకు నిబంధనలు ఉల్లంఘించి పార్లమెంట్ వీధుల్లో ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 118మంది పోలీసులకు గాయాలయ్యాయి. 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసం కాగా.. 60మంది ఆందోళనకారులు గాయపడ్డారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65మందికి చికిత్స కొనసాగుతోంది. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ గెజిట్ ప్రకారం.. జూలై 19 నుండి అక్టోబర్ 18 వరకు మూడు నెలల పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్కు జాతీయ భద్రతా చట్టం, 1980 కింద ముందస్తు నిర్బంధ అధికారాలను కల్పిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని విచారణ లేకుండానే 12 రోజుల నుండి 12 నెలల వరకు నిర్బంధించవచ్చు.అయితే, ఈ ఉత్తర్వులు ప్రతి మూడు నెలలకొకసారి జారీ చేసే సాధారణ ప్రక్రియేనని, జూలై 7నే దీనికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ అయిందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుత సీజేపీ నిరసనలకు, ఈ ఆర్డర్కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వివరించారు.శాంతిభద్రతలను కాపాడేందుకు నిరసనకారులు సహకరించాలని, సమస్యపై చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కాగా, ఈ పోలీసుల కఠిన చర్యలకు నిరసనగా జూలై 24, శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. -
వాటర్ కానన్ ప్రయోగించిన పోలీసులు.. తడుస్తూ విద్యార్థుల డ్యాన్స్
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీక్పై బిహార్ రాజధాని పట్నాలో నిరసన తెలిపిన విద్యార్థులు ఉద్రిక్త పరిస్థితిని వైరల్ సీన్గా మార్చారు. తీవ్ర ఎండ ఉందంటూ వాటర్ కానన్ వాడాలని పోలీసులను వారు కోరగా.. నీళ్లు చల్లిన వెంటనే విద్యార్థులు నీళ్లలో తడుస్తూ డ్యాన్స్ చేశారు.భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులను గాంధీ మైదాన్ సమీపంలో, గవర్నర్ నివాసానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో పోలీసులు బ్యారికేడ్లతో అడ్డుకున్నారు.వైరల్ అయిన నిరసన దృశ్యాలువైరల్ వీడియోలో విద్యార్థులు పోలీసులతో, "సార్.. వాటర్ కానన్ లేదా? చాలా వేడిగా ఉంది" అని చెప్పడం వినిపించింది. పోలీసులు నీళ్లను విద్యార్థులపై ప్రయోగించారు. వెంటనే అక్కడి నుంచి తప్పుకోకుండా విద్యార్థులు అదే చోట డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. Bihar is not for beginners..बिहारी होना इतना आसान नहीं है बौस। आंदोलन कुचलने के लिए बिहार पुलिस वाटर कैनन से पानी की बौछार कर रही है । बिहारी लोग झूम झूम कर रेनडांस का मजा ले रहे हैं। pic.twitter.com/x9Tcjj5hO2— Dr. Om Sudha (@dromsudhaa) July 23, 2026మరో వైరల్ వీడియోలో విద్యార్థులు పోలీసుల తాడుతో తాడు థగ్ ఆఫ్ వార్ ఆడినట్టు కనిపించారు. ఇంకో వీడియోలో పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు పెట్టిన బ్యారికేడ్లను కొందరు ఎత్తుకుని పరుగెత్తారు. మరో ఘటనలో గేటు బోల్టులు తీసేసి దాన్నే తీసుకెళ్లినట్టు వార్తలు వచ్చాయి.ఈ వీడియోలపై సామాజిక మాధ్యమాల్లో జోకులు, మీమ్స్ వెల్లువెత్తాయి. "ఇది జంతర్ మంతర్ కాదు బాబూ... ఇది బిహార్" అనే అని కామెంట్లు చేశారు. కొందరు ఈ దృశ్యాలను హోలీ పండుగతో పోల్చారు. నిరసనకు అంతరాయం కలిగించేందుకు ఓ బీజేపీ నాయకుడు అక్కడికి వచ్చారు. ఆయన చేతిలో ఉన్న జెండాను చూసి గుర్తించిన విద్యార్థులు దాడి చేశారు. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ఆ బీజేపీ నాయకుడిని రక్షించారు. CJP Protest Reaches Patna, Bihar 😳 | Biharis Joined Like Never Before!#cjp #cjpprotest pic.twitter.com/hKIua7GfUy— TrendSpark (@ZENLOOP008) July 23, 2026 Bihari On Top#BiharStudentProtest #BiharProtest #PatnaProtest #StudentsProtest #StudentRights #NEET2026 #NEETPaperLeak #JusticeForStudents #BiharStudents #Patna pic.twitter.com/5KyKD0MDVO— JaanVerse (@jaanverse) July 22, 2026 why is bihar police playing tug of war with protesters 😭😭???? pic.twitter.com/0OmP20Q1gY— PrinCe (@Prince8bx) July 23, 2026 -
నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అక్రమాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయవాదులు ముందుకొచ్చారు. గురువారం లంచ్ విరామంలో 'సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్' బ్యానర్ కింద నిరసనకారులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ ప్రవేశికను (Preamble) పఠించారు. ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఎస్. మురళీధర్ (ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి) Supreme Court Bar Association (SCBA) అధ్యక్షుడు డాక్టర్ వికాస్ సింగ్ లీడ్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులపై పోలీసుల దారుణ హింసాకాండను, బలప్రయోగాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా నిలవడం న్యాయవాదుల రాజ్యాంగ బాధ్యత అని ప్రముఖ న్యాయవాదిఇందిరా జైసింగ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: స్టీల్ సిటీ అందాలకు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ ఫిదా, వైరల్ వీడియో Supreme Court Lawyers Fraternity in Delhi, stands up in solidarity with the Students Protest.They read the Preamble in unison and vow to stand by the youth of our Nation. This gets us all new found respect and support for all the Lawyers in the SC of India. So what if the… pic.twitter.com/kRPXYPeylJ— Pragnya Gupta (@GuptaPragnya) July 23, 2026 నీట్ పేపర్లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేస్తున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం డిమాండ్స్తో సీజేపీ ఆధ్వర్యంలో జూన్ 20 నుండి కొనసాగుతున్న ఈ నిరసనకు వాతావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్, AISA విద్యార్థులు కూడా మద్దతు తెరిపిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులు ఆందోళన కారులపై పోలీసుల దమనకాండపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనాయి. మరోవైపు ఈ డిమాండ్లతో నిరసన కారులపై పెట్టిన FIRల ఉపసంహరణ వరకు ఆందోళన విరమించేది లేదని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.ఇదీచదవండి: సీజేపీపై వివాదాస్పద పోస్ట్ : ఎవరీ ఇన్స్టా స్టార్ సోనియాప్రధాని మోదీ స్పందనపరీక్షా పత్రాల లీకేజీ కేసులలో నిందితులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. -
దద్దరిల్లిన జంతర్ మంతర్.. ఢిల్లీలో బొద్దింకల నిరసన
-
భారత్లో అంత బాగా నిరసనలు.. మనమేమో చేతగానోళ్లలా..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనను గమనిస్తున్న పాకిస్థానీయుల్లో ఆసక్తితో పాటు అసూయ కనిపిస్తున్నాయి. "పాకిస్థాన్లో ఇలా నిరసనలు ఎందుకు జరగవు?" అని వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు.నీట్ ప్రశ్నపత్రం లీకులపై జరుగుతున్న నిరసనలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. యువత ముందుండి నడిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఈ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు అవతల పాకిస్థానీయులు ఆశ్చర్యంతో వీటిని గమనిస్తున్నారు. పాటలు, నినాదాలు, ఉద్యమ లక్ష్యం అన్నింటినీ విశ్లేషిస్తున్నారు.క్రికెట్ కోసమైతే వస్తారు.. పాకిస్థాన్ యువత ఎందుకు వీధుల్లోకి రావడం లేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు ఆ దేశీయులు. ఇస్లామాబాద్లోని డీ-చౌక్ వద్ద లైవ్ క్రికెట్ మ్యాచ్లు చూసే జనం.. అక్కడ ఇతర కారణాలపై (సమస్యలపై) మాత్రం ఎందుకు గుమిగూడడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటంటే "పాకిస్థాన్లో అసలు ప్రజాస్వామ్యమే లేదు" అని కంటెంట్ క్రియేటర్ మహ్మద్ వలీద్ చెప్పిన మాటతో చాలామంది ఏకీభవిస్తున్నారు.‘‘డాన్’’ పత్రిక మాజీ సంపాదకుడు సిరిల్ అల్మీడా జంతర్ మంతర్ నిరసనలను "రావల్పిండీకి హెచ్చరిక"గా అభివర్ణించారు. రావల్పిండి నగరంలోనే పాకిస్థాన్ సైన్య ప్రధాన కార్యాలయం ఉంది. తమ దేశంలో ఇలాంటి విప్లవం రావడం లేదని నిరాశ చెందుతున్నారు.పోలీసుల దౌర్జన్యానికి వస్తే రెండు దేశాల్లోనూ పరిస్థితి ఒకేలా ఉంటుందని అంటున్నారు. వలీద్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోలో భారత యువత నుంచి పాకిస్థాన్ యువత నేర్చుకోవాల్సిన విషయాలను వివరించారు. నిరసన చేయాలంటే పెద్ద స్థాయిలో చేయాలని ఆయన అన్నారు. "పాకిస్థానీయులు తమ సంకల్పాన్ని ఎప్పుడూ చూపలేరు. 'నాకు ఏమాత్రం పట్టదు' అనే ధోరణితో ఉంటారు. డిగ్రీ తీసుకుని దేశం వదిలి వెళ్లడంపైనే మాట్లాడుతుంటారు. ఇది ఓడిపోయిన వారి ప్రవర్తన" అని చెప్పారు.బంగ్లా, భారత్లోనే నిరసనలు మరో పాకిస్థాన్ కంటెంట్ సృష్టికర్త నోమీ సయ్యద్ మాట్లాడుతూ.. "ఈ ఉపఖండంలో బంగ్లాదేశీయులు మార్పు తీసుకురాగలుగుతున్నారు. భారతీయులు నిరసన చేయగలుగుతున్నారు. పాకిస్థాన్లో మాత్రం అలాంటి వారు లేరు. మా దేశంలో ఇలాంటి విప్లవం ఎప్పుడూ రాదు" అని ఆయన అన్నారు.మరో ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ మహ్వాష్ అజాజ్ మాట్లాడుతూ.. భారత్లోని నిరసనలకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని చెప్పారు. "వందే మాతరం పాడుతూ దేశ అభివృద్ధి కోసం నిరసన చేస్తారు. కానీ, పాకిస్థానీయులను మాత్రం ఇక్కడ వేర్పాటువాదులుగా ముద్ర వేస్తారు" అని అన్నారు.అయితే అందరూ ఇదే అభిప్రాయంతో లేరు. మానవ హక్కుల పాత్రికేయురాలు అలిఫియా సోహైల్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్ నిరసనల గురించి మీరు మాట్లాడే తీరు, భారత మీడియా భారత్లోని నిరసనల గురించి మాట్లాడే తీరులానే ఉంది" అని అన్నారు."భారత కంటెంట్ సృష్టికర్తలు, ఇన్ఫ్లూయెన్సర్లు తమ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంటున్నారు. ఇక్కడ మాత్రం అణచివేతకు పాల్పడేవారి గొంతుకగా మారేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. వెన్నెముక లేని వర్గం" అని అబ్దుల్లా అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు. -
సీజేపీపై వివాదాస్పద పోస్ట్ : ఎవరీ ఇన్స్టా స్టార్ సోనియా
నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో రక్షణ విధులు నిర్వహించిన RAF (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) అసిస్టెంట్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ సోషల్ మీడియా పోస్ట్పై వివాదం రేగింది.ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలను ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.హర్యానాకు చెందిన ఈ అధికారిణికి ఇన్స్టాగ్రామ్లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, ఫిట్నెస్, ఆధ్యాత్మికత , బైక్ రైడింగ్కు సంబంధించిన అనేక గ్లామరస్ రీల్స్, పోస్టుల ద్వారా ఆమె నెట్టింట సందడి చేస్తూ ఉంటారు. ఇన్స్టా స్టార్ గా ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. తాజాగా సీజేపీ ఆందోళనపై ఒక చనిపోయిన బొద్దింక ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ "తమను తాము బాగుచేసుకోలేని వారు, దేశాన్ని బాగు చేయాలనుకుంటున్నారు" అని క్యాప్షన్ ఇవ్వడం ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పోస్ట్పై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు. CJP స్పందిస్తూ, పోలీసుల హింసను సమర్థిస్తూ నిరసనకారులను బొద్దింకలతో పోల్చడం దారుణం. అయినా బొద్దింకలు ఎప్పటికీ చనిపోవు అంటూ ఎక్స్ వేదికగా సీజేపీ కౌంటర్ ఇచ్చింది.ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చసోషల్ మీడియా పోస్ట్ ద్వారా సర్వీస్ నిబంధనల ఉల్లంఘించారని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు యూనిఫామ్ ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్గా వాడకూడదనే నియమం ఉన్నప్పటికీ, ఆమె తన '3star_Sonia' అకౌంట్లో యూనిఫామ్ ఫోటోనే ఉంచడం గమనార్హం. అయితే సీజేపీ నిరసనల్లో తనకు గాయాలయ్యాయని సోనియా మీడియాకు తెలిపారు. విద్యార్థుల మధ్యలో కొందరు అల్లరి మూకలు, వ్యతిరేక శక్తులు చొరబడి తమపై రాళ్లు, గాజు సీసాలు, చెప్పులు విసిరారని, మహిళలను కాపాడే ప్రయత్నంలో తన చేతికి దెబ్బతగిలి కట్టు పడిందని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్ బెదిరింపు వీడియో వైరల్ -
ఇతను ఎవరు? సీజేపీ ర్యాలీలో ఇంతగా వైరల్ అయ్యాడేంటి?
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలకు చెందిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో వార్తల్లో నిలిచిన వారిలో ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ నకుల్ ధుల్ ఒకరు. నిరసన స్థలం నుంచి ఆయన విడుదల చేసిన భావోద్వేగ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో 'చలో సంసద్' ర్యాలీ సమయంలో పోలీసుల చర్యలో తనతో పాటు తన స్నేహితులపై దాడి జరిగిందని నకుల్ ఆరోపించారు.నకుల్ ధుల్ ఎవరు?నకుల్ ధుల్ ఢిల్లీకి చెందిన డిజిటల్ క్రియేటర్. సామాజిక అంశాలు, విద్య, యువత సమస్యలు, సమకాలీన పరిణామాలపై వీడియోలు రూపొందిస్తుంటారు. ప్రజా విధానాలు, విద్యా అంశాలు, పౌర సమస్యలపై అభిప్రాయాలు, లైవ్ రిపోర్టింగ్, వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన వీడియోలు ఎక్కువగా ప్రజా విధానాలు, విద్య, పౌర అంశాలపై ఉంటాయి. సామాజిక, రాజకీయ పరిణామాలను దగ్గరగా గమనించే ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు.ఎందుకు ట్రెండింగ్లో ఉన్నారు?ఇటీవల ఢిల్లీలో జరిగిన 'చలో సంసద్' నిరసన నుంచి నకుల్ ఒక వీడియో షేర్ చేయడంతో ఆయన ట్రెండింగ్లోకి వచ్చారు. ఆ వీడియోలో.. పార్లమెంట్ వైపు సాగిన నిరసనలో పోలీసులు తీసుకుంటున్న చర్యలో భాగంగా తనతో పాటు తన స్నేహితులను కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది. చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నకుల్ చేసిన ఆరోపణలకు స్వతంత్రంగా ధ్రువీకరణ జరగలేదు. ఆయన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, నిరసనకారులు హెచ్చరికలను పట్టించుకోకుండా నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని, దూకుడుగా వ్యవహరించారని, అందువల్ల వారిని చెదరగొట్టే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.నటి అయేషా ఖాన్కు ఏమైంది?నిరసనలో పాల్గొనకముందే, నినాదాలు చేయకముందే నటి, మోడల్, కంటెంట్ క్రియేటర్ అయేషా ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను సాయంత్రం 4 గంటలకు తన స్నేహితులతో కలిసి నిరసన స్థలానికి చేరుకున్నానని ఆ నటి తెలిపారు. తాను మాట్లాడకముందే, నిరసనలో పాల్గొనకముందే, ఆ ప్రాంతంలో నిరసన చేయడానికి అనుమతి లేదని ఓ పోలీసు అధికారి చెప్పారని ఆమె ఆరోపించారు."బతా దిజియే దూస్రా ఔర్ క్యా రాస్తా హైం? (దయచేసి మరో మార్గం ఏమిటో చెప్పండి?)" అని ప్రశ్నించానని అయేషా తెలిపారు. సమాధానం చెప్పే బదులు పోలీసులు తనను, తన స్నేహితులను పోలీసు వాహనంలోకి ఎక్కాలని కోరారని ఆమె ఆరోపించారు.కాగా, విద్యా రంగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, జవాబుదారీతనం, విద్యా సంస్కరణల డిమాండ్లతో ఈ నిరసనలు మొదలయ్యాయి.ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకత్వం వహిస్తోంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ వైపు ర్యాలీ జరిగిన సమయంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి దూకుడుగా వ్యవహరించారని ఢిల్లీ పోలీసులు చెబుతుండగా, లాఠీచార్జి, టియర్ గ్యాస్ వాడారని నిరసనకారులు ఆరోపించారు.గత కొన్ని రోజులుగా షబానా ఆజ్మీ, వేదాంగ్ రైనా, అనుపమ్ ఖేర్, ప్రకాశ్ రాజ్ సహా పలువురు ప్రముఖులు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. మంగళవారం నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసినా ఉద్యమం కొనసాగుతోంది. -
డ్రగ్స్ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్ బెదిరింపు వీడియో వైరల్
