స్వర్ణంతో శుభారంభం | Neeraj Chopra starts 2025 season with gold medal | Sakshi
Sakshi News home page

స్వర్ణంతో శుభారంభం

Apr 18 2025 1:12 AM | Updated on Apr 18 2025 1:12 AM

Neeraj Chopra starts 2025 season with gold medal

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా 2025 సీజన్‌ను స్వర్ణ పతకంతో శుభారంభం చేశాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన పాచెఫ్‌్రస్టూమ్‌ ఇన్విటేషనల్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో 27 ఏళ్ల నీరజ్‌ చోప్రా విజేతగా నిలిచాడు. ఆరుగురు పోటీపడ్డ ఈ ఈవెంట్‌లో నీరజ్‌ జావెలిన్‌ను 84.52 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డూ స్మిట్‌ (దక్షిణాఫ్రికా; 82.44 మీటర్లు) రజతం, డంకన్‌ రాబర్ట్‌సన్‌ (దక్షిణాఫ్రికా; 71.22 మీటర్లు) కాంస్యం సాధించారు. 

నీరజ్‌ పాల్గొన్న ఈ మీట్‌కు వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ చాలెంజర్‌ ఈవెంట్‌గా గుర్తింపు ఉంది. దిగ్గజం జాన్‌ జెలెజ్నిను కొత్త కోచ్‌గా నియమించుకున్నాక నీరజ్‌ పోటీపడ్డ తొలి టోర్నీలో టాప్‌ ర్యాంక్‌లో నిలువడం విశేషం. నీరజ్‌ తదుపరి మే 16వ తేదీన జరిగే దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌లో, ఆ తర్వాత మే 24న పంచ్‌కులాలో జరిగే నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ జావెలిన్‌ త్రో టోర్నీలో పోటీపడతాడు. 

2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్‌... 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సొంతం చేసుకున్న నీరజ్‌... 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా అవతరించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement