Other Sports
-
హాకీ ఇండియా లీగ్.. పాకిస్తాన్ ఆడుతుందా?
నోయిడా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) 2026 సీజన్ వచ్చే ఏడాది జనవరి 5న ప్రారంభం కానుంది. ఈ మేరకు హాకీ ఇండియా (హెచ్ఐ) కార్యదర్శి భోళానాథ్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడేళ్ల విరామం తర్వాత గతేడాది తిరిగి నిర్వహించిన హెచ్ఐఎల్కు మంచి ఆదరణ లభించగా ఈసారి మహిళల లీగ్లో మరో రెండు జట్లను పెంచనున్నట్లు భోళానాథ్ తెలిపారు. ‘హెచ్ఐఎల్ (HIL 2026) వచ్చే సీజన్ తేదీలు ఖరారయ్యాయి. పురుషుల విభాగంలో 8 ఫ్రాంఛైజీలు యథావిథిగా పాల్గొంటుండగా... మహిళల విభాగంలో గత సీజన్లో పాల్గొన్న నాలుగు జట్లతో పాటు మరో రెండు జట్లు అదనంగా చేరనున్నాయి. వేదిక ఇంకా ఖరారు కాలేదు. విదేశీ ఆటగాళ్ల వెసులుబాటుకు తగ్గట్లే షెడ్యూల్ను జనవరి 5 నుంచి ప్రారంభిస్తున్నాం’ అని భోళానాథ్ వెల్లడించారు.ఇక గత సీజన్కు సంబంధించి కొంత మంది ప్లేయర్లకు డబ్బులు చెల్లించలేదనే వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఫ్రాంఛైజీలన్నీ హెచ్ఐఎల్ నియమావళిని పాటిస్తున్నాయని తెలిపారు. హాకీ ప్లేయర్లు (Hockey Players) చదువు కొనసాగించేందుకు వీలుగా అమిటీ యూనివర్సిటీతో హాకీ ఇండియా ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ద్వారా ప్లేయర్లు ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్ ద్వారా తమ చదువు కొనసాగించే అవకాశం దక్కింది.కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం మరోవైపు భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా కప్ హాకీ (Asia Cup Hockey) టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనే అంశంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అని హాకీ ఇండియా వెల్లడించింది. ప్రభుత్వం సూచనల మేరకే నడుచుకుంటామని వెల్లడించింది. చదవండి: ప్రొ హాకీ లీగ్కు భారత్ జట్టు ప్రకటన -
ప్రొ హాకీ లీగ్కు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) జట్టును ప్రకటించింది. జూన్ 7 నుంచి యూరప్లోని అమ్స్టెల్వీన్, నెదర్లాండ్స్, అంట్వెర్ప్, బెల్జియంలో భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్లు ఆడనుంది. దీని కోసం గురువారం 24 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జూన్ 7, 9న నెదర్లాండ్స్తో, 11, 12న అర్జెంటీనాతో టీమిండియా తపలడుతుంది. ఆ తర్వాత 14, 15న ఆ్రస్టేలియాతో, 21, 22న బెల్జియంతో మ్యాచ్లు ఆడుతుంది. ఈ ఏడాది ఆరంభంలో భువనేశ్వర్ వేదికగా జరిగిన హాకీ ప్రొ లీగ్ అంచె పోటీల్లో 8 మ్యాచ్లాడిన భారత్ 5 విజయాలతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ‘అనుభవజు్ఞలు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. ప్లేయర్లంతా బాగా సాధన చేశారు. హాకీ ప్రపంచకప్నకు అర్హత సాధించే నేపథ్యంలో... ప్రతి పాయింట్ కీలకం కావడంతో అన్నీ మ్యాచ్ల్లో విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం. పెనాల్టీ కార్నర్లను సది్వనియోగం చేసుకునే అంశంలో మరింత దృష్టిపెట్టాం’అని భారత హెడ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ అన్నాడు. పరాజయాలను ‘డ్రాలుగా... ‘డ్రా’లను విజయాలుగా మలచడమే లక్ష్యంగా ఉన్నామన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు గోల్కీపర్స్: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్, డిఫెండర్స్: సుమిత్, అమిత్ రొహిదాస్, జుగ్రాజ్ సంగ్, నీలమ్ సంజీప్, హర్మన్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, యశ్దీప్ సివాచ్, మిడ్ఫీల్డర్స్: రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, రాజిందర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, శంషేర్ సింగ్, ఫార్వర్డ్స్: గుర్జాంత్ సింగ్, అభిషేక్, శైలానంద్ లక్రా, మన్దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, దిల్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్. -
పతకమే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఈ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. 2023లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలుగమ్మాయి స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో నిరాశజనక ప్రదర్శన తర్వాత గాయాల నుంచి కోలుకున్న 25 ఏళ్ల జ్యోతి పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు తన టెక్నిక్లో మార్పులు చేసుకొని పాత పద్ధతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పారిస్ విశ్వక్రీడల కోసం ‘సెవెన్ స్ట్రయిడ్’ టెక్నిక్ ప్రయత్నించాను. కానీ అది నాకు ఉపయోగపడలేదు. దాని వల్ల రెండుసార్లు గాయపడ్డా. అందుకే పాత పద్దతైన ‘ఎయిట్ స్ట్రయిడ్’లోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. గాయాల బారిన పడకుండా ఉంటే 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకముంది’ అని జ్యోతి చెప్పింది. హర్డిల్స్ మధ్య అడుగుల వ్యూహాన్ని స్ట్రయిడ్ అంటారు. 100 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) కలిగిన జ్యోతి... గత ఆసియా చాంపియన్షిప్ 200 మీటర్ల పరుగులో రజత పతకం కూడా నెగ్గింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 59 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం గురువారం దక్షిణ కొరియాకు బయల్దేరింది. -
క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: తొలి రౌండ్లో మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్లపై రాణించిన భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్.ప్రణయ్, ఆయుశ్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్లకు పరాజయం ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్ చేరగా... మహిళల డబుల్స్లో ప్రేరణ అల్వేకర్–మృణ్మయి దేశ్పాండేలకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రేరణ–మృణ్మయి జంట 9–21, 14–21తో సూ యిన్ హుయ్–లిన్ జి యున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్లో తనీషా–ధ్రువ్ కపిల జోడీ 21–17, 18–21, 21–15తో ఫ్రాన్స్కు చెందినలీ పాలెర్మో–జులియెన్ మైమో జంటపై గెలిచింది. శ్రీకాంత్ వరుస గేముల్లో... పురుషుల సింగిల్స్లో ఒక్క శ్రీకాంత్ మాత్రమే ముందంజ వేశాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంక్ ప్లేయర్ శ్రీకాంత్ 23–21, 21–17తో తనకన్నా మెరుగైన 33వ ర్యాంకర్ ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ రెండు గేములు గెలిచేందుకు శ్రీకాంత్ 59 నిమిషాలు పాటు చెమటోడ్చాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఫ్రాన్స్కు చెందిన తొమా పొపొవ్తో తలపడతాడు. మిగతా పురుషుల సింగిల్ పోటీల్లో సతీశ్ కరుణాకరన్ 14–21, 16–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆశించిన స్థాయి ఆటతీరు కనబరచలేకపోయిన ప్రణయ్ 9–21, 18–21తో వరుస గేముల్లో యుషి తనక (జపాన్) చేతిలో కంగుతినగా... ఆయుశ్ శెట్టి 13–21, 17–21తో తొమ పొపొవ్ ధాటికి నిలువలేకపోయాడు. -
అతడి బాటలో నడుస్తా.. ప్రొఫెషనల్గా సిమ్రన్జీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సిమ్రన్జీత్ కౌర్ ప్రొఫెషనల్గా మారనుంది. ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన 29 ఏళ్ల సిమ్రన్జీత్ కౌర్ (Simranjeet Kaur)... అమెరికా మాజీ బాక్సర్ రాయ్ జోన్స్, భారత బాక్సర్ మన్దీప్ జాంగ్రాతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది భారత్ నుంచి నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ ప్రొఫెషనల్గా మారగా... ఇప్పుడు ఆ జాబితాలో సిమ్రన్జీత్ కూడా చేరింది.కాగా 2020 టోక్యో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సిమ్రన్జీత్... ఆసియా చాంపియన్షిప్స్లో పలు పతకాలు నెగ్గింది. ఈ ఏడాది జాతీయ చాంపియన్షిప్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన కౌర్... అమెచ్యూర్ బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.అతడి బాటలోనే నడుస్తూ‘ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మన్దీప్ జాంగ్రా ఇప్పటికే దేశం గర్వపడే విజయాలు సాధించారు. అతడి బాటలోనే నడుస్తూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు నావంతు ప్రయత్నం చేస్తా. ఈ ప్రయాణంలో రాయ్ జోన్స్ సహకారం మరవలేను’ అని సిమ్రన్జీత్ పేర్కొంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన భారత బాక్సర్ విజేందర్ సింగ్... దేశం నుంచి తొలి ప్రొఫెషనల్ బాక్సర్గా మారగా... ఆ తర్వాత వికాస్ కృషన్, సరితా దేవి, నీరజ్ గోయత్ వంటి పలువురు బాక్సర్లు ప్రొఫెషనల్స్గా మారారు. కాగా పంజాబ్ నుంచి తొలి మహిళా ప్రొఫెషనల్ బాక్సర్గా సిమ్రన్ నిలవనుండటం విశేషం. భారత జట్టు పసిడి బోణీన్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత జట్టు పసిడి బోణీ కొట్టింది. జర్మనీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హరియాణాకు చెందిన యువ షూటర్ కనక్ స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో బుధవారం 17 ఏళ్ల కనక్ 239 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 8 మంది షూటర్లు పాల్గొన్న 24 షాట్ల తుదిపోరులో కనక్ తన గురితో అదరగొట్టింది.‘ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనయ్యా. కానీ ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది.’ అని కనక్ వెల్లడించింది. మాల్దోవాకు చెందిన అన్నా డుల్స్ 1.7 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా... చెన్ యెన్ చింగ్ (చైనీస్ తైపీ) కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు ఫైనల్కు అర్హత సాధించారు. కనక్ 571 పాయింట్లతో, ప్రాచి 572 పాయింట్లతో తుదిపోరుకు చేరారు. -
సంచలనాల మోత
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు అదర గొట్టారు. తొలి రౌండ్లో నలుగురు భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సతీశ్ కుమార్ కరుణాకరన్, ఆయుశ్ శెట్టి తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈ సీజన్లో ఫామ్లో లేని ప్రపంచ మాజీ నంబర్వన్, ప్రస్తుత 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 23–21, 13–21, 21–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)ను ఓడించాడు. మరో మ్యాచ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–17, 21–16తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. ప్రపంచ 51వ ర్యాంకర్ సతీశ్ కుమార్ కరుణాకరన్ 21–13, 21–14తో ప్రపంచ 9వ ర్యాంకర్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను కంగుతినిపించాడు. ప్రపంచ 41వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 20–22, 21–10, 21–8తో ప్రపంచ 30వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు.అయితే భారత్కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్కు నిరాశ ఎదురైంది. ప్రియాన్షు 15–21, 17–21తో జియా హెంగ్ జేసన్ టెహ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో సతీశ్; యుషి టనాకా (జపాన్)తో ప్రణయ్; ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ఆయుశ్ శెట్టి తలపడతారు. సింధుకు నిరాశ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. బరిలో ఉన్న నలుగురు క్రీడాకారిణులు పీవీ సింధు, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మాళవిక తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 11–21, 21–14, 15–21తో ప్రపంచ 26వ ర్యాంకర్ థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్ల్లో ఉన్నతి 12–21, 20–22తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో, ఆకర్షి 9–21, 8–21తో పుత్రి కుసుమ వర్థిని (ఇండోనేసియా) చేతిలో, మాళవిక 21–19, 18–21, 8–21తో చియు పిన్ చియాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 10–21, 14–21తో గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా) జంట చేతిలో ఓడిపోగా... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–18, 15–21, 21–14తో అద్నాన్–సారి జమాల్ (ఇండోనేసియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల డబుల్స్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్; హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. -
శ్రీకాంత్ ముందంజ
కౌలాలంపూర్: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ప్రపంచ మాజీ నంబర్వన్, భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మొదలైన మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 65వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ తొలి రౌండ్లో 21–8, 21–13తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. అనంతరం రెండో రౌండ్లో 9–21, 21–12, 21–6తో హువాంగ్ యి కాయ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి ప్రవేశించాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఆరో సీడ్, చైనా ప్లేయర్ లు గ్వాంగ్ జుతో శ్రీకాంత్ తలపడతాడు. 2021 ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం నెగ్గిన 32 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది ఎనిమిది టోర్నీల్లో ఆడినా ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. మరోవైపు గతవారం థాయ్లాండ్ ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు దూసుకెళ్లిన హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లికి ఈ టోర్నీలో నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే తరుణ్ వెనుదిరిగాడు. తరుణ్ 13–21, 21–23తో పనిత్చఫోన్ తీరారత్సకుల్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయాడు. భారత్కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి 20–22, 20–22తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. అన్మోల్ 14–21, 18–21తో హుంగ్ యి టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మోహిత్–లక్షిత జగ్లాన్ ద్వయం 15–21, 16–21తో మింగ్ యాప్ టూ–లీ యు షాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు నేడు మొదలవుతాయి. -
వ్యభిచారం కేసులో ఒలింపిక్ చాంపియన్ అరెస్టు
కొలంబస్: అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్ (2016)లో ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్ టోక్యో ఒలింపిక్స్ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్ చాంపియన్గా ఘనతకెక్కిన స్నైడర్ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో స్నైడర్ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. 29 ఏళ్ల స్నైడర్ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు. అతని భార్య మ్యాడీ ఫుట్బాల్ ప్లేయర్! రెండు వరుస ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన స్నైడర్ గతేడాది పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్షిప్లో స్నైడర్ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్గా నిలిచాడు. ఓవరాల్గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్నైడర్ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్లలో నెగ్గి, 21 బౌట్లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్ అమెరికన్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లీగ్లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. -
సుమిత్ నగాల్ శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. పారిస్లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 170వ ర్యాంకర్ సుమిత్ 6–1, 6–1తో ప్రపంచ 141వ ర్యాంకర్ మిచెల్ క్రుగెర్ (అమెరికా)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని సుమిత్ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్ నెగ్గిన మొత్తం 59 పాయింట్లలో 22 విన్నర్స్ ఉన్నాయి. 14 అనవసర తప్పిదాలు చేసిన సుమిత్ నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు గెలిచాడు. రెండో రౌండ్లో ప్రపంచ 225వ ర్యాంకర్ జురిజ్ రొడియోనోవ్ (ఆ్రస్టియా)తో సుమిత్ తలపడతాడు. 27 ఏళ్ల సుమిత్ తన కెరీర్లో ఎనిమిదిసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో మూడుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్లో ఒక్కోసారి, యూఎస్ ఓపెన్లో మూడుసార్లు అతను మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. 2020 యూఎస్ ఓపెన్లో, 2024 ఆ్రస్టేలియన్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరడం సుమిత్ గ్రాండ్స్లామ్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. -
సోషల్ మీడియా పోస్ట్తో.. రూ. 14 కోట్ల జాబ్ పోయింది
లండన్: ఇంగ్లండ్ మాజీ ఫుట్బాల్ ఆటగాడు, కామెంటేటర్ గ్యారీ లినేకర్ (Gary Lineker) బీబీసీ వ్యాఖ్యాత స్థానం నుంచి వైదొలగనున్నాడు. సామాజిక మాధ్యమాల్లో జియోనిజానికి సంబంధించిన పోస్ట్ పెట్టిన కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న గ్యారీ... ఇప్పుడు వ్యాఖ్యాతగా తప్పుకోనున్నాడు. మీడియా సెలబ్రిటీగా మంచి పేరున్న 64 ఏళ్ల లినేకర్... అత్యధిక పారితోషికం అందుకుంటున్న బ్రిటిష్ జాతీయ ప్రసారకుడిగా ఉన్నాడు. బీబీసీలో వ్యాఖ్యాతగా అతడు ఏడాదికి దాదాపు 1.7 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 14 కోట్ల 52 లక్షలు) ప్రతిఫలంగా పొందుతున్నాడు.‘జియోనిజం రెండు నిమిషాల్లో వివరించొచ్చు’ అనే క్యాప్షన్తో కూడిన ఎలుక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో లినేకర్పై విమర్శలు గుప్పుమన్నాయి. యూదు వ్యతిరేక భావజాలం కలిగిన ఇలాంటి పోస్టు పెట్టినందుకు లినేకర్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ... బీబీసీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించినందుకు సోషల్ మీడియా పాలసీ (Social Media Policy) ప్రకారం అతడిపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 80 మ్యాచ్లాడిన లినేకర్... 48 గోల్స్ చేశాడు. 1986 ప్రపంచకప్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.చదవండి: భారత టాప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై గగన్ నారంగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ -
నీరజ్ చోప్రాపై గగన్ నారంగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: భారత టాప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవలే 90 మీటర్ల మార్క్ను అధిగమించి ఇకపై మరింత పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టాడు. తాజా ప్రదర్శనతో నీరజ్పై ఒక పెద్ద భారం దిగిపోయిందని, మున్ముందు అతని నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చని భారత మాజీ షూటర్, 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ (Gagan Narang) అభిప్రాయపడ్డాడు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో భాగంగా జావెలిన్ను నీరజ్ 90.23 మీటర్ల దూరం విసిరాడు.‘ఇంత కాలం నీరజ్ తన వీపుపై 90 మీటర్ల లక్ష్యం అనే పెద్ద బరువును మోసుకొని తిరిగాడు. అతని మనసులో కూడా అదే భావనతో ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు అదంతా తొలగిపోయింది. ఇకపై మరింత స్వేచ్ఛగా ఆడి ఇంతకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. నేను కూడా ఒక దశలో 600/600 పాయింట్ల కోసం ఎంతో శ్రమించా. 597–599 చాలాసార్లు సాధించినా అసలైన అంకె మాత్రం రాలేదు. ఎట్టకేలకు దానిని అందుకున్న తర్వాత స్వేచ్ఛ లభించినట్లయింది’ అని గగన్ అన్నాడు. నీరజ్ చోప్రా (Neeraj Chopra) సాధించిన ఘనతలు కేవలం దూరానికి సంబంధించినవి మాత్రమే కాదని, అంతర్జాతీయ వేదికలపై అతని స్థాయిని చూపించాయని గగన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.‘దోహాలో నీరజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతను సాధించిన చాలా పెద్ద ఘనత. అయితే దీనిని కేవలం 90 మీటర్ల దూరం అనే లెక్కల్లోనే చూడవద్దు. భారత అథ్లెటిక్స్కు సంబంధించి అతను చరిత్రను తిరగరాస్తున్నాడు. ఒక తరం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచాడు. సీజన్లో ఇది తొలి టోర్నీ మాత్రమే. మున్ముందు చాలా పోటీలు ఉన్నాయి. కాబట్టి మైలురాయిని దాటడమే కాదు సరైన సమయంలో సరైన ఫలితం సాధించడం కూడా ముఖ్యం’ అని ఈ హైదరాబాదీ షూటర్ వ్యాఖ్యానించాడు.మరోవైపు షూటింగ్ లీగ్ నిర్వహించాలనే ఆలోచన పట్ల అతను సానుకూలంగా స్పందించాడు. ‘చాలా కాలంగా దీని గురించి చర్చ సాగింది. మన షూటర్లు జర్మనీలోని బుండెస్లీగాలో ఆడేందుకు వెళుతుంటారు. ఇప్పుడు మనకూ ఒక లీగ్ ఉంటుంది. ప్రతీ జట్టులో సీనియర్, యూత్, జూనియర్ ఆటగాళ్లు ఉండటం షూటింగ్కు మేలు చేస్తుంది. లీగ్ నిర్వహణకు ఇది సరైన సమయం కూడా’ అని గగన్ నారంగ్ విశ్లేషించాడు.చదవండి: PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే -
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఐపీఎల్ తర్వాత ప్రేక్షకాదరణలో రెండో స్థానంలో నిలిచిన ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దబంగ్ ఢిల్లీ స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ (Naveen Kumar) తొలిసారి పీకేఎల్ వేలానికి వచ్చాడు. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలుకాగా దబంగ్ ఢిల్లీ (Dabang Delhi) 8వ సీజన్లో విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ తరఫున ఆరు సీజన్లు ఆడిన నవీన్ 1102 రెయిడింగ్ పాయింట్లు సాధించాడు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వదిలేసుకోవడంతో మిగతా ఫ్రాంచైజీలు అతనిపై కన్నేశాయి.ఇలా విడుదల, అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను 12 ఫ్రాంచైజీలు ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 83 మందిని రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకున్నాయి. నాలుగు కేటగిరీలుమొత్తం నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలుంది. ఎ, బి, సి, డిగా విభజించిన రిటెయినర్లలో ఎ ఆటగాడికి రూ. 30 లక్షలు, బి ప్లేయర్కు రూ. 20 లక్షలు, సి, డి ఆటగాళ్లకు వరుసగా రూ. 13 లక్షలు, రూ. 9 లక్షలు చెల్లించాల్సివుంటుంది.ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ట పరిమితి రూ. 5 కోట్లకు లోబడే రిటెయిన్ మొత్తాన్ని తీసివేయగా మిగిలిన మొత్తంతో ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముంబైలో ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు కబడ్డీ ఆటగాళ్ల వేలం పాట జరుగనుంది.ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ప్లేయర్లుబెంగాల్ వారియర్స్: విశ్వాస్, యశ్ మలిక్, మన్జీత్, దీప్ కుమార్, సుశీల్ కాంబ్రేకర్. బెంగళూరు బుల్స్: చంద్ర నాయక్, లక్కీ కుమార్, మన్జీత్, పంకజ్. దబంగ్ ఢిల్లీ: సందీప్, మోహిత్. గుజరాత్ జెయింట్స్: హిమాన్షు సింగ్, హిమాన్షు, ప్రతీక్ దహియా, రాకేశ్. హరియాణా స్టీలర్స్: రాహుల్ సెప్తాల్, వినయ్, శివమ్ అనీల్, జైదీప్, జయసూర్య, విశాల్ తటే, సాహిల్ మనికందన్, వికాస్ రామదాస్ జాదవ్. జైపూర్ పింక్పాంథర్స్: రెజా మిర్బాఘెరి, అభిషేక్, రోనక్ సింగ్, నితిన్ కుమార్, సోంబిర్, రితిక్ శర్మ. పట్నా పైరేట్స్: హమిద్ మిర్జాయి నదిర్, త్యాగరాజన్ యువరాజ్, సుధాకర్, అయాన్, నవ్దీప్, దీపక్, సాహిల్ పాటిల్. పుణేరి పల్టన్: అభినేశ్, గౌరవ్ ఖత్రి, పంకజ్ మోహితే, అస్లామ్ ముస్తఫా, మోహిత్ గోయత్, దాదాసొ శివాజీ పూజారి, ఆదిత్య తుషార్ షిండే. తమిళ్ తలైవాస్: మొయిన్ షఫాగి, హిమాన్షు, సాగర్, నితేశ్ కుమార్, నరేందర్, రోనక్, విశాల్ చహల్, ఆశిష్, అనూజ్ గవాడే, ధీరజ్ రవీంద్ర బైల్మరే. తెలుగు టైటాన్స్: శంకర్ భీమ్రాజ్, అజిత్ పాండురంగ పవార్, అంకిత్, ప్రఫుల్ జవారే, సాగర్ చేతన్ సాహు, నితిన్, రోహిత్. యు ముంబా: సునీల్ కుమార్, రోహిత్, అమిర్ మొహమ్మద్, సతీశ్ కన్నన్, ముకిలన్ షణ్ముగమ్, అజిత్ చౌహాన్, దీపక్ కుండు, లోకేశ్ గోస్లియా, సన్నీ.యూపీ యోధాస్: సుమిత్, భవానీ రాజ్పుత్, సాహుల్ కుమార్, సురేందర్ గిల్, అషు సింగ్, హితేశ్ గగన గౌడ, శివమ్ చౌదరి, జయేశ్ వికాస్ మహాజన్, గంగారామ్, సచిన్, కేశవ్ కుమార్.చదవండి: Football Tournament: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. -
టైటిల్ బోణీ చేసేనా?
కౌలాలంపూర్: ఈ ఏడాది స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో టోరీ్నకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత కొంత కాలంగా లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఈసారైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. గత నెల సుదిర్మన్ కప్లో భాగంగా ఇండోనేసియా, డెన్మార్క్ చేతిలో ఓడిన ఈ ఇద్దరు తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన సింధు ప్రస్తుతం ప్రపంచ 16వ ర్యాంక్లో కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 27వ ర్యాంకర్ నుగుయెన్ థుయ్ లిన్ (వియత్నాం)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)తో 35వ ర్యాంకర్ ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మూడో సీడ్ చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ)తో సతీశ్ కుమార్ కరుణాకరన్, బ్రియాన్ యంగ్ (కెనడా)తో ఆయుశ్ శెట్టి, జియా హెంగ్ జాసన్ (సింగపూర్)తో ప్రియాన్షు రజావత్ తలపడనున్నారు. మహిళల సింగిల్స్లో సింధుతో పాటు ఉన్నతి హూడా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్ పోటీ పడుతున్నారు. పురుషుల డబుల్స్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి, హరిహరన్–రూబన్ కుమార్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్లో నాలుగు జోడీలు పోటీలో ఉన్నాయి. మిక్స్డ్ డబుల్స్లో రుతి్వక శివాని–రోహన్ కపూర్, ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, అషిత్ సూర్య–అమృత, ఆద్య–సతీశ్ కుమార్ బరిలో దిగనున్నారు. ఇక ప్రధాన పోటీలకు ముందు జరగనున్న క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల విభాగంలో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్తో పాటు శంకర్ ముత్తుస్వామి, తరుణ్ మన్నెపల్లి మంగళవారం బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగం నుంచి అన్మోల్ పోటీలో ఉంది. -
ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
సౌత్ ఆసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్(SAFF) అండర్-19 చాంపియన్షిప్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్ను కైవసం చేసుకుంది.ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్( 4-3)లో యంగ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ను నిర్వహించారు.పెనాల్టీ షూటౌట్లో కూడా ఆసక్తికరంగా సాగింది. పెనాల్టీ షూటౌట్లో 3-3తో సమంగా ఉన్నసమయంలో కెప్టెన్ షమీ సింగమాయుమ్ అద్బుతమైన గోల్ కొట్టి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్కు ఇది రెండవ శాఫ్ అండర్-19 టైటిల్ కావడం విశేషం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ -
నిధి నాయకత్వంలో...
బెంగళూరు: ఈ ఏడాది డిసెంబర్లో జరిగే మహిళల జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్కు సన్నాహాల్లో భాగంగా భారత జట్టు ఈ నెలలో నాలుగు దేశాల టోర్నీలో పోటీపడనుంది. అర్జెంటీనాలోని రొసారియా నగరంలో ఈనెల 25 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో భారత్తోపాటు అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో ఆడనున్న భారత జట్టును శనివారం హాకీ ఇండియా ప్రకటించింది. 24 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు గోల్కీపర్ నిధి నాయకత్వం వహిస్తుంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్ను మే 25న చిలీతో ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా వరుసగా ఉరుగ్వేతో (మే 26న), అర్జెంటీనాతో (మే 28న), చిలీతో (మే 30న), ఉరుగ్వేతో (జూన్ 1న), అర్జెంటీనాతో (జూన్ 2న) తలపడతుంది. ‘ఈ టోర్నీ ద్వారా మా అత్యుత్తమ క్రీడాకారిణులు ఎవరో గుర్తిస్తాము. మరో ఆరు నెలల్లో జూనియర్ ప్రపంచకప్ జరగనుంది. తాజా టోర్నీ మన అమ్మాయలకు అంతర్జాతీయ అనుభవం కలిపిస్తుంది’ అని భారత జూనియర్ జట్టు కోచ్ తుషార్ ఖాండ్కర్ తెలిపారు. భారత జూనియర్ మహిళల హాకీ జట్టు: నిధి (కెప్టెన్, గోల్కీపర్), ఏంజిల్ హర్షరాణి మింజ్ (గోల్కీపర్), మమితా ఓరమ్, లాల్తట్లుయాంగి, మనీషా, పూజా సాహూ, పార్వతి టొప్నో, నందిని, సాక్షి శుక్లా (డిఫెండర్లు), ప్రియాంక యాదవ్, అనీషా సాహూ, రజని కెర్కెట్టా, బినిమా ధన్, ఖైడెమ్ షిలీమా చాను, సంజన హోరో, సుప్రియా కుజుర్, ప్రియాంక డోగ్రా (మిడ్ ఫీల్డర్లు), హీనా బానో, సోనమ్, సుఖ్వీర్ కౌర్, గీతా యాదవ్, లాల్రిన్పుయ్, కనిక సివాచ్, కర్మన్ప్రీత్ కౌర్ (ఫార్వర్డ్లు). స్టాండ్బై: విద్యశ్రీ, హుదా ఖాన్, ముని్మని దాస్, సెలెస్టినా హోరో. -
విజేత ప్రజ్ఞానంద
బుకారెస్ట్: గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా నిర్వహించిన సూపర్బెట్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చాంపియన్గా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. నిర్ణిత తొమ్మిది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద, మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. అలీరెజాతో గేమ్ను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద.. లాగ్రెవ్పై గెలిచి 1.5 పాయింట్లతో టైటిల్ను ఖరారు చేసుకున్నాడు. విజేత ప్రజ్ఞానందకు 77,667 డాలర్లు (రూ. 66 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. -
ఎయిర్ ట్యాక్సీల్లో వేదికలకు రవాణా.. ఇలా ఇదే తొలిసారి
లాస్ ఏంజెలిస్: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటి వరకు ఆటగాళ్లు, ప్రేక్షకులు, వీఐపీలు కార్లు, బస్సుల్లోనే వేదికలకు చేరేవారు. కానీ లాస్ ఏంజెలిస్లో 2028లో జరిగే విశ్వక్రీడలు ‘విహంగ విహారానికి’ సిద్ధమవుతున్నాయి. మరో మూడేళ్లలో అమెరికాలోని ప్రఖ్యాత నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో ‘ఎయిర్ ట్యాక్సీ’లను వినియోగిస్తామని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.ఆటగాళ్లు, వీఐపీలే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం విహంగ విహారం చేస్తూ ఆయా వేదికలకు చేరుకుంటారు. విశ్వక్రీడల్లో ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలు నిర్వహించనుండటం చరిత్రలోనే తొలిసారి కానుంది. తద్వారా ఎవరికీ ప్రయాణ బడలిక లేకుండా కేవలం పది నుంచి 20 నిమిషాల్లోపే వేదికలకు చేరవేయవచ్చని నిర్వాహకులు ప్రణాళికలతో ఉన్నారు. సోఫీ స్టేడియం, లాస్ ఏంజెలిస్ మెమోరియల్ కొలిజియం, శాంటా మోనికా, ఆరెంజ్ కౌంటీ, హాలీవుడ్ వేదికలకు ఎయిర్ ట్యాక్సీలను వినియోగించే ఆలోచనతో ఉన్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ ఆడమ్ గోల్డ్స్టెయిన్ తెలిపారు. అమెరికా భవిష్య ప్రయాణ ముఖచిత్రాన్నే లాస్ ఏంజెలిస్ విశ్వక్రీడలు మార్చబోతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఫైనల్లో అల్కరాజ్రోమ్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్లో 25వ టోరీ్నలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/4)తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ ఒక ఏస్ సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన అల్కరాజ్ రెండు టోర్నీల్లో (మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్; రోటర్డామ్ ఓపెన్) విజేతగా నిలిచి, బార్సిలోనా ఓపెన్లో రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. యానిక్ సినెర్ (ఇటలీ), టామీ పాల్ (అమెరికా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. -
PKL: పీకేఎల్ ఆటగాళ్ల వేలం.. తేదీలు ఇవే
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 12వ సీజన్కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియను ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలో నిర్వహించే ఈ వేలానికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే 12 ఫ్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేశామని నిర్వాహకులు వెల్లడించారు. కాగా 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన 11 సీజన్లలో 8 వేర్వేరు జట్లు టైటిళ్లు గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలో కబడ్డీ లీగ్లో పలానా జట్టు ఫేవరెట్ అనే మాటే లేకుండా ప్రతీ జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. దీంతో యేటికేడు కబడ్డీ కూతకు ఆదరణ అంతకంతకు పెరుగుతూనే ఉండటం విశేషం. బెంగాల్ వారియర్స్ కోచ్గా నవీన్ ఈ ఏడాది జరిగే 12వ సీజన్ పీకేఎల్ కోసం బెంగాల్ వారియర్స్ తమ జట్టు హెడ్ కోచ్గా నవీన్ కుమార్ను నియమించింది. ప్రస్తుతం కోచ్గానే కాదు... అంతకుముందు ఆటగాడిగాను అతనికి మంచి రికార్డు ఉంది. దక్షిణాసియా క్రీడలు (2006), ఆసియా క్రీడలు (2006), కబడ్డీ ప్రపంచకప్ (2007), ఆసియా ఇండోర్ క్రీడల్లో (2007) భారత్ స్వర్ణాలు గెలిచిన బృందంలో అతను సభ్యుడిగా ఉన్నాడు. కోచ్గానూ నిరూపించుకున్నాడు.గతంలో అతను భారత జాతీయ, దేశవాళీ జట్లకు కోచింగ్ సేవలందించాడు. భారత నేవి, స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) జట్లకు కోచ్గా వ్యవహించాడు. ఆటలో కడదాకా కనబరిచే పోరాటస్ఫూర్తి, ఏ దశలోనూ కుంగిపోని సానుకూల దృక్పథం అతన్ని మేటి కోచ్గా నిలబెడుతోంది. 12 ఫ్రాంచైజీలు తలపపడిన గత సీజన్లో బెంగాల్ పదో స్థానంతో నిరాశపరిచింది.ఈ నేపథ్యంలో వేలానికి ముందే అతన్ని నియమించుకోవడం ద్వారా సరైన ఆటగాళ్ల కొనుగోలు, జట్టు కూర్పు, పటిష్టమైన దళాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినంత సమయం లభిస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం భావించింది. బెంగాల్కు కోచింగ్ పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారియర్స్ను దీటైన జట్టుగా, బరిలో ఎదురులేని ప్రత్యర్థిగా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
ప్రపంచం ‘కన్ను’గప్పి నాటకాలు.. ఎట్టకేలకు పాపం పండింది!
బాకు (అజర్బైజాన్): ప్రపంచాన్ని ‘గుడ్డి’గా నమ్మించిన అజర్బైజాన్ పారా జూడో క్రీడాకారిణి పాపం పండింది. జీవితకాల నిషేధానికి గురైంది. ఒక శాతం కూడా దృష్టిలోపం లేకపోయినా... నకిలీ అంధత్వ సర్టిఫికెట్తో అంతర్జాతీయ పోటీల్లో అజర్బైజాన్ జూడో క్రీడాకారిణి షహానా హాజియెవా (Shahana Haji) పతకాలు గెలిచింది. ఇప్పుడు పాపం పండటంతో ‘పోడియం’కెక్కిన ఆమె పాతాళానికి పడిపోయింది.అసలు విషయమేమిటంటే... 26 ఏళ్ల హాజియెవా టోక్యో పారాలింపిక్స్లో దృష్టి లోపం ఉన్న జూడో క్రీడాకారిణిల విభాగంలో (48 కేజీలు) పోటీపడి బంగారు పతకం గెలుపొందింది. కాలచక్రం తిరిగేసరికి ఈ లోపల మరో పారాలింపిక్స్ క్రీడలు (పారిస్) కూడా ముగిశాయి. ఇన్నాళ్లూ బాగానే ఉంది. కానీ ఈనెల కజకిస్తాన్లోని అస్తానాలో ప్రపంచ పారా జూడో చాంపియన్షిప్ జరిగింది. ఇందులో కళ్లున్నా... కనపడనట్లు ఆడిన కపట నాటకం బయటపడింది.ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన అంధత్వ పరీక్షలో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది. షహానా హాజియెవాకు రెండు కళ్లు వందశాతం కనిపిస్తూనే ఉన్నాయని తేలింది. ఎలాంటి దృష్టి లోపం, పాక్షిక అంధత్వం కూడా లేదని తేలింది. దీంతో ప్రపంచ పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. ప్రపంచం ‘కన్ను’గప్పిన ఆమె మోసంతో ఇప్పుడు పారా క్రీడలు కాదుకదా అసలైన క్రీడల్లో కూడా పాల్గొనే అర్హతను పూర్తిగా కోల్పోయింది.అజర్బైజాన్కే చెందిన ఎల్నారా నిజామ్లికి పాక్షిక దృష్టి లోపం ఉంది. కానీ ఆమె పూర్తి అంధత్వంతో ‘జే1’ కేటగిరీలో పాల్గొనాలని చూసిన మోసం కూడా బట్టబయలైంది. అయితే ఆమెకు ‘జే2’ కేటగిరీ (పాక్షిక అంధత్వం)లో పాల్గొనే అవకాశమిచ్చారు. అజర్బైజాన్ జాతీయ పారాలింపిక్ సంఘం తమ అథ్లెట్ల కపట నాటకంపై స్పందించింది. ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. -
నీరజ్ 90.23 మీటర్లు
దోహా: 90 మీటర్లు... ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? అని కొన్నేళ్లుగా అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం సమాధానం ఇచ్చాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు భారత స్టార్ తన కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం ఖతర్ రాజధాని దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో నీరజ్ చోప్రా తన కెరీర్ బెస్ట్ ప్రదర్శనను నమోదు చేశాడు.27 ఏళ్ల నీరజ్ తన మూడో ప్రయత్నంలో జావెలిన్ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో నీరజ్ తన పేరిటే ఉన్న (2022 స్టాక్హోమ్ డైమండ్ లీగ్ మీట్లో 89.94 మీటర్లు) జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. విఖ్యాత కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ ప్రారంభించాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లోనే నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం విశేషం. 11 మంది మేటి జావెలిన్ త్రోయర్లు పోటీపడ్డ దోహా డైమండ్ లీగ్ మీట్లో జూలియన్ వెబెర్ (జర్మనీ; 91.06 మీటర్లు) అగ్రస్థానాన్ని క్కించుకున్నాడు. నీరజ్ చోప్రా (90.23 మీటర్లు) రెండో స్థానం సంపాదించగా... అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 86.64 మీటర్లు) మూడో స్థానాన్ని పొందాడు. భారత్కే చెందిన కిశోర్ కుమార్ జేనా (78.60 మీటర్లు) ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. డైమండ్ లీగ్ మీట్లలో అథ్లెట్లకు పతకాలు బదులుగా పాయింట్లు కేటాయిస్తారు. టాప్–8లో నిలిచిన వారికి వరుసగా 8, 7, 6, 5, 4, 3, 2, 1 పాయింట్లు లభిస్తాయి. వెబెర్కు 8 పాయింట్లు, నీరజ్కు 7 పాయింట్లు, పీటర్స్కు 6 పాయింట్లు దక్కాయి.నిర్ణిత నాలుగు మీట్లు ముగిశాక టాప్–7లో నిలిచిన వారు ఫైనల్ మీట్లో పోటీపడతారు. సీజన్ తొలి మీట్లో నీరజ్ తొలి ప్రయత్నంలో జావెలిన్ను 88.44 మీటర్ల దూరం విసిరి శుభారంభం చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో అతను ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ 90.23 మీటర్లకు వెళ్లింది. నాలుగో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ను 80.56 మీటర్ల దూరం విసరగా... ఐదో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ను 88.20 మీటర్లు విసిరాడు. 3 ఆసియా నుంచి జావెలిన్ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరిన మూడో ప్లేయర్గా నీరజ్ చోప్రా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 92.97 మీటర్లు), చావో సున్ చెంగ్ (చైనీస్ తైపీ; 91.36 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్గా 25 మంది క్రీడాకారులు జావెలిన్ను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరారు. -
మైదానంలో మాత్రమే!
దోహా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన పాక్ ప్రత్యర్థి అర్షద్ నదీమ్తో గల అనుబంధంపై స్పష్టత ఇచ్చాడు. దోహా డైమండ్ లీగ్లో పాల్గొనేందుకు వచ్చిన అతను పతకంపై గురి పెట్టాడు. విమర్శలపై సమాధానమిచ్చాడు. భారత్, పాక్ల మధ్య యుద్ధవాతావరణాన్ని సృష్టించిన ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాకిస్తాన్కు చెందిన జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్కు భారత్లో జరిగే ఈవెంట్ కోసం ఆహ్వానం పలకడంపై నీరజ్ చోప్రా సహా అతని కుటుంబసభ్యులపై కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. వీటిని తాళలేక చోప్రా వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి బెంగళూరులో వచ్చే వారం నిర్వహించతలపెట్టిన ‘ఎన్సీ క్లాసిక్’ ఈవెంట్ నిరవధిక వాయిదా పడింది. అయితే తమ ఇద్దరి బంధంపై తాజాగా నీరజ్ స్పష్టత ఇచ్చాడు. ‘ముందుగా మీకో విషయం స్పష్టం చేయదల్చుకుంటున్నా... అర్షద్తో నాకున్నది పోటీల సందర్భంగా ఉండే స్నేహమే! అంతేతప్ప బలమైన అనుబంధం, ప్రాణ స్నేహితులం ఏమాత్రం కాదు. అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితులతో కనీసం ముందరిలా ఉంటామో లేదో కూడా తెలీదు. ఒకవేళ అతను సంస్కారం చూపితే నేను చూపుతా. అంతకుమించి ఇంకేమీ ఉండదు. మైదానంలో అథ్లెట్లుగా మాట్లాడుకుంటాం. అథ్లెట్ మిత్రులుగానే మెలుగుతాం. అంతే!’ అని అన్నాడు. మొదట్లో కష్టమనిపించినా... ప్రస్తుత కోచ్, లెజెండ్ జాన్ జెలెజ్నితో మొదట్లో శిక్షణ చాలా కష్టమనిపించిందని, కఠినంగా ఉండేదని అయితే ఇప్పుడా సమస్య లేదని నీరజ్ వివరించాడు. ‘నా పాత కోచ్ క్లాస్ బార్టొనీట్జ్ శైలి వేరు. ప్రస్తుత కోచ్ జెలెజ్నీ శైలి పూర్తి భిన్నం. అతనితో కలిసి పని (శిక్షణ) చేయడానికి ఇబ్బంది పడ్డాను. చాలా విభిన్నమైన శిక్షణ శైలి అతనిది. తర్వాతర్వాత అలవాటు పడ్డాక అంతా సర్దుకుంది. జెలెజ్నీ కోచింగ్లో ఎంతటి నిష్ణాతుడో అందరికీ తెలుసు. నా టెక్నిక్, రనప్ ఇపుడంతా మెరుగైంది. అలాగని పాత కోచ్ క్లాస్ తక్కువేమీ కాదు. నాలుగైదేళ్లు అతని శిక్షణలోనే రాటుదేలాను’ చోప్రా అన్నాడు. టైటిల్ లక్ష్యంతో చోప్రా... దోహా డైమండ్ లీగ్ మాజీ చాంపియన్ నీరజ్ చోప్రా మరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఈ స్టార్ జావెలిన్ త్రోయర్ ఫామ్లో ఉన్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. ఇలాంటి అనుకూలతలతో ఈ లీగ్లో స్వర్ణం చేజిక్కించుకోవడం అతనికి ఏమంత కష్టం కానేకాదు. శుక్రవారం జరిగే జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్కు రెండు సార్లు ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. అతనితో పాటు జాకుబ్ వాద్లెచ్ (చెక్), జర్మనీకి చెందిన జులియన్ వెబెర్, మ్యాక్స్ డెహ్నింగ్, జూలియుస్ యెగో (కెన్యా), రొడెరిక్ గెన్కీ డీన్ (జపాన్)లు నీరజ్ చోప్రాకు పోటీ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ పోటీల్లో తలపడే ప్రత్యర్థులందరూ ఈ డైమండ్ లీగ్ బరిలో ఉన్నారు. అయితే పాక్ చాంపియన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ మాత్రం గైర్హాజరయ్యాడు. లీగ్ కోసం ఎంతో కసరత్తు చేశానని పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని చోప్రా చెప్పాడు. స్టీపుల్చేజ్లో గుల్వీర్, పారుల్ నీరజ్ జావెలిన్ త్రోలో పతకంపై గురిపెట్టగా, మిగతా భారత అథ్లెట్లు గుల్వీర్ సింగ్, పారుల్ చౌధరీ స్టీపుల్చేజ్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. జాతీయ రికార్డు నెలకొల్పిన గుల్వీర్ పురుషుల 5000 మీటర్ల పోటీలో పొడియంలో నిలవాలని గంపెడాశలు పెట్టుకున్నాడు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో పారుల్ చౌధరీ గట్టి పోటీ ఇచ్చేందుకు సై అంటోంది. -
‘ఒలింపిక్ క్రీడలను దత్తత తీసుకుంటాం’
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన దేశంలో ఇతర క్రీడలకు అండగా నిలవాలని యోచిస్తోంది. కనీసం రెండు లేదా మూడు ఒలింపిక్ క్రీడలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు బీసీసీఐ తమ ఆలోచనను కేంద్ర క్రీడా శాఖకు తెలియజేసింది. మంత్రి మన్సుఖ్ మాండవియాతో గురువారం బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీసీఐ ఈ ప్రతిపాదన చేసింది ‘మా ప్రతిపాదనను బీసీసీఐ స్వాగతించింది. ఏ క్రీడలను ఎంచుకుంటే బాగుంటుందనే విషయం తుది నిర్ణయం కేంద్ర క్రీడాశాఖకే వదిలేశాం. ఆయా క్రీడల్లోనూ ఒలింపిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి కనీసం 100 నుంచి 200 మందికి అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తాం. ఒలింపిక్ క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రీడల సన్నాహాలు ఉంటాయి’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సమావేశంలో 58 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. క్రికెట్ బోర్డు తాజా ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన వీరు తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 23 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిక్షణా కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో బాక్సింగ్ (రోహ్టక్), స్విమ్మింగ్, షూటింగ్ (న్యూఢిల్లీ)లలో మాత్రం ఒకే క్రీడాంశంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. విభిన్న క్రీడాంశాలకు కేంద్రంగా పటియాలా, బెంగళూరులలో ‘సాయ్’ కేంద్రాలు నడుస్తున్నాయి. గతంలోనూ పలు మార్లు బీసీసీఐ ఆరి్థకపరంగా ఇతర క్రీడలకు సహకారం అందించింది. ఆటలను దత్తత తీసుకోవాలనే తాజా ప్రతిపాదనపై మున్ముందు మరింత స్పష్టత రానుంది. భారత సంతతికి చెందిన విదేశాల్లో స్థిరపడిన ఓవర్సీస్ సిటిజన్ (ఓసీఐ)లు క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించరాదనే నియమం ప్రస్తుతం అమల్లో ఉంది. దీనిని తొలగించాలని కూడా కేంద్ర క్రీడాశాఖ యోచిస్తోంది. అక్కడ ఆటలో నిష్ణాతులైన తర్వాత మన దేశం తరఫున వచ్చి ఆడితే ఇక్కడి ప్లేయర్లకు కూడా మేలు జరుగుతుందని, వ్యవస్థలో కొత్త మార్పులు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరోవైపు వివిధ క్రీడా సమాఖ్యలు తమలోని వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించుకుంటేనే ఆట బాగుపడుతుందని... క్రీడలను కోర్టులు నడపడం సరైందని కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. వారందరితో సమావేశంపై సమస్యను పరిష్కరించేందుకు మంత్రి స్వయంగా సిద్ధమయ్యారు. -
ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో తరుణ్ మన్నేపల్లి... మహిళల సింగిల్స్ విభాగంలో ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్... మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్ను దాటలేకపోయారు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ డ్రాలో అడుగు పెట్టిన తరుణ్ గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 14–21, 16–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తరుణ్ రెండో గేమ్లో కాస్త పోటీనిచ్చాడు. మహిళలసింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఉన్నతి హుడా 14–21, 11–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో, మాళవిక 12–21, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో, ఆకర్షి కశ్యప్ 9–21, 14–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 20–22, 14–21తో రుయ్ హిరోకామి–సయాకా హొబారా (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ టోర్నీలలో భారత్ నుంచి ఒక్కరు కూడా ఫైనల్ చేరుకోలేకపోయారు. -
పోలాండ్ ఈవెంట్కు నీరజ్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పోలాండ్ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి చోప్రా ఈ నెల 24న ‘ఎన్సీ క్లాసిక్’ టోర్నమెంట్ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. కానీ భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల పలు విమానాశ్రయాల మూసివేతతో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలనుకున్న ఎన్సీ క్లాసిక్ ఈవెంట్ నిరవధికంగా వాయిదా పడింది. ఇపుడు ఇదే సమయంలో పోలాండ్లో జరిగే ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగుతాడు. ఈ నెల 23న అక్కడ ‘ఒర్లిన్ జానుస్జ్ కుసొసిన్సికి మెమోరియల్ ఈవెంట్’ జరుగనుంది. ఈ ఈవెంట్లో పలువురు అంతర్జాతీయ మేటి జావెలిన్ త్రోయర్లు పాల్గొంటారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జులియన్ వెబెర్ (జర్మనీ), పోలాండ్ జాతీయ రికార్డు నెలకొల్పిన మార్సిన్ క్రుకొవ్స్కీ తదితరులు పాల్గొంటారు. ఈ సీజన్లో దక్షిణాఫ్రికా ఈవెంట్తో ఈ సీజన్కు శ్రీకారం చుట్టిన చోప్రా ఈ నెల 16న దోహా డైమండ్ లీగ్లో పాల్గొనాల్సి ఉంది. -
గడుల ఆట... కొత్త బాట!
ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్ పోటీలు మారబోతున్నాయి. దీంతో గడుల్లో వేసే ఎత్తులు, పైఎత్తులు కొత్త ఫార్మాట్లో జరగనున్నాయి. అయితే ఈ తరహా ఫార్మాట్ ఇప్పుడైతే ఖతర్లో జరిగే టోర్నీలో నిర్వహిస్తారు. ఆ తర్వాత కొనసాగుతుందో లేదో టోర్నీ జరిగిన విధానం, ఆసక్తిగొలిపిన వైనాన్ని బట్టి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తుది నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి ఇన్నాళ్లు జరిగిన ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలది ఒక లెక్కయితే... దోహాలో జరగబోయేది మాత్రం కొత్త లెక్క! ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్ మాత్రం మారలేదు. తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగనుంది. టూకీగా... ఇదీ టోర్నీ కహానీ! ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్–బ్లిట్జ్ టోర్నీకి దోహా (ఖతర్) ఆతిథ్య వేదిక కాగా... డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆరు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 10 లక్షల యూరోలు (భారత కరెన్సీలో రూ. 9.58 కోట్లు). ఓపెన్ కేటగిరీ విజేతలకు ర్యాపిడ్, బ్లిట్జ్ (3.5 లక్షల యూరోల చొప్పున) 7 లక్షల యూరోలు (రూ. 6.7 కోట్లు), మహిళల విభాగం విజేతలకు 3 లక్షల యూరోలు (రూ.2.87 కోట్లు). ర్యాపిడ్, బ్లిట్జ్లకు లక్షన్నర యూరోల చొప్పున కేటాయించారు. బ్లిట్జ్ ఫార్మాట్ మార్పులివి... ఈ ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్ పోటీల్లో నాకౌట్ దశను మరింత క్రమబద్దీకరించారు. అంటే గతంలో ఎనిమిది మందితో మొదలయ్యే క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశ స్థానంలో ఇప్పుడు నలుగురు మాత్రమే పాల్గొనే సెమీఫైనల్ను తీసుకొచ్చారు. ఈ టోర్నీల తొలిదశ స్విస్ లీగ్ పద్ధతి నుంచి నేరుగా సెమీఫైనల్స్ పోటీలే జరుగుతాయి. మధ్య ఎనిమిది మంది బరిలో ఉండే క్వార్టర్ ఫైనల్స్ ఉండవిక! ఈ మార్పుతో ఒరిగేదేంటి? ‘ఫిడే’ అధికారుల వివరణ ప్రకారం కొత్త బ్లిట్జ్ ఫార్మాట్లో స్విస్ లీగ్ పద్ధతి నుంచి నాకౌట్ చేరే వరకు ప్రతీ మ్యాచ్ ఆసక్తికరంగా, పోటాపోటీగా జరిగే అవకాశముంటుంది. స్విస్ లీగ్ దశలో ఎక్కువ మ్యాచ్లు ఆడటం వల్ల ఇందులో నిలకడైన ప్రదర్శన కనబరిచిన వారే చివరకు నాకౌట్ దశ (సెమీస్)కు అర్హత సాధిస్తారు. అంటే ఒకరితో ఒక ఎత్తు పొరపాటుతో ఓడిన మ్యాచ్, మరొకరు ఒక పైఎత్తుతో గెలిచిన మ్యాచ్ల వల్ల నాకౌట్ అవకాశాలు కోల్పోరు. ఎందుకంటే విరివిగా ఉండే లీగ్ మ్యాచ్ల వల్ల ఒక పొరపాటును అధిగమించి మరో మ్యాచ్లో గెలిచే అవకాశాలుంటాయి. బ్లిట్జ్లో 19 రౌండ్లు ఓపెన్ కేటగిరీలో బ్లిట్జ్ చాంపియన్షిప్ 19 రౌండ్ల పాటు జరుగుతుంది. మహిళల విభాగంలో 15 రౌండ్ల పాటు నిర్వహిస్తారు. అనంతరం నలుగురు చొప్పున సెమీఫైనల్కు చేరతారు. ఇక్కడి నుంచి గెలిచిన ఇద్దరి మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని, నియమనిబంధనల్ని ఫిడే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. యథాతథంగానే ర్యాపిడ్ ఈవెంట్ బ్లిట్జ్ పోరు మారింది. కానీ ర్యాపిడ్ చాంపియన్షిప్ను ఫిడే మార్చలేదు. ఓపెన్ కేటగిరీలో 13 రౌండ్లు, మహిళల విభాగంలో 11 రౌండ్ల మ్యాచ్లు జరుగుతాయి. అగ్రస్థానంలో నిలిచిన వారే విజేతగా ఆవిర్భవిస్తారు. ఒకవేళ టాప్లో పాయింట్లు సమంగా ఉంటే మాత్రం విజేతను తేల్చడానికి ప్లేఆఫ్ పోటీని నిర్వహిస్తారు. గత ఏడాది న్యూయార్క్ వేదికగా ప్రపంచ ర్యాపిడ్, చెస్ చాంపియన్షిప్ జరిగింది. ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్లో విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల ముర్జిన్... మహిళల విభాగంలో భారత స్టార్ కోనేరు హంపి విజేతలుగా నిలిచారు. బ్లిట్జ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో ఇయాన్ నిపోమ్నిషి (రష్యా), కార్ల్సన్ (నార్వే) సంయుక్త విజేతలుగా నిలువగా... మహిళల విభాగంలో చైనాకు చెందిన జు వెన్జున్ టైటిల్ సాధించింది. -
సినెర్ ముందంజ
రోమ్: నిషేధం గడువు పూర్తయ్యాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో ప్రపంచ పురుషుల టెన్నిస్ నంబర్వన్ యానిక్ సినెర్ జోరు కొనసాగిస్తున్నాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 18వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో సెరున్డోలో (అర్జెంటీనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సినెర్ 7–6 (7/2), 6–3తో విజయం సాధించాడు. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సినెర్ రెండు ఏస్లు సంధించాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఏడుసార్లు నెట్ వద్దకు దూసుకొచి్చన సినెర్ నాలుగుసార్లు పాయింట్లు గెలిచాడు. సెరున్డోలో 14 సార్లు నెట్ వద్దకు వచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు సొంతం చేసుకున్నాడు. 17 విన్నర్స్ కొట్టిన సినెర్ 30 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు సెరున్డోలో 29 విన్నర్స్ కొట్టి ఏకంగా 53 అనవసర తప్పిదాలు చేశాడు. 91 సర్వీస్ పాయింట్లలో సినెర్ 51 పాయింట్లు... 86 సర్విస్ పాయింట్లలో సెరున్డోలో 47 పాయింట్లు సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో సినెర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో సినెర్ 3–0తో రూడ్పై ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 6–4తో విజయం సాధించాడు. సెమీస్లో కోకో గాఫ్ రోమ్ ఓపెన్ మహిళల టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్, అమెరికా స్టార్ కోకో గాఫ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ మీరా ఆంద్రియెవా (రష్యా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 6–4, 7–6 (7/5)తో గెలుపొందింది. ఒక గంట 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కోకో గాఫ్ తన సర్విస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. -
తరుణ్ శుభారంభం
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి శుభారంభం చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన తరుణ్ తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ జస్టిన్ హో (మలేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 53వ ర్యాంకర్ తరుణ్ 21–16, 21–19తో జస్టిన్ హో ఆట కట్టించాడు. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత్కే చెందిన కిడాంబి శ్రీకాంత్ను బోల్తా కొట్టించిన తరుణ్ అదే జోరును మెయిన్ ‘డ్రా’లోనూ కొనసాగించాడు. తొలి గేమ్లో ఒకదశలో 8–11తో వెనుకబడిన తరుణ్ ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే దూకుడుతో ఆడి తొలి గేమ్ను దక్కించుకున్నాడు. వరుసగా మూడు పాయింట్లు నెగ్గి రెండో గేమ్ను ఆరంభించిన తరుణ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. ఒకదశలో జస్టిన్ హో 15–16తో ఆధిక్యాన్ని ఒక పాయింట్కు తగ్గించాడు. అయితే తరుణ్ రెండు పాయింట్లు గెలిచి 18–15తో ముందంజ వేశాడు. ఆ తర్వాత జస్టిన్ స్కోరును సమం చేసేందుకు యతి్నంచినా చివరకు తరుణ్ రెండు పాయింట్ల ఆధిక్యంతో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.మరోవైపు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో నేరుగా పోటీపడ్డ ఇద్దరు భారత ఆటగాళ్లు లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్ను దాటలేకపోయారు. లక్ష్య సేన్ 18–21, 21–9, 17–21తో ఎన్హట్ నుగుయెన్ (ఐర్లాండ్) చేతిలో, ప్రియాన్షు 13–21, 21–17, 16–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయారు. ప్రిక్వార్టర్స్లో గాయత్రి–ట్రెసా జోడీ మహిళల డబుల్స్లో భారత్కు చెందిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... రష్మీ గణేశ్–సానియా సికందర్ (భారత్); సెల్వం కవిప్రియ–సిమ్రన్ సింఘి (భారత్) జంటలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–15, 21–13తో జిన్ యె–కార్మెన్ టింగ్ (మలేసియా) జంటను ఓడించింది. రష్మీ–సానియా 11–21, 5–21తో టాన్ పియర్లీ–థినా (మలేసియా) చేతిలో, కవిప్రియ–సిమ్రన్ 17–21, 17–21తో బెన్యాపా–నుంతాకర్న్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్ (భారత్) జంట 20–22, 21–17, 18–21తో ఆరిఫ్ జునైది–రాయ్ కింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఉన్నతి, ఆకర్షి గెలుపు మహిళల సింగిల్స్ విభాగంగలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... రక్షిత శ్రీ, అనుపమ తొలి రౌండ్లో ఓడిపోయారు. ఉన్నతి 21–14, 18–21, 23–21తో థమోన్వన్ (థాయ్లాండ్)పై, ఆకర్షి 21–16, 20–22, 22–20తో కవోరు సుగియామ (జపాన్)పై, మాళవిక 21–12, 13–21, 21–17తో నెస్లిహాన్ అరిన్ (తుర్కియే)పై విజయం సాధించారు. రక్షిత శ్రీ 18–21, 7–21తో యో జియా మిన్ (ఇండోనేసియా) చేతిలో, అనుపమ 11–21, 9–21తో ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి చవిచూశారు. -
భారత్లో ఆసియా కప్ హాకీ: పాక్కు ఎంట్రీ కష్టమే
న్యూఢిల్లీ: భారత్లో జరిగే పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కాస్తా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. చివరకు కాల్పుల విరమణతో భారత్ వైపు నుంచి ప్రతిదాడులు తప్పినా... పాక్ నుంచి చీకటి పడగానే డ్రోన్ల దాడి ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ హాకీ జట్టును కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశాలే లేవు. దీనిపై హాకీ ఇండియా (హెచ్ఐ) భారత ప్రభుత్వ సలహా కోరగా... ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాలేదు. ఆగస్టు 27 నుంచి సెపె్టంబర్ 7 వరకు బిహార్లోని రాజ్గిర్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరగనుంది. ఇందులో ఆతిథ్య భారత్ సహా జపాన్, కొరియా, చైనా, మలేసియా, ఒమన్, చైనీస్ తైపీ, పాకిస్తాన్ పోటీపడతాయి. ప్రపంచకప్ హాకీకి ఈ ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీగా జరుగుతోంది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న ప్రపంచకప్ హాకీ టోర్నీ వచ్చే ఏడాది జరుగుతుంది. భారత్లో జరిగే టోర్నీ కోసం పాక్ను అనుమతించకపోవడం గతంలోనూ జరిగింది. 2016లో పఠాన్కోట్లో భారత ఎయిర్బేస్పై ఉగ్రదాడి జరగడంతో ఆ ఏడాది జరిగిన జూనియర్ ప్రపంచకప్ హాకీలో పాక్కు అనుమతించలేదు. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోళానాథ్ సింగ్ చెప్పారు. అనుమతిస్తారా, నిరాకరిస్తారా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని, దీనిపై ముందస్తుగా తాము చెప్పడానికేమీ లేదని ఆయన చెప్పారు. ఆసియా టోర్నీలో పాక్ స్థానంలో మలేసియాను ఆడించే అవకాశమైంది. ఈ టోర్నీలో ఐదుసార్లు విజేత అయిన దక్షిణ కొరియా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతుంది. కొరియా తర్వాత దాయాది దేశాలు చెరో నాలుగుసార్లు ఆసియా కప్ గెలిచాయి. -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. ఇకపై లెఫ్టినెంట్ కల్నల్గా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను భారత సైన్యం ప్రధానం చేసింది . ఈ మేరకు బుధవారం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. నీరజ్ కొత్త ర్యాంక్ ఏప్రిల్ 16, 2025 నుండి అమల్లోకి వచ్చింది."1948 టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులేషన్స్లోని పేరా 31 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంకును ప్రధానం చేయడానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని" రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా నీరజ్ ముందుగా 2016 నయీబ్ సుబేదార్ హోదాలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా భారత సైన్యంలో చేరాడు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్-2021లో గోల్డ్ మెడల్ సాధించడంతో సుబేదార్గా పదోన్నతి పొందాడు. కాగా నీరజ్ చోప్రా..ఇండియన్ అథ్లెటిక్స్ హిస్టరీలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్.. పారిస్ ఒలింపిక్స్లో రజత పతకంతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే గోల్డెన్ బాయ్కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. కాగా దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ప్రత్యేక హోదా భారత సైన్యం సత్కరిస్తోంది. ఈ గౌరవ హోదా పొందిన ఆరో క్రీడాకారుడిగా నీరజ్ నిలిచాడు. నీరజ్ కంటే ముందు ప్రముఖ షూటర్లు అభినవ్ బింద్రా, విజయ్ కుమార్.. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని ఈ అరుదైన గౌరవాన్ని పొందారు. -
ఒకప్పుడు బాక్సింగ్ చాంపియన్.. ఇప్పుడు రామ్ చరణ్ బౌన్సర్!
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్తో తలపడ్డ యోధుడు అతడు.. ఐదుసార్లు బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్షిప్ గెలిచిన వీరుడు.. అంతేకాదు నాలుగుసార్లు కామన్వెల్త్ చాంపియన్గా నిలిచిన ఘనత అతడిది.. కానీ ఇప్పుడు ఓ ఈవెంట్లో బౌన్సర్..ఆ బాక్సింగ్ చాంపియన్ పేరు జూలియస్ ఫ్రాన్సిస్ (Julius Francis). కాగా టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charana) మైనపు విగ్రహాన్ని ఇటీవలే.. లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కుటుంబంతో సహా చెర్రీ హాజరయ్యాడు.ఈ సందర్భంగా రామ్ చరణ్ తన అభిమానులను కలిసేందుకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో బౌన్సర్ల బృందంలో బ్రిటిష్ హెవీవెయిట్ చాంపియన్ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ కూడా కనిపించడం విశేషం.అంతేకాదు.. ఫ్రాన్సిస్ తన బాక్సింగ్ బెల్టును తీసుకుని రామ్ చరణ్ దగ్గరికి వచ్చి.. దానిని తన భుజం చుట్టూ వేయాల్సిందిగా కోరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఎవరీ జూలియస్ ఫ్రాన్సిస్?1993- 2006 మధ్య జూలియస్ ఫ్రాన్సిస్ ప్రొపెఫషనల్ బాక్సర్గా ఉన్నాడు. 2000 సంవత్సరంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్తో తలపడ్డ అతడు.. ఓటమి చవిచూశాడు. అరవై ఏళ్ల జూలియస్ ఓవరాల్గా తన కెరీర్లో 23 విజయాలు సాధించి.. ఇరవై నాలుగింటిలో ఓడిపోయాడు.ఇక 2007లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బౌట్లోనూ జూలియస్ ఫ్రాన్సిస్ పాల్గొన్నాడు. 2012లో నటనా రంగంలోనూ అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2022లో యూకేలో ఓ రెస్టారెంట్ బయట ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు అభిమానులతో ఓ వ్యక్తికి గొడవ జరుగగా.. అక్కడే బౌన్సర్గా ఉన్న ఫ్రాన్సిస్ సదరు ఫ్యాన్స్ను నెట్టివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలాకాలం తర్వాత ఫ్రాన్సిస్ మరోసారి తెరమీదకు వచ్చాడు. ఇదిలా ఉంటే.. బాక్సర్ మైక్ టైసన్కు టాలీవుడ్తో అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో అతడు కీలక పాత్రలో కనిపించాడు.చదవండి: ‘మాక్స్వెల్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా.. -
కోచ్ ముర్రేతో జొకోవిచ్ తెగదెంపులు
లండన్: ఒక దిగ్గజ ప్లేయర్తో మరో మాజీ వరల్డ్ నంబర్వన్ కోచింగ్ అనుబంధం ఆరు నెలలకే ముగిసింది. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన కోచ్, బ్రిటన్ మాజీ ప్లేయర్ ఆండీ ముర్రేతో తెగదెంపులు చేసుకున్నాడు. ఇకపై వీరిద్దరు కలిసి పని చేయరని ముర్రే మేనేజర్ ప్రకటించాడు. గత ఏడాది ముర్రే ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత తనకు కోచింగ్ సహకారం కావాలంటూ జొకోవిచ్ స్వయంగా ముర్రేను సంప్రదించాడు. దాంతో వీరిద్దరు ఈ ఏడాది తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్కు ముందు జత కట్టారు. అయితే ఇది ఎక్కువ కాలం సాగలేదు. తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేక వరుసగా ఓడుతున్న జొకోవిచ్ ఈ సీజన్లో ఇంకా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. నిజానికి రాబోయే క్లే కోర్టు సీజన్ ముగిసే వరకు కూడా తనకు ముర్రే కోచ్గా వ్యవహరిస్తాడని గతంలోనే జొకోవిచ్ చెప్పినా... చివరకు దానికి చాలా ముందే ఇద్దరూ విడిపోయారు. ‘గత ఆరు నెలలుగా నాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. కోర్టులో కఠోర శ్రమతో పాటు కోర్టు బయట కూడా రోజులు బాగా గడిచాయి’ అని జొకోవిచ్ సోషల్ మీడియాలో ముర్రే గురించి పోస్ట్ చేయగా...తనకు కోచ్గా అవకాశం ఇచ్చిన జొకోవిచ్కు ముర్రే కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పటికే 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 37 ఏళ్ల జొకోవిచ్ మరో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధిస్తే టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్గా ఆల్టైమ్ రికార్డు నెలకొల్పుతాడు. మహిళల విభాగంలో ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్, జొకోవిచ్ పేరిట సంయుక్తంగా ఈ రికార్డు ఉంది. కెరీర్లో 99 సింగిల్స్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ 100వ టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాడు. తదుపరి ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు జరిగే జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో జొకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో జొకోవిచ్ గెలిస్తే జిమ్మీ కానర్స్ (109; అమెరికా), రోజర్ ఫెడరర్ (103; స్విట్జర్లాండ్) తర్వాత 100 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో క్రీడాకారిడిగా గుర్తింపు పొందుతాడు. -
శ్రీకాంత్కు చుక్కెదురు
బ్యాంకాక్: ప్రపంచ మాజీ నంబర్వన్, భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో తెలంగాణకు చెందిన తరుణ్ మన్నేపల్లి 21–16, 21–19తో శ్రీకాంత్ను బోల్తా కొట్టించి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు.అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 23 ఏళ్ల తరుణ్ 17–21, 21–19, 21–17తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై, 32 ఏళ్ల శ్రీకాంత్ 21–15, 21–17తో శంకర్పై గెలుపొందారు. భారత్కే చెందిన ఆయుశ్ శెట్టి, ఐరా శర్మ కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్ల్లో ఆయుశ్ శెట్టి 14–21, 20–22తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో, ఐరా 12–21, 18–21తో థమన్వోన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మొహిత్–లక్షిత (భారత్) జోడీ 8–21, 10–21తో ఎన్జీ సాజ్ యావు–చాన్ యిన్ చాక్ (హాంకాంగ్) ద్వయం చేతిలో ఓడింది. -
భారత్ను సెమీస్కు చేర్చిన రోహెన్ సింగ్
దక్షిణాసియా అండర్–19 పురుషుల ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అరుణాచల్ప్రదేశ్లో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్ తేడాతో నేపాల్ జట్టును ఓడించి గ్రూప్ ‘టాపర్’గా నిలిచి సెమీఫైనల్కు అర్హత పొందింది. భారత్ తరఫున చాపామాయుమ్ రోహెన్ సింగ్ (28వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఒమంగ్ డోడుమ్ (29వ నిమిషంలో), డానీ మీటీ (84వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఈనెల 16న జరిగే సెమీఫైనల్లో మాల్దీవులు జట్టుతో భారత్ తలపడుతుంది. -
తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్కు స్వర్ణం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2025లో తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిష్కాఅగర్వాల్ స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ గేమ్స్లో హైదరాబాద్కు చెందిన 17 ఏళ్ల నిష్కా ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో విజేతగా నిలిచింది. నిష్కా 44.333 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని పొందింది. అనుష్క పాటిల్ (మహారాష్ట్ర; 42.067 పాయింట్లు) రజతం, సారా రవూల్ (మహారాష్ట్ర; 41.233 పాయింట్లు) కాంస్యం సాధించారు. -
భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ప్రొ హాకీ లీగ్ చివరి అంచె టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు జార్ఖండ్కు చెందిన మిడ్ఫీల్డర్ సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. పంజాబ్కు చెందిన ఫార్వర్డ్ నవ్నీత్ కౌర్ వైస్ కెపె్టన్గా వ్యవహరిస్తుంది. ప్రొ హాకీ లీగ్ చివరి అంచె మ్యాచ్లు జూన్ 14 నుంచి 29వ తేదీ వరకు యూరోప్లోని జర్మనీ,బ్రిటన్, బెల్జియం దేశాల్లో జరుగుతాయి.ఈ టోర్నీలో భారత జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడుతుంది. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బెల్జియం, చైనా జట్లతో భారత్ రెండు మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. భారత జట్టు వరుసగా జూన్ 14, 15వ తేదీల్లో లండన్లో ఆ్రస్టేలియా జట్టుతో... జూన్ 17, 18వ తేదీల్లో లండన్లో అర్జెంటీనాతో... జూన్ 21, 22వ తేదీల్లో ఆంట్వర్ప్లో బెల్జియంతో... జూన్ 28, 29వ తేదీల్లో బెర్లిన్లో చైనా జట్టుతో పోటీపడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ హాకీ లీగ్లో భారత్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో రెండు మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. మొత్తం తొమ్మిది పాయింట్లతో భారత్ ఆరో స్థానంలో ఉంది. టోర్నీ ముగిశాక చివరిదైన తొమ్మిదో స్థానంలో నిలిచిన జట్టు వచ్చే సీజన్లో ప్రొ లీగ్ నుంచి బయటకు వచ్చి నేషన్స్ కప్లో ఆడాల్సి ఉంటుంది. ప్రొ లీగ్ విజేత జట్టు తదుపరి ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.భారత మహిళల హాకీ జట్టుసలీమా టెటె (కెప్టెన్), నవ్నీత్ కౌర్ (వైస్ కెప్టెన్), సవిత, బిచ్చూదేవి (గోల్ కీపర్లు), సుశీలా చాను, జ్యోతి, సుమన్ దేవి, జ్యోతి సింగ్, ఇషిక చౌధరీ, జ్యోతి ఛత్రి (డిఫెండర్లు), వైష్ణవి విఠల్ ఫాడ్కే, సుజాత కుజుర్, మనీశా చౌహాన్, నేహా, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, సునెలితా టొప్పో, మహిమా టెటె (మిడ్ ఫీల్డర్లు), దీపిక, దీపిక సోరెంగ్, బల్జీత్ కౌర్, రుతుజా, బ్యూటీ డుంగ్డుంగ్, సాక్షి రాణా (ఫార్వర్డ్లు). -
గాయత్రి–ట్రెసా జాలీ జోడీ పునరాగమనం
బ్యాంకాక్: గాయాల కారణంగా సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆడలేకపోయిన భారత మహిళల డబుల్స్ నంబర్వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (Treesa Jolly) ద్వయం పునరాగమనం చేయనుంది. మంగళవారం నుంచి మొదలయ్యే థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ఒంగ్ జిన్ యి–కార్మెన్ తింగ్ (మలేసియన్) జంటతో గాయత్రి–ట్రెసా ద్వయం తలపడుతుంది.మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సహా యువ బ్యాడ్మింటన్ తారలు ఆయుశ్ షెట్టి, ఉన్నతి హుడాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. నేడు క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. 20 ఏళ్ల ఆయుశ్, 17 ఏళ్ల ఉన్నతిలు తమ జోరు కొనసాగించేందుకు పట్టుదలతో ఉన్నారు. గతవారం జరిగిన చైనీస్ తైపీ ఓపెన్లో ఈ ఇద్దరు సెమీఫైనల్స్ చేరి భారత బ్యాడ్మింటన్ భవిష్యత్కు కొత్త ఊపిరిలూదారు.అయితే ఈ టోర్నీలో వీరిద్దరు క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఆయుశ్, ఉన్నతిలు ఉన్న ఫామ్ దృష్ట్యా మెయిన్ ‘డ్రా’ చేరడం ఏమంత కష్టం కాదు. తొలి మ్యాచ్లో ఆయుశ్ ఫిన్లాండ్కు చెందిన జొకిమ్ ఒల్టార్ఫ్ తో, మహిళల క్వాలిఫయర్స్లో ఉన్నతి... స్థానిక ప్లేయర్ తమోన్వన్ నితిటిక్రాయ్తో తలపడతారు. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి మ్యాచ్లో భారత స్టార్ లక్ష్యసేన్ ఐర్లాండ్ ఆటగాడు ఎన్హత్ నెన్గుయెన్ను ఎదుర్కొంటాడు.గాయం నుంచి కోలుకోకపోవడంతో సుదిర్మన్ కప్కు దూరంగా ఉన్న లక్ష్యసేన్ తాజా టోర్నీ ద్వారా తన ఫిట్నెస్ను పరీక్షించుకోనున్నాడు. మరో మ్యాచ్లో నిలకడగా రాణిస్తున్న ప్రియాన్షు రజావత్... అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో తలపడతాడు. మహిళల సింగిల్స్లో భారత మేటి షట్లర్ మాళవిక న్సోద్... తుర్కియేకు చెందిన నెస్లిహన్ యిగిత్తో జరిగే తొలి రౌండ్ పోరుతో థాయ్ ఓపెన్ను ప్రారంభించనుంది. మిగతా మ్యాచ్ల్లో మాజీ జాతీయ చాంపియన్ అనుపమకు మొదటి రౌండ్లోనే గట్టి సవాల్ ఎదురవుతోంది. ఆమె మాజీ ప్రపంచ చాంపియన్ రత్చనోక్ ఇంతనాన్ (థాయ్లాండ్)ను ఎదుర్కోనుంది. -
నెరవేరిన కేన్ కల
బెర్లిన్: ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు... ఏకంగా ఆరుసార్లు కెరీర్లో మేజర్ ట్రోఫీలు సాధించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ ఏడో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ప్రతిష్టాత్మక జర్మనీ అంతర్జాతీయ ఫుట్బాల్ లీగ్ బుండెస్లీగాలో హ్యారీ కేన్ తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. 2024–2025 బుండెస్లీగా సీజన్లో బాయెర్న్ మ్యూనిక్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టును విజేతగా నిలబెట్టాడు. ఈ క్రమంలో తన కెరీర్లో లోటుగా ఉన్న మేజర్ ట్రోఫీని అందుకున్నాడు.బొరుసియా మొంచెన్గ్లాడ్బాచ్ క్లబ్తో జరిగిన 33వ లీగ్ మ్యాచ్లో మాన్యుయెల్ నెయుర్ సారథ్యంలోని బాయెర్న్ మ్యూనిక్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గెలిచింది. తద్వారా ఈ సీజన్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బాయెర్న్ మ్యూనిక్ జట్టు రికార్డుస్థాయిలో 33వసారి బుండెస్లీగా టైటిల్ను హస్తగతం చేసుకుంది. మ్యూనిక్ జట్టుకు హ్యారీ కేన్ (31వ నిమిషంలో), మైకేల్ ఒలిస్ (90వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ సీజన్లు 30 మ్యాచ్లు ఆడిన హ్యారీ కేన్ 25 గోల్స్తో టాప్ స్కోరర్గా ఉన్నాడు. సీజన్లోని చివరి మ్యాచ్ మే 17న హఫెన్హీమ్ జట్టుతో బాయెర్న్ మ్యూనిక్ జట్టు ఆడుతుంది.మొత్తం 18 జట్లు ఇంటా, బయట పద్ధతిలో బుండెస్లీగాలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు 34 మ్యాచ్లు ఆడుతుంది. 33 మ్యాచ్లు పూర్తి చేసుకున్న బాయెర్న్ మ్యూనిక్ జట్టు 24 విజయాలు సాధించింది. 7 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 95 గోల్స్ సాధించి, 32 గోల్స్ను సమర్పించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 79 పాయింట్లతో టాప్ ర్యాంక్ను ఖరారు చేసుకుంది.68 పాయింట్లతో బాయెర్ 04 లెవెర్కుసెన్ జట్టు రన్నరప్ ట్రోఫీని ఖరారు చేసుకుంది. 31 హ్యారీ కేన్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు 2021, 2024 ‘యూరో’ టోరీ్నలో రన్నరప్గా నిలిచింది. హ్యారీ కేన్ సభ్యుడిగా ఉన్న టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ జట్టు 2015, 2019లలో ఇంగ్లిష్ ఫుట్బాల్ లీగ్ కప్లో రన్నరప్గా... 2019 చాంపియన్స్ లీగ్లో రన్నరప్గా నిలిచింది. 2023లో కేన్ సభ్యుడిగా ఉన్న బాయెర్న్ మ్యూనిక్ జట్టు జర్మన్ సూపర్ కప్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దాంతో ఆరుసార్లు హ్యారీ కేన్కు టైటిల్ దక్కినట్టే దక్కి చేజారిపోయింది. అయితే ఏడో ప్రయత్నంలో హ్యారీ కేన్ ఖాతాలో బుండెస్లీగా రూపంలో మేజర్ టైటిల్ చేరింది. -
త్రుటిలో చేజారిన పతకాలు
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా వ్యక్తిగత చెస్ చాంపియన్షిప్ బ్లిట్జ్ విభాగంలో భారత్కు త్రుటిలో రెండు కాంస్య పతకాలు చేజారాయి. పురుషుల విభాగంలో తమిళనాడు గ్రాండ్మాస్టర్ మురళీ కార్తికేయన్... మహిళల విభాగంలో ఒడిశా అమ్మాయి పద్మిని రౌత్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను కోల్పోయారు. నిరీ్ణత తొమ్మిది రౌండ్ల తర్వాత కార్తికేయన్ ఏడు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. దాంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు.రుడిక్ మకారియన్ (రష్యా)కు మూడో స్థానంతోపాటు కాంస్య పతకం ఖరారైంది. కార్తికేయన్కు నాలుగో స్థానం, నీలాశ్ సాహా (భారత్)కు ఐదో స్థానం, జియాంగ్ హావోచెన్ (చైనా)కు ఆరో స్థానం లభించాయి. పురుషుల విభాగంలో మొత్తం 111 మంది ప్లేయర్లు పోటీపడగా... 8 పాయింట్లతో 15 ఏళ్ల ఇవాన్ జెమ్లియాన్స్కి (రష్యా) విజేతగా అవతరించాడు. ఇరాన్కు చెందిన 15 ఏళ్ల సినా మొవాహెద్ 7.5 పాయింట్లతో రజతాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత పద్మిని రౌత్, యుజిన్ సాంగ్ (చైనా), ఎల్నాజ్ కలియాక్మెత్ (కజకిస్తాన్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. దాంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కాంస్య పతకాన్ని ఖరారు చేయగా... యుజిన్ సాంగ్కు కాంస్యం లభించింది. పద్మిని నాలుగో స్థానంలో, ఎల్నాజ్ ఐదో స్థానంలో నిలిచారు. 7.5 పాయింట్లతో అలువా నుర్మాన్ (కజకిస్తాన్), వాలెంటీనా గునీనా (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్లను వర్గీకరించగా... నుర్మాన్కు స్వర్ణం, గునీనాకు రజతం లభించాయి. ఆసియా టోర్నిలో రష్యా ప్రాతినిధ్యం ఎందుకంటే... ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నిలలో రష్యా తరఫున పాల్గొనడంపై నిషేధం విధించాయి. అయితే రష్యా క్రీడాకారులు దేశం తరఫున కాకుండా తటస్థ క్రీడాకారులుగా పాల్గొనవచ్చని ఐఓసీ వెసులుబాటు కల్పించింది. దాంతో పలువురు రష్యా క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నిలలో ఆయా క్రీడా సమాఖ్య పతాకాలపై బరిలోకి దిగుతున్నారు. ఇక రష్యా చెస్ క్రీడాకారుల విషయానికొస్తే 2023లో రష్యా యూరోపియన్ చెస్ యూనియన్ నుంచి బయటకు వచ్చి ఆసియా సమాఖ్యలో చేరింది. పలు టోర్నీలలో రష్యా ప్లేయర్లు ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) తరఫున పాల్గొంటున్నారు. తాజాగా ఆసియా చాంపియన్షిప్లో రష్యా క్రీడాకారులు ‘ఫిడే’ పతాకంపై పోటీపడుతున్నారు. -
భారత్ ‘పాంచ్ పటాకా’
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత కాంపౌండ్ ఆర్చర్లు 5 పతకాలతో సత్తాచాటారు. వ్యక్తిగత విభాగంలో మధుర స్వర్ణ పతకంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో భారత ఆర్చర్లకు మొత్తంగా 2 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో మధుర 139–138తో కార్సన్ (అమెరికా)పై గెలుపొందింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మధుర ఈ టోర్నీలో ఓవరాల్గా మూడు పతకాలు గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మధుర... టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ విభాగంలో కాంస్యం గెలిచిన జట్లలో కూడా సభ్యురాలు. ఫైనల్లో మొదట ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు సాధించిన మధుర ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఒకదశలో వరుసగా రెండు సార్లు 8 పాయింట్లతో పాటు ఒకసారి 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని 81–85తో వెనుకంజలో పడింది. తర్వాతి రౌండ్లో మెరుగైన ప్రదర్శనతో స్కోరును 110–110తో సమం చేసి... అదే జోరు కొనసాగిస్తూ పసిడి ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ దేవ్తలేలతో కూడిన భారత పురుషుల జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 232–228 పాయింట్ల తేడాతో మెక్సికో జట్టుపై గెలుపొందింది. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. షూటాఫ్లో అతడు దక్షిణ కొరియా ఆర్చర్పై విజయం సాధించాడు. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర) లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సురేఖ, చికిత, మధుర త్రయం. 221–234తో మెక్సికో జట్టు చేతిలో ఓడింది. ఇక మిక్స్డ్ టీమ్ విభాగంలో మధుర–అభిõÙక్ వర్మ జంట కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత జోడీ 144–142 పాయింట్ల తేడాతో ఫాటిన్ నూర్ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)పై గెలుపొందింది. తాజా ప్రదర్శనతో భారత కాంపౌండ్ జట్టు భవిష్యత్తుపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సారి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్ను ప్రవేశపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మనకు ఒలింపిక్స్కు పతకం సాధించేందుకు మంచి అవకాశం ఉంది. -
మూడు పతకాలకు విజయం దూరంలో
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు మూడు విజయాలు సాధిస్తే మూడు పతకాలను ఖరారు చేసుకుంటారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ (ఢిల్లీ)–మధుర (మహారాష్ట్ర) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పార్థ్ సాలుంఖే సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్లో గెలిస్తే దీపిక, పార్థ్ స్వర్ణ, రజత పతకాల కోసం రేసులో నిలుస్తారు. సెమీఫైనల్లో ఓడిపోతే కాంస్య పతకం కోసం పోటీపడతారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ సెమీఫైనల్లో అభిషేక్–మధుర ద్వయం 156–158తో ఎల్లా గిబ్సన్–అజయ్ స్కాట్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్లో ఫాటిన్ నూర్ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)లతో అభిషేక్, మధుర తలపడతారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్ తొలి రౌండ్లో, అతాను దాస్ క్వార్టర్ ఫైనల్లో ని్రష్కమించారు. ధీరజ్ 5–6తో అబ్దుల్లా (టర్కీ) చేతిలో, తరుణ్దీప్ 5–6తో తెత్సుయ (జపాన్) చేతిలో, అతాను దాస్ 2–6తో కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. పార్థ్ సాలుంఖే తొలి రౌండ్లో 6–5తో 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత మెటీ గాజోజ్ (టర్కీ)పై, రెండో రౌండ్లో 6–5తో తెత్సుయ (జపాన్)పై, మూడో రౌండ్లో 6–2తో రియాన్ ట్యాక్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో కిమ్ జె డియోక్ (కొరియా)పై గెలుపొందాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి తొలి రౌండ్లో 6–4తో లూసియా (స్పెయిన్)పై, రెండో రౌండ్లో 6–0తో డయానా (కజకిస్తాన్)పై, మూడో రౌండ్లో 6–4తో విక్టోరియా (ఫ్రాన్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో లీ జియామన్ (చైనా)పై విజయం సాధించింది. భారత్కే చెందిన అంకిత మూడో రౌండ్లో 3–7తో లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో, అన్షిక తొలి రౌండ్లో 5–6తో ఎలీసా టార్ట్లెర్ (జర్మనీ) చేతిలో, సిమ్రన్జిత్ తొలి రౌండ్లో 3–7తో యుహెరా రుకా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
మేమంతా మీ వెంటే...
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం దుశ్చర్యలను తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎదుర్కొంటున్న భారత త్రివిధ దళాలకు క్రీడా దిగ్గజాలు మద్దతు పలికారు. క్రికెట్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా చాంపియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులు దేశ ప్రజల సంరక్షణ కోసం పగలనక... రాత్రనక శ్రమిస్తున్న సాయుధ బలగాల ధైర్యానికి సెల్యూట్ చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న భారత సేనల ధైర్య సాహసాల్ని స్టార్లంతా కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా తామంతా సైన్యం వెంటే అని స్థయిర్యం పెంచారు. దేశ రక్షణే లక్ష్యంగా శ్రమిస్తోన్న భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లను చూసి గర్వపడుతున్నా. త్రివిధ దళాలు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఈ పోరాటయోధుల వల్లే భారత్ తలెత్తుకొని నిలబడుతోంది. దేశం కోసం అహరి్నశలు శ్రమించే మీ వెంటే జాతి మొత్తం నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగాలి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని విజ్ఞప్తి. –భారత కెప్టెన్ రోహిత్ శర్మసాయుధ బలగాలకు నా సలామ్. ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా ఎదురునిలిచి దేశాన్ని కాపాడే మన వీరుల ధైర్యసాహసాలకు జేజేలు పలుకుతున్నాం. భారత్ కోసం మీరు, మీ కుటుంబసభ్యులు చేసే త్యాగాలకు మేమంతా రుణపడే ఉంటాం. –విరాట్ కోహ్లి ఉగ్రవాదులను హతమార్చితే మౌనంగా ఉండాల్సిన చోట పాక్ యుద్ధాన్ని ఎంచుకొని తమ వక్రబుద్ధిని మరోమారు చూపింది. దీనికి తగిన గుణపాఠం మా సైన్యం మీకు నేర్పుతుంది. ఆ పాఠమెలా ఉంటుందంటే జీవితంలో మీరెప్పుడు మర్చిపోరు. –వీరేంద్ర సెహ్వాగ్ టెర్రరిజంపై పోరాటం... దేశ రక్షణకోసం మీరు కనబరిచే సాహసాలు మాకెంతో గర్వకారణం. సరిహద్దుల్లో మీరున్నారనే ధైర్యమే దేశాన్ని ధీమాగా నడిపిస్తోంది.–నీరజ్ చోప్రాభారత దళాలు చూపే ధైర్యం, క్రమశిక్షణ, త్యాగాలే దేశానికి బలం. ఆపరేషన్ సిందూర్ను విజయవంతంగా నిర్వహించి మన పతకాన్ని రెపరెపలాడించిన మీ నిస్వార్థసేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. జై హింద్. –పీవీ సింధు -
‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా
న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ టోర్నమెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఈవెంట్ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న బెంగళూరు వేదికగా ఈ మీట్ జరగాల్సి ఉండగా... భారత్, పాక్ దాడుల నేపథ్యంలో టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం నీరజ్ చోప్రా వెల్లడించాడు. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ తొలి ఎడిషన్ను వాయిదా వేశాం. ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, భాగస్వాముల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే తదుపరి కార్యచరణ వెల్లడిస్తాం. ఈ క్లిష్ట సమయంలో దేశంతో దృఢంగా నిలబడటం చాలా ముఖ్యం. ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో భద్రతా బలగాలు పోరాడుతున్నాయి. మేమంతా వారి వెంటే. జై హింద్’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. -
భారత్ చేజారిన కాంస్యం
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత రికర్వ్ పురుషుల, మహిళల జట్లు పతకం సాధించడంలో విఫలమయ్యాయి. ధీరజ్ బొమ్మదేవర (ఆంధ్రప్రదేశ్), అతాను దాస్ (బెంగాల్), తరుణ్దీప్ రాయ్ (సిక్కిం)లతో కూడిన భారత పురుషుల జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకోగా... దీపిక కుమారి (జార్ఖండ్), అంకిత (బెంగాల్), అన్షిక కుమారి (బిహార్)లతో కూడిన భారత మహిళల జట్టు మాత్రం రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్లు మధుర (మహారాష్ట్ర), రిషభ్ యాదవ్ (హరియాణా) సెమీఫైనల్ చేరుకొని పతకాల వేటలో నిలిచారు. క్రిస్టియన్ స్టాడర్డ్, బ్రాడీ ఎలీసన్, జాక్ విలియమ్స్లతో కూడిన అమెరికా జట్టుతో కాంస్య పతక మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3–5 సెట్ పాయింట్లతో ఓడిపోయింది. తొలి సెట్ను అమెరికా 57–56తో నెగ్గి 2 పాయింట్లు సాధించింది. రెండో సెట్ 56–52తో అమెరికా ఖాతాలోనే వెళ్లింది. అమెరికా ఆధిక్యం 4–0కు పెరిగింది. మూడో సెట్ను భారత్ 55–54తో గెలిచి 2 పాయింట్లు సంపాదించింది. నాలుగో సెట్లో రెండు జట్లు 56–56తో సమంగా నిలిచాయి. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. ఓవరాల్గా అమెరికా 5–3తో విజయాన్ని ఖరారు చేసుకొని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు భారత జట్టు 5–4తో (53–51, 55–58, 55–56, 54–53, 29–27) కజకిస్తాన్పై గెలిచింది. నాలుగు సెట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. దాంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... భారత్ పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–0తో (58–56, 57–56, 55–53)తో ఇటలీపై నెగ్గింది. సెమీఫైనల్లో టీమిండియా 4–5తో (51–54, 50–56, 56–55, 55–53, 25–26) ‘షూట్ ఆఫ్’లో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన భారత మహిళల జట్టు 4–5తో (49–50, 52–54, 52–45, 55–48, 26–27)తో ‘షూట్ ఆఫ్’లో అలెజాంద్రా వలెన్సియా, వాలెంటీనా వాజ్క్వెజ్, మోంటాయ అల్ఫారోలతో కూడిన మెక్సికో జట్టు చేతిలో ఓడిపోయింది. చికిత, జ్యోతి సురేఖలకు నిరాశ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ క్రీడాకారిణి తనిపర్తి చికిత, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి నిరాశపరచగా... మధుర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మధుర 142–141తో జ్యోతి సురేఖను ఓడించింది. రెండో రౌండ్ మ్యాచ్ల్లో చికిత 134–138తో అదెల్ జెక్సెన్బినోవా (కజకిస్తాన్) చేతిలో, అదితి 129–140తో కార్సన్ క్రాహి (అమెరికా) చేతిలో ఓడిపోయారు.పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్లో రిషభ్ డెన్మార్క్కు చెందిన మథియాస్ ఫులర్టన్పై గెలిచాడు. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 147–147తో సమంగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లోనూ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే రిషభ్ సంధించిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో అతనికి సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. -
ఉజ్బెకిస్తాన్తో భారత్ ‘ఢీ’
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టు ఉజ్బెకిస్తాన్తో రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడనుంది. మే 30వ తేదీన తొలి మ్యాచ్... జూన్ 3వ తేదీన రెండో మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని పడుకోన్–ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ ఈ రెండు మ్యాచ్లకు వేదిక కానుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం భారత జట్టు 69వ ర్యాంక్లో, ఉజ్బెకిస్తాన్ 50వ ర్యాంక్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు 13 సార్లు తలపడ్డాయి. తొమ్మిది మ్యాచ్ల్లో ఉజ్బెకిస్తాన్, ఒక మ్యాచ్లో భారత్ గెలిచాయి. మరో మూడు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి పర్యవేక్షణలో 2026 ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి జరుగుతున్న శిక్షణ శిబిరంలో భారత క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. ఈ శిబిరంలో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కూడా ఉంది. ఈ సీజన్లో సౌమ్య నిలకడగా రాణించి 2025 సంవత్సరానికి భారత ఉత్తమ మహిళా ఫుట్బాలర్ అవార్డును గెల్చుకుంది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీ జూన్ 23 నుంచి జూలై 5వ తేదీ వరకు థాయ్లాండ్లో జరగనుంది. గ్రూప్ ‘బి’లో మంగోలియా, తిమోర్లెస్టె, ఇరాక్, థాయ్లాండ్ జట్లతో కలిసి భారత్ ఉంది. భారత ప్రాబబుల్స్: పాయల్, ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, కీషమ్ మెలోడి చాను, మోనాలిసా దేవి, పూరి్ణమ కుమారి, నిర్మలా దేవి, మారి్టనా థోక్చోమ్, శుభాంగి సింగ్, సంజు, మాలతి ముండా, తోయ్జామ్ థోయ్బిసనా చ ఆను, రంజన చాను, స్వీటీ దేవి, వికసిత్ బరా, హేమం షిల్కీ దేవి, కిరణ్ పిస్డా, రత్నబాలా దేవి, ముస్కాన్ సుబ్బా, లిషామ్ బబీనా దేవి, కార్తీక అంగముత్తు, సిండీ కల్నే, సంగీత బస్ఫోరె, ప్రియదర్శిని, బేబీ సనా, సంతోష్, అంజు తమాంగ్, మౌసుమి ముర్ము, మాళవిక, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్, సులాంజన రౌల్, లిండా కోమ్ సెర్టో, రింపా హల్దర్, మనీషా నాయక్, రేణు, కరిష్మా పురుషోత్తం, సుమతి కుమారి, మనీషా కల్యాణ్, గ్రేస్ డాంగ్మె. -
ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్లో నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... వచ్చే నెలలో చెక్ రిపబ్లిక్లో జరగనున్న ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొననున్నాడు. గత రెండు సార్లు గాయాల కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉన్న నీరజ్ చోప్రా... జూన్ 24న జరిగే మీట్లో బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా... ప్రస్తుతం కొత్త కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ‘ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ మీట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. నా కోచ్ జెలెజ్నీ గతంలో ఈ టోర్నీలో చాలా సార్లు విజేతగా నిలవడంతో పాటు... ఈవెంట్ డైరెక్టర్గానూ ఉన్నారు’ అని నీరజ్ పేర్కొన్నాడు. 1961 నుంచి జరుగుతున్న ఈ మీట్కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య... గోల్డ్ లెవల్ మీట్ గుర్తింపునిచ్చింది. ఈ నెల 16న దోహా డైమండ్ లీగ్లో పాల్గొననున్న ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత నీరజ్... ఈ నెల 24 భారత్లో తొలిసారి జరగనున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్లో పాల్గొననున్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నుంచి నీరజ్ తప్పుకున్నాడు. -
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో స్పందించిన తీరు వైరల్ అవుతోంది. ఈ దేశ ఐక్యతకు ఇదే సరైన నిదర్శనం అంటూ ఆమె పంచుకున్న ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ముష్కరులకు మెరుపు దాడులతో మన సైన్యం సమాధానమిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని దాదాపు తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది. తద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదని మరోసారి భారత్ స్పష్టమైన సందేశాన్ని దాయాదికి అందించింది.పేరు సరిగ్గా సరిపోయిందంటూఇక ఈ ఆపరేషన్కు సిందూర్ అనే పేరు సరిగ్గా సరిపోయిందంటూ బాధిత కుటుంబాలతో పాటు యావత్ భారతావని ప్రశంసిస్తోంది. అమాయకపు ఆడపడుచుల నుదిటి సిందూరం చెరిగేపోయేలా పాశవిక దాడికి తెగబడిని ఉగ్రవాదులకు ‘రక్త సిందూరం’తో సమాధానమిచ్చారని.. ఇది సరైన నివాళి అని ఉద్వేగానికి లోనవుతున్నారు.మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగాఅదే విధంగా.. ఈ ఆపరేషన్కు సంబంధించిన ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్కు ఇద్దరూ మహిళా సైనికాధికారులు నాయకత్వం వహించడం కూడా జాతి హృదయాలు ఉప్పొంగేలా చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్... భారత దేశపు మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా తాము చేపట్టిన ఆపరేషన్ గురించి వివరిస్తూ ఉంటే భారతీయల గుండెలు గర్వంతో నిండిపోయాయి.ఈ ఒక్క ఫొటో చాలువాళ్లిద్దరు అలా చెరోవైపు ప్రెస్ మీట్లో కూర్చుని ఐక్యతకు ప్రతీకలా నిలిచిన తీరు నిజమైన దేశభక్తుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ దృశ్యాన్ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘ఈ శక్తివంతమైన ఫొటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది’’ అని సానియా మీర్జా పేర్కొన్నారు.మరోవైపు.. సరిహద్దుల్లో తీవ్రవాదులను తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పలువురు క్రీడాకారులు స్పందిస్తూ మన దేశ ఘనతను కీర్తించారు. ఏకత్వంలో నిర్భీతిఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘ఏకత్వంలో నిర్భీతి. ఎల్లలెరుగని బలం. మన ప్రజలే మన దేశానికి బలం. మనమంతా ఒక్కటే. ప్రపంచంలో తీవ్రవాదానికి చోటు లేదు. జైహింద్’ అంటూ వ్యాఖ్యానించాడు. పేసర్ షమీ, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ కూడా ఇదే తరహాలో స్పందించారు.‘మీపై ఎవరైనా రాళ్లు విసిరితే మీరు పూలు విసరండి. అయితే అది పూలకుండీతో సహా విసరండి’ అని సెహ్వాగ్ ట్వీట్ చేయగా, ‘ప్రతికూల పరిస్థితులను కూడా భారత సైన్యం తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించింది. ప్రమాదకర సమయంలో వారి ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం’ అని షమీ స్పందించాడు.బాక్సింగ్లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ ‘భారత్ మాతాకీ జై’ అని ట్వీట్ చేయగా... పఠాన్, సైనా నెహ్వాల్ ‘జైహింద్’ అంటూ మద్దతు పలికారు. ‘మన సైనికులు కేవలం భయపెట్టడంతో ఆగిపోరు. వారు ఏదైనా చేసి చూపిస్తారు’ అని బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. మన సైనికుల భద్రత గురించి తాను ప్రార్థన చేస్తున్నట్లు ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వెల్లడించింది.చదవండి: సరైన సమాధానం.. సాక్ష్యం కనబడుతోందా?.. ఆపరేషన్ సిందూర్పై స్పందనలు -
రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత్కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా భారత్ ఖాతాలో కనీసం రెండు స్వర్ణాలు లేదా రెండు రజతాలు చేరనున్నాయి. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర)లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు... అభిõÙక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్ దేవ్తలేలతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. మరోవైపు మెక్సికో పురుషుల, మహిళల జట్లు కూడా ఫైనల్లోకి అడుగు పెట్టాయి. శనివారం భారత్, మెక్సికో జట్లు రెండు స్వర్ణాల కోసం పోటీపడతాయి. క్వాలిఫయింగ్లో అగ్రస్థానంలో నిలిచినందుకు... భారత జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్కు ‘బై’ లభించింది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు 232–229 పాయింట్ల తేడాతో అదెల్ జెక్సెన్బినోవా, విక్టోరియా లియాన్, రొక్సానా యునోసోవాలతో కూడిన కజకిస్తాన్ జట్టును ఓడించింది. సెమీఫైనల్లో భారత జట్టు 232–230 పాయింట్లతో ఎల్లా గిబ్సన్, ఇసబెల్లా కార్పెంటర్, లేలా అనిసన్లతో కూడిన బ్రిటన్ జట్టుపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 239–232 పాయింట్ల తేడాతో అజయ్ స్కాట్, ఆడమ్ కార్పెంటర్, ల్యూక్ డేవిస్లతో కూడిన బ్రిటన్ జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో భారత బృందం 232–231 పాయింట్ల తేడాతో మథియాస్ ఫులర్టన్, మారి్టన్ డామ్స్బో, నిక్లాస్ బ్రెడాల్లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. తొమ్మిదో స్థానంలో ధీరజ్ బుధవారం జరిగిన రికర్వ్ విభాగం పురుషుల క్వాలిఫయింగ్లో భారత ఆర్చర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. పారిస్ ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 677 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 666 పాయింట్లతో తరుణ్దీప్ రాయ్ 28వ స్థానంలో, 652 పాయింట్లతో అతాను దాస్ 57వ స్థానంలో, 651 పాయింట్లతో పార్థ్ సాలుంఖే 60వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా 1995 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన భారత్కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది.రికర్వ్ విభాగం మహిళల క్వాలిఫయింగ్లో భారత స్టార్ దీపిక కుమారి 655 పాయింట్లు సాధించి 12వ స్థానాన్ని దక్కించుకుంది. 652 పాయింట్లతో అంకిత 17వ స్థానంలో, 642 పాయింట్లతో అన్షిక 29వ స్థానంలో, 637 పాయింట్లతో సిమ్రన్జిత్ కౌర్ 39వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా 1949 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచిన భారత్కు తొలి రౌండ్లో ‘బై’ దక్కింది. -
సాక్ష్యం కనబడుతోందా?: ఆపరేషన్ సిందూర్పై భారత బాక్సర్ రియాక్షన్
ఆపరేషన్ సిందూర్.. యావత్ భారతావని నోట ఇప్పుడిదే మాట.. పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం సరైన రీతిలో సమాధానం ఇచ్చిందంటూ సర్వత్రా హర్షాతిరేకాలు.. ఉన్మాదంతో అమాయకపు ఆడబిడ్డల నుదిటిన సిందూరం తుడిపేసిన ముష్కరులకు అదే పేరుతో బదులిచ్చినందుకు సెల్యూట్ అంటూ ఆర్మీపై ప్రశంసల జల్లు..జై హింద్భారత క్రీడాలోకం కూడా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్, మాజీ క్రికెటర్లు వీరేందర్ సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా జై హింద్ అంటూ భారత సైన్యానికి తమ మద్దతు తెలియజేశారు.సరైన సమాధానంఇక ప్రముఖ బాక్సర్ గౌరవ్ బిధూరి (Gaurav Bidhuri) భారత ఆర్మీని ప్రశంసిస్తూనే.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘మనం మన ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ.. మన సైన్యం ఆపరేషన్ సిందూర్ అమలు చేసింది.కానీ మనమేమో రోజూ ఇక్కడ స్టూడియ్లో కూర్చుని.. ‘మోదీ జీ యుద్ధం చేయండి! ఇంకెందుకు వాళ్లపై దాడులు చేయడం లేదు’ అంటూ అరుస్తూ ఉంటాము.ఇప్పుడు అందరికీ సరైన సమాధానం దొరికింది కదా!.. ఇంట్లో కూర్చుని ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఇలాంటి సైనిక చర్యలు చేపట్టాలంటే కచ్చితమైన ప్రణాళిక, వ్యూహాలు, ప్రత్యర్థి స్పందించే తీరుకు ఎలా బదులివ్వాలి.. పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి.. ఇలా ఎన్నో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.మన ఆర్మీ అందుకు తగ్గ సమయం తీసుకుని సరైన సమయంలో పంజా విసిరింది. ఒక్క మిషన్తో 8-9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు’’ అని గౌరవ్ బిధూరి IANSతో పేర్కొన్నాడు.ఈ సాక్ష్యం సరిపోతుందా? అదే విధంగా.. పహల్గామ్ దాడికి పాకిస్తాన్ కారణం అనడానికి ఆధారాలు చూపాలన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి మరోసారి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘‘కొంతమంది మాకు ఆధారాలు కావాలని డిమాండ్ చేశారు కదా! ఇప్పటికైనా అర్థమైందా? ఈ సాక్ష్యం సరిపోతుందా? అంతా స్పష్టంగానే ఉంది కదా! ఇంతకంటే గొప్పగా ఇంకేమైనా కావాలా?’’ అంటూ గౌరవ్ బిధూరి ఆఫ్రిది చురకలు అంటించాడు.అదే విధంగా.. ‘‘ఏదేమైనా ఈరోజు దేశం మొత్తం భారత సైన్యం, మన నాయకత్వం వెంట ఉంది. ఇది కేవలం ప్రతిచర్య మాత్రమే కాదు.. న్యాయం చేయడం కూడా! మనపై దాడి చేయాలనుకునేవారికి సందేశం. మీ చర్యలకు తప్పకుండా బదులిస్తామనే సంకేతం. జై హింద్’’ అంటూ గౌరవ్ బిధూరి ఉద్వేగానికి లోనయ్యాడు.కాళ్ల పారాణి ఆరకముందే చెరిగిన సిందూరంకాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గత నెల ఉగ్రవాదులు మారణహోం సృష్టించిన విషయం విదితమే.ప్రశాంత బైసరన్ లోయలో కల్లోలం సృష్టించి ఇరవై ఆరు మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. మతం పేరు అడుగుతూ పురుషుల ప్రాణాలు తీశారు. మొదటగా నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)ను కాల్చారు. నవ వరుడైన వినయ్ భార్య హిమాన్షితో కలిసి హనీమూన్కు రాగా.. ఉగ్రవాదుల దుశ్చర్యతో పెళ్తైన ఆరు రోజులకే ఆమె నుదిటి సిందూరం చెరిగిపోయింది.హిమాన్షితో మాదిరే మరికొంత మంది మహిళలు తమ భర్తల్ని కోల్పోగా.. ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాదులకు ఆర్మీ ఇలా సరైన విధంగా బుద్ధిచెప్పింది. తెల్లవారుజామున ఒంటి గంట తర్వాత దాదాపు ఇరవై మూడు నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. కాగా పహల్గామ్ ఘటనలో ఇంకొందరు తమ తండ్రి, సోదరుడు, కుమారులను కోల్పోయారు. చదవండి: Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ -
చైనా నుంచి తొలిసారి...
ఫెఫీల్డ్ (ఇంగ్లండ్): బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, డైవింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశాల్లో ఎంతోమంది ప్రపంచ చాంపియన్లను అందించిన చైనా నుంచి తాజాగా ప్రొఫెషనల్ స్నూకర్ క్రీడాంశంలో తొలిసారి విశ్వవిజేత అవతరించాడు. ఇంగ్లండ్లో జరిగిన ప్రపంచ ప్రొఫెషనల్ స్నూకర్ చాంపియన్షిప్లో చైనాకు చెందిన 28 ఏళ్ల జావో జిన్టాంగ్ మొదటిసారి చాంపియన్గా నిలిచాడు. ‘బెస్ట్ ఆఫ్ 35’ ఫ్రేమ్స్ పద్ధతిలో రెండు రోజులపాటు జరిగిన ఫైనల్లో క్వాలిఫయర్ జావో జిన్టాంగ్ 18–12 ఫ్రేమ్ల తేడాతో వేల్స్కు చెందిన మూడుసార్లు ప్రపంచ చాంపియన్ మార్క్ విలియమ్స్పై విజయం సాధించాడు. జావో జిన్టాంగ్ 141–0, 100–38, 47–44, 28–66, 77–49, 71–61, 119–0, 95–0, 0–86, 8–65, 85–9, 74–0, 14–62, 0–72, 96–23, 71–63, 43–71, 76–5, 18–66, 65–7, 85–45, 104–1, 14–84, 79–26, 63–36, 30–101, 1–62, 6–96, 0–73, 110–8 స్కోరుతో 50 ఏళ్ల విలియమ్స్ను ఓడించాడు. విజేత జిన్టాంగ్కు 5,00,000 పౌండ్లు (రూ. 5 కోట్ల 63 లక్షలు) ప్రైజ్మనీగా దక్కింది. -
‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ టికెట్ల రేట్లు ఇలా.. రూ. 199 నుంచి..
బెంగళూరు: భారత దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ జావెలిన్ ఈవెంట్కు సంబంధించిన టికెట్ల విక్రయం ప్రారంభమైంది. టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా పేరిట ఈ నెల 24న నిర్వహించనున్న ఈ ఈవెంట్లో నీరజ్తో పాటు థామస్ రోలెర్ (జర్మనీ), అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) వంటి పలువురు అంతర్జాతీయ స్టార్ జావెలిన్ త్రోయర్లు పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను ‘డిస్ట్రిక్ట్’ యాప్లో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు సోమవారం వెల్లడించారు. టికెట్ల ధర రూ. 199 నుంచి 9,999గా నిర్ణయించారు. రూ. 44,999 ధర గల ఐదు కార్పొరేట్ బాక్స్లు కూడా అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం స్టేడియంలో 12 వేల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్ కావడంతో... కర్ణాటక ఒలింపిక్ సంఘం, క్రీడా మంత్రిత్వ శాఖ దీని నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య కూడా దీనికి ‘గోల్డ్ ఈవెంట్’ స్థాయి కల్పించింది.ఇవీ చదవండి: కాంస్యం నెగ్గిన పర్వ్లిమా (పెరూ): భారత యువ వెయిట్ లిఫ్టర్ పర్వ్ చౌధరీ ప్రపంచ యూత్, జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్íÙప్లో కాంస్య పతకంతో మెరిశాడు. పురుషుల 96 కేజీల విభాగంలో పర్వ్ 315 కేజీల బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్లో 140 కేజీల బరువెత్తిన పర్వ్... క్లీన్ అండ్ జెర్క్లో మరో 175 కేజీల బరువు ఎత్తాడు. ఈ టోర్నమెంట్లో భారత్కు ఇది మూడో పతకం కావడం విశేషం.ఇప్పటికే జ్యోష్న సబర్ (40 కేజీల), హర్షవర్ధన్ సాహూ (49 కేజీలు) కాంస్యాలు గెలుచుకోగా... ఇప్పుడు పర్వ్ ఆ సంఖ్యను మూడుకు పెంచాడు. ప్రపంచ చాంపియన్షిప్లలో ఓవరాల్ లిఫ్టింగ్తో పాటు స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్లో వేర్వేరుగా పతకాలు ఇస్తారు. సినెర్ పునరాగమనంరోమ్: ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ (ఇటలీ)పై విధించిన నిషేధం పూర్తయింది. దీంతో స్వదేశంలో జరగనున్న ఇటాలియన్ ఓపెన్ ద్వారా సినెర్ పునరాగమనం చేయనున్నాడు. ఈ టోర్నీలో ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్వన్ ఆటగాడు పాల్గొననుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ టోర్నీ తొలి రౌండ్లో సినెర్కు ‘బై’ దక్కగా... శుక్రవారం జరగనున్న రెండో రౌండ్లో సినెర్ ఆడనున్నాడు.వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ (వాడా) సినెర్పై విధించిన నిషేధం సోమవారంతో ముగియగా... ఈ ఇటలీ ఆటగాడు ప్రాక్టీస్ ప్రారంభించాడు. తమ అభిమాన ఆటగాడి సాధన చూసేందుకు వేలాదిగా ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అనంతరం సినెర్ కోర్టులో అడుగు పెట్టలేదు. ఈ నెల 25 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుండగా... దానికి ముందు ఇటాలియన్ ఓపెన్ సినెర్కు మంచి ప్రాక్టీస్ కానుంది. ఇటాలియన్ ఓపెన్లో చివరిసారిగా 1976లో ఇటలీకి చెందిన అడ్రియానో పనట్టా విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఇటలీ ప్లేయర్లు ఎవరూ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గలేదు. -
పియాస్ట్రిదే పైచేయి.. 1997 తర్వాత ఇదే తొలిసారి...
ఫ్లోరిడా: గత నాలుగేళ్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ సాధించిన రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్కు ఈ సీజన్లో తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొడుతున్న వెర్స్టాపెన్ను ప్రధాన రేసులో మాత్రం మెక్లారెన్ డ్రైవర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఫార్ములావన్ 2025 సీజన్లో భాగంగా జరిగిన ఆరో రేసు మయామి గ్రాండ్ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్ల రేసును పియాస్ట్రి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 28 నిమిషాల 51.587 సెకన్లలో పూర్తి చేసి ఈ సీజన్లో నాలుగో గెలుపును, వరుసగా మూడో విజయాన్ని అందుకున్నాడు.రెండో స్థానంలో లాండో నోరిస్మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఈ రేసులో విజేతగా నిలిచిన నోరిస్ ఈసారి 1 గంట 28 నిమిషాల 56.217 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందగా... ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నలుగురు డ్రైవర్లు లియామ్ లాసన్ (వీసా క్యాష్ రేసింగ్ బుల్స్), గాబ్రియెల్ బొర్టొలెటో (స్టేక్ టీమ్ కిక్ సాబెర్), ఒలివెర్ బియర్మన్ (మనీగ్రామ్ హాస్), జాక్ దూహాన్ (అల్పైన్ టీమ్) మధ్యలోనే వైదొలిగారు. లాసన్ 36వ ల్యాప్లో, బొర్టొలెటో 30వ ల్యాప్లో, బియర్మన్ 27వ ల్యాప్లో, దూహాన్ తొలి ల్యాప్లో తప్పుకున్నారు.1997 తర్వాత తొలిసారి... నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పియాస్ట్రి ఆరంభంలో వెనుకబడ్డాడు. అయితే 14వ ల్యాప్లో వెర్స్టాపెన్ను వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని చాంపియన్గా నిలిచాడు. తద్వారా 1997 తర్వాత ఫార్ములావన్లో వరుసగా మూడు రేసుల్లో నెగ్గిన మెక్లారెన్ డ్రైవర్గా పియాస్ట్రి గుర్తింపు పొందాడు. చివరిసారి మెక్లారెన్ తరఫున మికా హకినెన్ ఈ ఘనత సాధించాడు.1997 సీజన్ చివరి రేసులో నెగ్గిన హకినెన్ 1998 సీజన్లోని తొలి రెండు రేసుల్లోనూ విజేతగా నిలిచాడు. ఇక 24 రేసుల తాజా సీజన్లో ఆరు రేసులు ముగిశాక ఆస్కార్ పియాస్ట్రి 131 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక 115 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 99 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్లో మెక్లారెన్ 246 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. సీజన్లోని తదుపరి రేసు ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ప్రి (ఇటలీ) ఈనెల 18న జరుగుతుంది. -
మూడోసారి టైటిల్... సబలెంకా ప్రైజ్మనీ ఎంతంటే?
మాడ్రిడ్: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్వన్ అరీనా సబలెంకా (Aryna Sabalenka- బెలారస్) మూడో సింగిల్స్ టైటిల్ను తన ఖాతాలో జమ చేసుకుంది. మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా మూడోసారి చాంపియన్గా నిలిచింది. అమెరికా స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోకో గాఫ్ (Coco Gauff)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంకా 6–3, 7–6 (7/3)తో విజయాన్ని అందుకొని మూడోసారి మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ను దక్కించుకుంది. 2023, 2021లలో కూడా సబలెంకా ఈ టోర్నీలో చాంపియన్గా నిలిచింది.ఈ క్రమంలో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తర్వాత మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ను మూడుసార్లు గెలిచిన రెండో ప్లేయర్గా సబలెంకా గుర్తింపు పొందింది. ఓవరాల్గా సబలెంకా కెరీర్లో ఇది 19వ టైటిల్కాగా, ఈ ఏడాది మూడోది. ఈ సంవత్సరం ఆమె బ్రిస్బేన్ ఓపెన్, మయామి ఓపెన్లలో విజేతగా నిలిచింది. కోకో గాఫ్తో 1 గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది.రూ. 9 కోట్ల 40 లక్షలుతన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయిన బెలారస్ స్టార్ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 142 పాయింట్లకుగాను సబలెంకా 81 పాయింట్లు, కోకో గాఫ్ 61 పాయింట్లు గెలిచారు. విజేతగా నిలిచిన సబలెంకాకు 9,85,030 యూరోల (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ కోకో గాఫ్కు 5,23,870 (రూ. 5 కోట్లు) యూరోల ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. ఒసాకా ఖాతాలో టైటిల్ మాలో (ఫ్రాన్స్): నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా (Naomi Osaka) డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ను సాధించింది. ఆదివారం ముగిసిన ఎల్ ఓపెన్ 35 డబ్ల్యూటీఏ–125 టోరీ్నలో ఒసాకా విజేతగా నిలిచింది. 2021 ఆ్రస్టేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ తర్వాత ఒసాకాకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో ఒసాకా 6–1, 7–5తో కాజా జువాన్ (స్లొవేనియా)పై విజయం సాధించింది.మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన రెండో సీడ్ ఒసాకా... ఒక ఏస్ కొట్టి 6 డబుల్ ఫాల్ట్లు చేసింది. 6 బ్రేక్ పాయింట్లు కాచుకున్న ఈ మాజీ ప్రపంచ నంబర్వన్... ఓవరాల్గా 70 పాయింట్లు సాధించింది. 2023 జూలైలో పాపకు జన్మనిచ్చిన ఒసాకా ఆ తర్వాత నెగ్గిన తొలి డబ్ల్యూటీఏ టైటిల్ ఇదే. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న 27 ఏళ్ల ఒసాక ఈ ఏడాది తొలి గ్రాండ్స్లామ్ టోర్న ఆస్ట్రేలియా ఓపెన్లో మూడో రౌండ్లో పరాజయం పాలైంది. చదవండి: కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!.. రేసులో మూడు పేర్లు.. -
మా ప్రయాణం అద్భుతం ఒలింపిక్ పతకమే లక్ష్యం
భారత బ్యాడ్మింటన్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రాటుదేలుతూ వస్తోంది. గతేడాది పారిస్ ఒలింపిక్స్ అవకాశం తృటిలో కోల్పోయినా... ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–10లోకి దూసుకొచ్చింది. 9వ ర్యాంకుతో ఈ ఘనతకెక్కిన తొలి భారత మహిళల జంటగా నిలిచింది. బిజీగా గడిచిన గత సీజన్లో విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచితే... వరల్డ్ టూర్ ఫైనల్స్ లాంటి మేజర్ టోర్నీలు పాఠాలు నేర్పాయని ఇద్దరు చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు తాము జోడీకట్టిన తీరు నుంచి విజయాలు, సాఫల్యాల దాకా తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. 2021లో మొదలైన మీ ప్రయాణం ఎలా సాగుతోంది? గాయత్రి: మొదట్లో నేను సింగిల్స్ ఆడేదాన్ని. కానీ డబుల్స్ అయితే ఇంకా బాగా ఆడతాననిపించింది. దీంతో ట్రెసాతో జోడీ కట్టాను. నేను అనుకున్నట్లుగానే కొన్ని టోర్నీల్లోనే డబుల్స్లో రాణించగలగడం మరింత ఆనందాన్నిచ్చింది. తర్వాత ఏడాదే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ (2022) ఆడి సెమీస్ చేరాం. అలాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఇంత త్వరగా ఆడతామనుకోలేదు. అక్కడి నుంచే మా జోడీ మరింత బలపడింది. మా పయనం అద్భుతంగా సాగుతోంది. మేటి ప్రత్యర్థులతో ఎన్నో మ్యాచ్లు గెలిచాం. ఎంతో నేర్చుకున్నాం. ట్రెసా: 2021లో మేమిద్దరం కలిసి ఆడటం మొదలుపెట్టాం. అప్పటినుంచే గాయత్రి గురించి తెలుసుకున్నాను. కోర్టులో జోడీగా, కోర్టు బయట స్నేహితులుగా మా బంధం పటిష్టమైంది. ఆటలోనే కాదు... అవసరమైన ప్రతీసారి నాకు చాలా మద్దతుగా నిలుస్తుంది. నాకు ఏదైనా సాయం అవసరమైనా గాయత్రి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. గతేడాది సాధించిన సయ్యద్ మోడి టైటిల్ ఎలాంటి సంతృప్తినిచ్చింది? గాయత్రి: బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో భాగమైన సయ్యద్ మోడి టైటిల్ను సాధించేవరకు తెలియదు... మేమే ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళల జోడీ అని! అందుకే ఆ విజయం ఎప్పటికీ ప్రత్యేకమైంది. దేశానికి ట్రోఫీ తెచ్చిపెట్టడం గొప్ప అనుభూతినిచ్చింది. ఆ విజయానందంలో మేమిద్దరం భావోద్వేగానికి గురయ్యాం. అది ఇప్పటికీ గుర్తుంది. ట్రెసా: ఇలాంటి మేజర్ టోర్నీ టైటిల్స్ గెలుపొందాలన్నదే మా ఉమ్మడి కల. ఫైనల్లో గెలిచి... పోడియంపై నిలిచి... గర్వంగా బంగారు పతకాల్ని అందుకోవడం మంచి అనుభూతినిచి్చంది. ఇలాంటి సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. పారిస్ ఒలింపిక్స్ అవకాశాన్ని కోల్పోయిన మీరు లాస్ ఏంజెలిస్ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? గాయత్రి: పారిస్ ఛాన్స్ చేజార్చుకోవడంతోనే మా ఒలింపిక్స్ కల అంతమవలేదు. మా మనోధైర్యం కోల్పోలేదు. తదుపరి లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ రూపంలో మరో అవకాశముంది. మరింత కష్టపడతాం. ప్రతి టోర్నీని అనుకూలంగా మలచుకుంటాం. ఒక్క ఒలింపిక్సే టోర్నమెంట్ కాదు. ఎన్నో ముఖ్యమైన టోర్నీలూ ఉన్నాయి. అన్నింటా సత్తా చాటడమే మా లక్ష్యం. ట్రెసా: అవును... ఆ ఒలింపిక్స్కు దూరమయ్యాం. మేం అర్హత సాధించలేకపోవడం మమ్మల్ని నిరాశపరిచింది. కానీ వచ్చే ఒలింపిక్స్ కోసం ఇప్పటినుంచే శ్రమిస్తాం. ప్రతి క్యాలెండర్ ఇయర్లోని టోర్నీలన్నీ ఆడటం ద్వారా ర్యాంకింగ్కు మెరుగుపర్చుకొని అర్హత సాధిస్తాం. గతేడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ అనుభవం గురించి చెబుతారా? గాయత్రి: హాంగ్జౌలో జరిగిన ఈ టోర్నీలో తొలి పోరులో చైనాకు చెందిన లియు–తన్ జంటను ఎదుర్కొన్న మాకు పరాజయం తప్పలేదు. అయితే రెండో మ్యాచ్లో మలేసియన్ జోడీ పిర్లి తన్–తినాలపై గెలుపొందడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ మూడో మ్యాచ్లో నమీ మత్సుయమ–చిహరు షిదా (జపాన్) జోడీ చేతిలో ఓడటంతో ముందుకెళ్లే అవకాశాల్ని కోల్పోయాం. అయితే అనుభవ పాఠాలైతే నేర్చుకోగలిగాం. ట్రెసా: సీజన్ ముగింపు టోర్నీలో అంతా మేటి ప్రత్యర్థులే ఎదురవుతారు. రెడ్ మ్యాట్పై ఆడే మ్యాచ్ల్ని టీవీల్లో చూశాను. గతేడాది ప్రత్యక్షంగా ఆడాను. చైనాలోని స్టేడియాలు, మ్యాచ్లపై ఉండే అంచనాలు నిజంగా గొప్పగా ఉంటాయి. అక్కడ మేం ఆడిన మ్యాచ్లు, అనుభవం చాలా దోహదపడుతుందని అనుకుంటున్నా. గుత్తా జోడీ ర్యాంకింగ్ను అధిగమించడం ఎలా అనిపిస్తోంది?గాయత్రి: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్పల 10వ ర్యాంకును అధిగమించిన భారత మహిళల ద్వయంగా నిలువడం చాలా ఆనందాన్నిచ్చింది. మొదట ఈ ర్యాంకు ఘనత తెలియదు. నిజానికి మా లక్ష్యం గుత్తా జోడీ ర్యాంకింగ్ను చెరిపేయడం కాదు. మేం టాప్–10లోకి దూసుకెళ్లడం. మొత్తానికి భారత మహిళల డబుల్స్లో ఇలా మెరుగైన ర్యాంకింగ్ సాధించడం మా శ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాం. ట్రెసా: నిజానికి గత క్యాలెండర్ ఇయర్ చాలా బిజీగా గడిచింది. అందుకే కఠినమైన టోర్నీలను ఎంపిక చేసుకొని ఆడటం. విజయాలు సాధించడం వల్లే మా ర్యాంకుల్లో మెరుగుదల కనిపించింది. ఇలాంటి మైలురాళ్లు ఎవరికైనా ఆనందాన్నే ఇస్తాయి. -
అమెరికాతో భారత్ ‘సై’
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్, అమెరికాల మధ్య చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఇరు దేశాలకు చెందిన టాప్ స్టార్ ప్లేయర్లందరూ ఈ టోర్నీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ‘డ్రా’ తదితర వివరాలను శుక్రవారం వెల్లడించారు. అక్టోబర్ 4న అర్లింగ్టన్లోని ఇ–స్పోర్ట్స్ స్టేడియంలో చెస్ పోటీలు జరుగనున్నాయి. ఇరు దేశాల నుంచి ఐదుగురు చొప్పున ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. అమెరికన్ సూపర్ గ్రాండ్మాస్టర్ హికారు నకమురను గుకేశ్ ‘ఢీ’కొంటాడు. గుకేశ్తో పాటు తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్, సాగర్ షా, కుర్రాడు ఎథన్ వాజ్తో పాటు భారత మహిళా ప్లేయర్, అంతర్జాతీయ మాస్టర్ దివ్య దేశ్ముఖ్లు బరిలో ఉన్నారు. మొదటి బోర్డులో గుకేశ్, నకముర తలపడతారు. రెండో బోర్డులో అర్జున్... గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాను ఎదుర్కొంటాడు. మూడో బోర్డులో సాగర్ షా, లెవి రొజ్మన్ పోటీపడనుండగా, మిగతా పోటీల్లో దివ్యతో కారిస్సా యిప్, ఎథన్ వాజ్తో టానిటొలువా అడ్యూమి తలపడతారు. టోర్నీ నిబంధనల విషయానికొస్తే బోర్డులోని ఇరు ఆటగాళ్ల మధ్య ఐదు రౌండ్ల గేమ్లు జరుగుతాయి. పది నిమిషాల్లో గేమ్ను ముగించాల్సి ఉంటుంది. అప్పటికీ ‘డ్రా’ అయితే మరో 5 నిమిషాల ఆటను కొనసాగిస్తారు. షూటౌట్కు వస్తే మరో నిమిషం అదనంగా కేటాయిస్తారు. అప్పటికీ సమఉజ్జీలుగా నిలిస్తే మాత్రం విజేత తేలే వరకు పోటీ కొనసాగుతుంది. -
క్రీడా గ్రామంలో కాదు... క్రూజ్ షిప్లో
టోక్యో: కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్లాంటి మెగా ఈవెంట్లు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనే అంతర్జాతీయ అథ్లెట్ల కోసం ఆధునిక హంగులతో, సకల సౌకర్యాలతో క్రీడా గ్రామాన్ని నిర్మించడమేది ఆనవాయితీ. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ మెగా ఈవెంట్లోనూ ఇదే జరిగింది. కానీ వచ్చే ఏడాది జపాన్ ఆతిథ్యమిచ్చే ఆసియా క్రీడల్లో మాత్రం క్రీడా గ్రామం కనిపించదు. దీని స్థానంలో ఫ్లోటింగ్ విలేజ్కు నిర్వాహకులు మొగ్గు చూపారు. అంటే నీటిపై తెలియాడే విలేజ్ అన్నమాట! ఇందుకోసం భారీ ఓడను వినయోగించనుంది. క్రూజ్ షిప్ తెలుసుగా... అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఓడ. నీటిపై కదలాడే నగరాన్ని తలపించే క్రూజ్షిప్లో ఏషియాడ్కు విచ్చేసే అథ్లెట్లకు బస కల్పించే ఏర్పాట్లను జపాన్ నిర్వాహకులు చేస్తున్నారు. వచ్చే ఏడాది సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ ఆసియా క్రీడల్లో ఆసియా దేశాలకు చెందిన 15 వేల మంది అథ్లెట్లు పాల్గొంటారు. వీరందరి బసకోసం రోటీన్గా క్రీడా గ్రామాన్ని నిర్మించకుండా క్రూజ్షిప్లోనే బస ఏర్పాట్లు చేయనున్నారు. ఇదే జరిగితే అథ్లెట్లకు ఇదో సరికొత్త అనుభూతిని అందిస్తుంది. జపాన్లోని అయిచి రాష్ట్రంలోని నగోయా నగరంలో ఆసియా క్రీడలతో పాటు పారా ఆసియా క్రీడలు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ నగోయా రేవు సమీపంలోని కింజో పీర్ వద్ద క్రూజ్షిప్ను ఫ్లోటింగ్ విలేజ్గా వాడుకోనుంది. ఆర్చరీ, బాస్కెట్బాల్ 3్ఠ3, కనోయింగ్ –కయాకింగ్, సైక్లింగ్, మౌంటెన్ బైక్ సైక్లింగ్, రేసింగ్ ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, జూడో, కబడ్డీ, కురాష్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రగ్బీ, సెపక్తక్రా, స్పోర్ట్ క్లైంబింగ్, స్క్వాష్, టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, వుషు తదితర పోటీల్లో పాల్గొనేందుకు 4600 మంది అథ్లెట్లు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ 20 క్రీడాంశాలకు సంబంధించిన వేదికలన్నీ (స్టేడియాలు) కూడా నగోయా పోర్ట్కు అతి దగ్గరలోనే ఉండటంతో నిర్వాహకులు ఫ్లోటింగ్ విలేజ్ (క్రూజ్షిప్పై) వైపు మొగ్గినట్లు తెలిసింది. ఇంతకు ముందెన్నడూ చూడని గ్రామాన్ని ఆవిష్కరించనున్నామని, ఇది అథ్లెట్ల జీవితాల్లో చిరకాలం నిలిచిపోయే వినూత్న వేదికని ఆసియా క్రీడల సాంకేతిక అధికారి ఒకరు తెలిపారు. భారీ ఓడలో కంటెయినర్లతో తయారు చేసిన విల్లాలు ఉంటాయి. అంతేకాదు జిమ్, స్విమ్మింగ్పూల్ సదుపాయలెన్నో ఉంటాయి. -
‘ఖేల్రత్న’ అందుకున్న సాత్విక్–చిరాగ్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఎట్టకేలకు జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ను స్వీకరించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం ఈ అవార్డును వీరిద్దరికి అందజేశారు. 2023 ఏడాదికిగాను ప్రకటించిన ఈ అవార్డును సాత్విక్–చిరాగ్ తీసుకోవడంలో చాలా ఆలస్యమైంది. రాష్ట్రపతి భవన్లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమ సమయంలో మరో చోట టోర్నీలు ఆడుతున్న ఈ డబుల్స్ జోడీ గైర్హాజరైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అందుకోవడానికి సిద్ధమైన తరుణంలో సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథ్ అనూహ్య మృతితో అవార్డు కార్యక్రమం వాయిదా పడింది. ‘ఈ ఇద్దరు షట్లర్ల అత్యుత్తమ ప్రదర్శన, అంకితభావానికి దక్కిన గౌరవమిది. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ మాండవీయ ట్వీట్ చేశారు. ‘ఎట్టకేలకు అవార్డును అందుకున్నాం. మేమిద్దరం జోడీగా మారిన సమయం నుంచి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. మా విజయాల్లో వారి సహకారం ఎంతో ఉంది. గత కొద్ది రోజులుగా మేం ఆశించిన ప్రదర్శన ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చెలరేగి కొత్త విజయాలు సాధించేందుకు ఈ అవార్డు మాకు ప్రేరణనిస్తుంది’ అని సాత్విక్–చిరాగ్ చెప్పారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ బ్యాడ్మింటన్లో సాత్విక్–చిరాగ్ అగ్రశ్రేణి జోడీగా ఎదిగారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో 3 స్వర్ణాలు, 3 రజతాలు గెలుచుకున్న ఈ జంట 2022 వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం సాధించింది. ర్యాంకింగ్స్లో వరల్డ్ నంబర్వన్ స్థానానికి చేరిన తొలి భారత జోడీగా నిలవడంతో పాటు టీమ్ ఈవెంట్ థామస్ కప్ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం జరుగుతున్న సుదిర్మన్ కప్ నుంచి వీరిద్దరు తప్పుకున్నారు. -
ఎంత డబ్బు అయినా చెల్లిస్తా!.. నాకు అక్కర్లేదు!
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రష్యా స్టార్ డానిల్ మెద్వెదేవ్ ఆఫర్ను తిరస్కరించాడు. తాను అనుకున్న శిఖరాలకు చేరిన తర్వాతే రిటైర్ అవుతానని.. ఆ తదనంతరమే కోచ్గా మారతానని స్పష్టం చేశాడు. అయితే, డానిల్తో తనకు ఉన్న అనుబంధం దృష్ట్యా అతడితో కలిసి పనిచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నాడు.కానీ ప్రస్తుతానికి అందుకు వెలకట్టలేనని జొకోవిచ్ చెప్పుకొచ్చాడు. కాగా స్టార్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్.. తాజాగా ఇటాలియన్ ఓపెన్ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.గత మూడు టోర్నమెంట్లలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సెర్బియా వీరుడు... వచ్చే నెలలో జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోరీ్నకి సిద్ధమయ్యేందుకు ఇటాలియన్ ఓపెన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.ఈ నేపథ్యంలో 37 ఏళ్ల జొకోవిచ్ ఇటాలియన్ ఓపెన్ను ఉద్దేశించి ‘వచ్చే ఏడాది కలుద్దాం’ అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇటీవల మయామి ఓపెన్, మాంటెకార్లో మాస్టర్స్, మాడ్రిడ్ ఓపెన్లలో జొకోవిచ్ పరాజయం పాలయ్యాడు.టెన్నిస్ చరిత్రలో పురుషుల సింగిల్స్లో మరే ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఇప్పటికే 24 గ్రాండ్స్లామ్ టైటిళ్లు నెగ్గిన జొకోవిచ్... ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలవడం ద్వారా ఆ సంఖ్యను 25కు పెంచుకోవాలని చూస్తున్నాడు. మోకాలి గాయం కారణంగా గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న జొకో... శస్త్రచికిత్స అనంతరం తిరిగి సత్తా చాటాడు.అదే విధంగా.. 2024 పారిస్ ఒలింపిక్స్లో అల్కరాజ్ (స్పెయిన్)పై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జొకోవిచ్... పురుషుల సింగిల్స్లో అత్యధిక వారాల పాటు ప్రపంచ నంబర్వన్గా ఉన్న ఘనతను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, గాయాల బెడద కారణంగా జొకోవిచ్ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు రాగా.. డానిల్ మెద్వెదేవ్ స్పందించాడు. ‘‘నొవాక్ నా కోచ్ అయితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అందుకు నేను కచ్చితంగా డబ్బు చెల్లిస్తాను’’ అని పేర్కొన్నాడు. ఇందుకు జొకోవిచ్ పైవిధంగా బదులిచ్చాడు.గ్రాండ్స్లామ్ డబుల్స్ చాంపియన్ పర్సెల్పై 18 నెలలు నిషేధం సిడ్నీ: రెండుసార్లు గ్రాండ్స్లామ్ డబుల్స్ చాంపియన్గా నిలిచిన మ్యాక్స్ పర్సెల్పై 18 నెలల నిషేధాన్ని విధించారు. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) నిర్ణయాన్ని శిరసావహిస్తానని ఆ్రస్టేలియన్ ప్లేయర్ చెప్పాడు. అయితే ఈ కేసు డోపింగ్లో కాస్త భిన్నమైంది. అతను డోప్ టెస్టులో పట్టుబడలేదు.అయితే గత డిసెంబర్లో పర్సెల్ తీసుకున్న విటమిన్ మెడిసిన్లో మోతాదుకు మించి ఉ్రత్పేరకాలు ఉన్నట్లు తెలింది. డోపింగ్ నిబంధనలకు లోబడి ఆ మెడిసిన్ తీసుకోవడంలో తప్పులేకపోయినా.. దాన్ని వాడిన పద్ధతి, పరిమితికి మించి ఉండటంతో శిక్ష విధించాల్సి వచ్చిందని ఐటీఐఏ తెలిపింది.‘పర్సెల్ డోపీ కాదు. నిషిద్ధ ఉ్రత్పేరకాలేమీ తీసుకోలేదు. డోపింగ్ నిరోధక నిబంధనలు అతిక్రమించాడు’ అని ఐటీఐఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరెన్ మూర్హౌస్ తెలిపారు. తాను డోపీ కానప్పటికీ ఈ ఉదంతం తనని కుదురుగా ఉండనివ్వడం లేదని, ప్రతీ రోజు మానసిక ఒత్తిడితో సతమతమయ్యానని ఇప్పుడు ఈ శిక్షతో కాస్త ప్రశాంతంగా ఉండొచ్చని భావిస్తున్నట్లు పర్సెల్ చెప్పాడు. గతేడాది పర్సెల్.. థాంప్సన్ (ఆస్ట్రేలియా)తో కలిసి యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు. 2022లో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి వింబుల్డన్ ట్రోఫీని సాధించాడు. -
సన్నీ థామస్ కన్నుమూత.. అభినవ్ బింద్రా భావోద్వేగం
కొచ్చి: జాతీయ షూటింగ్ మాజీ కోచ్ సన్నీ థామస్ కన్నుమూశారు. రెండు దశాబ్దాలకు పైగా భారత షూటర్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ థామస్ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కేరళలోని కొట్టాయాంకు చెందిన 84 ఏళ్ల సన్నీ థామస్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1993 నుంచి 2012 వరకు భారత జాతీయ షూటింగ్ కోచ్గా వ్యవహరించిన థామస్... దేశానికి ఎన్నో మరపురాని విజయాలు అందించారు.‘ద్రోణాచార్య’ అవార్డుఇక.. 2001లో ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న థామస్ శిక్షణలో రాటు దేలిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ ‘డబుల్ ట్రాప్’లో రజత పతకం నెగ్గాడు. ఒలింపిక్స్ షూటింగ్లో మన దేశానికి ఇదే తొలి పతకం కాగా... ఆ తర్వాత కూడా ఆయన శిష్యులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన సమయంలోనూ థామస్ జాతీయ కోచ్గా ఉన్నారు.‘ప్రొఫెసర్ థామస్ మరణం భారత షూటింగ్కు తీరని లోటు. భారత షూటింగ్కు ఆయన దిక్సూచి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మన షూటర్లు పతకాలు సాధిస్తున్నారంటే దీని వెనక ఆయన కృషి ఎంతో ఉంది’ అని జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కాళికేశ్ నారాయణ్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అభినవ్ బింద్రా భావోద్వేగంమరోవైపు తన గురువు మృతిపై అభినవ్ బింద్రా తీవ్ర సంతాపం వ్యక్తం చేశాడు. ‘ఆయన కేవలం కోచ్ మాత్రమే కాదు. మెంటార్, గైడ్... అంతకన్నా ఎక్కువే. భారత షూటర్లకు ప్రొఫెసర్ థామస్ మార్గదర్శి. ఆయన అంకితభావం వల్లే దేశంలో షూటింగ్కు మంచి ఆదరణ లభిస్తోంది. నా కెరీర్లో ఆయన పాత్ర ఎంతో కీలకమైంది’ అని బింద్రా పేర్కొన్నాడు.కాగా 2012 లండన్ ఒలింపిక్స్లో పతకం సాధించిన విజయ్ కుమార్ కూడా ఆయన శిష్యుడే. హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్, జస్పాల్ రాణా, సమరేశ్ జంగ్ వంటి ఎందరో అంతర్జాతీయ షూటర్లను దేశానికి అందించిన ప్రొఫెసర్ థామస్... తన కెరీర్లో జాతీయ చాంపియన్గానూ నిలిచారు. -
ఏడాదిన్నర క్రితమే విడాకులు.. డేటింగ్ రూమర్స్పై క్లారిటీ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ (Mary Kom) తన వైవాహిక బంధం గురించి వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది. తన భర్త కరుంగ్ ఓన్కోలర్ (Karong Onkholer Kom)తో దాదాపు ఏడాదిన్నరే క్రితమే విడిపోయినట్లు ఆమె ధ్రువీకరించింది. పెద్దల సమక్షంలో విడాకుల ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ (Boxing World Champion)గా నిలిచిన 43 ఏళ్ల మేరీకోమ్ ఇటీవల తరచుగా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలిచింది. భర్తతో విడాకులతో పాటు హితేశ్ చౌధరీ అనే వ్యాపార్తవేత్తతో ఆమె బంధం గురించి కూడా తరచుగా కథనాలు వస్తున్నాయి. వీటన్నింటికి సమాధానమిస్తున్నట్లుగా తన లాయర్ ద్వారా మేరీ కోమ్ ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. ‘కోమ్ చట్టాల ప్రకారం’ విడాకులు‘మేరీకోమ్కు, ఓన్కోలర్కు మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. 2023 డిసెంబర్ 20న ఇద్దరి అంగీకారంతో ‘కోమ్ చట్టాల ప్రకారం’ కుటుంబసభ్యులందరి మధ్య వీరిద్దరికి విడాకులు మంజూరయ్యాయి. పెళ్లి అంతా ముగిసిన గతం కాబట్టి దానిపై ఏమీ వ్యాఖ్యానించదల్చుకోలేదు.అవన్నీ వదంతులు మాత్రమేమరోవైపు హితేశ్తో గానీ మరో బాక్సర్ భర్తతో గానీ ఆమెకు వ్యక్తిగత సంబంధం ఉన్నట్లుగా వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. ఇకపై ఎవరూ దీనిని ప్రస్తావించరాదు. మేరీకోమ్ ఫౌండేషన్ వ్యవహారాలు చూసే వ్యక్తిగా హితేశ్తో వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉంది. ఇకపై మేరీకోమ్కు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు రాయరాదని, ప్రచారం కల్పించరాదని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని మేరీకోమ్ తరఫున ఆమె న్యాయవాది రజత్ మాథూర్ ప్రకటించారు. కాగా మణిపూర్కు చెందిన మేరీకోమ్, కరుంగ్ ఓన్కోలర్ వివాహం 2005లో జరిగింది. వీరిద్దరికి ముగ్గురు మగ పిల్లలుకాగా... 2018లో కరుంగ్ ఓన్కోలర్ ఒక పాపను దత్తత తీసుకున్నాడు. చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
‘టాప్స్’లో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చోటు దక్కింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని కూడా చేర్చడంతో... ఈ విభాగంలో పోటీ పడుతున్న జ్యోతి సురేఖకు మరింత మెరుగైన శిక్షణ తీసుకునేందుకు ‘టాప్స్’ ఉపయోగపడనుంది. ఈ మేరకు బుధవారం మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) 155వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, వీరేన్ రస్కిన్హా, ప్రశాంతి సింగ్, సోమయ్య, సిద్ధార్థ్ శంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జ్యోతి సురేఖతో సహా ఏడుగురు కాంపౌండ్ ఆర్చర్లకు ‘టాప్స్’లో చోటు కల్పించారు. ఇందులో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలు అభిషేక్ వర్మ, పర్ణీత్ కౌర్, ప్రవీణ్ ఒజస్, ప్రపంచ చాంపియన్ అదితి గోపీచంద్, ప్రియాన్‡్ష, ప్రథమేశ్ ఉన్నారని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది. గత ఆసియా క్రీడల్లో మిక్స్డ్, టీమ్, వ్యక్తిగత విభాగాల్లో విజేతగా నిలిచింది. ‘2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని చేర్చాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఎంఓసీ భేటీ నిర్వహించి కాంపౌండ్ ఆర్చర్లకు టాప్స్లో అవకాశం కల్పించాం. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచకప్లలో ప్రదర్శన ఆధారంగా ఆర్చర్లను టాప్స్కు ఎంపిక చేశాం. అలాగే టాప్స్లో ఉన్న ఇతర క్రీడాకారులకు కూడా నిధులు విడుదల చేశాం’ అని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. » ‘టాప్స్’లోని 56 మంది అథ్లెట్లకు సంబంధించిన రూ. 4.37 కోట్ల నిధులను బుధవారం విడుదల చేశారు. » తాష్కెంట్లో 17 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ శిక్షణలో పాల్గొనేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్కు ఆమోదం లభించింది. ఈ నెల 8 నుంచి 23 వరకు ఉజ్బెకిస్తాన్ జట్టుతో ఈ ట్రైనింగ్ సాగనుంది. » టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లు ఆకుల శ్రీజ, మనిక బత్రా ఐటీటీఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్లో పాల్గొనేందుకు ముందస్తు నిధులు విడుదల చేశారు. ఖతర్ వేదికగా ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరగనుంది. » ఈ నెల 9 నుంచి యూఏఈ వేదికగా జరుగుతున్న అథ్లెటిక్స్ గ్రాండ్ప్రిలో పాల్గొనేందుకు లాంగ్ జంపర్ శైలి సింగ్కు ఆర్థిక సాయం కూడా అందించారు. » ఇక టెన్నిస్ యువ సంచలనం మాయా రాజేశ్వరన్కు కూడా ‘టాప్స్’ నిధులు అందించింది. స్పెయిన్లోని రఫా నాదల్ అకాడమీలో శిక్షణ పొందేందుకు అవసరమైన నిధులు విడుదల చేసింది. -
భారత బాక్సర్ల పసిడి పంచ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్–15 విభాగంలో భారత బాక్సర్లు ఏకంగా 25 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 11 స్వర్ణాలు, మూడు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఫలితంగా ఈ విభాగంలో భారత్ ఓవరాల్ చాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకుంది. బాలికల విభాగంలో భారత బాక్సర్లు కోమల్ (33 కేజీలు), ఖుషీ (35 కేజీలు), తమన్నా (37 కేజీలు), సువీ (40 కేజీలు), మిల్కీ (43 కేజీలు), ప్రిన్సీ (52 కేజీలు), నవ్య (58 కేజీలు), సునైనా (61 కేజీలు), తృష్ణ (67 కేజీలు), వన్షిక (ప్లస్ 70 కేజీలు)... బాలుర విభాగంలో సంస్కార్ వినోద్ (35 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. బాలుర విభాగంలో రుద్రాక్ష్ (46 కేజీలు), అభిజీత్ (61 కేజీలు), లక్షయ్ (64 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు. -
మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్ జట్టు
ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు కథ ముగిసింది. చైనాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసి నాకౌట్ దశకు చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. డెన్మార్క్తో జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్లో 1–4తో ఓడిన భారత్... ఇండోనేసియా జట్టుతో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లోనూ 1–4తో ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగ్గిన డెన్మార్క్, ఇండోనేసియా జట్లు గ్రూప్ ‘డి’ నుంచి నాకౌట్ దశకు అర్హత పొందాయి. ఇండోనేసియాతో జరిగిన పోటీలో మిక్స్డ్ డబుల్స్ తొలి మ్యాచ్లో ధ్రువ్–తనీషా క్రాస్టో 10–21, 21–18, 21–19తో రెహాన్–గ్లోరియాలపై గెలిచి భారత్కు 1–0తో ఆధిక్యం అందించారు. అయితే రెండో మ్యాచ్లో పీవీ సింధు 12–21, 13–21తో పుత్రి కుసుమ వర్థిని చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్లో ప్రణయ్ 21–19, 14–21, 12–21తో క్రిస్టీ చేతిలో ఓటమి చెందాడు. నాలుగో మ్యాచ్లో శ్రుతి–ప్రియా ద్వయం 10–21, 9–21తో ల్యానీ ట్రియా–సితి ఫాదియా జంట చేతిలో ఓడింది. ఐదో మ్యాచ్లో హరిహరన్–రూబన్ 20–22, 18–21తో షోహిబుల్ –డానియల్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
అసీఫా ప్రపంచ రికార్డు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ రేసులో మహిళల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన ఈ రేసులో ఇథియోపియాకు చెందిన టిగ్స్ట్ అసీఫా విజేతగా అవతరించింది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని 28 ఏళ్ల అసీఫా 2 గంటల 15 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని అందుకుంది. ఈ క్రమంలో 2 గంటల 16 నిమిషాల 16 సెకన్లతో పెరెస్ జెప్చిర్చిర్ (కెన్యా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అసీఫా బద్దలు కొట్టింది. గత ఏడాది లండన్ మారథాన్లోనే పెరెస్ జెప్చిర్చిర్ ఈ ప్రపంచ రికార్డును సృష్టించి స్వర్ణ పతకాన్ని సాధించగా... అసీఫా రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. ఈ సంవత్సరం పెరెస్ జెప్చిర్చిర్ లండన్ మారథాన్కు దూరం కాగా... అసీఫా అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకోవడంపాటు ప్రపంచ రికార్డును లిఖించింది. జాయ్స్లిన్ జెప్కోస్గి (కెన్యా; 2గం:18ని:44 సెకన్లు) రజతం, సిఫాన్ హసన్ (నెదర్లాండ్స్; 2గం:19నిమిషాలు) కాంస్యం సాధించారు. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గిన అసీఫా 2022, 2023 బెర్లిన్ మారథాన్ రేసుల్లోనూ విజేతగా నిలిచింది. లండన్ మారథాన్ పురుషుల విభాగంలో సెబాస్టియన్ సావీ (కెన్యా) విజేతగా నిలిచాడు. సెబాస్టియన్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 2 నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. జేకబ్ కిప్లిమో (ఉగాండా; 2గం:3ని:37 సెకన్లు) రజతం, అలెగ్జాండర్ ముతిసో (కెన్యా; 2గం:4ని:20 సెకన్లు) కాంస్యం సాధించారు. -
మనుశ్–దియా జోడీ సంచలనం
ట్యూనిస్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ట్యూనిస్ కంటెండర్ టోర్నీలో భారత్కు చెందిన మనుశ్ షా–దియా చిటాలె జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో చాంపియన్గా అవతరించింది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మనుశ్–దియా ద్వయం 11–9, 5–11, 14–12, 3–11, 11–6తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ సొరా మత్సుషిమా–మివా హరిమోటో (జపాన్) జోడీని బోల్తా కొట్టించింది. 37 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో కీలకదశలో భారత జోడీ పైచేయి సాధించింది. సొంత సర్వీస్లో 22 పాయింట్లు నెగ్గిన దియా–మనుశ్... ప్రత్యర్థి సర్వీస్లోనూ 22 పాయింట్లు సాధించారు. విజేతగా నిలిచిన మనుశ్–దియాలకు 2,500 డాలర్ల (రూ. 2 లక్షల 13 వేలు) ప్రైజ్మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్లో 11వ స్థానంలో ఉన్న మనుశ్–దియా ఈ టోర్నీలో మూడో సీడ్గా బరిలోకి దిగింది. తొలి రౌండ్లో దియా–మనుశ్ 11–6, 11–5, 11–5తో సన్ యాంగ్–హు యి (చైనా)లపై, క్వార్టర్ ఫైనల్లో 11–6, 2–11, 16–18, 11–2, 11–4తో సత్యన్ జ్ఞానశేఖరన్–ఆకుల శ్రీజ (భారత్)లపై, సెమీఫైనల్లో 11–4, 11–5, 11–6తో వసీమ్ ఇసిద్ (ట్యూనిషియా)–హనా గొడా (ఈజిప్ట్)లపై విజయం సాధించారు. -
14 స్వర్ణాల వేటలో...
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా అండర్–15, అండర్–17 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం బౌట్లలో సత్తా చాటిన 14 మంది భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. అండర్–15 బాలికల విభాగంలో 12 మందిలో 9 మంది భారత బాక్సర్లు తుదిపోరుకు అర్హత సాధించారు. పోటీల ఎనిమిదో రోజు బాలికల విభాగంలో కోమల్ (33 కేజీలు), నవ్య (58 కేజీలు), సునైనా (61 కేజీలు) ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యంతో రిఫరీ స్టాప్డ్ ద కాంటెస్ట్ (ఆర్ఎస్సీ) ద్వారా విజయం సాధించగా... ఖుషీ అహ్లావత్ (35 కేజీలు), తమన్నా (37 కేజీలు), ప్రిన్సీ (52 కేజీలు), తృష్ణ (67 కేజీలు) కూడా చక్కటి ప్రదర్శనతో గెలుపొందారు. మిల్కీ మైనమ్ (43 కేజీలు) హోరాహోరీ సెమీస్లో 3–2తో నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. మరో ఇద్దరు బాక్సర్లు ‘బై’ ద్వారా ముందంజ వేశారు. బాలుర అండర్–15 విభాగంలో సంస్కార్ వినోద్ (35 కేజీలు) రిఫరీ స్టాప్డ్ ద కాంటెస్ట్ ద్వారా కిర్గిస్తాన్ బాక్సర్ అర్సెన్ జొరోబెవ్పై విజయం సాధించాడు. ఇతర బౌట్లలో రుద్రాక్ష్ (46 కేజీలు), అభిజీత్ (61 కేజీలు), లక్ష్య (64 కేజీలు) కూడా గెలిచి ఫైనల్కు చేరారు. ఈ చాంపియన్షిప్లో మొత్తంగా భారత బాక్సర్లు 43 పతకాలు ఖాయం చేసుకున్నారు. -
వివాదం ఇంకా ఉంది!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐ–లీగ్ చాంపియన్షిప్లో చర్చిల్ బ్రదర్స్ ఫుట్బాల్ క్లబ్ను విజేతగా అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించడంపై అంతర్జాతీయ స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టు (సీఏఎస్) స్టే విధించింది. కేసులో విచారణ ముగిసేవరకు టైటిల్ చాంప్పై ఓ నిర్ణయానికి రావొద్దని సీఏఎస్ డివిజన్ డిప్యూటీ ప్రెసిడెంట్ మధ్యంతర తీర్పు ఇచ్చారు. ఈ సీజన్ ఐ–లీగ్లో రెండో స్థానంలో నిలిచిన ఇంటర్ కాశీ జట్టు తమకు సంబంధించిన ఒక మ్యాచ్ ఫలితంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించకుండానే ఏఐఎఫ్ఎఫ్ ఏకపక్షంగా చర్చిల్ బ్రదర్స్ జట్టును విజేతగా ప్రకటించడం అసంబద్ధమని కోర్టుకెక్కింది. దీనిపై ఆదివారం విచారించిన సీఏఎస్ డివిజన్ ఏఐఎఫ్ఎఫ్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. జట్టు సభ్యులకు పతకాలు గానీ, ట్రోఫీని గానీ బహూకరించరాదని స్పష్టం చేసింది. ప్రతివాదులైన విజేత జట్టు చర్చిల్ బ్రదర్స్ యాజమాన్యం, ఏఐఎఫ్ఎఫ్లకు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 29 వరకు గడువిచ్చింది. కానీ జరగాల్సిన తంతు ఆదివారమే జరిగిపోవడంతో ఇప్పుడు ఏఐఎఫ్ఎఫ్ నవ్వులపాలైంది. వివాదం ఉన్న సంగతిని ఏమాత్రం పట్టించుకోని ఏఐఎఫ్ఎఫ్ అత్యుత్సాహానికి పోయి ఆదివారం విజేత జట్టుకు ట్రోఫీని, పతకాలను బహూకరించింది. అయితే తుదితీర్పుకు లోబడే తమ నిర్ణయముంటుందని, అప్పుడు ట్రోఫీని, పతకాలను వెనక్కి తీసుకుంటామని ముక్తాయించిన తీరు సర్వత్రా విమర్శల పాలైంది. ఏమిటీ వివాదం! ఐ–లీగ్ ఫుట్బాల్ టోర్నీలో నాకౌట్ పోటీలు, ఫైనల్ మ్యాచ్ అనేవి ఉండవు. మొత్తం పాల్గొన్న జట్లలో సాధించిన విజయాలు, కొట్టిన గోల్స్, ఇచ్చిన గోల్స్ ఆధారంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో 40 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చర్చిల్ బ్రదర్స్ను ఏఐఎఫ్ఎఫ్ విజేతగా ప్రకటించింది. కానీ 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఇంటర్ కాశీ జట్టుకు అంతకుముందు నాంధారి జట్టుతో జరిగిన మ్యాచ్ ఫలితం వివాదం రేపింది. ఈ మ్యాచ్లో ఇంటర్ కాశీ జట్టు 2–0తో నాంధారి జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో అనర్హతకు గురైన ఆటగాడితో మ్యాచ్ ఆడించినందు వల్ల నాంధారి జట్టుపై పెనాల్టీ విధించి ఫలితాన్ని తమకు అనుకూలంగా ఇవ్వాలని ఇంటర్ కాశీ కోరింది. ఒకవేళ తీర్పు ఇంటర్ కాశీ జట్టుకు అనుకూలంగా వస్తే ఆ జట్టు 42 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్గా అవతరిస్తుంది. -
భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 2–3 గోల్స్ తేడాతో పరాజయం చవిచూసింది. భారత్ తరఫున జ్యోతి సింగ్ (13వ నిమిషంలో), సునెలితా టొప్పో (59వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఇవీ స్టాన్స్బై (17వ నిమిషంలో), డేలీ డాల్కెన్స్ (48వ నిమిషంలో), జేమీ లీ సుర్హా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. తొలి క్వార్టర్ చివర్లో లభించిన పెనాల్టీ కార్నర్ను జ్యోతి సింగ్ గోల్గా మలచడంతో భారత్ ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాల తర్వాత ఆసీస్ స్కోరును సమం చేసింది. ఒకదశలో మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగుస్తుందనిపించింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో ఆసీస్ రెండు గోల్స్ చేసింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్ రెండో గోల్ చేసినా పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది. -
పరాజయంతో ప్రారంభం
జియామెన్ (చైనా): స్టార్ జోడీలు లేకుండానే ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 1–4 తేడాతో డెన్మార్క్ చేతిలో ఓడిపోయింది. ఈ పరాజయంతో భారత జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే తదుపరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయాల కారణంగా పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఈ మెగా ఈవెంట్కు దూరంగా ఉన్నాయి. దాంతో భారత జట్టు విజయావకాశాలన్నీ రెండు సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడ్డాయి. అయితే ఈ రెండింటిలోనూ భారత స్టార్స్ ఆకట్టుకోలేకపోయారు. వెరసి ఈ టోర్నీని భారత జట్టు పరాజయంతో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జంట 13–21, 14–21తో జెస్పెర్ టాఫ్ట్–అమెలీ మేగ్లండ్ జోడీ చేతిలో ఓటమి పాలైంది. రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో భారత రెండో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 15–21, 16–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మూడో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో హరిహరన్–రూబన్ కుమార్ ద్వయం 7–21, 4–21తో ప్రపంచ నంబర్వన్ ఆండెర్స్ స్కారప్–కిమ్ అస్ట్రుప్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. నాలుగో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో భారత నంబర్వన్ పీవీ సింధు 20–22, 21–23తో లినె హోమార్క్ జార్స్ఫెల్డ్ చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లోనూ సింధు ఒకదశలో ఆధిక్యంలో ఉన్నా దానిని సది్వనియోగం చేసుకోలేకపోయింది. చివరిదైన ఐదో మ్యాచ్గా జరిగిన మహిళల డబుల్స్లో తనీషా క్రాస్టో–శ్రుతి మిశ్రా ద్వయం 13–21, 18–21తో నటాషా–అలెగ్జాండ్రా బోయె జంటను ఓడించి భారత్ క్లీన్స్వీప్ కాకుండా కాపాడింది. మంగళవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో మాజీ చాంపియన్ ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది. -
కోచింగ్లో కొత్త ‘కీర్తి’
క్రీడల్లో అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో గొప్ప విజయాలు అందుకున్న స్టార్లను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే అదే శిక్షణకు వచ్చేసరికి మాత్రం పురుషులే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. క్రీడాంశం ఏదైనా కోచింగ్లో మహిళల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ పురుష క్రీడాకారులకు మహిళలు కోచింగ్ ఇవ్వడం మరీ అరుదు. అయితే 32 ఏళ్ల కీర్తి తివారి ఇప్పుడు కోచింగ్లో తన ప్రత్యేకతను చాటుతోంది. ఇంకా ప్లేయర్ వయసులోనే ఉంటూ ఒక ప్లేయర్గానే కనిపించే ఆమె శిక్షణను చూస్తే ఎంత సాధికారికంగా కీర్తికి పట్టు ఉందో అర్థమవుతుంది. తనదైన శైలిలో ఆమె ఈతరం విజేతలను తయారు చేస్తోంది. ప్లేయర్నుంచి కోచింగ్ వైపు... కీర్తి స్వయంగా రన్నర్. 400 మీటర్ల పరుగులో పాల్గొన్న అథ్లెట్. కానీ అక్కడ పెట్టిన పరుగు ఫలితమివ్వకపోవడంతో కోచ్ పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. వ్యాయామ విద్యలో మాస్టర్స్ డిగ్రీ చేసిన కీర్తి తదనంతరం పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో కోచింగ్ డిప్లొమా పూర్తి చేసింది. 2019లో లక్నోలో తన శిక్షణను మొదలుపెట్టిన ఆమె ఫెడరేషన్ కప్లో ఓ విజేతను తయారు చేసింది. ఈ సీనియర్ జాతీయ ఈవెంట్లో పి. డేవిడ్ పురుషుల లాంగ్జంప్లో విజేతగా నిలువడంతో ఇప్పుడు కీర్తి పేరు తెరపైకి వచ్చిం ది. ఆమె నా కోచ్... కీర్తి ఫిజిక్ను చూసిన వారికి ఆమె ఓ అథ్లెట్గానే కనిపిస్తుంది. పురుషుల లాంగ్జంప్ పోటీ జరుగుతుంటే మహిళా అథ్లెట్కు ఏం పని అని అక్కడున్నవారు అనుకుంటుండగా... బరిలో ఉన్న డేవిడ్ కల్పించుకొని ఆమె నా కోచ్ అని చెప్పాల్సి వచ్చిం ది. ఎందుకంటే చాలామంది కోచ్లు మలివయసువారే ఉంటారు. యువకులెవరూ కోచ్లుగా ఉండరు. కానీ మూడు పదుల వయస్సున్న కీర్తిని సహజంగానే క్రీడాకారిణిగా భావించారంతా! అయితే ఈ యువ కోచ్ తన శిష్యుణ్ని తీర్చిదిద్దిన తీరు, విజేతగా మలచిన వైనం అందరిని ఆకట్టుకుంటోంది. పురుష ప్రపంచంలో ఆమె ఒంటరి పయనం విదేశాల సంగతి పక్కనబెడితే భారత్లాంటి దేశాల్లో అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఏ ఆటలో ఆసక్తి వుంటే తీసుకెళ్లేది పురుష కోచ్ వద్దకే. దిగ్గజ షట్లర్లు సైనా, సింధు తదితరులంతా పుల్లెల గోపీచంద్ శిక్షణలోనే ప్రపంచ బ్యాడ్మింటన్లో వెలిగారు. ఇలాంటి పురుష ప్రపంచంలో కీర్తి తన కోచింగ్ ప్రతిభతో పౌరుషాన్ని చాటింది. అకాడమీలో తాను ఒక ఒంటరనే ఫీలింగ్ ఉన్నా... తర్వాత అలవాటుపడింది. ఆటలో పడింది. కోచింగ్లోనే మమేకమైంది. దీంతో ఒంటరి పయనంలో ఆమె కనిపించేందుకు ఒక్కరే కావొచ్చు. కానీ కోచ్ పాత్ర తోడు–నీడ కావడంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. కష్టమైనా... కోచింగే ఇష్టం మహిళా కోచ్కు ఎదురయ్యే సవాళ్లు మామూలుగా వుండవు. పురుషాధిక్య సమాజంలో ఈ సవాళ్లతోనే సహవాసం చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో దూరమయ్యే పరిస్థితి పురుషులకు సులువు... కానీ అమ్మాయిల పరిస్థితి చాలా భిన్నం. అందుకేనేమో చాలామంది మహిళలు కోచింగ్ వైపు వచ్చినప్పటికీ నిలదొక్కుకునే ముందే అస్త్రసన్యాసం చేస్తారు. తిరుగుటపా కట్టేస్తారు. కానీ కీర్తి మాత్రం ఎన్ని కష్టాలెదురైనా... తనకెంతో ఇష్టమైన కోచింగ్ను వదిలిపెట్టలేదు. కొన్నాళ్లుగా డేవిడ్ ప్రదర్శనకు మెరుగులు దిద్దుతున్న ఆమె చివరకు ఫెడరెషన్ కప్లో ఆశించిన ఫలితాన్ని సాధించింది. ఇంత చేసినా కూడా కొందరు ఈ మాత్రం ప్రదర్శనతో ఒలింపిక్స్కు తీసుకెళ్తావా అని గేలి చేసినవారూ ఉన్నారు. దానికి ఆమె సమాధానం... అవును ఒలింపియన్ను తయారు చేయడమే తన లక్ష్యమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేది. -
కోబీ బ్రయాంట్ జెర్సీకి రూ. 59 కోట్లు
న్యూయార్క్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, దివంగత కోబీ బ్రయాంట్ ఎన్బీఏ అరంగేట్ర మ్యాచ్లో వేసుకున్న జెర్సీ రికార్డు ధరకు అమ్ముడైంది. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తొలి పోరులో బ్రయాంట్ ధరించిన జెర్సీ... శుక్రవారం నిర్వహించిన వేలంలో 70 లక్షల డాలర్ల (రూ. 59 కోట్ల 76 లక్షలు)కు అమ్ముడైంది.ఎన్బీఏ చరిత్రలో గొప్ప ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కోబీ... 2020లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ఘటనలో బ్రయాంట్ కూతురు గియానాతో పాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎన్బీఏలో భాగంగా బ్రయాంట్ 1996–97 సీజన్లో లాస్ ఏంజెలిస్ లేకర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 2007–08 సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న సందర్భంలో... బ్రయాంట్ సంతకం చేసిన జెర్సీ గతంలో 5.85 మిలియన్ డాలర్ల (రూ. 49 కోట్ల 93 లక్షల)కు అమ్ముడుపోగా... ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.18 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్ ఆడిన కోబీ 8వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగి... ఆరు నిమిషాల పాటు ఆడి ఖాతా తెరువలేకపోయాడు. ‘ఈ జెర్సీ ఓ కుర్రాడి సహజసిద్ధ సామర్థ్యానికి, ఆ తర్వాత దిగ్గజ ప్రస్థానానికి మధ్య వారధి. ఒక లెజెండ్కు చెందిన అరుదైన, అసాధారణ వస్తువు’ అని వేలం నిర్వహించిన సోథెబైస్ సంస్థ వెల్లడించింది. ఓవరాల్గా క్రీడాకారుల జెర్సీల వేలంలో... బేబ్ రూత్ జెర్సీ (24 మిలియన్ డాలర్లు), మైకేల్ జోర్డాన్ ఎన్బీఏ జెర్సీ (10.1 మిలియన్ డాలర్లు), డీగో మారడోనా అర్జెంటీనా జెర్సీ (9.3 మిలియన్ డాలర్ల) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
పాకిస్తాన్కు భారీ షాక్!.. ఈసారి ఆహ్వానం లేదు!
కరాచీ: సుప్రసిద్ధ హాకీ టోర్నమెంట్ ‘అజ్లాన్ షా కప్’లో పాకిస్తాన్ జట్టు ఈసారి పోటీపడే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నీ నిర్వాహకులకు పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) బకాయి పడటంతో.. మలేసియా హాకీ సమాఖ్య (ఎమ్హెచ్ఎఫ్) ఆహ్వానాన్ని నిలిపివేసింది. రెండేళ్ల క్రితం 2023లో జరిగిన టోర్నీకి సంబంధించిన రూ. 8, 83, 582 (10,349 అమెరికా డాలర్లు) బకాయిల్ని జోహర్ హాకీ సంఘం (జేహెచ్ఏ)కు ఇంకా చెల్లించలేదు.అందుకే ఈసారి పాకిస్తాన్కు ఆహ్వానాన్ని పంపడంలేదని నిర్వాహకులు తెలిపారు. జేహెచ్ఏ నిబంధనల ప్రకారం ఆ టోర్నీలో పాల్గొనే జట్ల సభ్యులకు మాత్రం ఆతిథ్య ఏర్పాట్లు చేస్తారు. అంతేగాని వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, హాకీ సమాఖ్య ఉన్నతాధికారులు వస్తే బస, స్థానిక రవాణా, ఇతరాత్ర ఖర్చుల్ని వారే భరించాల్సివుంటుంది. 2023 అక్టోబర్లో జరిగిన టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కుటుంబసభ్యులు, హాకీ అధికారులకు అయిన ఖర్చుల్ని చెల్లించలేదు.ఇందుకు సంబంధించి ఇదివరకే మలేసియా హాకీ, జేహెచ్ఏ వర్గాలు పాకిస్తాన్ సమాఖ్యకు లేఖ రాసినప్పటికీ చెల్లింపులు మాత్రం చేయలేదు. కుటుంబసభ్యులు, సమాఖ్య అధికారులు ఆటగాళ్లకు బస కల్పించిన లగ్జరీ హోటల్స్లోనే గడిపారు. దీనిపై జోహర్ సంఘం మలేసియా సమాఖ్యకు తెలపడంతో బకాయిలు రాబట్టేందుకు పీహెచ్ఎఫ్తో సంప్రదింపులు జరుపుతోంది.ఇదీ చదవండి: మూడు విభాగాల్లోనూ శ్రీజ పరాజయంట్యూనిస్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ట్యూనిస్ కంటెండర్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తొలి రౌండ్లోనే ఓటమి పాలైన శ్రీజ... మిక్స్డ్ డబుల్స్లో భారత్కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్తో కలిసి క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ శ్రీజ 6–11, 9–11, 8–11తో ప్రపంచ 76వ ర్యాంకర్ క్రిస్టినా కాల్బెర్గ్ (స్వీడన్) చేతిలో ఓడిపోయింది.23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీజ తన సర్వీస్లో 12 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 11 పాయింట్లు సాధించింది. భారత నంబర్వన్, ప్రపంచ 30వ ర్యాంకర్ మనిక బత్రా కూడా అనూహ్యంగా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. భారత్కే చెందిన దియా చిటాలె 12–10, 5–11, 9–11, 11–4, 11–4తో మనిక బత్రాను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన దియా 38 నిమిషాల్లో మనికను ఓడించింది.తన సర్వీస్ 29 పాయింట్లు సాధించిన దియా ప్రత్యర్థి సర్వీస్లో 19 పాయింట్లు సొంతం చేసుకుంది. భారత్కే చెందిన మరో ప్లేయర్ యశస్విని ఘోర్పడే తొలి రౌండ్లో 7–11, 6–11, 9–11తో అనె యుసెవా (జపాన్) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–సుతీర్థ ముఖర్జీ (భారత్) ద్వయం 11–7, 8–11, 8–11, 10–12తో జు కిహు–యాంగ్ హుజి (చైనా) జంట చేతిలో పరాజయం పాలైంది.మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–6, 11–9, 11–9తో దిమిత్రి లెవాజెక్– ఇజబెలా (సెర్బియా) జోడీపై గెలిచింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో శ్రీజ–సత్యన్ 6–11, 11–2, 18–16, 2–11, 4–11తో భారత్కే చెందిన మనుష్ షా–దియా చిటాలె చేతిలో ఓడిపోయారు. హర్మీత్ ముందంజ పురుషుల సింగిల్స్లో భారత ప్లేయర్ హర్మీత్ దేశాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మానవ్ ఠక్కర్, సత్యన్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. హర్మీత్ 11–6, 11–8, 11–7తో వు యిఫె (చైనా)పై గెలుపొందాడు. మానవ్ 11–8, 6–11, 7–11, 8–11తో మటియాస్ ఫాల్క్ (స్వీడన్) చేతిలో, సత్యన్ 6–11, 5–11, 11–6, 11–9, 9–11తో నవీద్ షమ్స్ (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. -
‘నాపై విద్వేషం చూపిస్తున్నారు’
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించి భారత అత్యుత్తమ అథ్లెట్గా గుర్తింపు తెచ్చుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కూడా దేశంలోని దురభిమానుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తాను నిర్వహించబోయే ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టోర్నీ కి పాకిస్తాన్ ఆటగాడు, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అర్షద్ నదీమ్ను అతను ఆహ్వానించడమే అందుకు కారణం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తానీయులపై భారత అభిమానులు సహజంగానే ఆగ్రహంతో ఉన్నారు. దానిని ఇప్పుడు నీరజ్పై చూపిస్తున్నారు. నిజానికి ఈ ఘటన జరగక ముందే నదీమ్ను నీరజ్ ఆహ్వానించాడు. టోర్నీ జరిగే సమయంలో తాను గతంలోనే నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం విదేశాల్లో ఉంటున్నానని, అందుకు హాజరు కాలేనని కూడా నదీమ్ స్పష్టం చేసేశాడు. ‘సహచర భారతీయుల్లాగే నేను కూడా కశీ్మర్ ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నాను. దానిపై చాలా ఆగ్రహంగా కూడా ఉన్నాను. అయితే నాపై కొందరు చూపిస్తున్న విద్వేషం ఊహించలేనిది. వారి మాటల్లో ఎన్నో తిట్లు కనిపిస్తున్నాయి. నేను సాధారణంగా ఇలాంటివి పట్టించుకోను. కానీ దానిని బలహీనతగా భావించవద్దు. పైగా దేశం పట్ల నా అంకితభావాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోను. అర్షద్కు ఆహ్వానం పంపడం ఒక క్రీడాకారుడి కోణంలోనే చూడాలి. నా ఈవెంట్కు అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకురావాలనే ఉద్దేశంతో అలా చేశాను. అయతే పహల్గాం ఘటనకు ముందే అందరినీ ఆహ్వానించాం’ అని నీరజ్ గుర్తు చేశాడు. మా కుటుంబాన్ని వదిలేయండి! కశ్మీర్ ఉగ్రదాడి ఘటన తర్వాత కొందరు వ్యక్తులు తన తల్లిని కూడా వదలడం లేదని, ఏడాది క్రితం ఆమె చేసిన వ్యాఖ్యను తప్పుగా అన్వయిస్తున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. పారిస్ ఒలింపిక్స్లో అర్షద్ స్వర్ణం, నీరజ్ రజతం గెలిచిన సమయంలో ‘అర్షద్ కూడా నా కొడుకులాంటివాడే’ అని నీరజ్ తల్లి సరోజ్ చెప్పింది. ‘జనాలు తమ అభిప్రాయాలు వేగంగా ఎలా మార్చుకుంటారో ఇప్పుడు కనిపిస్తోంది. ఏడాది క్రితం మా అమ్మ ఏదో నిరాడంబరత్వం, భోళాతనంతో ఒక మాట అంది. అప్పుడు ఆమెను అందరూ అభినందించారు. ఇప్పుడేమో ఆ మాటను పట్టుకొని అమ్మను తిట్టడం బాధగా ఉంది. కొందరు నన్ను లక్ష్యంగా చేసుకోవడం, నేను వివరణలు ఇచ్చుకోవడం చాలా బాధగా ఉంది. నా గురించి తప్పుడు మాటలు ప్రచారం చేయకండి. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి’ అని ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో సుబేదార్ మేజర్ హోదాలో ఉన్న నీరజ్ చోప్రా విజ్ఞప్తి చేశాడు. -
కూర్పుపై కసరత్తు
పెర్త్: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ్రస్టేలియా పర్యటనలో కూర్పుపై కసరత్తులు చేయనున్నట్లు భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ వెల్లడించాడు. ఈ టూర్లో భాగంగా భారత అమ్మాయిల జట్టు ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్లు... ప్రధాన జట్టుతో 3 మ్యాచ్లు ఆడనుంది. పెర్త్ వేదికగా శనివారం ఆ్రస్టేలియా ‘ఎ’తో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు తలపడుతోంది. మే 1, 3, 4న వరసగా ఆస్ట్రేలియా సీనియర్ జట్టుతో టీమిండియా మ్యాచ్లు ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్లు జరగగా... అందులో ఆసీస్ 10 మ్యాచ్ల్లో గెలవగా... భారత్ మూడు విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో హరేంద్ర మాట్లాడుతూ... ఇటీవల బెంగళూరులో నిర్వహించిన జాతీయ శిబిరం ప్లేయర్లకు ఉపయోగపడనుందని అన్నాడు. ‘ఈ పర్యటన మా ఆటతీరును పరీక్షించుకునేందుకు తోడ్పడుతుంది. ఇంకా ఏ రంగాల్లో మెరుగు పడాలో అర్థం చేసుకునేందుకు ఆ్రస్టేలియా కంటే మెరుగైన ప్రత్యర్థి ఉండరు. కూర్పును పరీక్షించడంతో బెంచ్ బలాన్ని మరింత పెంపొందించుకుంటాం. ఆ్రస్టేలియాలాంటి జట్టును వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్. ఇది మున్ముందు టోర్నీలకు తోడ్పడుతుంది’ అని హరేంద్ర అన్నాడు. ఇటీవల ప్రొ లీగ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నెదర్లాండ్స్పై విజయం సాధించి మన అమ్మాయిల జట్టు మంచి టచ్లో ఉంది. ఈ పర్యటన కోసం సలీమా సారథ్యంలో 26 మందితో జట్టును ప్రకటించారు. అందులో సీనియర్ గోల్ కీపర్ సవిత, నవ్నీత్ కౌర్, డ్రాగ్ఫ్లికర్ దీపిక ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఐదుగురు కొత్త అమ్మాయిలు జ్యోతి సింగ్, సుజాత, అజ్మీన, పూజ యాదవ్, మహిమ టెటెకు అవకాశమిచ్చారు. ‘బలమైన ప్రత్యర్థితో పోరుకు సిద్ధంగా ఉన్నాం. మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. జట్టు కూర్పు పరీక్షించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రొ లీగ్లో యూరప్ అంచె పోటీలు, మహిళల ఆసియా కప్నకు ముందు ప్లేయర్లకు ఇది మంచి అనుభవం అవుతుంది’ అని కెపె్టన్ సలీమా వెల్లడించింది. -
ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, నిత్య, నందిని, రజిత
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షి ప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. కొచ్చిలో గురువారం ముగిసిన ఫెడరేషన్ కప్లో రాణించిన క్రీడాకారులను, ఇంతకుముందు ఆసియా చాంపియన్షి ప్ అర్హత ప్రమాణాలను అధిగమించిన ప్లేయర్లను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎంపిక చేసింది. మే 27 నుంచి 31వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని గుమీ నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 59 మంది బరిలోకి దిగుతారు. పలువురు అథ్లెట్స్ ఒకటికి మించి ఈవెంట్స్లో పోటీపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జ్యోతి యర్రాజీ, కుంజ రజిత... తెలంగాణ నుంచి నిత్య గంధే, అగసార నందిని భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసియా పోటీలకు దూరంగా ఉంటున్నాడు. స్వదేశంలో మే 24న తన పేరిట జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగనుండటంతో అతడిని ఆసియా పోటీలకు ఎంపిక చేయలేదని ఏఎఫ్ఐ వివరించింది. 2023లో బ్యాంకాక్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. భారత అథ్లెటిక్స్ జట్టుపురుషుల విభాగం: అనిమేశ్ కుజుర్ (200 మీటర్లు), అను కుమార్, కృషన్ కుమార్ (800 మీటర్లు), యూనుస్ షా (1500 మీటర్లు), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), గుల్వీర్ సింగ్, అభిషేక్ పాల్ (5000 మీటర్లు), గుల్వీర్ సింగ్, సావల్ బర్వాల్ (10000 మీటర్లు), ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబకర్ (ట్రిపుల్ జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్), సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్ (జావెలిన్ త్రో), సమర్దీప్ సింగ్ (షాట్పుట్), తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), సెర్విన్ సెబాస్టియన్, అమిత్ (20 కిలోమీటర్ల నడక). 4గీ100 మీటర్ల రిలే: ప్రణవ్ ప్రమోద్ గౌరవ్, అనిమేశ్ కుజుర్, మణికంఠ హొబ్లీదార్, అమ్లాన్ బొర్గోహైన్, తమిళరసు, రాగుల్ కుమార్, గురీందర్వీర్ సింగ్. 4గీ400 మీటర్ల రిలే: విశాల్, జై కుమార్, టీఎస్ మనూ, రిన్సీ జోసెఫ్, తుషార్ మన్నా, సంతోష్ కుమార్, ధరమ్వీర్ చౌధరీ, మోహిత్ కుమార్. మహిళల విభాగం: నిత్య గంధే (200 మీటర్లు), జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్), రూపల్ చౌధరీ, విత్యా రాంరాజ్ (400 మీటర్లు), ట్వింకిల్ చౌధరీ, పూజ (800 మీటర్లు), లిల్లీ దాస్, పూజ (1500 మీటర్లు), పారుల్ చౌధరీ, అంకిత (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), సంజీవని జాధవ్, సీమా (10000 మీటర్లు), విత్యా రాంరాజ్, అను (400 మీటర్లు), శైలి సింగ్, అన్సీ సోజన్ (లాంగ్జంప్), పూజ (హైజంప్), సీమా (డిస్కస్ త్రో), అన్ను రాణి (జావెలిన్ త్రో), అగసార నందిని (హెప్టాథ్లాన్). 4గీ100 మీటర్ల రిలే: నిత్యా గంధే, అభినయ రాజరాజన్, స్నేహ, శ్రాబణి నందా, దానేశ్వరి, సుధీక్ష. 4గీ400 మీటర్ల రిలే: రూపల్, స్నేహ, శుభ, జిస్నా మాథ్యూస్, కుంజ రజిత, సాండ్రామోల్ సాబు. -
పాక్ ఆటగాడికి ఆహ్వానం.. నీరజ్ చోప్రాపై ట్రోలింగ్!.. మా అమ్మ ఏం చేసింది?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్పందించాడు. తనకు తన దేశం, దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. ఓ అథ్లెట్గా మరో అథ్లెట్ను తన పేరిట జరిగే ఈవెంట్కు రమ్మన్నానే తప్ప.. మరో ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.నో చెప్పిన అర్షద్అసలేం జరిగిందంటే.. కాగా మే నెల (24)లో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)ను ఈ టోర్నీలో పాల్గొనాల్సిందిగా నీరజ్ చోప్రా ఆహ్వానించాడు.అయితే, తాను ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ ఈవెంట్కు రాలేకపోతున్నానని అర్షద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పహల్గామ్లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రదాడి జరగగా.. భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఈ పాశవిక చర్యను ఖండించిన విషయం తెలిసిందే.‘‘జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడితో హృదయం విదారకంగా మారింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా’’ అని నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు. అయితే, కొంతమంది నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా పాక్కు చెందిన అర్షద్ నదీమ్ను ఈవెంట్కు ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ ద్రోహి అంటూ నీరజ్ను నిందించారు. విద్వేష విషం చిమ్ముతున్నారుఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అయితే, నాకు తప్పుగా అనిపించిన విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో మాత్రం వెనుకడుగు వేయను. ముఖ్యంగా దేశం పట్ల నా ప్రేమపై సందేహాలు, నా కుటుంబ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితే వస్తే అస్సలు రాజీపడను.అర్షద్ నదీమ్ను ఈవెంట్కు ఆహ్వానించడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విద్వేష విషం చిమ్ముతున్నారు. అసభ్యంగా తిడుతున్నారు. మా కుటుంబాన్ని కూడా వదలడం లేదు.ఓ అథ్లెట్గా మరో అథ్లెట్ అయిన అర్షద్కు నేను ఆహ్వానం పంపాను. అంతేగానీ అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో భాగంగా అత్యుత్తమ అథ్లెట్లను దేశానికి రప్పించి.. ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాం.ఇందుకు సంబంధించి సోమవారమే అంటే.. పహల్గామ్ ఘటన కంటే ముందే సదరు అథ్లెట్లకు ఆహ్వానాలు చేరిపోయాయి. ఆ తర్వాత 48 గంటలకు ఘటన జరిగింది. నా వరకు నా దేశం, నా దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. అన్నింటికంటే వాటికే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.మా అమ్మ తప్పేముంది?బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం మొత్తం వారికి అండగా ఉంటుంది. జరిగిన ఘటనతో నా మనసు ఎంతో బాధపడింది. అంతకంటే ఎక్కువ ఆగ్రహాన్నీ తెప్పించింది. మన దేశం ఇందుకు తగిన సమాధానం చెప్పి.. బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.ఓ క్రీడాకారుడిగా చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా. అందుకు ఎంతో గర్విస్తున్నా కూడా. కానీ దేశం పట్ల నా ప్రేమను సందేహిస్తూ ఇలాంటి కామెంట్లు రావడం మనసును బాధించింది.నన్ను, నా కుటుంబానికి టార్గెట్ చేస్తున్నవాళ్లు.. మాది ఓ సాధారణ కుటుంబం అనే విషయం అర్థం చేసుకోవాలి. నా మీద మీడియాలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నేను స్పందించననే భ్రమలో ఉన్నారేమో.మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ఎన్నటికీ నిజం కావు. మా అమ్మను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారో అర్థం కావడం లేదు. దాదాపు ఏడాది క్రితం తను ఓ తల్లిగా స్పందిస్తూ అమాయకంగా, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు.ఆరోజు మా అమ్మను ఎంతో మంది ప్రశంసించారు. మరి ఈరోజు అదే మనుషులు ఎందుకు ఇలా తనను కించపరిచేలా మాట్లాడుతున్నారు. నేను మరింత కఠినంగా శ్రమించి దేశానికి మరింత గొప్ప పేరు తెచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా. జై హింద్ ’’ అంటూ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. దేశం పట్ల తన ప్రేమను శంకించేవారికి ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.కాగా టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన నీరజ్.. ప్యారిస్లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్యారిస్లో అర్షద్ రికార్డు స్థాయిలో 2.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం అందుకున్నాడు. కాగా నీరజ్- అర్షద్ టోక్యో, ప్యారిస్ విశ్వక్రీడల సమయంలో కలిసి ఫొటోలు దిగుతూ.. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు.ఇక ప్యారిస్లో నీరజ్ తృటిలో స్వర్ణం చేజార్చుకున్నా.. అర్షద్ గెలవడం కూడా తమకు సంతోషాన్నిచ్చిందని నీరజ్ తల్లి పేర్కొన్నారు. అర్షద్ కూడా తన కుమారుడి లాంటి వాడేనని.. అతడిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అయితే, తాజా ఘటనల నేపథ్యంలో నీరజ్తో పాటు అతడి తల్లిని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్ -
‘మళ్లీ నా సమయం వచ్చింది’
పుణే: క్లాసికల్ ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందని... భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి పేర్కొంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి విజేతగా నిలిచింది. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్తో కలిసి హంపి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే నల్లపావులతో ఎక్కువ గేమ్లు ఆడినందుకు హంపికి టైటిల్ దక్కింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ స్పందిస్తూ... ‘క్లాసికల్లో మెరుగైన ప్రదర్శన చేయక చాలా రోజులైంది. గతేడాది మొత్తం ఈ ఫార్మాట్లో నా తడబాటు సాగింది. దీంతో ఎన్నో పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చిoది. అందుకే ఇందులో టైటిల్ గెలవడం ఆనందాన్ని పెంచింది. ర్యాపిడ్ వరల్డ్ టైటిల్ గెలిచినప్పటి నుంచి నా ఆటతీరు మెరుగైంది. తిరిగి నా టైమ్ వచ్చినట్లు అనిపిస్తోంది. రెండోసారి ర్యాపిడ్ టైటిల్ సాధించిన అనంతరం నాలో కొత్త ఉత్తేజం వచ్చింది. చిన్నప్పుడు ఆడిన ఆటకు ఇప్పుడు ఆడుతున్న ఆటకు చాలా తేడా ఉంది. ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి తగ్గట్లు మనం కూడా మారాలి. నాకంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన ప్రత్యర్థితో పోటీపడి గెలవడం బాగుంది’ అని వెల్లడించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోని 38 ఏళ్ల హంపి... క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పింది. ప్రస్తుతానికి అమెరికా, నార్వేలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. సాధారణంగా దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను పడగొట్టే హంపి... తాజా టోర్నీలో మాత్రం ఆచితూచి ఆడింది. వివాదాలకు దూరంగా ఉండే... హంపికి సరైన సపోర్టింగ్ వ్యవస్థ ఉంటే మరిన్ని ఫలితాలు సాధిస్తుందని పుణే గ్రాండ్మాస్టర్ అభిజీత్ కుంటే అభిప్రాయపడ్డాడు. కెరీర్లో లెక్కకు మిక్కిలి టైటిల్స్ గెలిచిన హంపి క్యాండిడేట్స్ ప్రపంచ టైటిల్ మాత్రం ఒడిసి పట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అభిజీత్ మాట్లాడుతూ.. ‘హంపీ చాలా చక్కగా ఆడుతోంది. ఆమె ఆటలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ప్రపంచ టైటిల్ సాధించేందుకు ఇదొక్కటే సరిపోదు. నిష్ణాతులైన బృందం ఆమెకు తోడ్పాటు అందించాలి. ఇప్పుడు ఆమె ఆటతీరు బాగలేదని కాదు కానీ... బలమైన మెంటారింగ్ అవసరం’ అని అన్నాడు. -
క్రీడాభివృద్ధికి ‘కార్పొరేట్’ సహకారం అవసరం
న్యూఢిల్లీ: భారత్లో క్రీడల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహకారాన్ని కోరతామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారత్లో క్రీడల సంస్కృతి పెరిగేందుకు, అథ్లెట్ల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మనదేశంలో ప్రతీ క్రీడాంశానికి ప్రత్యేక ఎక్సలెన్సీ కేంద్రం (సీఓఈ) ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఒనగూరే ప్రయోజనాలెన్నో ఉన్నాయన్నారు. ఎక్సలెన్సీలతో ఎంతో మేలు ‘ప్రతి క్రీడ కోసం ప్రత్యేకంగా అధునాతన సదుపాయాలతో ఒలింపిక్ సెంటర్ లేదంటే ఎక్సలెన్సీ కేంద్రం నిర్మించాలనేదే నా లక్ష్యం. వచ్చే పదేళ్లలో ఇలాంటి కేంద్రాల ద్వారా ప్రతిభావంతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అప్పుడు క్రీడా ప్రగతే మారుతుంది. ఇందుకోసం ప్రముఖ కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కోరతాం. వారి నిధులతో ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో ఎక్సలెన్సీలను నిర్మించే యోచనలో ఉన్నాం. ప్రస్తుతం దేశంలో ఉన్న 23 జాతీయ ఎక్సలెన్సీ కేంద్రాలన్నీ ప్రభుత్వానివే! భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఆధ్వర్యంలోనే ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నాం. మనకన్నా చిన్న దేశాలు ఒలింపిక్స్లో పతకాలు సాధిస్తున్నాయి. జపాన్, ఆ్రస్టేలియా, అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల మోడల్ను అధ్యయనం చేశాం. మన ఎక్సలెన్సీలకు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తోడవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. వర్గపోరును సహించం జాతీయ క్రీడా సమాఖ్యల పంథా మారాల్సిందే. ఏ సమాఖ్య అయినా సరే తమ ఆట, అథ్లెట్లకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టాలి. క్రీడేతర అంశాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సమాఖ్యలో వర్గపోరును ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. దీని వల్ల ఆ క్రీడకు, అథ్లెట్కు వాటిల్లే నష్టమెంటో మాకు తెలుసు. కాబట్టి సమాఖ్యలన్నీ కూడా ఆయ క్రీడాకారుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, వెన్నంటే తోడ్పాటు తదితర అంశాలను గుర్తుంచుకొని వ్యవహరించాలి. వర్గపోరుతో అథ్లెట్ల ప్రయోజనాల్ని దెబ్బతీసే సమాఖ్యల తీరును ఎంతమాత్రం ఉపేక్షించం. ఐక్య కార్యచరణ సమితి అవసరం భారత్ ఇదివరకు 2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్ వేసింది. దీనికి ముందే 2036 ఒలింపిక్స్ కోసం ప్రాథమిక దశలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ను దాఖలు చేసింది. ఇలా మన సత్తా, సాధన సంపత్తిని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ముందు గట్టిగా విశదీకరించేందుకు, లేదంటే ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఒక ఐక్య కార్యచరణ సమితి అవసరం ఎంతో ఉంది. మన రెజ్లింగ్ సమాఖ్యకు అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య సమస్యలెదురయ్యాయి. ఐక్య సమితి ఉంటే మన వాదన వినిపించొచ్చు. ప్రత్యేక డిజీలాకర్ ఆటగాళ్లు వారి ప్రదర్శనలు, వాళ్లకు అవసరమైన పత్రాలు, దరఖాస్తులు ఇకపై డిజిటలైజ్ చేస్తాం. అంటే ప్రతిదానికి వేర్వేరు పత్రాలు, దరఖాస్తులు అవసరముండవు. ఆటగాళ్ల ఘనతల్ని ప్రత్యేక డిజీలాకర్లో భద్రబరిచే కార్యక్రమాన్ని ఏడాదిలోగా పూర్తిచేస్తాం. ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య విధిగా డిజీలాకర్ను ఏర్పాటు చేసుకోవాల్సిందే. అయితే ఒలింపిక్ పతక విజేతలకు దరఖాస్తులు, పత్రాలు వ్యక్తిగతంగా డిజీలాకర్లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం యావత్తు చూసిన పతక విజేతల ఘనత ప్రత్యేకంగా లిఖించాలా? కొండంత భరోసాగా ఉద్యోగాలు క్రీడలను కెరీర్గా ఎంచుకొని కఠోరంగా శ్రమించి పతకాలు తెచ్చే క్రీడాకారులకు ఉద్యోగ భరోసా కూడా లభిస్తోంది. 25 వేల పైచిలుకు క్రీడకారులు వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ఈ స్థిరమైన ఆర్థిక భరోసా వల్ల ఆటగాళ్లు మరింత క్రీడల్లో రాణించేందుకు, రాటుదేలేందుకు, నాణ్యమైన శిక్షణ పొందెందుకు దోహదపడుతుంది. -
కోనేరు హంపికి అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్ప్రి టైటిల్ గెలిచిన హంపీ.. తన విజయంతో దేశం గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఆమె సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.నల్ల పావులతో ఎక్కువ గేమ్లు ఆడికాగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో.. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పుణె వేదికగా బుధవారం ముగిసిన ఈ టోర్నీలో హంపి, చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్తో కలిసి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.అయితే, ఈ టోర్నమెంట్లో నల్ల పావులతో ఎక్కువ గేమ్లు (5) ఆడినందుకు హంపికి టైటిల్ ఖరారైంది. మరోవైపు.. నల్ల పావులతో తక్కువ గేమ్లు (4) ఆడిన జు జినెర్ రన్నరప్తో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. పది మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. Congratulations @Humpy_Koneru On winning the FIDE Women’s Grand Prix title! Another glorious feather in your cap. Your brilliance continues to make India proud. A true inspiration to countless young minds, especially aspiring women in sports. #Chess #GrandPrix— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2025 -
సహజ పరాజయం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ100 చార్లోట్స్విల్లె ఓపెన్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమైంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని చార్లోట్స్విల్లె నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 320వ స్థానంలో ఉన్న సహజ క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్లో 6–0, 6–1తో మరియా కరోలినా ఫెరీరా టర్చెటో (బ్రెజిల్)పై విజయం సాధించింది. అయితే క్వాలి ఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్లో సహజ 4–6, 1–6తో ప్రపంచ 556వ ర్యాంకర్ మరియా కొజి రెవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ 4 డబుల్ ఫాల్ట్ లు చేసింది. తన సర్వీస్ను ఏడుసార్లు కోల్పోయిన సహజ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. సహజ ఫస్ట్ సర్వ్లో 17 పాయింట్లు, సెకండ్ సర్వ్లో 11 పాయింట్లు సాధించింది. పుణేలో ఈనెల తొలి వారంలో జరిగిన బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహించాక సహజ ఆడిన తొలి టోర్నీలో ఇదే కావడం గమనార్హం. -
నీరజ్ ఆహ్వానానికి నదీమ్ నో
లాహోర్: వచ్చే నెలలో బెంగళూరు వేదికగా జరగనున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’లో తాను పాల్గొనడం లేదని... పాకిస్తాన్కు చెందిన ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ స్పష్టం చేశాడు. వచ్చే నెల 24న బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ మీట్ జరగనుండగా... అందులో పాల్గొనాల్సిందిగా నదీమ్కు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆహ్వానించాడు. అయితే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు సిద్ధమవుతుండటంతో నీరజ్ ఆహ్వానాన్ని తిరిస్కరించినట్లు నదీమ్ బుధవారం వెల్లడించాడు. నీరజ్ నుంచి ఆహ్వా నం రావడం చాలా గొప్పగా ఉందని అయితే అనుకోకుండా తాను పాల్గొనలేకపోతున్నానని అన్నాడు. ‘నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ మే 24న జరగనుంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకం సాధించాలనే లక్ష్యంతో మెరుగైన సాధన కోసం నేను మే 22న కొరియా వెళ్తున్నా’ అని నదీమ్ వివరించాడు. మే 27 నుంచి 31 వరకు కొరియాలోని గుమీలో ఆసియా చాంపియన్షిప్ జరగనుంది. అంతకుముందు ఈ అంశంపై స్పందించిన నీరజ్ చోప్రా... ఈ టోర్నీలో పాల్గొనేందుకు నదీమ్కు ఆహ్వానం పంపినట్లు తెలిపాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో నదీమ్ జావెలిన్ను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం చేజిక్కించుకోగా... నీరజ్ 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైవసం చేసుకున్నాడు. భారత్ వేదికగా నిర్వహిస్తున్న తొలి జావెలిన్ మెగా ఈవెంట్లో అంతర్జాతీయ స్టార్లు అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), థామస్ రోలెర్ (జర్మనీ), జూలియస్ యెగో (కెన్యా), కర్టీస్ థాంప్సన్ (అమెరికా) పాల్గొంటున్నారు. ఈ టోర్నీకి ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపు ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ పంచ్కులాలో జరగాల్సినా... నిర్ణీత ప్రమాణాలతో కూడిన ఫ్లడ్లైట్లు లేకపోవడంతో వేదికను బెంగళూరుకు మార్చారు. -
విజేత హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి, చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్ 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఈ టోర్నీలో నల్ల పావులతో ఎక్కువ గేమ్లు (5) ఆడినందుకు హంపికి టైటిల్ ఖరారుకాగా... నల్ల పావులతో తక్కువ గేమ్లు (4) ఆడిన జు జినెర్ రన్నరప్గా నిలిచింది. భారత్కే చెందిన దివ్య దేశ్ముఖ్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 4 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. 10 మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. ఎనిమిది రౌండ్లు ముగిశాక 6 పాయింట్లతో హంపి, జినెర్ సమఉజ్జీగా ఉన్నారు. చివరి రౌండ్ గేముల్లో హంపి 84 ఎత్తుల్లో సలీమోవా (బల్గేరియా)పై, జినెర్ 76 ఎత్తుల్లో పొలీనా (రష్యా)పై గెలిచారు. దివ్య (భారత్)–అలీనా పోలాండ్) గేమ్ 42 ఎత్తుల్లో... హారిక శ్రీ(భారత్)–మున్గున్తుల్ (మంగోలియా) గేమ్ 40 ఎత్తుల్లో... వైశాలి (భారత్)–సలోమి (జార్జియా) గేమ్ 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. 2024–2025 గ్రాండ్ ప్రి సిరీస్లో మొత్తం ఆరు టోర్నీలు ఉండగా... ఇప్పటికి ఐదు ముగిశాయి. ఒక్కో ప్లేయర్ గరిష్టంగా మూడింటిలో పాల్గొనాలి. హంపికి సంబంధించి మూడు టోర్నీలు ముగిశాయి. ఓవరాల్ పట్టికలో హంపి 279.17 పాయింట్లతో రెండో స్థానంలో... గొర్యాక్చినా (రష్యా) 308.34 పాయింట్లతో అగ్రస్థానంలో ... జినెర్ 235 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. జినెర్కు మరో టోర్నీ మిగిలి ఉంది. టాప్–2లో నిలిచిన వారు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు. -
టైటిల్కు చేరువలో హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి టైటిల్కు చేరువైంది. అలీనా కష్లిన్స్కాయ (పోలాండ్)తో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను హంపి 61 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మరోవైపు చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్ 50 ఎత్తుల్లో భారత్కే చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ను ఓడించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి, జు జినెర్ ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరులో జు జినెర్పై హంపి పైచేయిగా ఉంది. నేడు జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో హంపి; పొలీనా షువలోవా (రష్యా)తో జు జినెర్ తలపడతారు. భారత ఇతర గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్బాబు తమ ఎనిమిదో రౌండ్ గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. మెలియా సలోమి (జార్జియా)తో గేమ్ను హారిక 116 ఎత్తుల్లో... సలీమోవాతో గేమ్ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా), పొలీనా షువలోవా మధ్య జరిగిన మరో గేమ్ 91 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. ఎనిమిదో రౌండ్ తర్వాత దివ్య దేశ్ముఖ్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో, నాలుగు పాయింట్లతో హారిక ఐదో స్థానంలో, 3.5 పాయింట్లతో వైశాలి ఆరో స్థానంలో ఉన్నారు. -
నందిని, జ్యోతి యర్రాజీలకు స్వర్ణ పతకాలు
జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. కొచ్చిలో జరుగుతున్న ఈ మీట్లో మంగళవారం మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్లో నందిని మొత్తం 5813 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. పూజ (హరియాణా; 5401 పాయింట్లు) రజతం, మౌమిత మండల్ (రిలయన్స్; 5373 పాయింట్లు) కాంస్యం సాధించారు. మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ బంగారు పతకాన్ని దక్కించుకుంది. రిలయెన్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.23 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. విజేతగా నిలిచే క్రమంలో జ్యోతి ఆసియా చాంపియన్షిప్ అర్హత ప్రమాణ సమయాన్ని (13.26 సెకన్లు) కూడా అధిగమించింది. -
స్లేటర్కు నాలుగేళ్ల జైలు
సిడ్నీ: గృహ హింస తదితర కేసుల్లో ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే అతను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జడ్జి తీర్పునిచ్చారు. గతంలో ఈ కేసులో స్లేటర్ ఏడాది పాటు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నాడు. తాజా తీర్పు ప్రకారం అతని మిగిలిన మూడేళ్ల శిక్షను కూడా రద్దు చేశారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఒక మహిళను వెంటపడి వేధించడంతో పాటు స్లేటర్ అసభ్యకర సందేశాలు కూడా పంపించాడు. పోలీసు విచారణలో ఇవన్నీ వాస్తవమని తేలడంతో అతడిని జైలుకు పంపించారు. అయితే స్లేటర్ సుదీర్ఘ కాలం పాటు మద్యానికి బానిసై మానసిక సమస్యలతో బాధపడ్డాడని, ఇదే కారణంగా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడ్డాడని అతని లాయర్లు వాదించారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించి కూడా అతనిపై వేర్వేరు కేసులు ఉన్నాయి. జైలులో ఉన్న 375 రోజుల పాటు అతను సత్ప్రవర్తనతో మెలిగాడని వారు వివరించారు. దాంతో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటూ న్యాయమూర్తి 55 ఏళ్ల స్లేటర్ శిక్షను కుదించారు. అయితే స్లేటర్ వచ్చే ఐదేళ్లపాటు ‘సస్పెండెడ్ పీరియడ్’లో ఉంటాడు. ఈ సమయంలో మళ్లీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం తీవ్ర శిక్షకు గురవుతాడు. స్లేటర్ 1993–2001 మధ్య కాలంలో ఆ్రస్టేలియాకు 74 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 42.83 సగటుతో 5312 పరుగులు సాధించాడు. 14 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలతో అతను ఆసీస్ అప్రతిహత విజయాల్లో ఓపెనర్గా కీలకపాత్ర పోషించాడు. 42 వన్డేలు కూడా ఆడిన స్లేటర్ ప్రస్తుతం కామెంటేటర్గా స్థిరపడ్డాడు. -
ఎదురులేని హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి జోరు కొనసాగుతోంది. మంగోలియాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) బత్కుయాగ్ మున్గున్తుల్తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్లో నల్ల పావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలుపొందింది. ఈ టోర్నీలో హంపికిది మూడో విజయం కావడం విశేషం. మరో మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకున్న హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్కే చెందిన మరో స్టార్ గ్రాండ్మాస్టర్, హైదరాబాద్కు చెందిన ద్రోణవల్లి హారిక, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ల మధ్య జరిగిన ఆరో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 27 ఎత్తులయ్యాక గేమ్లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలి రమేశ్బాబు రెండో పరాజయాన్ని చవిచూసింది. జు జినెర్ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్లో వైశాలి 41 ఎత్తుల్లో ఓడిపోయింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన మరో గేమ్లో పొలీనా షువలోవా (రష్యా) 45 ఎత్తుల్లో గెలిచింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా), అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన మరో గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత జు జినెర్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దివ్య దేశ్ముఖ్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. నేడు జరిగే ఏడో రౌండ్ గేముల్లో సలోమితో సలీమోవా; అలీనాతో వైశాలి; జు జినెర్తో హంపి; మున్గున్తుల్తో దివ్య దేశ్ముఖ్; పొలీనాతో హారిక తలపడతారు. -
జయహో జ్వెరెవ్
మ్యూనిక్ (జర్మనీ): స్వదేశంలో జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ అదరగొట్టాడు. తన 28వ పుట్టిన రోజున... తనకెంతో కలిసొచ్చిన బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో జ్వెరెవ్ మూడోసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జ్వెరెవ్ 6–2, 6–4తో అమెరికాకు చెందిన రెండో సీడ్ బెన్ షెల్టన్ను ఓడించాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్ను జమ చేసుకున్నాడు. 2017, 2018లలో కూడా ఈ టైటిల్ నెగ్గిన జ్వెరెవ్ ఓవరాల్గా తన కెరీర్లో 24వ టైటిల్ను సాధించాడు. చాంపియన్గా నిలిచిన జ్వెరెవ్కు 4,67,485 యూరోల (రూ. 4 కోట్ల 54 లక్షలు) ప్రైజ్మనీతోపాటు రూ. 1 కోటీ 40 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎం70 మోడల్ ఎలక్ట్రిక్ కారు లభించింది. -
భారత షూటర్లకు రెండు రజతాలు
లిమా (పెరూ): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) రెండో ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం భారత షూటర్లు రెండు రజత పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అర్జున్ బబూటా... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్–ఆర్య బోర్సె రజత పతకాలు సాధించారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ బబూటా 252.3 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. 253.4 పాయింట్లతో చైనా షూటర్ షెంగ్ లిహావో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. పెనీ మార్టన్ (హంగేరి; 229.8 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్కు చేరిన మరో భారత షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ 104.8 పాయింట్లతో చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్–ఆర్య ద్వయం 11–17తో జెనెట్ హెగ్–జాన్ హెర్మన్ హెగ్ (నార్వే) జంట చేతిలో ఓడిపోయింది. సోమవారంతో ముగియనున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది. -
నాగపురి రమేశ్పై NADA సస్పెన్షన్ వేటు.. ఏ తప్పూ చేయలేదన్న కోచ్
ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్, జాతీయ జూనియర్ జట్టు ప్రధాన కోచ్ అయిన నాగపురి రమేశ్పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. అతడి దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారు. డోప్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వకుండా దాటవేశారు.ఏడుగురిపై కూడా వేటుఈ క్రమంలో.. నిబంధనల ప్రకారం వారికి కోచ్గా ఉన్న నాగపురి రమేశ్పై నాడా చర్యలు తీసుకుంది. గతంలో అతడు ద్రోణాచారి అవార్డు పొందాడు. అంతేకాదు.. అంతర్జాతీయ అథ్లెట్లు ద్యుతీ చంద్, పారా ఒలంపియన్, పతక విజేత జీవాంజి దీప్తి, అగసార నందిని వంటి దిగ్గజ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘతన నాగపురి రమేశ్కు ఉంది.ఇదిలా ఉంటే.. రమేశ్తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్లు కరంవీర్ సింగ్, రాకేశ్లను కూడా నాడా సస్పెండ్ చేసింది. అదే విధంగా.. డోపింగ్ టెస్టుకు నిరాకరించిన ఏడుగురు అథ్లెట్లపై కూడా నాడా వేటు వేసింది. వీరిలో పారస్ సింఘాల్, పూజా రాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాస్, చెలిమి ప్రత్యూష, శుభం మహారా, కిరన్, జ్యోతి ఉన్నట్లు సమాచారం.నేను ఏ తప్పూ చేయలేదునాడా సస్పెన్షన్ వేటు నేపథ్యంలో నాగపురి రమేశ్ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దడానికే తన జీవితం ధారబోశానని ఉద్వేగానికి లోనయ్యారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
ఫైనల్లో అనాహత్, వీర్
కౌలాలంపూర్: ప్రపంచ స్క్వాష్ చాంపియన్షిప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్, వీర్ చోత్రాని ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఐదో సీడ్, 17 ఏళ్ల అనాహత్ 11–2, 11–7, 11–6తో హెలెన్ టాంగ్ (హాకాంగ్)పై విజయం సాధించింది. 21 నిమిషాల్లో ముగిసిన పోరులో అనాహత్... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఐదు మ్యాచ్లు జరగగా... అన్నీట్లోనూ అనాహత్ విజయం సాధించడం విశేషం. ఆదివారం జరగనున్న ఫైనల్లో టోబీ ట్సె (హాంకాంగ్)తో అనాహత్ తలపడనుంది. భారత మరో ప్లేయర్, రెండో సీడ్ ఆకాంక్ష పరాజయం పాలైంది. ఆకాంక్ష 3–11, 10–12, 12–10, 8–11తో టోబీ ట్సె చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వీర్ చోత్రాని కూడా ఫైనల్లో అడుగు పెట్టాడు. సెమీ ఫైనల్లో వీర్ చోత్రాని 11–7, 11–6, 7–11, 11–4తో ఎనిమిదో సీడ్ చి హిమ్ వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్లు మే 9 నుంచి 17 వరకు చికాగోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధిస్తారు. -
ఆటపై అభి‘రుచి’
సాక్షి క్రీడా విభాగం : పెరూ రాజధాని లిమా నగరంలో ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీ... భారత స్టార్ షూటర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బరిలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత మొదటిసారి బరిలోకి దిగిన మనూ స్వర్ణం గెలవడం ఖాయం అన్నట్లుగా అంచనాలు ఆమెపైనే ఉన్నాయి. కానీ చివరకు అనూహ్య ఫలితం వచ్చింది. భారత్కే చెందిన మరో యువ షూటర్, 18 ఏళ్ల సురుచి సింగ్ దూసుకొచ్చింది. మనూ భాకర్ను వెనక్కి నెట్టి ఆమె స్వర్ణపతకం సొంతం చేసుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ రజతానికి పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఆమెపై పడింది. మనూ భాకర్పై గెలిచిన రెండో రోజు సురుచి పిస్టల్ మళ్లీ మెరిసింది. ఈసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్కే చెందిన సౌరభ్ చౌధరీతో కలిసి సురుచి మరో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు వారమే అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన తొలి ప్రపంచ కప్లో స్వర్ణం నెగ్గిన ఆమెకు ఓవరాల్గా ఇది మూడో స్వర్ణం. అయితే మొదటి స్వర్ణంతో పోలిస్తే మనూ భాకర్ను ఓడించి సాధించిన పసిడి పతకం విలువ పెద్దదిగా మారిపోయింది. బాక్సింగ్, రెజ్లింగ్ను కాదని... సురుచి స్వస్థలం హరియాణాలోని జఝర్. దేశంలోనే బాక్సింగ్కు అడ్డాగా ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ సహా ఎంతో మంది బాక్సర్లు ఓనమాలు నేర్చుకొని అగ్రస్థాయికి చేరిన భివానికి సమీపంలో ఇది ఉంటుంది. జఝర్కు చెందిన ఇందర్ సింగ్ ఆర్మీలో హవల్దార్గా పని చేశాడు. ఒకప్పుడు గొప్ప రెజ్లర్గా గుర్తింపు తెచ్చుకున్న గూంగా (మూగ) పహిల్వాన్ (వీరేందర్ సింగ్) ఇతనికి సోదరుని వరుస (కజిన్) అవుతాడు. తన కజిన్ తరహాలోనే తన కూతురు సురుచిని కూడా రెజ్లర్ను చేయాలని ఇందర్ సింగ్ ఆశించాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం మరోవైపు ఆసక్తిని చూపించింది. అటు బాక్సింగ్, ఇటు రెజ్లింగ్ కాకుండా షూటింగ్ను ఎంచుకుంది. అందులో టాప్ ప్లేయర్ కావడమే లక్ష్యంగా పెట్టుకుంది. కూతురి ఇష్టాన్ని గుర్తించిన ఇందర్ సింగ్ ఆమెను భివానిలోని గురు ద్రోణాచార్య షూటింగ్ అకాడమీలో చేర్పించాడు. ఆపై తన ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కూతురును షూటర్ను చేసేందుకు తన సమయం వెచ్చించాడు. 13 ఏళ్ల సురుచి కోచ్ సురేశ్ సింగ్ మార్గనిర్దేశనంలో షూటింగ్ను నేర్చుకొని అందులో పట్టు సంపాదించింది. ఇక మున్ముందు టోర్నీల్లో విజయాలే లక్ష్యంగా ఆమె సిద్ధమవుతూ వచ్చింది. అప్పుడే కోవిడ్ మహమ్మారి వచ్చేసింది. ప్రపంచంలో ఎంతో మంది ప్లేయర్లకు వచ్చిన కష్టమే సురుచికి కూడా వచ్చింది. సొంత ఊర్లో సాధన... కోవిడ్ సమయంలో భివానికి వెళ్లి ప్రాక్టీస్ చేయడం అసాధ్యంగా మారింది. అప్పటికే సురుచి కొన్ని జూనియర్ టోర్నమెంట్లలో పాల్గొంటూ వచ్చింది. ఆ సమయంలో మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ఇందర్ సింగ్కు తమ స్వగ్రామంలోనే కొత్తగా ఏర్పాటైన కార్గిల్ షూటింగ్ అకాడమీ కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న అనిల్ జాఖడ్ ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన అకాడమీ ఇది. దాంతో ఇక్కడే సురుచి సాధన మళ్లీ మొదలైంది. ఆమె తన ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ శిక్షణ కోవిడ్ తర్వాత మంచి ప్రభావం చూపించింది. 2022 జాతీయ చాంపియన్షిప్లో ఆమె తొలి సారి పతకం గెలుచుకొని తన విజయ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత 2023 జాతీయ చాంపియన్షిప్లో కూడా పతకాలు సాధించింది. అయితే 2024లో జరిగిన పోటీలు ఆమె స్థాయిని షూటింగ్ ప్రపంచానికి తెలియజేశాయి. ఈసారి ఏకంగా 7 పతకాలతో మెరిసిన సురుచికి భారత భవిష్యత్తు స్టార్గా గుర్తింపు వచ్చింది. స్టార్ షూటర్ శిక్షణలో... ప్రఖ్యాత పిస్టల్ షూటర్ జీతూ రాయ్ భారత జట్టు కోచింగ్ బృందంలోకి వచ్చాక సురుచి ఆట మరింత పదునెక్కింది. షూట్ చేసే సమయంలో ఆమె నిలిచే తీరులో ఉన్న స్వల్ప లోపాన్ని సవరించడంతో పాటు కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకునే విషయంలో జీతూ రాయ్ ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. సురుచి ఇటీవలి వరుస విజయాల్లో రాయ్ పాత్ర కూడా చాలా ఉంది. ముఖ్యంగా వరల్డ్ కప్కు ముందు కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్లో జీతూ రాయ్ మార్గనిర్దేశనంలో జరిగిన 15 రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం సురుచికి ఎంతో మేలు చేసింది. వరల్డ్ కప్లో 2 వ్యక్తిగత స్వర్ణాలతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సౌరభ్ చౌదరితో కలిసి మరో పసిడిని కూడా ఆమె సొంతం చేసుకొని తన స్వర్ణాల సంఖ్యను మూడుకు పెంచుకుంది. ఓపికకు చిరునామావంటి షూటింగ్ క్రీడలో కెరీర్ ఆరంభంలో ఆమె త్వరగా ప్రాక్టీస్ ముగించే ప్రయత్నంలో కాస్త అసహనం ప్రదర్శించేది. కానీ కోచ్లు దీనిని గుర్తించి ఆమెకు సరైన దిశానిర్దేశం చేశారు. ఆటలో ఎదగాలంటే సాంకేతిక అంశాలే కాదు వ్యక్తిగత లోపాలు కూడా దిద్దుకోవాలని వారు చేసిన సూచనలను ఆమె అర్థం చేసుకుంది. ఇప్పుడు ప్రాక్టీస్లో కూడా తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి పర్ఫెక్షన్ వచ్చే వరకు సురుచి అక్కడినుంచి కదలదు. అలాంటి పట్టుదల అలవాటు చేసుకొని పెద్ద లక్ష్యాలతో ఆమె ముందుకు సాగుతోంది. తొలి కోచ్ సురేశ్ సింగ్ నుంచి జీతూ రాయ్ వరకు ఇప్పుడు కష్టపడే తత్వం గురించే చెబుతుండటం విశేషం. వరల్డ్ కప్ తరహా ప్రదర్శనలు పునరావృతం చేస్తూ నిలకడగా సాగితే భవిష్యత్తులో సురుచి నుంచి కూడా ఒలింపిక్ పతకం ఆశించవచ్చు. -
రామ్ బాబుకు పసిడి
చండీగఢ్: జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్షిప్లో ఉత్తరప్రదేశ్కు చెందిన రామ్ బాబు పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన రేస్లో రామ్ బాబు 35 కిలోమీటర్ల దూరాన్ని... 2 గంటల 32 నిమిషాల 53.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్ర స్థానంలో నిలిచాడు. 2022 ఆసియా క్రీడల్లో మంజు రాణితో కలిసి మిక్స్డ్ రేస్వాక్లో కాంస్యం నెగ్గిన రామ్ బాబు... జాతీయ పోటీల్లోనూ అదే జోరు కనబర్చాడు. అయితే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (2 గంటల 29 నిమిషాల 56 సెకన్లు)ను మాత్రం సవరించలేకపోయాడు. 20 కిలోమీటర్ల విభాగంలో... సెబాస్టియన్ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. 1 గంట 21 నిమిషాల 46.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. అమిత్ (1 గంట 21 నిమిషాల 51.46 సెకన్లు), అమన్జ్యోత్ సింగ్ (1 గంట 22 నిమిషాల 12.72 సెకన్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు 1 గంట 24 నిమిషాల 50 సెకన్లు అర్హత మార్క్ కాగా... ఈ ముగ్గురూ దానికంటే మెరుగైన టైమింగ్ నమోదు చేసుకున్నారు. మహిళల 20 కిలోమీటర్ల రేస్వాక్లో రవీనా (1 గంట 35 నిమిషాల 58.80 సెకన్లు) స్వర్ణం గెలుచుకుంది. మహిళల విభాగంలో 35కు బదులు 34 కిలోమీటర్లు! మహిళల విభాగంలో ఫలితాలు వెల్లడించలేదు. మహిళా వాకర్లు రేసును పూర్తి చేయకుండానే ముగింపు గీత దాటడంతో ఫలితాలు నిలిపివేశారు. మొదట సాంకేతిక కారణాలతో మహిళల విబాగంలో ఫలితాలను నిలిపివేసినట్లు ప్రకటించిన నిర్వాహకులు ఆ తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టారు. 35 కిలోమీటర్ల రేసుకు బదులు మహిళలు 34 కిలోమీటర్లను మాత్రమే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ రేసులో పాయల్ 2 గంటల 51 నిమిషాల 48.76 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానం దక్కించుకుంది. అయితే ఈ ఫలితాలు పరిగణనలోకి రావు. 2024లోనూ ఇక్కడ జరిగిన జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్షిప్లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అప్పుడు తప్పుడు గణాంకాలు నమోదు కావడంతో... ఆ తర్వాత వరల్డ్ అథ్లెటిక్స్ సంఘం సమయాలను సవరించింది. -
జాతీయ ప్రాబబుల్స్కు 39 మంది ప్లేయర్లు
న్యూఢిల్లీ: మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ క్వాలిఫయర్స్ కు ముందు నిర్వహించనున్న జాతీయ శిబిరానికి 39 మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. జూన్, జూలైలో జరగనున్న ఈ అర్హత పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా... జాతీయ మహిళల సీనియర్ ఫుట్బాల్ టీమ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రీ శనివారం 39 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. ఈ ప్రాబబుల్స్లో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ చోటు దక్కించుకుంది.ఇటీవల ఇండియన్ ఉమెన్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తరఫున 9 గోల్స్తో సత్తాచాటిన సౌమ్య... ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 33 మ్యాచ్లాడింది. మహిళల ఆసియాకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీకి థాయ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. జూన్ 23 నుంచి జూలై 5 వరకు జరగనున్న ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘బి’ నుంచి బరిలోకి దిగనుంది. ఆతిథ్య థాయ్లాండ్, మంగోలియా, టిమొర్ లెస్ట్, ఇరాక్తో భారత జట్టు తలపడుతుంది. దానికి ముందు భారత ప్లేయర్ల కోసం మే1 నుంచి బెంగళూరులో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. సీనియర్ ప్లేయర్లు బాలా దేవి, ఆశాలత దేవికి ఈ ప్రాబబుల్స్లో చోటు దక్కలేదు. ఇటీవల ఐడబ్ల్యూఎల్లో రాణించిన యంగ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి. ప్రాబబుల్స్: పాయల్, ఎలాంగ్బమ్ చాను, కైశమ్ మెలోడీ చాను, మోనాలిసా దేవి (గోల్ కీపర్స్), పూర్ణిమ కుమారి, నిర్మలా దేవి, మార్టినా థోక్చమ్, శుభాంగి సింగ్, సంజూ, మాలతీ, టోయిజమ్ చాను, రంజనా చాను, స్వీటి దేవి, విక్సిత్ బారా, షిల్కీ దేవి (డిఫెండర్స్), కిరణ్, రత్నబాలా దేవి, ముస్కాన్, బబీనా దేవి, కార్తీక అంగముత్తు, కోల్నీ, సంగీత, ప్రియదర్శిని, బేబే సనా, సంతోష్, అంజూ తమాంగ్ (మిడ్ఫీల్డర్స్), మౌసుమీ ముర్ము, మాళవిక, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్, సులాజన, లిండా కామ్, రింపా హల్దార్, మనీషా నాయక్, రేణు, కరిష్మా పురుషోత్తమ్, సుమతి, మనీషా, గ్రేస్ డాంగ్మెయి (ఫార్వర్డ్స్). -
హంపి–హారిక గేమ్ ‘డ్రా’
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి అజేయపరంపర కొనసాగుతోంది. భారత్కే చెందిన మరో స్టార్ గ్రాండ్మాస్టర్, హైదరాబాద్కు చెందిన ద్రోణవల్లి హారికతో శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్ను హంపి ‘డ్రా’గా ముగించింది. తెల్ల పావులతో ఆడిన హంపి గేమ్ను 19 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఐదో రౌండ్ తర్వాత హంపి 3.5 పాయింట్లతో ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో హంపి రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్ను దివ్య దేశ్ముఖ్ 72 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్, తమిళనాడు అమ్మాయి వైశాలి రమేశ్బాబు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్లో వైశాలి తెల్లపావులతో ఆడుతూ 52 ఎత్తుల్లో గెలుపొందింది. జు జినెర్ (చైనా)–నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) మధ్య జరిగిన గేమ్ 71 ఎత్తుల్లో... మెలియా సలోమి (జార్జియా)–అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన గేమ్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత జు జినెర్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శనివారం విశ్రాంతి దినం. ఆదివారం జరిగే ఆరో రౌండ్ గేముల్లో దివ్య దేశ్ముఖ్తో ద్రోణవల్లి హారిక; బత్కుయాగ్ మున్గున్తుల్తో కోనేరు హంపి; జు జినెర్తో వైశాలి; పొలీనా షువలోవాతో మెలియా సలోమి; నుర్గుల్ సలీమోవాతో అలీనా కష్లిన్స్కాయా తలపడతారు. -
శభాష్ సౌమ్య...
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఇండియన్ ఉమెన్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు తొలిసారి చాంపియన్గా అవతరించింది. ఈస్ట్ బెంగాల్ జట్టుకు తొలిసారి టైటిల్ దక్కడంలో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కీలకపాత్ర పోషించింది. మిడ్ఫీల్డర్ పొజిషన్లో ఆడే సౌమ్య మొత్తం 9 గోల్స్ సాధించి ఐడబ్ల్యూఎల్ 2024–2025 సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈస్ట్ బెంగాల్కే చెందిన ఫాజిలా ఇక్వాపుట్ (ఉగాండా) 24 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలువగా.. ఈస్ట్ బెంగాల్కే చెందిన ఎల్షాదాయ్ అచెమ్పోంగ్ (ఘనా) 10 గోల్స్తో రెండో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో విదేశీ క్రీడాకారిణులు ఉండటంతో... తాజా ఐడబ్ల్యూఎల్లో అత్యధిక గోల్స్ చేసిన భారతీయ క్రీడాకారిణిగా సౌమ్య గుర్తింపు పొందింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీన మొదలైన ఈ లీగ్ ఏప్రిల్ 18న ముగిసింది. మొత్తం ఎనిమిది జట్లు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఒక్కో జట్టుతో రెండుసార్లు చొప్పున తలపడ్డాయి. ఈస్ట్ బెంగాల్ జట్టు నిర్ణీత 14 మ్యాచ్లు ఆడి 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. ఈస్ట్ బెంగాల్ జట్టు 12 మ్యాచ్ల్లో గెలిచి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. ఓవరాల్గా ఈస్ట్ బెంగాల్ జట్టు 38 గోల్స్ చేసి, ప్రత్యర్థి జట్లకు 10 గోల్స్ సమర్పించుకుంది. ఇప్పటి వరకు ఐడబ్ల్యూఎల్ ఎనిమిదిసార్లు జరగ్గా... గోకులం కేరళ జట్టు మూడుసార్లు చాంపియన్గా నిలిచింది. ఈస్టర్న్ స్పోర్టింగ్ యూనియన్, రైజింగ్ స్టూడెంట్స్ క్లబ్, సేతు క్లబ్, ఒడిశా ఎఫ్సీ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. రెండోసారి విజేత జట్టులో... నిజామాబాద్ జిల్లాలోని కూనేపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల సౌమ్య ఖాతాలో రెండోసారి ఐడబ్ల్యూఎల్ టైటిల్ చేరింది. సౌమ్య 2021–2022 ఐడబ్ల్యూఎల్ సీజన్ విజేత గోకులం కేరళ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది. 2015లో భారత అండర్–14 జట్టుకు... 2016లో భారత అండర్–16 జట్టుకు ఆడిన సౌమ్య 2016 నుంచి 2018 వరక భారత అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2021లో భారత సీనియర్ మహిళల జట్టులోకి ఎంపికైన సౌమ్య ఇప్పటి వరకు ఓవరాల్గా 33 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి ఐదు గోల్స్ సాధించింది. 2017లో ఇండియా రష్ సాకర్ క్లబ్ (ముంబై) తరఫున తొలిసారి ఐడబ్ల్యూఎల్లో బరిలోకి దిగిన సౌమ్య... 2019–2020 సీజన్లో కెంక్రె ఎఫ్సీ (ముంబై) తరఫున ఆడింది. 2021–2022 సీజన్లో గోకులం కేరళ జట్టుకు ఆడిన సౌమ్య 2022–2023లో క్రొయేషియాకు చెందిన డైనమో జాగ్రెబ్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించింది. క్రొయేషియా లీగ్లో ఆడిన తర్వాత తిరిగి వచి్చన సౌమ్య 2023–2024 ఐడబ్ల్యూఎల్లో మరోసారి గోకులం కేరళ జట్టు తరఫున బరిలోకి దిగింది. -
సెమీస్లో అనాహత్, ఆకాంక్ష
కౌలాలంపూర్: ప్రపంచ స్క్వాష్ చాంపియన్షిప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్స్ అనాహత్ సింగ్, ఆకాంక్ష సాలుంఖే సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో ఐదో సీడ్, 17 ఏళ్ల అనాహత్ 11–1, 11–7, 11–5తో అకారి మిదోరికవా (జపాన్)పై, రెండో సీడ్ ఆకాంక్ష 11–0, 11–3, 11–3తో వాయ్ హాన్ యోంగ్ (సింగపూర్)పై గెలుపొందారు. భారత్కే చెందిన తన్వీ ఖన్నా క్వార్టర్ ఫైనల్లో 5–11, 6–11, 12–10, 9–11తో ఎనిమిదో సీడ్ హెలెన్ టాంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్ మ్యాచ్ల్లో అనాహత్ 11–4, 11–5, 11–7తో జెమికా అరిబాడో (ఫిలిప్పీన్స్)పై, ఆకాంక్ష 11–4, 11–3, 11–8తో రిసా సుగిమోటో (జపాన్)పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వీర్ చోత్రాని కూడా సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు.క్వార్టర్ ఫైనల్లో వీర్ చోత్రాని 9–11, 11–6, 11–6, 11–7తో మొహమ్మద్ సిఫిక్ కమాల్ (మలేసియా)పై గెలిచాడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్లు మే 9 నుంచి 17 వరకు చికాగోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధిస్తారు. -
రొలాండ్ గారోస్లో నాదల్కు ప్రత్యేక సన్మానం
పారిస్: సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ను ప్రత్యేకంగా సన్మానించనున్నారు. మరే ఆటగాడికీ సాధ్యంకాని రీతిలో... 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న నాదల్... ఓవరాల్గా 22 గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచాడు. ఈ ఏడాది మే 25 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుండగా... తొలి రోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో నాదల్ను సన్మానించనున్నారు. ‘రొలాండ్ గారోస్కు, నాదల్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్లో అతడు చరిత్ర సృష్టించాడు. నాదల్ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం. అది అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోను చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని ఫ్రెంచ్ ఓపెన్ డైరెక్టర్ అమెలీ మౌరెస్మో గురువారం అన్నారు. 2024 ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో పరాజయం పాలైన నాదల్... అదే సమయంలో సన్మానించాలని నిర్వాహకులు భావించినా... దానికి అతడు అంగీకరించలేదు. శరీరం సహకరిస్తే మరోసారి ఫ్రెంచ్ ఓపెన్లో బరిలోకి దిగాలని 38 ఏళ్ల నాదల్ భావించాడు. కాగా... వరుస గాయాల కారణంగా గతేడాది నవంబర్లో నాదల్ కెరీర్కు వీడ్కోలు పలకడంతో... నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాదల్తో పాటు మేరీ పియర్స్, రిచర్డ్ గాస్కె్వట్ను కూడా సన్మానించనున్నారు. 25 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్లో పియర్స్ మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్లో టైటిల్స్ సాధించింది. ఈ ఏడాది జూన్ 5న మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్కు ముందు ఆమెను సన్మానించనున్నారు. 50 ఏళ్ల పియర్స్ 2019లో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోనూ చోటు దక్కించుకుంది. -
పసిడి పతకం నెగ్గిన హిమాన్షు
దమ్మామ్ (సౌదీ అరేబియా): ఆసియా అండర్–18 యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో హిమాన్షు భారత్కు పసిడి పతకాన్ని అందించాడు. 17 ఏళ్ల హిమాన్షు జావెలిన్ను 67.57 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. లు హావో (చైనా; 63.45 మీటర్లు) రజతం... రుసియన్ సాదుల్లాయెవ్ (ఉజ్బెకిస్తాన్; 61.96 మీటర్లు) కాంస్యం సాధించారు.హరియాణా మహిళా అథ్లెట్ ఆర్తి తన ఖాతాలో రెండో కాంస్య పతకాన్ని జమ చేసుకుంది. 200 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని సాధించింది. ఆర్తి 24.31 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. 100 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల హైజంప్లో దేవక్ భూషణ్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. భూషణ్ 2.03 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల షాట్పుట్లో నిశ్చయ్ రజత పతకం దక్కించుకోగా... పురుషుల మెడ్లీ రిలేలో చిరంత్, సయ్యద్ సాబీర్, సాకేత్ మింజ్, కదీర్ ఖాన్లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది. -
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్గా జు వెన్జున్
మహిళల చదరంగంలో తనకు తిరుగులేదని చైనా గ్రాండ్మాస్టర్ జు వెన్జున్ మరోసారి నిరూపించుకుంది. క్లాసికల్ ఫార్మాట్లో వరుసగా ఐదోసారి ఆమె విశ్వవిజేతగా నిలిచింది. చైనాకే చెందిన టాన్ జోంగితో షాంఘైలో జరిగిన ప్రపంచ చెస్ మహిళల చాంపియన్షిప్ మ్యాచ్లో 34 ఏళ్ల జు వెన్జున్ 6.5–2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇద్దరి మధ్య 12 గేమ్లు జరగాల్సి ఉన్నా... తొమ్మిదో గేమ్లోనే జు వెన్జున్కు టైటిల్ ఖరారు కావడంతో మిగతా మూడు గేమ్లను నిర్వహించలేదు. తొమ్మిది గేమ్లలో జు వెన్జున్ ఐదు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోయింది. విజేతగా నిలిచిన జు వెన్జున్కు 3,41,000 డాలర్లు (రూ. 2 కోట్ల 91 లక్షలు), రన్నరప్ టాన్ జోంగికి 2,27,000 డాలర్లు (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. 2018లో రెండుసార్లు (10 గేమ్ల ఫార్మాట్, నాకౌట్ ఫార్మాట్ వేర్వేరుగా) ప్రపంచ చాంపియన్గా నిలిచిన జు వెన్జున్ ఆ తర్వాత 2020లో, 2023లోనూ వరల్డ్ టైటిల్ను సాధించింది. -
స్వర్ణంతో శుభారంభం
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2025 సీజన్ను స్వర్ణ పతకంతో శుభారంభం చేశాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన పాచెఫ్్రస్టూమ్ ఇన్విటేషనల్ ట్రాక్ ఈవెంట్లో 27 ఏళ్ల నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. ఆరుగురు పోటీపడ్డ ఈ ఈవెంట్లో నీరజ్ జావెలిన్ను 84.52 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డూ స్మిట్ (దక్షిణాఫ్రికా; 82.44 మీటర్లు) రజతం, డంకన్ రాబర్ట్సన్ (దక్షిణాఫ్రికా; 71.22 మీటర్లు) కాంస్యం సాధించారు. నీరజ్ పాల్గొన్న ఈ మీట్కు వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజర్ ఈవెంట్గా గుర్తింపు ఉంది. దిగ్గజం జాన్ జెలెజ్నిను కొత్త కోచ్గా నియమించుకున్నాక నీరజ్ పోటీపడ్డ తొలి టోర్నీలో టాప్ ర్యాంక్లో నిలువడం విశేషం. నీరజ్ తదుపరి మే 16వ తేదీన జరిగే దోహా డైమండ్ లీగ్ మీట్లో, ఆ తర్వాత మే 24న పంచ్కులాలో జరిగే నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో టోర్నీలో పోటీపడతాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్... 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. 2022 ప్రపంచ చాంపియన్షిప్లో రజతం సొంతం చేసుకున్న నీరజ్... 2023 ప్రపంచ చాంపియన్షిప్లో విశ్వవిజేతగా అవతరించాడు. -
హంపి, దివ్య విజయం
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో నాలుగో రోజు భారత స్టార్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ మెరిశారు. హంపి వరుసగా రెండో విజయం నమోదు చేసుకోగా... దివ్య ఖాతాలో మూడో గెలుపు చేరింది. భారత్కే చెందిన ఇద్దరు గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్బాబుల మధ్య జరిగిన ముఖాముఖి పోరు ‘డ్రా’గా ముగిసింది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలిచింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో ఆడిన మహారాష్ట్ర అమ్మాయి దివ్య 77 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. హారిక, వైశాలి మధ్య జరిగిన గేమ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) 55 ఎత్తుల్లో... జు జినెర్ (చైనా) 39 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. 10 మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్ తర్వాత జు జినెర్ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హంపి, దివ్య 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. హారిక, పొలీనా, మున్గున్తుల్ 2 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందగా... జు జినెర్ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. -
మీరాబాయి చానుకు కీలక పదవి.. వెయిట్లిఫ్టర్ స్పందన ఇదే
న్యూఢిల్లీ: స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను... భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎన్నికైంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం చేజిక్కించుకొని చరిత్ర సృష్టించిన చాను... సహచర లిఫ్టర్లకు తోడ్పాటు అందించేందుకు ఇది సహకరిస్తుందని పేర్కొంది. ‘తోటి లిఫ్టర్ల తరఫున మాట్లాడే అవకాశం దక్కంది. దీన్ని సద్వినియోగ పర్చుకుంటా. పదవితో వచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా.క్రీడేతర అంశాలపై దృష్టి పడకుండా... వెయిట్లిఫ్టింగ్కు మరింత తోడ్పాటు అందించేందుకు నా వంతు కృషి చేస్తా. లిఫ్టర్ల సమస్యలతో పాటు అన్ని కోణాల్లో దృష్టి సారిస్తా’ అని మీరాబాయి చాను ఒక ప్రకటనలో తెలిపింది. టోక్యో ఒలింపిక్స్లో చాను 49 కేజీల విభాగంలో రజతం గెలిచి... ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్గా నిలిచింది. అంతకుముందు (2000 సిడ్నీ ఒలింపిక్స్) భారత్ నుంచి వెయిట్లిఫ్టింగ్లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం నెగ్గింది. అదే అనిశ్చితి: గందరగోళంలో భారత బాక్సింగ్ సంఘంన్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సంఘం (బీఎఫ్ఐ)లో అనిశ్చితి కొనసాగుతోంది. రాష్ట్ర సంఘాలన్నీ వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే... తాజాగా ఎన్నికైన తాత్కాలిక కమిటీ మాత్రం జాతీయ చాంపియన్షిప్ల నిర్వహణ, కోచ్ల నియామకం, అంతర్జాతీయ టోర్నీలో ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా... న్యాయపరమైన సమస్యలతో ఆలస్యమైంది.గత నెల 28న ఎన్నికలు నిర్వహించాలని మొదట నిర్ణయించగా... సమాయాభావం వల్ల అదీ సాధ్యపడలేదు. తాజాగా ఈ నెల 28 లోపు ఎన్నికలు నిర్వహించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. చాన్నాళ్లు బీఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ సింగ్... తాత్కాలిక కమిటీకి కూడా చీఫ్గా కొనసాగుతున్నాడు.‘సుదీర్ఘ అనుభవం ఉన్న అజయ్ సింగ్... ఎన్నికలను వాయిదా వేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అస్సాం బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు, హేమంత్ అన్నారు. ‘అజయ్ సింగ్ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంగా ఒక్క చాంపియన్షిప్ కూడా నిర్వహించలేదు. పారిస్ ఒలింపిక్స్లో మనవాళ్లకు రిక్తహస్తాలే మిగిలాయి’ అని మధ్యప్రదేశ్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. -
హంపి, హారిక తొలి గెలుపు
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో మూడో రోజు భారత స్టార్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సత్తా చాటుకున్నారు. వీరిద్దరు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకున్నారు. బుధవారం జరిగిన మూడో రౌండ్ గేముల్లో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి తెల్ల పావులతో ఆడుతూ 53 ఎత్తుల్లో ప్రపంచ జూనియర్ చాంపియన్, భారత్కే చెందిన రైజింగ్ స్టార్ దివ్య దేశ్ముఖ్ను ఓడించింది.తొలి రెండు రౌండ్ గేముల్లో నెగ్గిన దివ్యకిది తొలి ఓటమి కావడం గమనార్హం. మరో గేమ్లో హైదరాబాద్కు చెందిన హారిక 68 ఎత్తుల్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో తొలి గెలుపు రుచి చూసింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ వైశాలి రమేశ్బాబు రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్ను వైశాలి 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మరోవైపు బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందగా... జు జినెర్ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. -
‘ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్’
న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా భార్య పూజా పుజారా కొత్త పుస్తకాన్ని తీసుకురానుంది. ఓ క్రికెటర్ జీవిత భాగస్వామిగా తన అనుభవాలను పూజ పుస్తక రూపమిచ్చింది. ‘ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్’ పేరిట ఈ నెల 29న ఆ పుస్తకాన్ని విడుదల చేయనుంది. క్రికెట్ను విపరీతంగా అభిమానించి మన దేశంలో... ఓ ఆటగాడి జీవితంలో అటు గ్రౌండ్లో ఇటు ఇంట్లో ఎదురైన ఎత్తుపల్లాలను పూజ ఇందులో ప్రస్తావించింది. ‘చతేశ్వర్ పుజారా చాలా మొండివాడు. ఒక పట్టాన దేన్ని అంగీకరించడు. అదే సమయంలో సున్నిత మనసు్కడు, పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు. అయితే అతడి దగ్గర దాచడానికి ఏమీ లేదు. దైవంపై నమ్మకం ఎక్కువ. హాస్యాన్ని ఇష్టపడతాడు. రాజ్కోట్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన అతడి ప్రయాణం ఎంతో ప్రత్యేకం. అందులో భాగం అయ్యే అవకాశం నాకు దక్కడం ఆనందంగా ఉంది. చతేశ్వర్ జీవితంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నా. అందుకోసమే ఇంత సమయం కేటాయించి పుస్తకాన్ని తీసుకు వస్తున్నా’ అని పూజా పుజారా వెల్లడించింది.క్రికెట్పై కనీస అవగాహన లేకుండానే 2013లో అతడిని వివాహమాడిన పూజా... ఆ తర్వాతి కాలంలో స్పోర్ట్స్ న్యూట్రీషియన్గా మారింది. ఓ క్రీడాకారుడి భాగస్వామి పుస్తకం రాయడం ఇదే తొలిసారి. ఈ నెలాఖరులో మార్కెట్లోకి రానున్న పుస్తకంపై భారత దిగ్గజ ఆటగాళ్లు అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. పుజారాను సమీపం నుంచి గమనించిన పూజా... అతడి జీవితంలోనే భిన్న పార్శా్వలను స్పృషించిందని ద్రవిడ్ కితాబిచ్చాడు. కష్టాన్ని నమ్ముకుంటే ఒక వ్యక్తి ఎంతటి విజయం సాధించగలడనే అంశం ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుందని పేర్కొన్నాడు. -
సురుచి ధమాకా
లిమా (పెరూ): గతవారం అర్జెంటీనాలో అదరగొట్టిన భారత టీనేజ్ పిస్టల్ షూటర్ సురుచి ఇందర్ సింగ్ అదే జోరును పెరూలో పునరావృతం చేసింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ రెండో టోర్నమెంట్లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల సురుచి 24 గంటల వ్యవధిలో రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సురుచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 243.6 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత స్టార్ మనూ భాకర్ రజత పతకంతో సంతృప్తి పడింది. మనూ భాకర్ 242.3 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 34 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో సురుచి 582 పాయింట్లతో రెండో స్థానంలో, మనూ భాకర్ 578 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లోనూ సురుచి గరి అదిరింది. ఈ ఈవెంట్ ఫైనల్లో సురుచి–సౌరభ్ చౌధరీ (భారత్) ద్వయం విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సాధించింది. ఫైనల్లో సురుచి–సౌరభ్ జోడీ 17–9తో కియాన్జున్ యావో–కాయ్ హు (చైనా) జంటను ఓడించింది. కాంస్య పతక మ్యాచ్లో మనూ భాకర్–రవీందర్ సింగ్ (భారత్) జోడీ 6–16తో కియాన్కె మా–యిఫాన్ జాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
సాత్విక్ - చిరాగ్ జోడీ పునరాగమనం
ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో ఆశించిన విజయాలు అందుకోలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో సమరానికి సమాయత్తమవుతున్నారు. ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్లో ఈసారైనా పతకం లోటు తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈనెల 27 నుంచి చైనాలోని జియామెన్ నగరంలో ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ ‘సుదిర్మన్ కప్’కు తెర లేవనుంది. ఎనిమిది రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. బ్యాడ్మింటన్లో ప్రముఖ టీమ్ ఈవెంట్స్ అయిన థామస్ కప్, ఉబెర్ కప్లలో... ఆసియా టీమ్ చాంపియన్షిప్లలో భారత జట్లు పతకాలు సాధించాయి. కానీ 36 ఏళ్ల చరిత్ర కలిగిన సుదిర్మన్ కప్లో మాత్రం ఇప్పటి వరకు భారత్ పతకాల బోణీ కొట్టలేదు. అందుబాటులో ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులతో చైనాకు బయలుదేరనున్న భారత బృందం ఈసారి పతకంతో తిరిగి రావాలని ఆశిద్దాం.న్యూఢిల్లీ: మొత్తం ఐదు మ్యాచ్లు... అందులో మూడు గెలిస్తే చాలు విజయం ఖరారు... పురుషుల సింగిల్స్లో ఇద్దరు స్టార్లు... మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్... పురుషుల డబుల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ జోడీ... ఈ మూడు విభాగాల్లో మనవాళ్లు సహజశైలిలో విజృంభిస్తే భారత్కు గెలుపుతోపాటు అందని ద్రాక్షగా ఊరిస్తున్న పతకం అందుకోవడం కష్టమేమీ కాదు. అయితే ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం సుదిర్మన్ కప్లో విశేషంగా రాణిస్తేనే పతకాన్ని మెడలో వేసుకోవడం సాధ్యమవుతుంది. ఈనెల 27 నుంచి మే 4 వరకు చైనాలోని జియామెన్ నగరంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లో పోటీపడనున్న భారత జట్టును మంగళవారం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. చిరాగ్ శెట్టి వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ నెలలోనే జరిగిన ఆసియా వ్యక్తిగత చాంపియన్షిప్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ జోడీ పాల్గొనలేదు. ప్రస్తుతం చిరాగ్ ఈ గాయం నుంచి తేరుకొని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సుదిర్మన్ కప్లో ఈ జోడీ పునరాగమనం చేయనుంది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీ ఐదు టోర్నీల్లో ఆడి రెండింటిలో సెమీఫైనల్కు చేరుకుంది. మహిళల డబుల్స్లో మినహా మిగతా నాలుగు విభాగాల్లో (పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత్ నుంచి స్టార్ ప్లేయర్లు పోటీపడుతున్నారు. భారత నంబర్వన్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో ఈ జంట సుదర్మిన్ కప్లో ఆడటంలేదు. ఆసియా వ్యక్తిగత చాంపియన్షిప్లోనూ గాయత్రి–ట్రెసా జోడీ బరిలోకి దిగలేదు. గాయత్రి–ట్రెసా జోడీ స్థానంలో ప్రియా–శ్రుతి మిశ్రా ద్వయం సుదిర్మన్ కప్లో ఆడనుంది. నాలుగు విభాగాల్లో బ్యాకప్ ప్లేయర్లను ఎంపిక చేసిన ‘బాయ్’ మహిళల డబుల్స్లో ఒక్క జోడీనే ఎంపిక చేయడం గమనార్హం. క్లిష్టమైన ‘డ్రా’... ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా సుదిర్మన్ కప్ టోర్నీకి భారత్ అర్హత సాధించింది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ప్రతి గ్రూప్లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. గ్రూప్ ‘డి’లో భారత్, మాజీ చాంపియన్ ఇండోనేసియా, మాజీ రన్నరప్ డెన్మార్క్తోపాటు ఇంగ్లండ్ జట్లున్నాయి. ఇంగ్లండ్ జట్టుపై భారత్ గెలిచే అవకాశం ఉన్నా... ఇండోనేసియా, డెన్మార్క్లపై నెగ్గాలంటే స్టార్ క్రీడాకారులు పూర్తిస్థాయిలో విజృంభించాల్సి ఉంటుంది. గ్రూప్ మ్యాచ్లు ముగిశాక నాలుగు గ్రూప్ల నుంచి రెండు జట్ల చొప్పున మొత్తం ఎనిమిది జట్లు నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్ చేరుకున్న జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి.సుదిర్మన్ కప్ టోర్నీకి భారత బ్యాడ్మింటన్ జట్టుపురుషుల సింగిల్స్: లక్ష్య సేన్ (ప్రపంచ 18వ ర్యాంక్), హెచ్ఎస్ ప్రణయ్ (ప్రపంచ 30వ ర్యాంక్). మహిళల సింగిల్స్: పీవీ సింధు (ప్రపంచ 18వ ర్యాంక్), అనుపమ ఉపాధ్యాయ్ (ప్రపంచ 44వ ర్యాంక్). పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (ప్రపంచ 11వ ర్యాంక్); హరిహరన్–రూబన్ కుమార్ (ప్రపంచ 42వ ర్యాంక్). మహిళల డబుల్స్: ప్రియా కొన్జెంగ్బమ్–శ్రుతి మిశ్రా (ప్రపంచ 39వ ర్యాంక్). మిక్స్డ్ డబుల్స్: ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (ప్రపంచ 17వ ర్యాంక్), సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ (ప్రపంచ 33వ ర్యాంక్). -
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ఎంపిక.. ఐదుగురికి తొలిసారి చోటు
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి సలీమా టెటె నాయకత్వం వహిస్తుంది. 26 మందిలో ఐదుగురు జ్యోతి సింగ్, సుజాత కుజుర్, అజ్మీనా కుజుర్, పూజా యాదవ్, మహిమా టెటె తొలిసారి భారత సీనియర్ జట్టులోకి వచ్చారు. బన్సారి సోలంకి, అంజన డుంగ్డుంగ్, లాల్థంట్లాంగి, సాక్షి శుక్లా, ఖైదెమ్ షిలీమా చాను, దీపి మోనికా టొప్పో, సోనమ్లను స్టాండ్బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు.ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్లు ఆడుతుంది. తొలుత ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్లు... అనంతరం ఆ్రస్టేలియా సీనియర్ జట్టుతో మూడు మ్యాచ్లు ఉంటాయి. జూన్లో జరిగే యూరోపియన్ అంచె ప్రొ హాకీ లీగ్కు సన్నాహకంగా భారత జట్టుకు ఆస్ట్రేలియాతో సిరీస్ ఉపయోగపడనుంది. భారత మహిళల హాకీ జట్టు: సవితా పూనియా, బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్కీపర్లు), జ్యోతి సింగ్, ఇషికా చౌధరీ, సుశీలా చాను, సుజాత కుజుర్, సుమన్ దేవి తౌడమ్, జ్యోతి, అజ్మీనా కుజుర్, సాక్షి రాణా (డిఫెండర్లు), సలీమా టెటె, వైష్ణవి ఫాలే్క, నేహా, షర్మీలా దేవి, మనీషా చౌహాన్, సునెలిటా టొప్పో, మహిమా టెటె, పూజా యాదవ్, లాల్రెమ్సియామి (మిడ్ ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్, దీపిక, రుతుజా పిసాల్, ముంతాజ్ ఖాన్, బల్జీత్ కౌర్, దీపిక సొరెంగ్, బ్యూటీ డుంగ్డుంగ్. -
డిస్కస్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డు
రామోనా (అమెరికా): పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో క్రీడాంశంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఒక్లాహోమా త్రోస్ సిరీస్ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ మీట్లో లిథువేనియాకు చెందిన మికోలస్ అలెక్నా (Mykolas Alekna- 75.56 మీటర్లు) ఈ ఘనత సాధించాడు. స్వర్ణ పతకం గెలిచే క్రమంలో 22 ఏళ్ల అలెక్నా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును రెండుసార్లు తిరగ రాయడం విశేషం. గత ఏడాది ఇదే మీట్లో అలెక్నా డిస్క్ను 74.35 మీటర్ల దూరం విసిరి... 1986 నుంచి జుర్గెన్ షుల్ట్ (జర్మనీ; 74.08 మీటర్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో మికోలస్ రజత పతకం గెలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఒక్లాహోమో మీట్లో అలెక్నా తొలి ప్రయత్నంలో డిస్క్ను 74.89 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డును సవరించాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో డిస్క్ను 75.56 మీటర్ల దూరం విసిరి మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా డిస్క్ను 75 మీటర్ల దూరం విసిరిన తొలి అథ్లెట్గా గుర్తింపు పొందాడు. తండ్రి బాటలోమికోలస్కు ఘనమైన క్రీడా కుటుంబ నేపథ్యం ఉంది. మికోలస్ తండ్రి వర్జిలియస్ అలెక్నా కూడా విఖ్యాత డిస్కస్ త్రోయర్ కావడం విశేషం. 6 అడుగుల 7 అంగుళాల ఎత్తు, 130 కేజీల బరువున్న వర్జిలియస్ 2000 సిడ్నీ ఒలింపిక్స్లో స్వర్ణం, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో సర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించాడు. 2003 పారిస్ ప్రపంచ చాంపియన్షిప్లో, 2005 హెల్సింకి ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకాలు నెగ్గిన వర్జిలియస్... 1997 ఏథెన్స్ ప్రపంచ చాంపియన్షిప్లో, 2001 ఎడ్మంటన్ ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్గా తన కెరీర్లో వర్జిలియస్ 12 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు గెలిచాడు. 2014లో రిటైర్మెంట్ ప్రకటించిన 53 ఏళ్ల వర్జిలియస్ రాజకీయాల్లో ప్రవేశించి లిథువేనియా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
‘అతి’ వల్ల అనర్థాలు తప్పవు!.. చాలా బాధగా ఉంది..
యడ్లపల్లి ప్రాంజల... హైదరాబాద్కు చెందిన యువ టెన్నిస్ ప్లేయర్. కొన్నేళ్ల క్రితం వరకు చక్కటి ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ సానియా మీర్జా తర్వాత ఆ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్న అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? మే, 2019లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో ఆమె అత్యుత్తమంగా 265కు చేరుకుంది.మరింత మెరుగైన ప్రదర్శనతో పైకి దూసుకు పోతూ మెరుగైన భవిష్యత్తుపై ప్రాంజల ఆట నమ్మకం కలిగించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. 20 ఏళ్ల వయసులో ఆమె మళ్లీ మళ్లీ గాయాలపాలైంది. ఒక గాయం నుంచి కోలుకోగానే మరొకటి ఆమెను వెంటాడింది.15 ఏళ్ల వయసులోనే ఐటీఎఫ్ స్థాయిలో వరుసగా టైటిల్స్ గెలిచిన ఆ అమ్మాయికి అసలు సమయంలో గాయాల విషయంలో సరైన మార్గనిర్దేశనం లేకుండా పోయింది. దాంతో కెరీర్లో ఎదుగుతున్న సమయంలో ఆమె ఆటకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో ప్రాంజల 1409వ స్థానానికి పడిపోయింది! అంటే కెరీర్లో ఎదుగుతున్న కీలకమైన 20–25 మధ్య ఐదేళ్ల కెరీర్ను ఆమె దాదాపు పూర్తిగా నష్టపోయింది.‘నాకు ఇప్పటికీ టెన్నిస్ అంటే చాలా ఇష్టం. పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాను. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బాధ వేస్తుంది. గాయాలతో పాటు టోర్నమెంట్ షెడ్యూల్, ఫిట్నెస్వంటివాటిపై సరైన రీతిలో మార్గనిర్దేశనం లభించి ఉంటే పరిస్థితి ఎంత మెరుగ్గా ఉండేదో అనిపిస్తుంది’ ఆమె ప్రాంజల వ్యాఖ్యానించింది.జిమ్ ఎక్సర్సైజ్లే సమస్యగా... ప్రాంజల మాత్రమే కాదు భారత టెన్నిస్లో ఎంతో మంది అమ్మాయిలు ప్రస్తుతం ఈ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి కారణం భారత టెన్నిస్లో ముఖ్యంగా మహిళల టెన్నిస్లో ఇలాంటివి చూసేందుకు ఒక సరైన వ్యవస్థనే లేదు. అసలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజ్లు కూడా ఎంత వరకు చేయాలి, అవి పరిమితి దాటితో ఎలాంటి నష్టం కలిగిస్తాయో కూడా ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వద్ద కూడా దీనికి సరైన సమాధానం లేదు. ఆటలో దూసుకుపోతున్న సమయంలో ‘అతి’గా ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు చేయడం కూడా ప్రాంజలను నష్టపర్చింది. ఒక మ్యాచ్లో 6–3, 5–2, 30–30తో విజయానికి బాగా చేరువైన సమయంలో కూడా అనారోగ్యంతో తప్పుకోవాల్సి రావడం ఆమె పరిస్థితిని చూపించింది. ‘నేను టీనేజర్గా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ట్రైనింగ్ చేసేదానిని. జిమ్లో కూడా చాలా ఎక్కువగా బరువును ఎత్తేదానిని. దాని వల్ల ఏమైనా అయితే ఎలా కోలుకోవాలనే విషయంపై కనీస సమాచారం కూడా లేదు.వెన్నునొప్పి, తుంటి నొప్పి, మోకాలు, మడమ... ఇలా ఒకదాని తర్వాత మరో గాయం వెంటాడింది. జిమ్లో బరువుల ప్రభావంతో కండరాలు బాగా బిగుసుకుపోయాయి. దాంతో శరీరంలో సమతుల్యత లభించింది. రెండు నెలలో తగ్గే గాయాలకు కూడా ఆరు నెలలు పట్టింది. నేను చేసిన ఎక్సర్సైజ్లతోనే నాకు బాగా నష్టం జరిగిందనే విషయం కూడా నాకు ఇటీవల అర్థమైంది. అంతకుముందు ఏమీ తెలీదు. తెలిస్తే జాగ్రత్త పడేదాన్ని’ అని ప్రాంజల తన ఆవేదనను ప్రదర్శించింది. ఏఐటీఏ చొరవ చూపిస్తేనే... కొన్నేళ్ల క్రితం చైనా మహిళా టెన్నిస్ ప్లేయర్ల కోసమే ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మొదలు పెట్టింది. ముఖ్యంగా తమ అగ్రశ్రేణి క్రీడాకారిణులకు అమిత ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు భారత్లో 16–24 వయసు మధ్య టెన్నిస్ ఆడుతున్న అమ్మాయిలకు కూడా అలాంటిది అవసరం ఉంది. దీనిపై ఇప్పుడిప్పుడే డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘భారత మహిళా ప్లేయర్లు విడివిడిగా కాకుండా ఒక బృందంగా టోర్నీలకు వెళ్లటం మేలు చేస్తుంది. అప్పుడు ఏఐటీఏ వారి కోసమే ఒక కోచ్ను, ఫిజియోను పంపే అవకాశం ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే అమ్మాయిలకు 360 డిగ్రీ పర్యవేక్షణ అవసరం. న్యూట్రిషన్, మానసిక దృఢత్వం, మ్యాచ్ల విశ్లేషణ, సరైన షెడ్యూలింగ్, ప్రాక్టీస్కు స్పేర్ పార్ట్నర్లు...ఇలా అన్నింటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో భారత్లో పెద్ద సంఖ్యలో టోర్నీలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 3–4 ఏళ్ల పాటు ప్రస్తుత ప్లేయర్లకు అండగా నిలవాల్సి ఉంది. లేదంటే ఈ ప్రతిభ వృథా అవుతుంది’ అని ప్రముఖ టెన్నిస్ అడ్మినిస్ట్రేటర్ సుందర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా ఏఐటీఏ మేల్కొనకపోతే ప్రాంజల కెరీర్ను దెబ్బ తీసిన అనుభవాలు మున్ముందూ ఎదురు కావచ్చు. -సాక్షి క్రీడా విభాగం -
హంపి గేమ్ ‘డ్రా’... హారిక పరాజయం
పుణే: ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో తొలి రోజు నలుగురు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి రమేశ్బాబు తమ తొలి గేమ్లను ‘డ్రా’ చేసుకోగా... ద్రోణవల్లి హారిక పరాజయం చవిచూసింది. ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ గేముల్లో భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ వైశాలితో నల్లపావులతో ఆడిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ హంపి 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చైనా గ్రాండ్మాస్టర్ జు జినెర్ 53 ఎత్తుల్లో హారికపై గెలుపొందింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో పోటీపడ్డ దివ్య దేశ్ముఖ్ 53 ఎత్తుల్లో నెగ్గడం విశేషం. భారత ప్లేయర్ల గేమ్లన్నీ 53 ఎత్తుల్లోనే ముగియడం గమనార్హం. ఇతర తొలి రౌండ్ గేముల్లో బత్కుయాగ్ మున్గున్తుల్ 85 ఎత్తుల్లో మెలియా సలోమీ (జార్జియా)పై, పొలీనా షువలోవా (రష్యా) 57 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. మొత్తం 10 మంది ప్లేయర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరగనుంది. -
Archery World Cup 2025: ధీరజ్కు కాంస్య పతకం
సెంట్రల్ ఫ్లోరిడా (అమెరికా): ఆర్చరీ–2025 సీజన్ తొలి టోర్నమెంట్లో భారత క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో భారత్ నాలుగు పతకాలు గెల్చుకుంది. చివరిరోజు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత నంబర్వన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాంస్య పతక మ్యాచ్లో 23 ఏళ్ల ధీరజ్ 6–4 (28–28, 28–29, 29–29, 29–28, 30–29) సెట్ పాయింట్లతో ఆండ్రెస్ టెమినో మెడీల్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ధీరజ్ 1–7 (27–28, 28–30, 29–29, 26–30) సెట్ పాయింట్లతో ఫ్లోరియన్ ఉన్రా (జర్మనీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్లో 666 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచిన ధీరజ్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో 6–0తో కెమిరిన్ పికెరింగ్ (బెర్ముడా)పై, రెండో రౌండ్లో 7–1తో కార్లోస్ రొజాస్ (మెక్సికో)పై, మూడో రౌండ్లో 7–3తో అతాను దాస్ (భారత్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో థామస్ చిరాల్ట్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉన్న ధీరజ్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పని చేస్తున్నాడు. ఇదే టోర్నీలో ధీరజ్ రికర్వ్ టీమ్ ఈవెంట్లో అతాను దాస్, తరుణ్దీప్ రాయ్లతో కలిసి భారత్కు రజత పతకాన్ని అందించాడు. ఇదే టోర్నీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ సహచరుడు రిషభ్ యాదవ్తో కలిసి కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. అభిõÙక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్లతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తదుపరి ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నమెంట్ చైనాలోని షాంఘై నగరంలో మే 6 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీలలో ధీరజ్ సాధించిన పతకాలు. ఇందులో వ్యక్తిగత విభాగంలో మూడు కాంస్యాలు ఉన్నాయి. టీమ్ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్యాలు, రెండు రజతాలు ఉన్నాయి. -
పియాస్ట్రి... మళ్లీ గెలిచాడు
సాఖిర్ (బహ్రెయిన్): క్వాలిఫయింగ్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ఫార్ములావన్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన సీజన్ నాలుగో రేసు బహ్రెయిన్ గ్రాండ్ప్రిలో పియాస్ట్రి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఆ్రస్టేలియాకు చెందిన పియా్రస్టి... నిర్ణీత 57 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 35 నిమిషాల 39.435 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో చైనా గ్రాండ్ప్రిలోనూ పియాస్ట్రి టైటిల్ సాధించాడు. మెర్సిడెస్ జట్టుకు చెందిన జార్జి రసెల్ రెండో స్థానాన్ని పొందగా... మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ మూడో స్థానంలో నిలిచాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్గా నిలుస్తున్న రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఆరో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన లూయిస్ హామిల్టన్ ఐదో స్థానాన్ని సాధించాడు. 24 రేసుల ఈ సీజన్లో నాలుగు రేసులు పూర్తయ్యాయి. 77 పాయింట్లతో లాండో నోరిస్ అగ్ర స్థానంలో... 74 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానంలో... వెర్స్టాపెన్ 69 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని ఐదో రేసు సౌదీ అరేబియా గ్రాండ్ప్రి ఈనెల 20న జిద్దా నగరంలో జరుగుతుంది. -
సెమీస్లో బాలాజీ జోడీ ఓటమి
చెన్నై: మెక్సికో సిటీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ మూడో ర్యాంకర్ శ్రీరామ్ బాలాజీ పోరాటం ముగిసింది. మెక్సికో సిటీలో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ రేయస్ వరేలా (మెక్సికో) ద్వయం 4–6, 5–7తో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఆస్టిన్క్రాయిసెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బాలాజీ–వరేలా మూడు ఏస్లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. సెమీఫైనల్లో ఓడిన బాలాజీ–వరేలాలకు 3470 డాలర్ల (రూ. 2 లక్షల 98 వేలు) ప్రైజ్మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
16 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
స్టాక్హోమ్ (స్వీడన్): పురుషుల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. స్విమ్ ఓపెన్ స్టాక్హోమ్ టోర్నీలో జర్మనీకి చెందిన లుకాస్ మార్టిన్ ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన లుకాస్ మార్టిన్ 400 మీటర్లను 3 నిమిషాల 39.96 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2009 నుంచి పాల్ బీడెర్మన్ (3ని:40.07 సెకన్లు; జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మార్టిన్ బద్దలు కొట్టాడు. 2009లో రోమ్లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్లో ‘సూపర్ సూట్స్’ ధరించి బీడెర్మన్ ఈ రికార్డు నెలకొల్పాడు. 2010లో ప్రపంచ స్విమ్మింగ్ సమాఖ్య ‘సూపర్ సూట్స్’ను నిషేధించింది. -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్: ధీరజ్ బృందానికి రజత పతకం
సెంట్రల్ ఫ్లోరిడా (అమెరికా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు రజత పతకం లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తరుణ్దీప్ రాయ్లతో కూడిన భారత జట్టు 1–5 సెట్ల తేడాతో లీ జాంగ్యువాన్, కావో వెన్చావో, వాంగ్ యాన్లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి సెట్లో రెండు జట్లు 54–54తో సమంగా నిలిచి చెరో పాయింట్ దక్కించుకున్నాయి. రెండో సెట్ను చైనా 58–55తో నెగ్గి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మూడో సెట్ను చైనా 55–54తో సొంతం చేసుకొని 5–1తో స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఆర్చరీ సీజన్ తొలి టోర్నీలో ఇప్పటి వరకు భారత్కు మూడు పతకాలు లభించాయి. -
చాంపియన్ మోహన్ బగాన్
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు చాంపియన్గా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో మోహన్ బగాన్ జట్టు 2–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)పై విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో ఐఎస్ఎల్ టైటిల్ కావడం విశేషం. 2024–25 లీగ్ దశలో అద్వితీయ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి లీగ్ షీల్డ్ దక్కించుకున్న మోహన్ బగాన్ జట్టు... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. తుదిపోరులో మోహన్ బగాన్ జట్టు తరఫున జాసన్ కమిన్స్ (72వ నిమిషంలో), జేమీ మెక్లారెన్ (96వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. మోహన్ బగాన్ జట్టు స్ట్రయికర్ అల్బెర్టో రోడ్రిగ్జ్ (49వ నిమిషంలో) సెల్ఫ్ గోల్తో బెంగళూరు ఖాతా తెరిచింది. మోహన్ బగాన్ ఆటగాళ్ల తప్పిదం వల్ల ఆట 49వ నిమిషంలోనే బెంగళూరు గోల్స్ ఖాతా తెరవగా... ద్వితీయార్ధంలో చెలరేగిపోయిన మోహన్ బగాన్ రెండు గోల్స్తో విజయ పతాక ఎగరవేసింది. మోహన్ బగాన్ జట్టు 20 షాట్స్ ఆడగా... అందులో ఆరింటిని ప్రత్యర్థి గోల్పోస్ట్పై సంధించగలిగింది. బెంగళూరు జట్టు 18 షాట్స్లో నాలుగింటిని ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి కొట్టింది. మ్యాచ్లో అత్యధిక శాతం బంతిని తమ నియంత్రణలో ఉంచుకోగలిగిన బెంగళూరు... ఫినిషింగ్ లోపాలతో గోల్స్ చేయలేకపోయింది. స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం బెంగళూరు విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఓవరాల్గా మ్యాచ్లో 62 శాతం బంతిని తమ ఆధినంలో ఉంచుకున్న బెంగళూరు జట్టు 512 పాస్లు కొట్టగా... 38 శాతం బంతిని నియంత్రించిన మోహన్ బగాన్ జట్టు 318 పాస్లు ఇచ్చుకుంది. పాస్ల కచ్చితత్వంలోనూ బెంగళూరు 78 శాతంతో మెరుగైన ప్రదర్శన కనబర్చగా... మోహన్ బగాన్ 65 శాతంతో వెనుకబడింది. 2022–23 సీజన్లోనూ ఈ రెండు జట్ల మధ్యే ఐఎస్ఎల్ ఫైనల్ జరగగా... అప్పుడు కూడా బెంగళూరుపై మోహన్ బగాన్ జట్టు విజయం సాధించింది. -
పంకజ్ అద్వానీకి రజత పతకం
న్యూఢిల్లీ: వరల్డ్ మ్యాచ్ప్లే బిలియర్డ్స్ చాంపియన్షిప్లో భారత దిగ్గజం పంకజ్ అద్వానీ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఐర్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పంకజ్ హోరాహోరీగా పోరాడి ఓడాడు. శనివారం జరిగిన తుదిపోరులో పంకజ్ 7–8 (100–19, 100–0, 47–100, 52–100, 100–19, 0–100, 100–49, 3–100, 100–34, 100–4, 85–100, 100–31, 53–100, 43–100, 28–100) ఫ్రేమ్ల తేడాతో ఇంగ్లండ్కు చెందిన డేవిడ్ కాసియర్ చేతిలో పరాజయం పాలయ్యాడు. బిలియర్డ్స్, స్నూకర్ క్రీడాంశాల్లో వివిధ విభాగాల్లో కలిపి 28 సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన పంకజ్... ‘బెస్ట్ ఆఫ్ 15’ పోరులో ఆరంభంలో చక్కటి ఆధిపత్యం కనబర్చినా... ఆఖర్లో పుంజుకున్న ఇంగ్లండ్ క్యూయిస్ట్ విజయం సాధించాడు. ఇక ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్షిప్లో పంకజ్ పోటీ పడనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న అద్వానీ... 2016 నుంచి ఈ టోర్నీలో వరుసగా టైటిల్స్ సాధిస్తూ వస్తున్నాడు. -
జ్యోతి సురేఖ జోడీ పసిడి గురి
సెంట్రల్ ఫ్లోరిడా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ (భారత్) జోడీ 153–151 పాయింట్ల తేడాతో హువాంగ్ ఐజు–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. తుదిపోరులో ఐదో సీడ్గా బరిలోకి దిగిన భారత జోడీ... రెండో సీడ్ చైనీస్ తైపీని వెనక్కినెడుతూ స్వర్ణం కైవసం చేసుకుంది. తొలి రెండు సిరీస్లను 37–38, 38–39తో కోల్పోయిన భారత ఆర్చర్లు... మూడో సెట్లో 39–38తో తిరిగి పోటీలోకి వచ్చారు. నాలుగో సిరీస్లో 39–36తో సునాయాసంగా నెగ్గి పసిడి పతకం చేజిక్కించుకున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని చేర్చిన అనంతరం ఈ విజయం విశ్వక్రీడల్లో భారత పతక ఆశలను మరింత పెంచింది. ఈ టోర్నీలో భారత్కు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు కాంపౌండ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు కాంస్య పతకం నెగ్గగా... రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్కు చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. -
ఒత్తిడి లేకుండా ఆడటమే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత రైఫిల్ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ‘కోటా’ను అందించిన షూటర్లలో అతనూ ఒకడు. అయితే దురదృష్టవశాత్తూ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ట్రయల్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో సందీప్ సింగ్ చేతిలో ఓడి పారిస్ ఒలింపిక్స్కు దూరమయ్యాడు. ఇది అతనిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపించింది. దాని నుంచి కోలుకోవడానికి అతనికి కొంత సమయం పట్టింది.‘ఆ సమయంలో నేను చాలా బాధపడిన మాట వాస్తవం. కొద్దిరోజుల పాటు అదే వేదనలో ఉండిపోయాను. నాకంటే ఎక్కువగా నా ఆటను దగ్గరి నుంచి చూసిన సహాయక సిబ్బంది, తల్లిదండ్రులు బాధపడ్డారు. అయితే కొద్ది రోజుల తర్వాత నేను సాధారణ స్థితికి వచ్చాను. ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ ద్వారా మాత్రమే భారత జట్టును ఎంపిక చేస్తారనేది వాస్తవమని అర్థమైంది. సెలక్టర్లను ఒప్పించేందుకు నా ప్రయత్నం నేను చేశాను కానీ నిబంధనలు ఉన్నాయి. ఏం చేస్తాం’ అని రుద్రాంక్ష్ వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత అతను మళ్లీ తన ఆటపై దృష్టి పెట్టాడు.బ్యూనస్ ఎయిర్స్లో గురువారం ముగిసిన సీజన్ తొలి వరల్డ్ కప్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకంతోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆర్య బోర్సేతో కలిసి రజతం గెలుచుకున్నాడు. మానసికంగా దృఢంగా మారేందుకు సైకాలజిస్ట్ల సహాయం కూడా తీసుకుంటున్నాడు. ‘టోర్నమెంట్లు జరిగే సమయంలో ఎలాంటి ఒత్తిడి దరి చేరనీయకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను.అలాంటి స్థితిలో నిలకడగా రాణిస్తూ నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నా. ప్రతీ రెండు నెలలకు ఒకసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. 0.1 పాయింట్ తేడాతో వెనుకబడిపోవచ్చు. ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి సాంకేతికంగానే కాకుండా మానసికంగా కూడా మెరుగ్గా ఉండటంపై దృష్టి పెట్టాలి. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్ ముందున్నాయి. నాపై నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఎంచుకున్న దారిలో నిలకడ కొనసాగిస్తే మంచి ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని బ్యూనస్ ఎయిర్స్లో వివరించాడు. -
ఎవరిదో కిరీటం?
కోల్కతా: 13 జట్లు... 162 మ్యాచ్లు... 210 రోజులు... 465 గోల్స్తో సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గత సీజన్ రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్, బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) మధ్య నేడు ఫైనల్ జరగనుంది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరుకున్న మోహన్ బగాన్ జట్టు... సొంతగడ్డపై జరగనున్న తుదిపోరులో గెలిచి రెండోసారి చాంపియన్గా నిలవాలని భావిస్తుంటే... ఇప్పటి వరకు నాలుగుసార్లు ఫైనల్కు చేరిన బెంగళూరు ఎఫ్సీ కూడా రెండోసారి టైటిల్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. 2022–23 సీజన్లో చాంపియన్గా నిలిచిన మోహన్ బగాన్ జట్టు... 2023–24 సీజన్లో రన్నరప్తో సరిపెట్టుకుంది. తాజా సీజన్ లీగ్ దశలో అదిరిపోయే ఆటతీరు కనబర్చిన మోహన్ బగాన్... ఇప్పటికే లీగ్ షీల్డ్ విన్నర్గా నిలిచింది. 2024–25 లీగ్ దశలో 24 మ్యాచ్లాడిన మోహన్ బగాన్ జట్టు 17 విజయాలు, 2 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 56 పాయింట్లు ఖాతాలో వేసుకొని ‘టేబుల్ టాపర్’గా నిలిచింది. నాకౌట్ మ్యాచ్లతో కలుపుకొని 26 మ్యాచ్ల్లో మోహన్ బగాన్ 50 గోల్స్ చేసింది. అంటే సరాసరిగా ఈ సీజన్లో మ్యాచ్కు రెండు గోల్స్ చొప్పున కొట్టింది. ఇక బెంగళూరు జట్టు గ్రూప్ దశలో 24 మ్యాచ్ల్లో 11 విజయాలు, 8 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 38 పాయింట్లు సాధించి ముందంజ వేసింది. నాకౌట్ మ్యాచ్లతో కలుపుకొని బెంగళూరు 27 మ్యాచ్ల్లో 48 గోల్స్ చేసింది. సమఉజ్జీల సమరం... దూకుడుకు మారుపేరైన ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయమే కాగా... ఈ సీజన్లో మోహన్ బగాన్ ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. బగాన్ జట్టు ప్రత్యర్థులకు 18 గోల్స్ మాత్రమే ఇచ్చుకోగా... బెంగళూరు జట్టు 33 గోల్స్ సమరి్పంచుకుంది. ఈ గణాంకాలు చాలు మోహన్ బగాన్ జట్టుపై గోల్ కొట్టడం ఎంత కష్టమో చెప్పేందుకు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఐఎస్ఎల్ ఫైనల్కు చేరిన బెంగళూరు జట్టు... 2018–19 సీజన్లో చాంపియన్గా అవతరించింది. 2017–18, 2022–23 సీజన్లలో రన్నరప్తో సరిపెట్టుకుంది. 2022–23 సీజన్లో మోహన్ బగాన్, బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ నిర్ణీత సమయంలో 2–2 గోల్స్తో ‘డ్రా’ కాగా... షూటౌట్లో మోహన్ బగాన్ జట్టు 4–3 గోల్స్ తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ఇప్పుడా పరాజయానికి బదులు తీర్చుకునేందుకు బెంగళూరుకు చక్కటి అవకాశం ఉంది. భారత స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సుభాశీష్ బోస్ కెప్టెన్సీలో మోహన్ బగాన్ బరిలోకి దిగుతోంది. ‘ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సీజన్ చాలా బాగా సాగింది. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగిస్తూ రెండోసారి ట్రోఫీ గెలుచుకోవాలని భావిస్తున్నాం. కోల్కతా నగరం మాకు రెండో ఇల్లు లాంటింది. జట్టు ప్రదర్శన బాగుంది. సొంత అభిమానుల సమక్షంలో మ్యాచ్ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. వారి అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని మోహన్ బగాన్ సారథి సుభాశీష్ బోస్ అన్నాడు. ఆడిన ఎనిమిది సీజన్లలో బెంగళూరు జట్టు నాలుగోసారి ఫైనల్కు చేరగా... ఐఎస్ఎల్ చరిత్రలో వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన తొలి జట్టుగా మోహన్ బగాన్ నిలిచింది. మోహన్ బగాన్ తరఫున అల్బెర్టో రోడ్రిగ్స్, లిస్టన్ కొలాకో, అనిరుధ్ థాపా, సుభాశీష్ కీలకం కానుండగా... బెంగళూరు జట్టు గోల్కీపర్ గుర్ప్రీత్సింగ్ సంధు, చింగ్లెన్సనా సింగ్, అల్బెర్టో నొగురె, ఎడ్గర్ మెండెజ్పై భారీ ఆశలు పెట్టుకుంది. -
సింధు ఇంటికి...
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్ సింగిల్స్ విభాగం నుంచి భారత క్రీడాకారులు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్వన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి చవిచూశారు. గతంలో రెండుసార్లు ఈ టోర్నీలో కాంస్య పతకాలు సాధించిన సింధు ఈసారి మాత్రం నిరాశపరిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ సింధు 12–21, 21–16, 16–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, తన చిరకాల ప్రత్యర్థి అకానె యామగుచి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ కోల్పోయినా, వెంటనే తేరుకొని రెండో గేమ్లో నెగ్గి మ్యాచ్లో నిలిచింది. గతంలో 14 సార్లు అకానె యామగుచిపై నెగ్గిన సింధుకు నిర్ణాయక మూడో గేమ్లో గట్టిపోటీ లభించింది. కీలకదశలో యామగుచి పైచేయి సాధించి సింధుపై 12వ సారి విజయాన్ని అందుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ప్రియాన్షు 14–21, 17–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో, కిరణ్ జార్జి 21–19, 13–21, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ పతకానికి విజయం దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ కపిల జంట 12–21, 21–16, 21–18తో యె హాంగ్ వె–నికోల్ గొంజాలెస్ చాన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఐదో సీడ్ చున్ మాన్ టాంగ్–యింగ్ సుయెట్ సె (హాంకాంగ్) జోడీతో నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ గెలిస్తే సెమీఫైనల్కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంటారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అశిత్ సూర్య–అమృత (భారత్) జంట 11–21, 14–21తో టాప్ సీడ్ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రూబన్ కుమార్–హరిహరన్ (భారత్) జంట 15–21, 14–21తో ఆరోన్ చియా–వుయ్ యిక్ సో (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
రష్మిక ‘హ్యాట్రిక్’
పుణే: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల టీమ్ టోర్నీలో అదరగొడుతోంది. ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా గురువారం హాంకాంగ్తో జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో భారత జట్టు 2–1తో గెలుపొందింది. ఈ టోర్నీలో భారత్కిది రెండో విజయం. హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో భారత్ సింగిల్స్లో ఒక మార్పు చేసింది. న్యూజిలాండ్, థాయ్లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ల్లో బరిలోకి దిగిన హైదరాబాద్ ప్లేయర్ సహజ యామలపల్లి స్థానంలో గుజరాత్కు చెందిన వైదేహి చౌధరీకి అవకాశం ఇచ్చారు. తొలి మ్యాచ్లో పోటీపడ్డ వైదేహి 2 గంటల 3 నిమిషాల్లో 7–6 (10/8), 6–1తో హో చింగ్ వుపై గెలిచి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్లో బరిలోకి దిగిన శ్రీవల్లి రష్మిక 7–6 (8/6), 2–6, 6–3తో హాంగ్ యి కొడీ వోంగ్ను ఓడించి భారత్కు 2–0తో విజయాన్ని ఖరారు చేసింది. 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఎనిమిది ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వ్లో 43 పాయింట్లు సాధించిన రష్మిక రెండో సర్వ్లో 14 పాయింట్లు సంపాదించింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయిన రష్మిక, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో, థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా రష్మిక సింగిల్స్లో విజయం అందుకుంది. ఫలితం తేలిపోవడంతో నామమాత్రమైన మూడో మ్యాచ్లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే (భారత్) జోడీ పోరాడినా చివరకు విజయానికి దూరమైంది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన డబుల్స్ మ్యాచ్లో అంకిత–ప్రార్థన ద్వయం 7–6 (7/2), 3–6, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో యుడైస్ చోంగ్–హాంగ్ యి కొడీ వోంగ్ జంట చేతిలో ఓడిపోయింది. -
వినేశ్కు రూ. 4 కోట్ల ప్రైజ్మనీ
చండీగఢ్: పారిస్ ఒలింపిక్స్లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు బహుమతి అందించనుంది. 2024 విశ్వక్రీడల మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్కు చేరగా... తుదిపోరుకు ముందు నిబంధనల విరుద్ధంగా నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో వినేశ్ పారిస్ ఒలింపిక్స్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. తదనంతర పరిణామాల మధ్య రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో చేరిన వినేశ్... హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. కాగా... ఒలింపిక్స్ ఫైనల్ చేరిన వినేశ్ను రజత పతకం గెలిచిన ప్లేయర్గానే భావిస్తామని గతంలోనే హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్లే ఆమెకు పురస్కారం అందిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం వినేశ్కు 3 ఆఫర్లు కేటాయించగా... అందులో వినేశ్ రూ. 4 కోట్ల నగదు బహుమతిని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖకు ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఒలింపిక్స్లో రజతం గెలిచిన అథ్లెట్లకు హరియాణా ప్రభుత్వం... రూ. 4 కోట్ల ప్రైజ్మనీ, గ్రూప్–1 ఉద్యోగం, షెహ్రీ వికాస్ ప్రాధికారణ్ ఇంటి స్థలం రూపంలో మూడు ఆఫర్లను ప్రకటించడం ఆనవాయితీ. అందులో అథ్లెట్లు ఎంపిక చేసుకున్న దాన్ని వారికి కేటాయిస్తారు. మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వినేశ్ ఈ అంశాన్ని గుర్తుచేసింది. ‘వినేశ్ దేశానికి గర్వకారణం అని ముఖ్యమంత్రి గతంలో అన్నారు. రజత పతక విజేతతో సమానంగా సత్కరిస్తామని మాటిచ్చారు. డబ్బు ముఖ్యం కాదు... కానీ ఇది గౌరవానికి సంబంధించిన విషయం. ఇప్పటి వరకు సీఎం హామీ నెరవేరలేదు’ అని వినేశ్ పేర్కొంది. దీంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నగదు పురస్కారం ఇవ్వాలని నిర్ణయించింది. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
మోంటెకార్లో (మొనాకో): భారత టెన్నిస్ డబుల్స్ దిగ్గజ ప్లేయర్ రోహన్ బోపన్న మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్టన్తో జత కట్టి ఈ టోర్నీలో బరిలోకి దిగిన బోపన్న ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సిమోన్ బొలెలీ–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీకి షాక్ ఇచ్చాడు. 96 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న–షెల్టన్ ద్వయం 2–6, 7–6 (7/4), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో బొలెలీ–వావాసోరి జోడీని బోల్తా కొట్టించింది. మూడు ఏస్లు సంధించిన బోపన్న–షెల్టన్ ఐదు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయిన ఈ ఇండో–అమెరికన్ జంట ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో మాన్యుయెల్ గినార్డ్ (ఫ్రాన్స్)–రొమైన్ అర్నియోడో (మొనాకో)లతో బోపన్న–షెల్టన్ తలపడతారు. ఈ ఏడాది ఏడో టోర్నీలో ఆడుతున్న బోపన్న ప్రస్తుతం మోంటెకార్లో ఓపెన్లో, దోహా ఓపెన్లో మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. సాకేత్–రామ్కుమార్ జంట పరాజయం సాక్షి, హైదరాబాద్: మాడ్రిడ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని, హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్, భారత ప్లేయర్ సిద్ధాంత్ బంతియా వేర్వేరు భాగస్వాములతో ఈ టోర్నీలో పోటీపడ్డారు. స్పెయిన్లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జంట 2–6, 4–6తో మూడో సీడ్ ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–లుకాస్ మిడ్లెర్ (ఆ్రస్టియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మరో క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ (భారత్)–డేవిడ్ వేగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ 4–6, 2–6తో ఇనిగో సెర్వాంటెస్ (స్పెయిన్)–డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్) జంట చేతిలో పరాజయం పాలైంది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సిద్ధాంత్ బంతియా (భారత్)–అలెగ్జాండర్ డాన్స్కీ (బల్గేరియా) ద్వయం 6–7 (2/7), 6–7 (4/7)తో ఒర్లాండో లుజ్ (బ్రెజిల్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాకేత్, అనిరుధ్, సిద్ధాంత్ జోడీలకు 1,470 యూరోల (రూ. 1 లక్ష 42 వేలు) చొప్పున ప్రైజ్మనీతోపాటు 20 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రిత్విక్ ద్వయం శుభారంభం3మెక్సికో సిటీ: భారత పురుషుల టెన్నిస్ డబుల్స్ నాలుగో ర్యాంకర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ మెక్సికో సిటీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ రిత్విక్ (భారత్)–నికోలస్ బరియంతోస్ (కొలంబియా) ద్వయం 3–6, 6–3, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో రే హో (చైనీస్ తైపీ)–క్రిస్టోఫర్ రొమియోస్ (ఆ్రస్టేలియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–బరియంతోస్ ద్వయం రెండు ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వ్లో 38 పాయింట్లకుగాను 29 పాయింట్లు, రెండో సర్వ్లో 24 పాయింట్లకుగాను 11 పాయింట్లు సాధించింది. -
ఒలింపిక్స్లో ఆరు క్రికెట్ జట్లు
న్యూఢిల్లీ: లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ క్రీడాంశంపై మరింత స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో ఆరు, మహిళల విభాగంలో ఆరు దేశాలకు చెందిన క్రికెట్ జట్లు బరిలోకి దిగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. టీమ్లో 15 మంది చొప్పున ఒక్కో విభాగంలో 90 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ తర్వాత 128 ఏళ్లకు మళ్లీ ఒలింపిక్స్లో క్రికెట్కు అవకాశం దక్కింది. మ్యాచ్లన్నీ టి20 ఫార్మాట్లోనే జరగనున్నాయి. అయితే ఏ ఆరు జట్లు పాల్గొంటాయనే విషయంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో పూర్తి స్థాయి సభ్యదేశం కాకపోయినా... ఆతిథ్య జట్టుగా అమెరికాకు క్రికెట్ పోరులో అవకాశం దక్కడం ఖాయం. అంటే మరో ఐదు జట్లు మాత్రమే ఒలింపిక్స్కు అర్హత సాధించవచ్చు. ఏదైనా కటాఫ్ తేదీని నిర్ణయించి ఆ సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–5లో ఉన్న జట్లను ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వెస్టిండీస్ టీమ్ అర్హత సాధిస్తే ఏ దేశం బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. క్రికెట్లో వెస్టిండీస్ పేరుతో కరీబియన్ ద్వీపంలోని వేర్వేరు దేశాలు కలిసి ఆడుతున్నాయి. సాధారణంగా ఒలింపిక్స్లో మాత్రం ఈ దేశాలన్నీ విడిగా పోటీ పడతాయి. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు నిర్వహించినప్పుడు బార్బడోస్ టీమ్ ప్రాతినిధ్యం వహించింది. విండీస్ రీజియన్ పోటీల్లో విజేతగా నిలవడంతో ఆ జట్టుకు అవకాశం లభించింది. మొత్తం 351 మెడల్ ఈవెంట్లు... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు మరో నాలుగు కొత్త క్రీడాంశాలకు చోటు లభించింది. బేస్బాల్/ సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్, లాక్రోస్లను కొత్తగా చేర్చారు. పారిస్ ఒలింపిక్స్లో మొత్తం 329 మెడల్ ఈవెంట్లు ఉండగా... ఇప్పుడు మరో 22 జత కలవడంతో ఈ సంఖ్య 351కి చేరింది. స్విమ్మింగ్లో గరిష్టంగా 41 పతకాలు అందుబాటులో ఉన్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి పురుష అథ్లెట్ల సంఖ్య (5,167)తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో మహిళా అథ్లెట్లు (5,333) బరిలోకి దిగనున్నారు.ఫుట్బాల్లో 12 పురుష జట్లు ఉంటే 16 మహిళా టీమ్లు ఉంటాయి. గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, కాంపౌండ్ ఆర్చరీలలో తొలిసారి మిక్స్డ్ టీమ్లు ఉండబోతున్నాయి. అథ్లెటిక్స్లో కూడా మొదటిసారి 4్ఠ100 మిక్స్డ్ రిలే ఈవెంట్ను చేర్చారు. ఓవరాల్గా అథ్లెట్ల సంఖ్య మాత్రం ఎప్పటిలాగే 10,500 ఉండనుంది. -
పసిడి పతక పోరుకు ధీరజ్ బృందం
ఫ్లోరిడా (అమెరికా): ప్రపంచకప్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో ధీరజ్, తరుణ్దీప్ రాయ్, అతాను దాస్లతో కూడిన భారత జట్టు 6–2 (54–54, 55–54, 56–56, 56–53) సెట్ పాయింట్ల తేడాతో పాబ్లో అచా, ఆండ్రెస్ టెమినో, జేవియర్ మెరీడాలతో కూడిన స్పెయిన్ జట్టును ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్లో భారత్ 6–2 సెట్ పాయింట్ల తేడాతో బ్రెజిల్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 6–2 సెట్ పాయింట్ల తేడాతోనే ఇండోనేసియా జట్టుపై గెలిచింది. మరోవైపు దీపిక కుమారి, అంకిత, అన్షికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు క్వార్టర్ ఫైనల్లో 2–6 సెట్ పాయింట్ల తేడాతో అమెరికా జట్టు చేతిలో ఓడిపోయింది. -
సింధు శుభారంభం
నింగ్బో (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ సింధు 21–15, 21–19తో ప్రపంచ 36వ ర్యాంకర్ ఎస్తర్ నురుమి వొర్డోయో (ఇండోనేసియా)పై గెలిచింది. 44 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్ల్లో విజృంభించిన సింధు... 19 ఏళ్ల ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–11తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. ఇతర మ్యాచ్ల్లో ఆకర్షి కశ్యప్, అనుపమ, మాళవిక ఓటమి పాలై ఇంటిదారి పట్టారు. ఆకర్షి 13–21, 7–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యూ (చైనా) చేతిలో... అనుపమ 13–21, 14–21తో ప్రపంచ 13వ ర్యాంకర్ రచనోక్ ఇంతనోన్ (థాయ్లాండ్) చేతిలో... మాళవిక 14–21, 8–21తో గావ్ ఫెంగ్ జై (చైనా) చేతిలో ఓడారు. ప్రిక్వార్టర్స్లో కిరణ్, ప్రియాన్షు... పురుషుల సింగిల్స్లో భారత స్టార్ ఆటగాళ్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే పరాజయం పాలవగా... కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. తొలి రౌండ్లో లక్ష్యసేన్ 18–21, 10–21తో లీ చయ్ హౌ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రణయ్ 16–21, 21–12, 11–21తో జూ గువాంగ్ లూ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్ జార్జి 21–16, 21–8తో దిమిత్రి పనారిన్ (కజకిస్తాన్)పై, ప్రియాన్షు 20–22, 21–12, 21–10తో వాంగ్చరోయెన్ (థాయ్లాండ్)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్లో ప్రియా–శ్రుతి మిశ్రా జోడీ 11–21, 13–21తో షూ యెన్ సంగ్–చైన్ హుయి యూ (చైనా) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్లో హరిహరన్–రూబన్ ద్వయం 21–3, 21–12తో మధుక దులంజన–లహిరు వీరసింఘే (శ్రీలంక) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించగా... పృథ్వీ–సాయి ప్రతీక్ జంట 19–21, 12–21తో చై సియాంగ్ చైవాంగ్ చీ లిన్ (చైనా) ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి ని్రష్కమించింది. -
రష్మిక అదుర్స్
పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో తొలి విజయం చేరింది. తొలి రోజు మంగళవారం న్యూజిలాండ్ చేతిలో 1–2తో ఓడిపోయిన భారత్ వెంటనే తేరుకుంది. బుధవారం థాయ్లాండ్ జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 2–1తో గెలుపొందింది. భారత్కు తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక థాయ్లాండ్తో మ్యాచ్లోనూ శుభారంభం అందించింది. ప్రపంచ 170వ ర్యాంకర్ లానియానా తారారుడి (థాయ్లాండ్)తో జరిగిన తొలి సింగిల్స్లో ప్రపంచ 345వ ర్యాంకర్ రష్మిక 6–2, 6–4తో సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక నాలుగు ఏస్లు సంధించింది. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రెండో మ్యాచ్లో భారత్కు నిరాశ ఎదురైంది. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి మూడో సెట్లో గాయం కారణంగా వైదొలిగింది. మనాన్చాయ (థాయ్లాండ్)తో జరిగిన మ్యాచ్లో సహజ తొలి సెట్ను 3–6తో కోల్పోయింది. రెండో సెట్ను టైబ్రేక్లో 7–6 (7/3)తో సొంతం చేసుకుంది. మూడో సెట్లో సహజ 0–1తో వెనుకబడిన దశలో గాయం కారణంగా ఆమె తప్పుకుంది. ఫలితంగా థాయ్లాండ్ స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక మూడో మ్యాచ్లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం సత్తా చాటుకుంది. పీంగ్టార్న్–పట్చారిన్ (థాయ్లాండ్) ద్వయంతో జరిగిన డబుల్స్ మ్యాచ్లో అంకిత–ప్రార్థన 7–6 (7/3), 3–6, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో గెలిచి భారత్కు 2–1తో విజయాన్ని ఖరారు చేసింది. -
ఆర్య–రుద్రాంక్ష్ జోడీకి రజతం
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్కు ఏడో పతకం లభించింది. బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆర్య బోర్సే–రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ జోడీ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆర్య–రుద్రాంక్ష్ ద్వయం 9–17 పాయింట్ల తేడాతో జిఫె వాంగ్–బుహాన్ సాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. కాంస్య పతక మ్యాచ్లో నర్మద నితిన్ రాజు–అర్జున్ బబూటా (భారత్) జంట 13–17 పాయింట్ల తేడాతో ఫెర్నాండా రుసో–మార్సెలో జూలియన్ గిటిరెజ్ (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లు నిరాశపరిచారు. నీరూ 115 పాయింట్లతో 12వ స్థానంలో, ప్రగతి దూబే 110 పాయింట్లతో 17వ స్థానంలో, భవ్య త్రిపాఠి 106 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచారు. పురుషుల ట్రాప్ ఈవెంట్లోనూ భారత షూటర్లెవరూ ఫైనల్ చేరలేకపోయారు. జొరావర్ సింగ్ సంధూ 119 పాయింట్లతో ఏడో స్థానంలో, పృథ్వీరాజ్ 117 పాయింట్లతో 16వ స్థానంలో, లక్షయ్ 115 పాయింట్లతో 21వ స్థానంలో నిలిచారు. టాప్–6లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్కు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఏడు పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
భారత ఆర్చరీ జట్టుకు కాంస్యం
ఫ్లోరిడా (అమెరికా): అంతర్జాతీయ ఆర్చరీ కొత్త సీజన్ను భారత పురుషుల కాంపౌండ్ జట్టు కాంస్య పతకంతో ప్రారంభించింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్ దేవ్తలేలతో కూడిన భారత జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్లో అభిషేక్, రిషభ్, ఓజస్ త్రయం 230–224 పాయింట్ల తేడాతో మథియాస్ ఫులర్టన్, రస్ముస్ బ్రామ్సెన్, మార్టిన్ డామ్స్బోలతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ ‘షూట్ ఆఫ్’లో 219–219 (27–29) స్కోరుతో ఇటలీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. జ్యోతి సురేఖ మాత్రమే... మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ మాత్రమే ఈ టోర్నీలో ఆడుతోంది. ఇతర భారత క్రీడాకారిణులకు వీసా రాకపోవడంతో టీమ్ విభాగంలో భారత్ పతకావకాశాలు దెబ్బతిన్నాయి. క్వాలిఫయింగ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ 691 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచింది. తొలి రౌండ్లో చిలీకి చెందిన ఒలియా ప్రాడోతో జ్యోతి సురేఖ ఆడుతుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రిషభ్ యాదవ్–జ్యోతి సురేఖ జోడీ పోటీపడుతుంది.లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కాంపౌండ్ ఈవెంట్ 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆర్చరీ క్రీడాంశంలో కొత్తగా కాంపౌండ్ ఈవెంట్ను జత చేశారు. ప్రస్తుతం ఒలింపిక్స్లో ఆర్చరీ క్రీడాంశంలో రికర్వ్ కేటగిరీలో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నారు. రికర్వ్ విభాగంలో ఐదు ఈవెంట్స్లో (పురుషుల, మహిళల వ్యక్తిగత, టీమ్, మిక్స్డ్) పతకాలు అందజేస్తున్నారు. తాజాగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ను కొత్తగా మెడల్ ఈవెంట్గా ప్రవేశ పెట్టనున్నారని వరల్డ్ ఆర్చరీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కాంపౌండ్ ఈవెంట్ను ఒలింపిక్స్లో చేర్చడంతో ఈ విభాగంలో భారత స్టార్స్ జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మల నుంచి ఒలింపిక్ పతకాన్ని ఆశించవచ్చు. -
Suruchi- Vijayveer: డబుల్ ధమాకా
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో మంగళవారం భారత షూటర్లు అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతో సత్తా చాటుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 18 ఏళ్ల సురుచి ఇందర్ సింగ్... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 244.6 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి చైనా ద్వయం కియాన్ వె 241.9 పాయింట్లతో రజతం దక్కించుకోగా... డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ జియాంగ్ రాన్జిన్ 221 పాయింట్లతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 41 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లోనూ సురుచి తన ఆధిపత్యం చాటుకుంది. సురుచి 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో నిలిచింది. భారత స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన మనూ భాకర్ నిరాశపరిచింది. మనూ 574 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానంతో సంతృప్తి పడి ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. భారత్కే చెందిన మరో షూటర్ సయం 572 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచింది. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో విజయ్వీర్ సిద్ధూ 29 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలో 22 ఏళ్ల విజయ్వీర్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలవడం ఇదే తొలిసారి. రికియార్డో మజెట్టి (ఇటలీ; 28 పాయింట్లు) రజతం నెగ్గగా... యాంగ్ యుహావో (చైనా; 23 పాయింట్లు) కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 24 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ ఈవెంట్లో విజయ్వీర్ 579 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. భారత్కే చెందిన గుర్ప్రీత్ సింగ్ 575 పాయింట్లతో 10వ స్థానంలో, అనీశ్ 570 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో కలిపి మొత్తం 6 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
ఓటమితో మొదలు
పుణే: సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్కు శుభారంభం లభించలేదు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్లో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 1–2తో ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ జట్టులో ప్రపంచ 245వ ర్యాంకర్ లులు సన్ సింగిల్స్ మ్యాచ్తోపాటు డబుల్స్లోనూ బరిలోకి దిగి తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. తొలి మ్యాచ్లో హైదరాబాద్ అమ్మాయి, ప్రపంచ 345వ ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 6–1, 6–1తో ఐశి దాస్ (న్యూజిలాండ్)పై అలవోకగా గెలిచింది. దాంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కేవలం 57 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రష్మిక కేవలం రెండు గేమ్లు కోల్పోయింది. ఆరు ఏస్లు సంధించిన రష్మిక నాలుగు డబుల్ ఫాల్ట్లు కూడా చేసింది. తొలి సర్వ్లో 20 పాయింట్లు నెగ్గిన రష్మిక రెండో సర్వ్లో తొమ్మిది పాయింట్లు సాధించింది. తన సర్వీస్ను ఒక్కసారి కూడా చేజార్చుకోని రష్మిక ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేయడం విశేషం. రెండో మ్యాచ్లో గెలిస్తే భారత్ 2–0తో విజయాన్ని ఖాయం చేసుకునేది. కానీ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ లులు సన్ 6–3, 6–3తో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లిని ఓడించింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ తన సర్వీస్ను మూడుసార్లు చేజార్చుకుంది. ఆరు ఏస్లు సంధించిన లులు సన్ రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. స్కోరు 1–1తో సమం కావడంతో చివరిదైన డబుల్స్ మ్యాచ్ కీలకంగా మారింది. సింగిల్స్లో భారత నంబర్వన్ అంకిత రైనా, డబుల్స్లో భారత నంబర్వన్ ప్రార్థన తొంబారే జత కట్టి ఈ మ్యాచ్లో బరిలోకి దిగారు. అయినప్పటికీ భారత్కు ఓటమి తప్పలేదు. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అంకిత–ప్రార్థన ద్వయం 3–6, 4–6తో లులు సన్–మోనిక్యూ బ్యారీ జోడీ చేతిలో ఓడిపోవడంతో న్యూజిలాండ్ 2–1తో విజయాన్ని అందుకుంది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో థాయ్లాండ్తో భారత్ ఆడుతుంది. -
‘ప్లే ఆఫ్’ బెర్త్ లక్ష్యంగా...
పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ (Billie Jean King Cup) ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ కోసం భారత జట్టు సిద్ధమైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు పుణే వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా భారత టెన్నిస్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. తెలుగమ్మాయిలు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పాటు అంకితా రైనా, వైదేహి, ప్రార్థన తొంబారేలతో కూడిన మన జట్టు ముమ్మర సాధన చేస్తోంది. ఇటీవల ముంబై డబ్ల్యూటీఏ టోర్నమెంట్ సెమీఫైనల్కు చేరిన యువ సంచలనం మాయా రాజేశ్వరన్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైంది. రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నమెంట్లో భారత్తో పాటు న్యూజిలాండ్, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా, థాయ్లాండ్, హాంకాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. గతేడాది మూడో స్థానంలో నిలవడం ద్వారా వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందలేకపోయిన భారత జట్టు ఈసారి ఆ అవాంతరాలను అధిగమించాలని పట్టుదలతో ఉంది.‘ప్రస్తుతానికి మా లక్ష్యం ప్లేయర్లను శారీరకంగా, మానసికంగా తాజాగా ఉంచడమే. ఈ వారం చాలా ముఖ్యమైంది. ఫిట్గా ఉంటేనే కోర్ట్లో చురుగ్గా కదలగలరు’ అని భారత కెప్టెన్ విశాల్ ఉప్పల్ పేర్కొన్నాడు. టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డైరెక్టర్ సుందర్ అయ్యర్ పేర్కొన్నారు. ప్రేక్షకులను ఉచితంగా అనుమతించనున్నట్లు వెల్లడించిన సుందర్ అయ్యర్... టోర్నీకి ‘సుహానా’ గ్రూప్ స్పాన్సర్గా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఐటా, ఐటీఎఫ్ మహారాష్ట్ర టెన్నిస్ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీని డీడీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. -
విజేత పెగూలా.. ఎనిమిదో టైటిల్
చార్ల్స్టన్ : అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తన కెరీర్లో ఎనిమిదో సింగిల్స్ టైటిల్ను సాధించింది. చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో పెగూలా చాంపియన్గా అవతరించింది. అమెరికాకే చెందిన సోఫియా కెనిన్తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పెగూలా 6–3, 7–5తో గెలుపొందింది. ఈ సీజన్లోని పెగూలాకిది రెండో టైటిల్. ఈ విజయంతో పెగూలా తన కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్ను అందుకుంది. విజేతగా నిలిచిన పెగూలాకు 1,64,000 డాలర్ల (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మెయిన్ ‘డ్రా’కు నగాల్ అర్హత మోంజా (ఇటలీ): భారత పురుషుల టెన్నిస్ సింగిల్స్ నంబర్వన్ సుమిత్ నగాల్ మోంజా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఫెడరికో ఇనాకోన్ (ఇటలీ)తో సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో సుమిత్ నగాల్ 6–4, 6–2తో గెలుపొంది మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నగాల్ తన ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్లో నగాల్ 5–7, 7–6 (7/2), 6–2తో ఎర్గీ కిర్కిన్ (టర్కీ)పై గెలుపొందాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఆస్ట్రియా ప్లేయర్ ఫిలిప్ మిసోలిచ్తో సుమిత్ ఆడతాడు. 28వ ర్యాంక్లో యూకీ బాంబ్రీ సోమవారం విడుదల చేసిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో యూకీ బాంబ్రీ భారత నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. యూకీ రెండు స్థానాలు పడిపోయి 28వ ర్యాంక్లో నిలిచాడు. ఆరేళ్లుగా డబుల్స్లో భారత నంబర్వన్గా ఉన్న రోహన్ బోపన్న గతవారం టాప్ ర్యాంక్ను యూకీకి కోల్పోయాడు. ప్రస్తుతం బోపన్న 43వ స్థానంలో ఉన్నాడు. -
సింధుపైనే మరోసారి ఆశలు
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్ పోటీలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్లుంటాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుపైనే భారత్ పతకావకాశాలు ఆధారపడి ఉన్నాయి.తొలి రౌండ్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ఎస్టెర్ వర్దోయో (ఇండోనేసియా)తో సింధు ఆడనుంది. ఈ టోర్నీ చరిత్రలో సింధు రెండుసార్లు (2014, 2022) కాంస్య పతకాలు సాధించింది. భారత్కే చెందిన సైనా నెహా్వల్ అత్యధికంగా మూడు కాంస్య పతకాలు గెలిచింది. ఈసారీ సింధు కాంస్యం నెగ్గితే సైనా రికార్డును సమం చేస్తుంది. 63 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్లో భారత్ నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ చేరుకోలేకపోయారు. సింధుతోపాటు భారత్ తరఫున మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్, అనుపమ, ఆకర్షి కశ్యప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పురుషుల సింగిల్స్లో భారత్ తరఫున లక్ష్య సేన్, ప్రణయ్, ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జి బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం; మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. -
ఐ–లీగ్ చాంపియన్ చర్చిల్ బ్రదర్స్ఎఫ్సీ
న్యూఢిల్లీ: ఐ–లీగ్ 2024–2025 సీజన్లో గోవాకు చెందిన చర్చిల్ బ్రదర్స్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ‘టాప్’ ర్యాంక్లో నిలిచింది. రియల్ కశ్మీర్ ఫుట్బాల్ క్లబ్తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ను 1–1 గోల్స్తో ‘డ్రా’ చేసుకున్న చర్చిల్ బ్రదర్స్ జట్టు 40 పాయింట్లతో అగ్రస్థానంతో లీగ్ను ముగించింది. తాజా సీజన్లో 22 మ్యాచ్లాడిన చర్చిల్ బ్రదర్స్ జట్టు 11 విజయాలు, 4 పరాజయాలు, 7 ‘డ్రా’లు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో మొత్తం 45 గోల్స్ చేసిన ఆ జట్టు... ప్రత్యర్థులకు 25 గోల్స్ ఇచ్చుకుంది. శ్రీనగర్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో చర్చిల్ బ్రదర్స్ జట్టు తరఫున రఫీఖ్ అమిను (50వ నిమిషంలో) ఏకైక గోల్ కొట్టగా... రియల్ కశ్మీర్ జట్టు తరఫున రామ్సంగ ట్లైచున్ (8వ నిమిషంలో) గోల్ చేశాడు. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్లో ఇంటర్ కాశీ జట్టు 3–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. ఈ సీజన్లో ఇంటర్ కాశీ జట్టు 22 మ్యాచ్లాడి 11 విజయాలు, 5 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 39 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయంపై ఉత్కంఠ ఐ–లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే అర్హత సాధిస్తుంది. ప్రస్తుతానికి చర్చిల్ బ్రదర్ జట్టు ‘టాప్’లో ఉన్నప్పటికీ... సీజన్లో భాగంగా జనవరి 13న నామ్ధారి స్పోర్ట్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో అర్హత లేని ఆటగాడిని బరిలోకి దింపారని ఇంటర్ కాశీ జట్టు ఆరోపించింది. ఈ అంశంపై అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఈ నెల 28న విచారణ చేపట్టనుంది. ఒకవేళ నిర్ణయం ఇంటర్ కాశీకి అనుకూలంగా వస్తే... మరో 3 పాయింట్లు వారి ఖాతాలో చేరనున్నాయి. అప్పుడు ఆ జట్టు 42 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానికి చేరనుంది. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్లో డెంపో స్పోర్ట్స్ క్లబ్ 4–3 గోల్స్ తేడాతో గోకులం కేరళ జట్టుపై గెలుపొందింది. శ్రీనిధి డెక్కన్ జట్టుకు తొమ్మిదో స్థానం మొత్తం 12 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్లో 22 మ్యాచ్లాడిన శ్రీనిధి జట్టు 7 విజయాలు, 8 పరాజయాలు, 7 ‘డ్రా’లతో 28 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 2021–2022 సీజన్లో మూడో స్థానం, 2022–2023 సీజన్లో రెండో స్థానం, 2023–2024 సీజన్లో రెండో స్థానం పొందిన శ్రీనిధి డెక్కన్ జట్టు ఈసారి మాత్రం నిరాశపరిచింది. -
వెల్డన్ వెర్స్టాపెన్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ తాజా సీజన్లో తొలి రెండు రేసుల్లో మెక్లారెన్ ఇద్దరు డ్రైవర్లను దాటి ముందుకెళ్లడంలో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ సఫలం కాలేకపోయాడు. కానీ మూడో రేసులో మాత్రం వెర్స్టాపెన్ జోరును అడ్డుకోవడంలో మెక్లారెన్ ఇద్దరు డ్రైవర్లు విఫలమయ్యారు. వెరసి ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లోని మూడో రేసులోనూ మూడో విజేత అవతరించాడు. సీజన్ మొదటి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్... సీజన్ రెండో రేసు చైనా గ్రాండ్ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి టైటిల్స్ సాధించారు. ఆదివారం జరిగిన సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్ప్రిలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ పూర్తి ఆధిపత్యం చలాయించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తనకెంతో కలిసొచ్చిన సుజుకా సర్క్యూట్లో వరుసగా నాలుగో ఏడాది జపాన్ గ్రాండ్ప్రి టైటిల్ను దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 53 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 22 నిమిషాల 06.983 సెకన్లలో ముగించి చాంపియన్గా నిలిచాడు. 2022, 2023, 2024 జపాన్ గ్రాండ్ప్రి రేసుల్లో వెర్స్టాపెన్కే అగ్రస్థానం దక్కింది. మెక్లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్ రెండో స్థానంలో, ఆస్కార్ పియాస్ట్రి మూడో స్థానంలో నిలిచారు. రెడ్బుల్ తరఫున తొలిసారి ప్రధాన డ్రైవర్గా వ్యవహరించిన జపాన్కు చెందిన యుకీ సునోడా 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత సీజన్లో ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టి ఆ తర్వాత వెనుకబడిపోయిన వెర్స్టాపెన్కు ఈ ఏడాది తొలి రెండు రేసుల్లో మెక్లారెన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. దాంతో వెర్స్టాపెన్ ఆ్రస్టేలియా గ్రాండ్ప్రిలో రెండో స్థానంలో, చైనా గ్రాండ్ప్రిలో నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ గత నాలుగేళ్లు ఫార్ములావన్లో ఓవరాల్ టైటిల్ సాధించిన వెర్స్టాపెన్ మూడో రేసులో మాత్రం వెనుకంజ వేయలేదు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన అతను దూసుకుపోయాడు. ఒక్కసారి వెర్స్టాపెన్ ఆధిక్యంలోకి వెళితే అతడిని ఓవర్టేక్ చేయడం కష్టంతో కూడుకున్నదని మెక్లారెన్ డ్రైవర్లకు తెలుసు. జపాన్ గ్రాండ్ప్రిలో అదే జరిగింది. మొదట్లోనే ఆధిక్యంలోకి వెళ్లిన వెర్స్టాపెన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యంలో కొనసాగి రెండు సెకన్ల తేడాతో విజేతగా నిలిచాడు. పాయింట్ తేడానే... 24 రేసులతో కూడిన తాజా సీజన్లో మూడు రేసులు ముగిశాక లాండో నోరిస్ 62 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 61 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడా ఒక్క పాయింట్ మాత్రమే ఉండటం గమనార్హం. సీజన్లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్ప్రి ఈనెల 13న జరుగుతుంది. 64 ఫార్ములావన్ చరిత్రలో వెర్స్టాపెన్ సాధించిన విజయాలు. అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్ల జాబితాలో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నాడు. లూయిస్ హామిల్టన్ (105), మైకేల్ షుమాకర్ (91) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 4 రెండు వేర్వేరు గ్రాండ్ప్రి రేసులను వరుసగా నాలుగేళ్ల పాటు సాధించిన నాలుగో డ్రైవర్గా వెర్స్టాపెన్ గుర్తింపు పొందాడు. వెర్స్టాపెన్ అబుదాబి (2020, 2021, 2022, 2023), జపాన్ గ్రాండ్ప్రి (2022, 2023, 2024, 2025) రేసులలో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో జిమ్ క్లార్క్ (బెల్జియం గ్రాండ్ప్రి; బ్రిటన్ గ్రాండ్ప్రి 1962–1965), మైకేల్ షుమాకర్ (స్పెయిన్ గ్రాండ్ప్రి 2001–2004; యూఎస్ఏ గ్రాండ్ప్రి 2003–2005), లూయిస్ హామిల్టన్ (బ్రిటన్ గ్రాండ్ప్రి 2001–2004; యూఎస్ఏ గ్రాండ్ప్రి 2014–2017) కూడా ఉన్నారు. -
రుద్రాంక్ష్ పాటిల్ ‘పసిడి’ గురి
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్కు రెండో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల రుద్రాంక్ష్ 252.9 పాయింట్ల స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మార్టన్ పెనీ (హంగేరి; 251.7 పాయింట్లు) రజతం, జూలియన్ గుటిరెజ్ (అర్జెంటీనా; 230.1 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఫైనల్లో పోటీపడ్డ మరో భారత షూటర్ అర్జున్ బబూటా 144.9 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 47 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ రౌండ్లో అర్జున్ 643.5 పాయింట్లతో టాప్ ర్యాంక్లో, రుద్రాంక్ష్ 633.7 పాయింట్లతో రెండో ర్యాంక్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో పోటీపడతారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచి నాలుగు పతకాలతో రెండో స్థానంలో ఉంది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో రుద్రాంక్ష్ కిది ఐదో పతకం కావడం విశేషం. గతంలో అతను రెండు స్వర్ణాలు (2023 కైరో), రెండు కాంస్యాలు (2023 భోపాల్) సాధించాడు. -
భారత బాక్సర్లకు ఆరు పతకాలు
తొలిసారి నిర్వహించిన వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు ఆరు పతకాలతో మెరిశారు. బ్రెజిల్లోని ఫాజ్ డు లుగాకు నగరంలో ఈ టోర్నమెంట్ జరిగింది. పురుషుల 70 కేజీల విభాగంలో భారత బాక్సర్ హితేశ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హితేశ్తో తలపడాల్సిన ఒడెల్ కమారా (ఇంగ్లండ్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ‘వాకోవర్’తో హితేశ్కు బంగారు పతకం ఖరారైంది. పురుషుల 65 కేజీల విభాగంలో అభినాశ్ జమ్వాల్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో అభినాశ్ 0–5తో యురీ రెయిస్ (బ్రెజిల్) చేతిలో ఓడిపోయాడు. సెమీఫైనల్లో పరాజయం పాలైన నలుగురు భారత బాక్సర్లు జాదూమణి సింగ్ (50 కేజీలు), మనీశ్ రాథోడ్ (55 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), విశాల్ (90 కేజీలు) కాంస్య పతకాలు గెల్చుకున్నారు. ఆరు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో 19 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పోటీపడ్డారు. -
గ్రాండ్స్లామ్ విజేతలకు నగదు బహుమతి పెంచాలి
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక గ్రాండ్స్లామ్ టోర్నీల విజేతలకు నగదు బహుమతిని పెంచాలని కోరుతూ స్టార్ ఆటగాళ్లు... నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల నిర్వాహకులకు లేఖ రాశారు. ఆ్రస్టేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ నిర్వాహకులతో వ్యక్తిగతంగా సమావేశమై ఈ అంశంపై మాట్లాడేందుకు సిద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. 24 గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్తో పాటు పురుషుల, మహిళల విభాగాల్లో అగ్రశ్రేణి ప్లేయర్లు ఈ లేఖపై సంతకాలు చేశారు. మార్చి 21వ తేదీతో ఉన్న ఈ లేఖపై పురుషుల ప్రపంచ నంబర్వన్ సినెర్ (ఇటలీ), జొకోవిచ్ (సెర్బియా), జ్వెరెవ్ (జర్మనీ), అల్కరాజ్ (స్పెయిన్), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), రూడ్ (నార్వే), మెద్వెదెవ్ (రష్యా), రుబ్లెవ్ (రష్యా), సిట్సిపాస్ (గ్రీస్), అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) సంతకాలు ఉన్నాయి. మార్చి తొలివారంలో విడుదల చేసిన ర్యాంకింగ్స్లో వీరు టాప్–10లో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో టాప్–11 ప్లేయర్లలో పది మంది దీనిపై సంతకాలు చెశారు. కజకిస్తాన్ ప్లేయర్ రిబాకినా మినహా తక్కినవాళ్లంతా ఇందులో ఉన్నారు. మహిళల ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్), కోకో గాఫ్ (అమెరికా), స్వియాటెక్ (పోలాండ్), జెస్సికా పెగూలా (అమెరికా), మాడిసన్ కీస్ (అమెరికా), జాస్మిన్ పావోలిని (ఇటలీ), ఎమ్మా నవారో (అమెరికా), జెంగ్ క్విన్వెన్ (చైనా), పౌలా బదోసా (స్పెయిన్), మిరా ఆంద్రెయెవా (రష్యా) దీనిపై సంతకాలు చేశారు. » గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ల ద్వారా నిధులు సమకూర్చి ఆటగాళ్ల సంక్షేమ కార్యక్రమాల కోసం ఆర్థిక సహాయం చేయాలని ఆటగాళ్లు కోరుతున్నారు. » గ్రాండ్స్లామ్ విజయవంతం కావడంలో ఆటగాళ్లదే ప్రధాన పాత్ర కాబట్టి అందుకు తగ్గట్లు నగదు బహుమతి శాతాన్ని పెంచాలని... తద్వారా టోర్నీ విలువ మరింత పెరుగుతుందని ప్లేయర్లు అంటున్నారు. » ప్లేయర్ల ఆరోగ్యం, సంక్షేమానికి పెద్ద పీట వేయాలని... ఇందులో అత్యధిక వాటా ఆటగాళ్లకే దక్కాలని లేఖలో పేర్కొన్నట్లు ఫ్రెంచ్ పత్రిక వెల్లడించింది. » జొకోవిచ్ ఆధ్వర్యంలో స్థాపించిన ఆటగాళ్ల సంఘం... పురుషుల, మహిళల ప్రొఫెషనల్ టూర్లు, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య, క్రీడా సమగ్రత సంస్థపై న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో ఇటీవల ఒక దావా వేసింది. » గ్రాండ్స్లామ్ ఆదాయంలో అతి తక్కువ మాత్రమే ఆటగాళ్లకు ఇస్తున్నారని... అందులో ప్లేయర్లకు మరింత వాటా దక్కాలని ఆ దావాలో పేర్కొంది. » యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ పురుషుల, మహిళల విజేతలకు కలిపి చెల్లించిన దానికంటే ఒక స్పెషాలిటీ కాక్టెయిల్ అమ్మకం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని అర్జిస్తున్నారని వాజ్యంలో పేర్కొంది. -
వెర్స్టాపెన్కు పోల్ పొజిషన్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్ ప్రిలో రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 నిమిషం 26.983 సెకన్లలో ల్యాప్ను పూర్తిచేశాడు. చివరి ల్యాప్లో అతడు ఈ టైమింగ్ నమోదు చేశాడు. కాగా... వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 41వ పోల్ పొజిషన్. మెక్లారెన్ డ్రైవర్లు నోరిస్ (1 నిమిషం 26.995 సెకన్లు), పియాస్ట్రి (1 నిమిషం 27.027 సెకన్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జపాన్ గ్రాండ్ప్రిలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన వెర్స్టాపెన్ ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో దూకుడు కనబర్చలేకపోయాడు. గత 16 రేసుల్లో అతడు కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో తనకు అచ్చొచ్చిన ట్రాక్పై నేడు జరగనున్న ప్రధాన రేసును వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. ఆదివారం ఇక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించగా... తడిసిన ట్రాక్పై మెరుగైన రికార్డు ఉన్న వెర్స్టాపెన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. వెర్స్టాపెన్ కెరీర్లో ఇప్పటి వరకు 63 ఎఫ్1 రేసులు నెగ్గాడు. ఈ జాబితాలో లూయిస్ హామిల్టన్ (105), షూమాకర్ (91) మాత్రమే అతడికంటే ముందున్నారు. ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి మెక్లారెన్ డ్రైవర్ నోరిస్ (44 పాయింట్లు) అగ్ర స్థానంలో ఉండగా... 36 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో ఉన్నాడు. రసెల్ (మెర్సిడెస్; 35 పాయింట్లు), పియాస్ట్రి (మెక్లారెన్; 34 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
ఇషా సింగ్ రజత గురి
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషా సింగ్ వెండి వెలుగులు విరజిమ్మింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా సింగ్ 35 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా షూటర్లు సున్ యుజీ 28 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఫెంగ్ జియాన్ 30 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్, ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ మనూ భాకర్ 24 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో మనూ భాకర్ 585 పాయింట్లు సాధించి మూడో స్థానంతో, ఇషా సింగ్ 579 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో ఫైనల్కు అర్హత సాధించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పసిడి పతకం కైవసం చేసుకుంది. దీంతో సీజన్ ప్రారంభ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం చేరింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ 458.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అనిట మంగోల్డ్ (జర్మనీ; 455.3 పాయింట్లు), అరినా అటుఖోవా (కజకిస్తాన్; 445.9 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో స్విఫ్ట్ కౌర్కు ఇదే తొలి పతకం మొత్తం 45 షాట్ల పాటు జరిగిన ఫైనల్లో తొలి 15 షాట్లు ముగిసిన అనంతరం జర్మనీ షూటర్ అనిట మంగోల్డ్ కంటే... 7.2 పాయింట్లు వెనుకబడిన సిఫ్ట్ కౌర్ ఆ తర్వాత అదరగొట్టింది. నీలింగ్ పొజిషన్లో సరైన గురి పెట్టలేకపోయిన భారత షూటర్... ఆ తర్వాత ప్రోన్, స్టాండింగ్ పొజిషన్లలో సత్తాచాటింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో సిఫ్ట్ కౌర్ 590 పాయింట్లు సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. -
ఫైనల్లో అభినాశ్
న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్లో భారత బాక్సర్ అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు) పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. బ్రెజిల్లోని ఫాజ్ డు ఇగాకు నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అభినాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో అభినాశ్ 5–0తో ఇటలీ బాక్సర్ మలంగపై ఏకపక్ష విజయం సాధించాడు. 22 ఏళ్ల అభినాశ్... ఫైనల్లో బ్రెజిల్కు చెందిన యూరీ రెయిస్తో తలపడతాడు. ఐదుగురు జడ్జీల్లో నలుగురు జమ్వాల్కు ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు ఇచ్చారు. మొదటి, మూడో రౌండ్లో అందరూ ఏకగ్రీవంగా అతనికే పాయింట్లు అందించడం విశేషం. మరో సెమీఫైనల్లో మనీశ్ రాథోడ్ ఓటమి పాలై కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 55 కేజీల సెమీస్లో మనీశ్ 0–5తో నూర్సుల్తాన్ అల్టిన్బెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. ఈ టోర్నీలో భారత బాక్సర్ హితేశ్ (70 కేజీలు) ఇప్పటికే ఫైనల్కు చేరగా... జాదూమణి సింగ్ (50 కేజీలు), విశాల్ (90 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. 19 దేశాలకు చెందిన 130 మంది బాక్సర్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్లో... భారత్ నుంచి 10 మంది బరిలోకి దిగారు. అందులో నలుగురు బాక్సర్లు ఆరంభ రౌండ్లలోనే ఓడిపోగా... మరో నలుగురు కాంస్య పతకాలు సాధించారు. -
మే 24న నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేరుతో మనదేశంలో ఓ అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మే 24న హరియాణాలోని పంచ్కుల వేదికగా జరగనున్న ఈ టోర్నీకి ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ అని పేరు పెట్టారు. దివంగత మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ స్టేడియంలో ఈ మీట్ను నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ జావెలిన్ త్రోయర్లు పాల్గొనే ఈ ఈవెంట్కు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ హోదాను కేటాయించింది. ప్రస్తుతానికి ఈ ఈవెంట్కు ప్రపంచ అథ్లెటిక్స్ క్యాలెండర్లో చోటు దక్కకపోయినా... ప్రతి ఏటా దీన్ని నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్తంగా ఈ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నాయి. నీరజ్ చోప్రా కూడా నిర్వాహక కమిటీలో భాగం పంచుకుంటున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గి కొత్త చరిత్ర సృష్టించిన నీరజ్... 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిశాడు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ ఈవెంట్కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఆమోదం తెలిపారు. భారత్లో మెగా టోర్నీలు నిర్వహించే సామర్థ్యాన్ని ఇది ప్రపంచానికి చాటుతుందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ దేశ అథ్లెటిక్స్ ప్రతిష్టను పెంపొందిస్తుందని ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘నీరజ్ జావెలిన్ శిక్షణ ప్రారంభించిన ప్రాంతంలోనే ఈ టోర్నీ జరగనుంది. నీరజ్ భాగస్వామ్యంతో దేశంలో ఈ ఈవెంట్ నిర్వహించడం భారత అథ్లెటిక్స్కు గొప్ప విషయం’ అని బహదూర్ సింగ్ అన్నారు. హరియాణా, పానిపట్ సమీపంలోని ఖంద్రా గ్రామంలో జన్మించిన నీరజ్ చోప్రా... 2012 నుంచి 2015 వరకు పంచ్కులలో జావెలిన్ శిక్షణ పొందాడు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన నీరజ్... ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో దేశానికి స్వర్ణం అందించిన తొలి అథ్లెట్గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ పొందుతున్న నీరజ్... మే 16న జరిగే దోహా డైమండ్ లీగ్తో సీజన్ ప్రారంభించే అవకాశాలున్నాయి. -
నిలబడలేని స్థితి నుంచి... మళ్లీ గన్ పట్టి...
రాహీ సర్నోబత్... భారత్ తరఫున షూటింగ్ ప్రపంచకప్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ. మొత్తంగా షూటింగ్ ప్రపంచ కప్లలో ఆమె ఖాతాలో 5 స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్యాలు... కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం ఆమె గెలుచుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం వరకు రాహీ భారత అత్యుత్తమ షూటర్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే 32 ఏళ్ల వయసులో ఆమె ఊహించని ఘటన రాహీ జీవితంలో చోటు చేసుకుంది. వరల్డ్ చాంపియన్షిప్ పోటీల కోసం ఆమె సిద్ధమవుతోంది. అనూహ్యంగా ఆమె శరీరంలో కాస్త మార్పు కనిపించింది. కొంత నొప్పిగా అనిపించినా ఆ సమయంలో దానిని పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. శరీరమంతా తట్టుకోలేనంత నొప్పితో విలవిల్లాడింది. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది. దాంతో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. అన్నింటిలో అంతా బాగుందనే వచ్చింది. అసలు సమస్య ఏమిటనేది మాత్రం తేలలేదు. పరిస్థితి మరింత తీవ్రంగా మారి అసలు పడుకోలేని పరిస్థితి. కూర్చొని మాత్రమే నిద్రపోవాల్సి వచ్చేది. చివరకు ఆమెకు ‘న్యూరోపతిక్ పెయిన్’ ఉన్నట్లుగా డాక్టర్లు తేల్చారు. అయితే దీనికి ప్రత్యేక కారణం గానీ, ప్రత్యేక చికిత్స గానీ ఉండదని, ప్రతీ వ్యక్తికీ భిన్నమైన లక్షణాలు ఉంటాయని చెప్పడం రాహీలో ఆందోళనను మరింత పెంచింది. ‘కొన్ని నెలల పాటు రోజుకు 17–20 గంటలు కేవలం పడుకునేదాన్ని. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకుండా పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయేదాన్ని’ అని నాటి బాధాకర రోజులను రాహీ గుర్తు చేసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాహీ అదృష్టవశాత్తూ ఆరోగ్యం మెరుగవడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత నొప్పి పూర్తిగా తగ్గకపోయినా ఫిజియోథెరపీని మొదలు పెట్టారు. నిర్విరామంగా 20 నిమిషాలు పాటు టీవీ షో చూడటం కూడా ఆమె మొదటి ఎక్సర్సైజ్గా మారింది. మొదట్లో అది కూడా కష్టంగా అనిపించింది. అయితే ఫిజియోథెరపీతో నెమ్మదిగా పరిస్థితి మారి కొంత ఎక్కువ సమయం కూర్చోవడం మొదలు పెట్టింది. ఆ సమయంలో ఆమె ఆటలో పునరాగమనం గురించి అస్సలు ఆలోచించలేదు. అసలు జీవితం సాధారణంగా మారి ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునే పరిస్థితి మాత్రమే ఆమెది. కానీ రాహీ చివరకు కోలుకొని ఆపై ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టింది. అంతా చక్కబడటంతో సర్నోబత్ మళ్లీ గన్ పట్టుకొని షూటింగ్ మొదలు పెట్టింది. ఈ సారి తనను తాను నిరూపించుకునేందుకో, పతకాలు గెలుచుకునేందుకో కాదు. తాను ఎలాంటి కఠిన పరిస్థితులను దాటి ధైర్యంగా నిలబడ్డానో, జీవితం ఇచ్చిన రెండో అవకాశాన్ని పట్టుదలగా ఎలా వాడుకున్నానో చూపించేందుకు రాహీ మళ్లీ ఆటలోకి అడుగు పెట్టింది. ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన జాతీయ క్రీడల్లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించడంతో ఆమె కొత్త జీవితం మొదలైంది. రియో, టోక్యో ఒలింపిక్స్లలో పాల్గొన్న రాహీ సర్నోబత్ ఇప్పుడు మరోసారి తన స్వప్నం ఒలింపిక్స్ పతకం కోసం సిద్ధమవుతోంది. అసలు లేవలేని పరిస్థితి నుంచి కోలుకొని మళ్లీ సత్తా చాటుతూ లాస్ ఏంజెలిస్ గేమ్స్ లక్ష్యంగా తన సన్నాహాలు చేస్తోంది. - సాక్షి క్రీడా విభాగం -
ఒడిశా టైటిల్ నిలబెట్టుకునేనా!
ఝాన్సీ (ఉత్తరప్రదేశ్): పురుషుల సీనియర్ హాకీ నేషనల్ చాంపియన్షిప్నకు వేళైంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఈనెల 15న జరగనున్న ఫైనల్తో ముగియనుంది. ‘త్రీ డివిజన్’ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 30 జట్లు పాల్గొంటున్నాయి. గత ఏడాది తమిళనాడులో జరిగిన జాతీయ చాంపియన్షిప్లో ఒడిశా జట్టు టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ఒడిశా తమ జోరు కొనసాగించి టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి. ‘ఎ’ డివిజన్లో ఉన్న 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతుండగా... ‘బి’ డివిజన్లోని 10 జట్లు, ‘సి’ డివిజన్లోని 8 జట్లు ప్రమోషన్ కోసం ప్రయత్నించనున్నాయి. ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది తిరిగి డివిజన్ల మార్పు జరుగుతుంది. ‘సి’ డివిజన్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు... వచ్చే ఏడాది ‘బి’ డివిజన్కు... ‘బి’ డివిజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన రెండు జట్లు ‘ఎ’ డివిజన్కు చేరనున్నాయి. ప్రతి డివిజన్లో కింది స్థానాల్లో నిలిచిన రెండు జట్లు... డిమోషన్ పొందుతాయి. ‘మహిళల సీనియర్ నేషనల్ చాంపియన్షిప్ను ఈ ఫార్మాట్లో నిర్వహించడం వల్ల ఆటకు మేలు జరిగింది. అందుకే పురుషుల విభాగంలోనూ దీన్ని కొనసాగిస్తున్నాం. దీంతో ప్రతి డివిజన్లోని జట్టు మరింత మెరుగైన స్థితిలో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది’అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. » ‘ఎ’ డివిజన్లోని 12 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో మూడు టీమ్ల చొప్పున పోటీ పడనున్నాయి. లీగ్ దశ ముగిసేసరికి గ్రూప్ అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుతాయి. » ఈనెల 13న సెమీఫైనల్స్, 15న ఫైనల్ నిర్వహించనున్నారు. » డిఫెండింగ్ చాంపియన్ ఒడిశాతో పాటు రన్నరప్ హరియాణా జట్లు ‘ఎ’ డివిజన్ నుంచి బరిలోకి దిగనున్నాయి. ఈ రెండు జట్లతో పాటు పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక, పుదుచ్చేరి జట్లు ‘ఎ’ డివిజన్లో చోటు దక్కించుకున్నాయి. » ‘బి’, ‘సి’డివిజన్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభం కానుండగా... ‘ఎ’ డివిజన్ మ్యాచ్లు ఈ నెల 8న ఆరంభమవుతాయి. » ఇది 15వ పురుషుల సీనియర్ హాకీ జాతీయ చాంపియన్షిప్ కాగా... గత ప్రదర్శన ఆధారంగా జట్లను విభజించారు. » తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు ప్రస్తుతం ‘బి’ డివిజన్లో ఉన్నాయి. వీటితో పాటు చండీగఢ్, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మిజోరం, దాద్రా నగర్ హవేలీ–దామన్ దియు, కేరళ, అస్సాం జట్లు కూడా ఇదే గ్రూప్లో రెండు ‘పూల్స్’గా పోటీ పడనున్నాయి. » ‘సి’ డివిజన్లో రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశీ్మర్, త్రిపుర, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్ జట్లున్నాయి. » ఒక్కో మ్యాచ్లో గెలిచిన జట్టుకు 3 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ ‘డ్రా’ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. -
127వ స్థానంలో...
లుసానే (స్విట్జర్లాండ్): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయి మ్యాచ్ల్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు విఫలమవుతోంది. ఈ నిరాశాజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత జట్టుపై పడింది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారత జట్టు 127వ స్థానానికి చేరుకుంది. క్రితంసారి భారత జట్టు 126వ స్థానంలో ఉంది. షిల్లాంగ్లో ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. తమకంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టుతో మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకోవడం బంగ్లాదేశ్ జట్టుకు కలిసొచ్చిoది. ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి 183 ర్యాంక్లో నిలిచింది. గత ఏడాది జూన్లో భారత స్టార్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సునీల్ ఛెత్రి గుడ్బై చెప్పాక భారత ప్రదర్శన తీసికట్టుగా మారింది. దాంతో గత నెలలో సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో, అంతకుముందు మాల్దీవులుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత జట్టుకు సునీల్ ఛెత్రి నాయకత్వం వహించాడు. కొత్త కోచ్ మనోలో మార్క్వెజ్ వచ్చాక భారత జట్టు ఆడిన 13 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. భారత్ తమ అత్యుత్తమ ర్యాంక్ 94ను 1996లో సాధించింది. ఆ తర్వాత టీమిండియా తమ అత్యుత్తమ ర్యాంక్ను అధిగమించడంలో విఫలమవుతోంది. వరుసగా మూడోసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్ను జూన్ 10న హాంకాంగ్తో ఆడుతుంది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుత విశ్వవిజేత అర్జెంటీనా టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... స్పెయిన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్కు చేరుకోగా... ఫ్రాన్స్ ఒక స్థానం పడిపోయి మూడో ర్యాంక్లో నిలిచింది. ఇప్పటికే 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన ఆసియా దేశాలు జపాన్ 15వ స్థానంలో, ఇరాన్ 18వ స్థానంలో ఉన్నాయి. -
పోటీ పడితే పతకమే!.. అమ్మ కష్టంతో ‘పసిడి పంట’
ముత్తారం(మంథని): ఆమె గ్రామీణ విద్యార్థిని.. ఆర్థిక స మస్యలున్నా కరాటే పోటీల్లో పంచ్ కొడితే పతకం సాధించాలనే తపనతో ప్రతిభకు ప దును పెడుతోంది. ఇటీవల జ రిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్ర తిభ చూపి మే నెలలో మలేషియాలో దేశంలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికైంది మెట్టు హాసిని.పోటీ పడితే పతకమే.. మంథనికి చెందిన మెట్టు దేవి – నర్సింగం దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుతూరు మానసకు వివాహం అయ్యింది. చిన్నకుతూరు హాసిని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మంథని బాలికల హై స్కూల్లో చదివింది. ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్లో ఇంటటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రా సింది. నాలుగో తరగతిలోనే సీనియర్ల ను చూసి కరాటే నే ర్చుకోవడమే కాదు.. అందులో రాణించాలని కంకణం కట్టుకుంది. ఇలా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతూనే కరాటేలో శిక్షణ తీసుకుంది.పసిడి పతకాల పంటఅదేసమయంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించింది. పోటీపడితే వెండి పతకాలతోపాటు ఇప్పటివరకు 15 బంగారు పతకాలు సాధించింది. 2024లో హరియాణాలోని పంచకుల, మధ్యప్రదేశ్లోని గాలియానాలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బ్లాక్బెల్ట్లో గోల్డ్మెడల్ సాధించి ఔరా అనిపించింది.గతేడాది 2024 నవంబరులో కరీంనగర్లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో బ్లాక్బెల్ట్లో ఫస్ట్డాన్గా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈఏడాది మే 7 నుంచి 12వతేదీ వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభ చూపే అవకాశం దక్కించుకుంది.అమ్మ ప్రోత్సాహం.. మాస్టర్ కృషి మా నాన్న మా కుటుంబానికి దూరంగా ఉంటున్నా.. మా అమ్మ కూలీ పనిచేస్తూ అక్క పెళ్లి చేసి, నన్ను చదివిస్తోంది. ఆడపిల్లకు కరాటే పోటీలు అవసరమా అని బంధువులు, ఇరుగుపొరుగువారు సూటిపోటీ మాటలతో ప్రశ్నించేవారు. ఇది మనోవేదనకు దారితీసినా.. కరాటే మాస్టర్ సమ్మయ్య నచ్చజెప్పి మళ్లీ శిక్షణ ఇచ్చారు. ఆడవాళ్లు అంటే కుటుంబానికే పరిమితం కాదనే పట్టుదలతో కరాటేలో రాణిస్తున్నా. మలేషియాలో జరిగే పోటీల్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. నా ప్రతిభ నాలాంటి ఆడపిల్లల కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి. -
65 నుంచి 40కు...
బెంగళూరు: గత రెండు వారాలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో భారత మహిళల హాకీ ప్రాబబుల్స్కు శిక్షణ శిబిరం జరిగింది. ఈ తొలి విడత శిబిరంలో మొత్తం 65 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండో దశ శిబిరం కోసం జాబితాను 40 మందికి కుదించారు. 28 మంది సీనియర్ ప్లేయర్లు కోర్ గ్రూప్ ప్రాబబుల్స్లో తమ చోటును నిలబెట్టుకోగా... జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో రాణించిన 12 మంది కొత్త ప్లేయర్లను ఎంపిక చేశారు. ‘కొత్తగా ఎంపికైన యువ క్రీడాకారిణులు రెండో దశ శిబిరంలో ఎలా రాణిస్తారో ఆసక్తితో ఉన్నాను. ఇందులో ఆకట్టుకుంటే వారు తమ కెరీర్లో మరో మెట్టు ఎక్కుతారు’ అని భారత మహిళల హాకీ జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. భారత మహిళల హాకీ కోర్ గ్రూప్ ప్రాబబుల్స్: సవిత పూనియా, బిచ్చూ దేవి, బన్సారి సోలంకి, మాధురి కిండో, సమీక్ష సక్సేనా (గోల్కీపర్లు). మహిమా చౌధరీ, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, ఉదిత, ఇషికా చౌధరీ, జ్యోతి ఛత్రి, జ్యోతి, అక్షత ధెఖాలే, అంజన డుంగ్డుంగ్, సుమన్ దేవి (డిఫెండర్స్). సుజాత కుజుర్, వైష్ణవి ఫాలే్క, నేహా, సలీమా టెటె, మనీషా చౌహాన్, అజ్మీనా కుజుర్, సునెలితా టొప్పో, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, బల్జీత్ కౌర్, మహిమా టెటె, అల్బెలా రాణి టొప్పో, పూజా యాదవ్ (మిడ్ ఫీల్డర్స్). దీపిమోనిక టొప్పో, హృతిక సింగ్, దీపిక సొరెంగ్, నవ్నీత్ కౌర్, సంగీత, దీపిక, రుతుజా, బ్యూటీ డుంగ్డుంగ్, ముంతాజ్ ఖాన్, అన్ను, చందన జగదీశ్, కాజల్ అటా్పడ్కర్ (ఫార్వర్డ్స్). -
సాకేత్ జోడీ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: మెనోర్కా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. స్పెయిన్లో జరుగుతున్న ఈ టోర్నీలో సాకేత్ తమిళనాడుకు చెందిన రామ్కుమార్ రామనాథన్తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగాడు. తొలి రౌండ్ మ్యాచ్లో సాకేత్–రామ్కుమార్ ద్వయం 6–1, 6–2తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)–ఇజాన్ కొరెత్యా (స్పెయిన్) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 48 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్కుమార్ నాలుగు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తమ సర్వీస్లను నిలబెట్టుకొని, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. అనిరుద్కు నిరాశమరోవైపు ఇదే టోర్నీలో బరిలోకి దిగిన హైదరాబాద్కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ మాత్రం తొలి రౌండ్ను దాటలేకపోయాడు. గతవారం డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్)తో కలిసి జిరోనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన అనిరుధ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. తొలి రౌండ్లో అనిరుధ్ (భారత్)–హెర్నాండెజ్ ద్వయం 6–7 (4/7), 7–5, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ డానియల్ కుకెర్మన్ (ఇజ్రాయెల్)–జోషువా పారిస్ (బ్రిటన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అనిరుధ్ జంట తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో మాత్రం అనిరుధ్ ద్వయం తడబడింది. భారత్కే చెందిన టాప్ సీడ్ జోడీ విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ జోడీ 2–6, 0–6తో మాటియో–ఆండ్రియా (ఇటలీ) జంట చేతిలో ఓటమి పాలైంది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో నిక్కీ పునాచా (భారత్)– గోర్నెస్ (స్పెయిన్) ద్వయం 6–3, 6–3తో వరోనా–టబెర్నర్ (స్పెయిన్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో స్నేహిత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్లో హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ అద్భుత పురోగతి సాధించాడు. గతవారం చెన్నైలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ లెవెల్ టోర్నీలో స్నేహిత్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతను తన కెరీర్లో తొలిసారి టాప్–100లోకి వచ్చాడు. మంగళవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్లో స్నేహిత్ ఏకంగా 34 స్థానాలు ఎగబాకి 89వ ర్యాంక్కు చేరుకున్నాడు.నా తదుపరి లక్ష్యం అదేచెన్నై స్టార్ కంటెండర్ టోర్నీ రెండో రౌండ్లో స్నేహిత్ ప్రపంచ 29వ ర్యాంకర్ యుకియా ఉడా (జపాన్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత దిగ్గజం, ఐదుసార్లు ఒలింపియన్ ఆచంట శరత్ కమల్పై గెలిచి పెను సంచలనం సృష్టించాడు.‘నా తాజా ప్రపంచ ర్యాంక్తో ఎంతో సంతోషంగా ఉన్నా. ఈ ఏడాదిలోపు టాప్–100లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దానిని మూడు నెలల్లోపే అందుకున్నా. ఇక టాప్–50లోకి రావడమే నా తదుపరి లక్ష్యం’ అని అంతర్జాతీయస్థాయిలో భారత్ తరఫున డజనుకంటే ఎక్కువ పతకాలు సాధించిన స్నేహిత్ వ్యాఖ్యానించాడు.మరోవైపు చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో సెమీఫైనల్ చేరి కాంస్య పతకాన్ని నెగ్గిన గుజరాత్ ప్లేయర్ మానవ్ ఠక్కర్ కూడా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను సాధించాడు. మానవ్ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 47వ ర్యాంక్లో నిలిచి భారత నంబర్వన్ అయ్యాడు. భారత్కే చెందిన హరీ్మత్ దేశాయ్ 68వ ర్యాంక్లో, మనుష్ షా 73వ ర్యాంక్లో నిలిచారు. చెన్నై స్టార్ కంటెండర్ టోరీ్నతో అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పిన శరత్ కమల్ 80వ ర్యాంక్లో నిలిచాడు. ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్: నాలుగో స్థానంలో అర్జున్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తాజా ర్యాంకింగ్స్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్, భారత స్టార్ ఇరిగేశి అర్జున్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత నెలలో అర్జున్ ఐదో ర్యాంక్లో ఉన్నాడు. ప్రస్తుతం అర్జున్ ఖాతాలో 2782 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ప్రపంచ చాంపియన్, తమిళనాడు గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2787 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్ను నిలబెట్టుకొని భారత నంబర్వన్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు.తొలి రౌండ్లోనే లక్ష్య చహర్ ఓటమి వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్ను భారత్ పరాజయంతో ప్రారంభించింది. బ్రెజిల్లోని ఫాజ్ డు లుగాకు నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. పురుషుల 80 కేజీల విభాగంలో భారత బాక్సర్ లక్ష్య చహర్కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బ్రెజిల్ బాక్సర్, 2023 ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత వాండర్లీ పెరీరాతో జరిగిన బౌట్లో లక్ష్య చహర్ 0–5తో ఓడిపోయాడు.150 పాయింట్లకుగాను పెరీరాకు 149 పాయింట్లు... లక్ష్య చహర్కు 135 పాయింట్లు లభించాయి. వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ నుంచి పది మంది బాక్సర్లు బరిలో ఉన్నారు. రిత్విక్ జోడీకి నిరాశ సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీకి వరుసగా మూడో టోర్నీలోనూ నిరాశ ఎదురైంది. ఫిబ్రవరిలో సాంటియాగో ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన రిత్విక్ ఆ తర్వాత పోటీపడ్డ మూడు టోర్నీలలో తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. అమెరికాలో జరుగుతున్న హ్యూస్టన్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియంతోస్తో జతకట్టి ఆడిన రిత్విక్ తొలి రౌండ్లో నిష్క్రమించాడు.పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో రిత్విక్ చౌదరీ–బరియంతోస్ ద్వయం 5–7, 4–6తో మార్సెలో జోర్మన్–రాఫెల్ మటోస్ (బ్రెజిల్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–బరియంతోస్ ఐదు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. తొలి రౌండ్లో ఓడిన రిత్విక్–బరియంతోస్లకు 3,700 డాలర్ల (రూ. 3 లక్షల 15 వేలు) ప్రైజ్మనీ లభించింది.