సాక్షి, ముంబై: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది. విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అనే ప్రధాన డిమాండ్లతో సీజేపీ పోరాటానికి రోజు రోజుకు యువత నుంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలోని జంతర్ వంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. భాష్ప వాయువు ప్రయోగించిన వైనం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ధర్నాలు ర్యాలు ఉదృతంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబైలోని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శివాజీ పార్క్, చెంబూర్ , ఆజాద్ మైదాన్తో సహా నగరంలోని కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పౌరులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు తీరుపై, ముంబై కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక వీడియో కొత్త వివాదానికి దారితీసింది. దీనికి ప్రకారం ఒక పోలీసు అధికారి నిరసన ప్రదేశం నుండి అదుపులోకి తీసుకున్న విద్యార్థుల బృందాన్ని నిరసనల్లో పాల్గొంటే అక్రమ మాదకద్రవ్యాల కేసులోఇరికిస్తానని బెదిరించడం కనిపిస్తుంది. అంతేకాదు నిరసనకు తిరిగి రావద్దని, మళ్లీ ఇక్కడ కనిపిస్తే, మీ బ్యాగుల్లో 50-50 గ్రాముల పౌడర్ (మాదక ద్రవ్యం) పెడతాను, దాంతో మీ జీవితం నాశనమైపోతుంది అంటూ ఆ పోలీసు అధికారి విద్యార్థులతో అనడం వీడియోలో ఉంది. (కిచిడీ ఫెయిల్, అంతరిక్ష వంటకాల్లో మూడింటికే చోటు : ఎందుకో?)ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చMumbai Police are threatening students" If you come to Protest again, I will frame you all in drug case and you'll spend your whole life in Jail.I'm a very bad guy,don't test me, I'll throw u all in Jail" This is what goons in uniform look like, Hope the Nation is watching…— 🪳Against Corruption (@akashuchani08) July 23, 2026 ఈ వీడియో వైరల్ కావడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ముంబై పోలీసులు, దీనికి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులపై విచారణను ప్రారంభించారు. విచారణ పూర్తయ్యే వరకు, వీడియోలో యూనిఫాంలో కనిపించిన సదరు అధికారిని ప్రస్తుత విధి నిర్వహణ నుండి తప్పించారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: వందే భారత్లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ -
కాక్రోచ్ నిరసనపై PM మోదీ రియాక్షన్
-
గుజరాత్లోనూ నిరసనలు.. అహ్మదాబాద్లో ఆందోళనలు ఉధృతం
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు గుజరాత్కూ విస్తరించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు అహ్మదాబాద్లో నిరసనలకు దిగారు. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీలు నిర్వహిస్తూ తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. భద్రతా దృష్ట్యా అహ్మదాబాద్లోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సీజేపీ నేతలు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేరే వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, నిరసనలు చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.MUMBAI ❌️ DELHI ❌️ Now, visuals emerge from Ahmedabad, Gujarat — home of Modi and Shah. Students are protesting against a failed education system. 👇 pic.twitter.com/zxQaQC3QcP— Priya Purohit (@Priyaa_Purohit) July 23, 2026 ఇదిలా ఉండగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సీజేపీ నిరసనలు కొనసాగడం గమనార్హం. బీహార్, ఒడిషా, మహారాష్ట్ర, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో సైతం సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. The protest at Gujarat University in Ahmedabad remains ongoing, with students persisting in their demonstration despite considerable police mobilisation and the arrest of demonstrators.#StudentProtest #GujaratUniversity #NEETProtest #PoliceDetention #StudentVoice pic.twitter.com/BQTyKTp6au— Kumar R Talukdar🇮🇳 (@Kumarjyoti49291) July 22, 2026Ahmedabad, Gujarat 📍मोदी जी के गढ़ गुजरात में भी छात्र अब सड़को पर उत्तर आए हैं 🔥🔥 pic.twitter.com/KxbDWcd93L— Amit Mishra (@Amitjanhit) July 23, 2026 -
కాక్రోచ్ జనతా పార్టీకి సల్మాన్ ఖాన్ మద్దతు
-
మోదీ ట్వీట్కు రాహుల్, సీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసిన ట్వీట్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి.ప్రధాని మోదీ స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ ఘాటు స్పందనప్రధాని ట్వీట్పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’’ అంటూ విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి రాజీనామా చేయాల్సిందే:సీజేపీమరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్పై స్పందించింది. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించింది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది. -
నీట్ను కంగాళి చేసి .. బిడ్డల్ని ఫారిన్లో చదివిస్తావా?
