
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2025లో తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిష్కాఅగర్వాల్ స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ గేమ్స్లో హైదరాబాద్కు చెందిన 17 ఏళ్ల నిష్కా ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో విజేతగా నిలిచింది. నిష్కా 44.333 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని పొందింది. అనుష్క పాటిల్ (మహారాష్ట్ర; 42.067 పాయింట్లు) రజతం, సారా రవూల్ (మహారాష్ట్ర; 41.233 పాయింట్లు) కాంస్యం సాధించారు.