నీట్–యూజీ పరీక్ష నిర్వహణపై నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్ష పారదర్శకతపై ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడిన నీట్ వంటి కీలక పరీక్షపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. కాబట్టి నైతిక బాథ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో..నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘సామాన్య విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే.. పరీక్ష వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఎలా వస్తాయి?’’ అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.‘నీట్ను కంగాళి చేసి..’ అంటూ విమర్శలునీట్ వివాదంపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. నీట్ కోసం పోరాడుతున్న దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.కుమార్తె సోషల్ మీడియా ఖాతాపై చర్చసోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం ఇదేనని ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొందరు నెటిజన్లు దీనిని నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఒత్తిడిగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.విమర్శలు ఎటు వరకు?ప్రజా విధానాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని కొందరు అంటున్నారు. అయితే రాజకీయ విమర్శలు కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల వరకు వెళ్లకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షా ప్రక్రియలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.రాజకీయ రంగు పులుముకున్న నీట్ వివాదంనీట్ పరీక్ష వ్యవహారం ఇప్పుడు కేవలం విద్యార్థుల సమస్యగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ.. ఇంకోవైపు రాజకీయ ఆరోపణలు.. ఇలా నీట్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్ష వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. -
గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు నిరసనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజా పరిణామాలు ఇవే..Live Updates08: 14 PMగాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనఇండి కూటమి ఎంపీల కొవ్వొత్తుల ప్రదర్శనగాంధీ స్మృతి కేంద్రం వద్ద నివాళులర్పిస్తున్న ఇండి కూటమి నేతలుమొదట ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించిన నేతలుప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రానికి వచ్చిన నేతలునీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇండికూటమి నేతల నివాళి 07: 30 PMవిద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కాలని భావించాం: రాహుల్ఇండియాగేట్కు వెళ్దామంటే అనుమతి ఇవ్వలేదువిద్యార్థులంతా రోడ్డుపై ఉన్నారురాజ్ఘాట్కు వెళ్దామని అనుకుంటున్నాంమా బస్సును పోలీసులు అడ్డుకున్నారుబస్సును వదిలి డ్రైవర్ వెళ్లిపోయాడు07:18 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల ర్యాలీరాజ్ఘాట్కు ర్యాలీగా వెళ్తున్న రాహుల్, ఇండి కూటమి నేతలురాజ్ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్న ఇండి కూటమి నేతలువిద్యార్థులు ఒంటరి వారు కాదు.. బాసటగా నిలుస్తాం: రాహుల్07:08 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలురాహుల్ నివాసంలో ముగిసిన ఇండి కూటమి ఎంపీల భేటీరాజ్ ఘాట్ బయల్దేరిన రాహుల్, ఇండి కూటమి నేతలువిద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్06:13 PMరాహుల్ గాంధీ నివాసంలో విపక్షాల కీలక భేటీవిద్యార్థుల ఆందోళనలు, తాజా పరిణామాలపై చర్చసమావేశం అనంతరం రాజ్ఘాట్కు వెళ్లే యోచనరాహుల్ గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు04:50PMరేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపుశాంతియుతంగా నిరసనలు చేపట్టాలన్న సీజేపీ 03:21 PMనీట్ పేపర్ లీక్ కేసుపై కేంద్రం కీలక నిర్ణయంనాలుగు రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుబాంబే హైకోర్టులోని రెండు బెంచ్ల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులుపేపర్ లీక్ చట్టం కింద ప్రతిరోజూ విచారణ03:13 PMసీజేపీని మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంఅన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమన్న కేంద్రం..జంతర్మంతర్లోనే చర్చలు జరగాలని పట్టుబడుతున్న సీజేపీ02:03 PM | కేంద్రం సంచలన నిర్ణయంఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలునిరసనకారుల్ని మూడు నెలల బంధించే అధికారంసీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీస్ కమిషనర్కు విశేష అధికారాలిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుసీజేపీ ఆందోళనలతో ఢిల్లీ పోలీసులకు అదనపు అధికారాలునేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించే అవకాశంగెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ1:58 PM | నిరసనకారుల్ని బెదిరించిన పోలీస్పై చర్యలుముంబైలో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు డ్రైవర్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.‘‘డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’’ అంటూ విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.వీడియోపై స్పందించిన ముంబై పోలీస్ శాఖ.. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.నిరసనకారులపై తప్పుడు కేసులు పెట్టడం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.01:18 PM | సీజేపీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతుజంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుఅంతకంతకు పెరుగుతున్న మద్దతు కమల్ హాసన్, నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటుల మద్దతుమొదటి విద్యార్థి మరణం దగ్గరే ప్రభుత్వం స్పందించి ఉండాల్సిందేన్న కమల్బాలీవుడ్ మద్దతు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్న షాఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్ తారలుఇటు సౌత్లోనూ పలువురి సపోర్ట్12:21 PM | మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు దృష్టిసీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో మూసివేసిన మెట్రో స్టేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది.సెంట్రల్ ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీంకోర్టు సమీప మెట్రో స్టేషన్ మూసివేత వల్ల కేసులకు హాజరయ్యే వారికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.ఎంట్రీ పాస్లు ఉన్న న్యాయవాదులు, రిజిస్ట్రీ సిబ్బందిని భద్రతా తనిఖీల తర్వాత అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే మధ్యాహ్నం తర్వాత తాను జోక్యం చేసుకుంటానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.ఇప్పటికే మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 11:33 AM | ముంబైలో పోలీస్ వాహనం నుంచి నిరసనకారుల పరార్చెంబూర్లో జరిగిన CJP నిరసనల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.అదుపులోకి తీసుకున్న విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వ్యాన్ తలుపును ఓ వ్యక్తి తెరిచినట్లు వైరల్ వీడియోలో కనిపించింది.దీంతో పలువురు విద్యార్థులు వాహనం నుంచి బయటకు వచ్చి పరారైనట్లు సమాచారం.నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు.దాదాపు 700–800 మంది ఆందోళనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.సుమారు 200 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.11:31 AM | రాళ్ల దాడిలో ఢిల్లీ ఏసీపీకి గాయాలుజంతర్ మంతర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రాళ్ల దాడిలో ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు.తలకు గాయం కావడంతో పాటు చేతులు, కాళ్లు, భుజంపై గాయాలైనట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు.చెవి నుంచి రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.11:14 AM | ప్రధాని మోదీ ట్వీట్పై CJP చీఫ్ సెటైర్పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్ చేశారు.ప్రధాని ట్వీట్లోని “యువత భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యం” అన్న వ్యాఖ్యలపై సెటైరికల్గా పోస్టు చేశారు.‘‘Hi, my name is Nothing’’ అంటూ గ్రాఫిక్ను షేర్ చేశారు. https://t.co/mo44rK6tNc pic.twitter.com/kEeHWUMouF— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026 11:08 AM | బిహార్ అసెంబ్లీలో నీట్ నిరసనల సెగవిద్యార్థులపై లాఠీచార్జ్ అంశం బిహార్ అసెంబ్లీని కుదిపేసింది.విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రశ్నించారు.మరోవైపు తమ వాహనంపై దాడి చేసిన వారిని అధికార కూటమి ఎమ్మెల్యేలు ‘గూండాలు’గా అభివర్ణించారు.అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతపార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యువత ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులు.. భారీగా మోహరింపుయువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటుఇవాళ పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజు భేటీఉభయ సభల్లోనూ విపక్షాల నిరసనలతో కొనసాగుతున్న వాయిదాల పర్వంశాంతియుతంగానే నిరసనలు కొనసాగుతాయన్న సీజేపీచలో సంసద్ మళ్లీ ఉండబోదన్న సీజేపీజంతర్ మంతర్ వద్దే దీక్ష చేస్తున్న మద్దతుదారులునిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని సీజేపీ ఆరోపణఅప్రమత్తంగా ఉండాలని వలంటీర్లకు ప్రతినిధుల పిలుపు11:04 AM | అభిజిత్ దీప్కేకు అస్వస్థతCJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు అస్వస్థతనిరసనలకు దూరంగా ఇవాళ రెస్ట్ తీసుకోనున్న దీప్కే గత కొన్ని రోజులుగా జ్వరం, తీవ్ర ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సీజేపీ వెల్లడి.నొప్పి నివారణ మందులతో ఇప్పటివరకు కొనసాగానని.. విశ్రాంతి కోసం కొంత సమయం పాటు నిరసన స్థలం నుంచి దూరంగా ఉంటాడని వెల్లడితిరిగి సాయంత్రానికి తిరిగి జంతర్ మంతర్కు వచ్చే చాన్స్.10:50 AM | పోలీసుల చర్యలపై ప్రియాంక గాంధీ ప్రశ్నలునిరసనకారులపై లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిజంగా శ్రద్ధ చూపిస్తే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలు వినాలని కేంద్రాన్ని కోరారు.10:46 AM | ‘విద్యార్థుల మాట వినండి’నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని ప్రియాంక గాంధీ అన్నారు.సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు.10:43 AM | జంతర్ మంతర్కు అలఖ్ పాండేఫిజిక్స్ వాలా సీఈవో అలఖ్ పాండే జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో పాల్గొన్నారు.ఆందోళనకారులను ‘పాక్ ఫండెడ్’, ‘చైనా మద్దతుదారులు’గా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు.పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థుల అంశాన్ని ప్రస్తావించారు.10:34 AM | చండీగఢ్కు విస్తరించిన నిరసనలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో చండీగఢ్లోనూ నిరసనలు జరిగాయని CJP తెలిపింది.దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.10:31 AM | చర్చలు ఉంటాయా? ఉండవా?!మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న విపక్షాలు, నిరసనకారులురాజీనామా తర్వాతే పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలంటున్న ప్రతిపక్షాలుఅప్పటిదాకా సమావేశాలను ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టీకరణఇటు.. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుమంత్రి రాజీనామా చేస్తేనే ఆందోళనలు విరమిస్తామని స్పష్టీకరణఇదివరకే మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులురాజీనామా సహా మూడు డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తిడిమాండ్లపై ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయని కేంద్రంచర్చలు ఉంటాయంటూనే.. ముందుకు అడుగు వేయని వైనంచర్చలకు కేంద్రమే దిగి రావాలని.. తాము వెళ్లబోమని సీజేపీ కుండబద్ధలులీక్కు కారకులైన వాళ్లను వదలమని.. కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటనమంత్రి రాజీనామాపై మాత్రం మౌనం!ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ముడిపడి ఉన్న నీట్ నిరసనల వ్యవహారంకేంద్రం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠచర్చలు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్ధం10:00 AM | నిరసనల్లోకి చొరబడ్డ అసాంఘిక శక్తులు!కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ఆరోపణలు సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. నిరసనల్లోకి కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డారని తెలిపారు. వారిని నియంత్రించేందుకు వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. రాత్రి సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని, టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు.09:49 AM | ‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’పేపర్ లీక్లపై ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. యువత భవిష్యత్తుకు అత్యధిక నష్టం చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.09:49 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: CJP పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై స్పందించిన CJP.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ను మరోసారి తెరపైకి తెచ్చింది.09:42 AM | పోలీస్పై దాడి వీడియో వైరల్జూలై 20న జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో కొందరు ఆందోళనకారులు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని వెంబడించి దాడి చేసినట్లు కనిపిస్తోంది.09:28 AM | ముంబైలోనూ CJP నిరసనలు.. 1,500 మందికి పైగా పాల్గొనడంNEET పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబై శివాజీ పార్క్లో భారీ నిరసన చేపట్టారు. ఇందులో నటులు, కమెడియన్లు కూడా పాల్గొన్నారు.09:17 AM | NEET పేపర్ లీక్పై ఫాస్ట్ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ ప్రకటనపరీక్షల పేపర్ లీక్లకు పాల్పడిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.09:05 AM | ముంబైలో నిరసనలు.. 200 మంది అదుపులోకిఅనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్లో జరిగిన ఆందోళనలో సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.08:59 AM | నిరసనల్లో గాయపడిన పోలీస్ అధికారి ఫొటో వైరల్CJP ఆందోళనల్లో ఇన్స్పెక్టర్ నందకిశోర్పై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఫొటో బయటకు వచ్చింది.08:21 AM | కేంద్రంపై ఆప్ నేత అతిషి విమర్శలుఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేతపై ఆప్ నేత అతిషి స్పందించారు. సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కానీ విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు.08:21 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది: CJP చీఫ్CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని కోరారు.08:21 AM | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీనియర్ అధికారిఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ దేవేశ్ చంద్ర శ్రీవాస్తవ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పోలీసులను పరామర్శించారు.07:55 AM | పోలీస్ అధికారి చర్యలపై CJP స్పందననిరసనకారిణిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ADCPను విధుల నుంచి తప్పించడంపై CJP స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.🔴 08:21 AM | ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేతCJP నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. రాజీవ్ చౌక్, మండీ హౌస్, ఐటీవో వంటి కీలక స్టేషన్ల వద్ద రాకపోకలను నిలిపివేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి.🔴 08:13 AM | మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం: CJPకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నిరసన 34వ రోజుకు చేరిందని, సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష 26వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.🔴 07:55 AM | పోలీస్ అధికారిపై చర్యలకు CJP డిమాండ్జంతర్ మంతర్ వద్ద మహిళా నిరసనకారిపై పోలీస్ అధికారి చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో.. సదరు అధికారిని సస్పెండ్ చేసి, విచారణ జరపాలని CJP డిమాండ్ చేసింది.🔴 07:24 AM | భద్రత కట్టుదిట్టం.. మెట్రో సేవలపై ప్రభావంకేంద్ర ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.🔴 07:13 AM | ఇంటర్నెట్ నిలిపివేతపై కాంగ్రెస్ ఆరోపణలుజంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. యువత నిరసన గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.🔴 05:01 AM | ముంబైలో 13 ఎఫ్ఐఆర్లు నమోదుCJPకి మద్దతుగా జరిగిన అనుమతి లేని నిరసనలపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. గత ఐదు రోజుల్లో 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. దాదాపు 400 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.🔴 03:46 AM | నాగ్పూర్లో నిరసనకారుల తరలింపునాగ్పూర్లోని సంవిధాన్ స్క్వేర్ వద్ద కొనసాగిన నిరసనను పోలీసులు రాత్రివేళ తొలగించారు. గడువు ముగిసినా ఆందోళన కొనసాగించడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్య సమయంలో కొందరు యువకులు జాతీయ గీతం ఆలపించారు.🔴 02:44 AM | మరో పోలీస్ చర్యపై CJP ఆరోపణలుజంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని CJP ఆరోపించింది. మరోసారి పోలీస్ చర్యకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? అంటూ ప్రశ్నించింది.🔴 02:04 AM | షరతులతో దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్చుక్నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. విద్యార్థులు కూడా తాత్కాలికంగా ఆందోళన విరమించి చర్చలకు రావాలని కోరారు.🔴 01:45 AM | నిరసనలో నేరస్తుడి హల్చల్!జూలై 20న జంతర్ మంతర్ నిరసనలో చరిత్ర కలిగిన నేర చరిత్ర కలిగిన హాజీ అఫ్జల్ కనిపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.🔴 01:18 AM | బ్యారికేడ్లు దాటేందుకు మళ్లీ ప్రయత్నంజంతర్ మంతర్ వద్ద కొందరు నిరసనకారులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.🔴 11:16 PM | దేశవ్యాప్తంగా నిరసనలపై కేంద్రం సమీక్షCJP ఆందోళనలు పలు రాష్ట్రాలకు విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. మహారాష్ట్రలో అత్యధికంగా నిరసనలు నమోదయ్యాయని, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, అసోం, హర్యానాల్లోనూ ఆందోళనలు జరిగాయని అధికారులు తెలిపారు.🔴 10:30 PM | ఢిల్లీలో రాళ్ల దాడి ఘటనకనాట్ ప్లేస్ సమీపంలోని టాల్స్టాయ్ మార్గ్ వద్ద పోలీసులు, RAF సిబ్బందిపై కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ గాయపడినట్లు వెల్లడించారు. -
భారత్లో నిరసనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత్లో జరుగుతున్న నిరసనలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న నిరసనలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇలా అన్నాడు.I am disturbed because every protest in India seems to have the same script.1. Abuse Lord Ram.2. Abuse Bharat Mata.3. Abuse PM Modi.4. Abuse PM Modi’s late mother.5. Abuse Brahmins.6. Abuse Hindutva.No discussion.No solutions.Only slogans, abuse, and chaos.The…— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026"భారత్లో జరిగే ప్రతి నిరసనకూ ఒకే రకమైన స్క్రిప్ట్ ఉండటం బాధాకరం. అనేక నిరసనల్లో సమస్యల పరిష్కారం కంటే రాముడిని తిట్టడం, భరతమాతను తిట్టడం, నరేంద్ర మోదీని, ఆయన తల్లిని తిట్టడం, హిందుత్వం, బ్రాహ్మణులపై విమర్శలు చేయడమే ఎక్కువగా కనిపిస్తుంది. చర్చలు లేవు, పరిష్కారాలు లేవు.. నినాదాలు, దూషణలు, గందరగోళమే కనిపిస్తుంది.అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాకముందే కొందరు రైతులు ఢిల్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు.ప్రతిపక్ష రాజకీయ వర్గాలు నేపాల్ తరహా పరిస్థితిని సృష్టించగలమనే భ్రమలో ఉన్నాయి. రోజురోజుకు పరిస్థితి మరీ సర్కస్లా మారుతుంది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా నిరసన తెలపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, దేశం ఎలా పురోగమించగలదు" అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.దానిష్ కనేరియా చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతడి అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు.కాగా, పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ అయిన కనేరియా గతంలోనూ భారత దేశానికి, ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడి వార్తల్లో నిలిచాడు. కనేరియా హిందువు కావడంతో పాక్ జట్టులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని గతంలో చాలాసార్లు ప్రస్తావించాడు. -
సీజేపీ నిరసనకు స్పాన్సర్ ఎవరు?.. అసలు కథ ఇదే
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. జంతర్మంతర్ వద్ద మరో ఆసక్తికర అంశం చర్చకు దారితీస్తోంది. నిరసనకారుల వెనుక ఎవరున్నారు?. అసలు వాళ్లకు మద్దతుగా వస్తున్న ఆహారం, నీరు, ఇతర సహాయ సామగ్రి ఎవరు పంపిస్తున్నారు? నిజంగానే ఆ ఆర్డర్లు ముంబై, హైదరాబాద్లాంటి నగరాల నుంచి ఆర్డర్ చేస్తున్నవేనా?.. ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.సీజేపీ ఆందోళనలు దేశానికి ప్రమాదకరమని.. ఈ ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. విదేశీ నిధులు, ముఖ్యంగా పాక్ నుంచి ఫండింగ్ వస్తోందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అదే సమయంలో నిరసన ప్రాంగణంలో కనిపిస్తున్న పరిణామాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.జంతర్మంతర్కు వరుసగా.. నిరసన ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్ డెలివరీలు వస్తూనే ఉన్నాయి. దాల్ చావల్, రాజ్మా చావల్, టీ, శాండ్విచ్లు, బర్గర్లు, తాగునీటి బాటిళ్లు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి. కొందరు డెలివరీ రైడర్లు వరుసగా రావడం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ ఆహారాన్ని ఎవరు పంపిస్తున్నారో తమకు తెలియదని వాలంటీర్లు చెబుతున్నారు. ఆర్డర్ వచ్చిన ప్రాంతం మాత్రమే తెలుస్తుందని.. పంపించిన వ్యక్తుల వివరాలు తమకు తెలియవని అంటున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సహాయం?నిరసనకారుల ప్రకారం.. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, నాగ్పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి కూడా సహాయం అందుతోందని వారు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు నేరుగా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా.. తమ మద్దతును ఆహారం, నీరు వంటి రూపాల్లో తెలియజేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తాము మద్దతుగా ఆర్డర్లు పెడుతున్నామంటూ కొందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. జూలై 20 తర్వాతే పెరిగిన మద్దతుజూలై 20న చలో సంసద్కు సీజేపీ ప్రయత్నించింది. అయితే ఘర్షణల నేపథ్యం, అలాగే నిరసనకారులకు గాయాలు అయిన నేపథ్యంలో.. శాంతియుతంగా జంతర్ మంతర్ వద్దే ఆ మరుసటి రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని అంటోంది. అయితే లాఠీ చార్జి పరిణామాల తర్వాత నిరసనకు ప్రజల నుంచి మద్దతు పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అంతకుముందు వరకు పరిమితంగా ఉన్న సహాయం.. ఆ తర్వాత భారీగా పెరిగిందని వాలంటీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆహార కొరత లేదని, రోజంతా పలు పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఒకానొక దశలో.. ఫుడ్ ఆర్డర్లు భారీగా చేరడంతో ఇక భోజనాలు పంపొద్దంటూ CJP తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేసింది.ఫండింగ్పై రాజకీయ ఆరోపణలు.. సోషల్ మీడియాలో చర్చఅయితే ఉద్యమానికి వస్తున్న మద్దతుపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. నిరసనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందన్న అంశంపై అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొన్ని వర్గాలు నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని ఆరోపిస్తుండగా.. మరికొందరు మాత్రం విద్యార్థుల సమస్యపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని వాదిస్తున్నారు.సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫుడ్ సపోర్ట్ను ప్రజల స్వచ్ఛంద మద్దతుగా చూస్తుంటే.. మరికొందరు ఉద్యమానికి నిధుల మూలాలపై స్పష్టత అవసరమని ప్రశ్నిస్తున్నారు.పేర్లు తెలియని దాతలు.. కనిపిస్తున్న మద్దతుప్రస్తుతం జంతర్మంతర్ వద్ద కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే.. పేర్లు వెల్లడించని వ్యక్తుల నుంచి ఆహారం, నీరు వంటి సహాయం నిరసనకారులకు చేరుతోంది. అయితే ఈ సహాయం వెనుక ఎవరు ఉన్నారు? ఇది కేవలం వ్యక్తిగత మద్దతేనా? లేదంటే మరేదైనా వ్యవస్థీకృత సహకారం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఒకవైపు.. ఆధారాలతో నిరూపితమైన వాస్తవాలు మరోవైపు. సీజేపీ నిరసనల చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చల మధ్య.. జంతర్మంతర్ ఫుడ్ ప్యాకెట్ల కథ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. -
సీజేపీ నిరసనలపై స్పందించిన యువీ
గత కొద్ది రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి శాంతి, సంభాషణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చాడు.తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొస్తూ.."ప్రతి చిన్నారి, విద్యార్థి, మహిళ, పురుషుడు ప్రశాంత వాతావరణంలో చదువుకునే, సురక్షితంగా ఎదిగే, తమ కలలను సాకారం చేసుకునే అవకాశం పొందాలి. వారి సంక్షేమమే భారత భవిష్యత్తుకు బలమైన పునాది. సంభాషణ ద్వారానే దేశ భవిష్యత్తు కోసం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది" అని పేర్కొన్నాడు.Yuvraj Singh Instagram Story. pic.twitter.com/ufb1k3JVBX— Jotdofficial (@jotdofficial_) July 22, 2026విద్యార్థుల నిరసనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో యువరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఆయన ఏ రాజకీయ పక్షానికీ మద్దతు ప్రకటించకుండా, విద్యార్థుల భద్రత, సంక్షేమం, విద్యా భవిష్యత్తుపైనే తన సందేశాన్ని కేంద్రీకరించాడు.క్యాన్సర్ను జయించిన తర్వాత యువరాజ్ స్థాపించిన 'YouWeCan' ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ అవగాహన, చికిత్స సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై ఇప్పుడిప్పుడే సెలబ్రిటి లోకం స్పందించడం మొదలు పెట్టింది. తొలుత ఈ విషయంపై మాట్లాడేందుకు వెనకడుగు వేసిన వారు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి యువరాజ్ సింగ్ చేరాడు.కాక్రోచ్ల నిరసనలపై క్రికెట్ రంగానికి సంబంధించి యువరాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలో నెటిజన్లు మరో భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల నిరసనలతో దేశం అట్టుడికి పోతుంటే విరాట్ మాత్రం స్వామీజీల చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.దేశ యువత భవిష్యత్తు పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తిగా విరాట్ను అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వాడు యువతకు ఏరకంగా ఆదర్శంగా నిలుస్తాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరు విరాట్ తన మఖాంను యూకే మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని దేశం నుంచే బహిష్కరించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.దేశం పట్ల, దేశ యువత పట్ల ఏమాత్రం బాధ్యలేకుండా ఇక్కడ సంపాదించుకొని విదేశాల్లో స్థిరపడే వారికి కూడా యువత సరైన గుణపాఠం నేర్పాలని పిలుపునిస్తున్నారు.


