-
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ భామ జాన్వీకపూర్ దేవరలో జూనియర్ సరసన నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవలే తన కాబోయే వరుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాజాగా బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా గురించి మొదటిసారి నోరు విప్పింది దేవర భామ.జాన్వీ మాట్లాడుతూ..'నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడే శిఖర్ నా లైఫ్లోకి వచ్చాడు. మేమిద్దరం కలసి పెరిగాం. అతను నా కలలను తనవిగా ఫీలవుతాడు. అలాగే నేను కూడా అతని కలలు నా సొంతం అనుకుంటా. మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు మేము మద్దతుగా ఉంటాం' అని తెలిపింది. కాగా.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఇలాంటి లక్షణాలు ఉండాలంటూ చెప్పుకొచ్చింది. గతంలోనూ బోనీ కపూర్ సైతం శిఖర్పై ప్రశంసలు కురిపించారు. మంచివాడని.. అందరితో త్వరగా కలిసిపోతారని తెలిపారు. జాన్వీతో పరిచయం కాకముందు ముందునుంచే శిఖర్ తనకు తెలుసని బోనీ అన్నారు. కాగా.. జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ ఈనెల 31న థియేటర్లలో సందడి చేయనుంది. -
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
-
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ భామ జాన్వీకపూర్. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ. తాజాగా బుధవారం ఈ సినిమా నుంచి దేఖా తెను అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న జాన్వీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని చేసుకునేవారికి ఎలా ఉండాలో చెప్పగలరా? అని అడిగారు. అయితే దీనికి జాన్వీ కపూర్ ఆసక్తికర సమాధానమిచ్చింది. అదేంటో మీరు చూసేయండి.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..' నా కలలను తనవిగా భావించేవాడు. నాకు అండగా నిలిచేవాడు. ఎల్లప్పుడు నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు. నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కావాలి' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. బాలీవుడ్ భామ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు జంటగా చాలాసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతే కాకుండా తన పెళ్లి కూడా తిరుమలలోనే జరుగుతుందని ఇప్పటికే వెల్లడించారు. చాలా సింపుల్గా శ్రీవారి ఆలయంలో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. మరోవైపు జాన్వీకపూర్ దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చే మూవీలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నేనేం క్రికెట్ కోసం పుట్టలేదు!
రాజ్కుమార్ రావు, జాన్వీకపూర్ జంటగా నటించిన హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి శరణ్ శర్మ దర్శకుడు. ఈ సినిమాలో మహేంద్ర పాత్రలో రాజ్కుమార్ రావు, మహిమ పాత్రలో జాన్వీ కపూర్ నటించారని బాలీవుడ్ సమాచారం. జీ స్టూడియోస్, కరణ్ జోహార్, యశ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ‘నాకు ఇంకో ఏడాది అవకాశం కల్పించండి నాన్న.. నేను కచ్చితంగా సెలక్ట్ అవుతాను.. నా కలను బ్రేక్ చేయవద్దు నాన్న.. ప్లీజ్’, ‘మీ నాన్న కోసం నువ్వు (జాన్వీని ఉద్దేశిస్తూ..) డాక్టర్ అయ్యావు మహి.. కానీ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు’ (రాజ్కుమార్ రావు), ‘నేనేం క్రికెట్ కోసం పుట్టలేదు’ (జాన్వీ కపూర్) వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. క్రికెటర్ కావాలనుకున్న ఓ యువకుడు తన లక్ష్యాన్ని సాధించలేకపోతాడు. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకుంటాడు.వృత్తి రీత్యా డాక్టర్ అయిన తన భార్యలో క్రికెట్ ప్రతిభ ఉందని గ్రహించి, తన భార్యకు తానే క్రికెట్ కోచింగ్ ఇచ్చి, ఆమెను ్రపోత్సహించి క్రికెటర్ను చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో ఆ భార్యాభర్తల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే నేపథ్యంలో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా కథనం ఉంటుందని బాలీవుడ్ టాక్. -
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
నడుము అందాలు చూపిస్తూ రచ్చ లేపిన కన్నడ బ్యూటీఅందాల జాతరతో కైపెక్కిస్తున్న 'జబర్దస్త్' వర్షతిరుపతిలో చీరకట్టులో అందంగా కనిపిస్తున్న జ్యోతిరాయ్ఎప్పటిలానే వెనకందాలతో మత్తెక్కిస్తున్న జాన్వీ కపూర్హాట్నెస్తో టెంపరేచర్ పెంచేస్తున్న బిగ్ బాస్ శుభశ్రీ'కృష్ణమ్మ' బ్యూటీ లేలేత అందాల విందు.. చూస్తే అంతే View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Jiya Shankar (@jiyaashankarofficial) View this post on Instagram A post shared by Kanikka Kapur (@kanikkakapur) View this post on Instagram A post shared by Richa Panai (@richapanai) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by VRK HERITAGE (@vrk_heritage) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Shilpa Manjunath (@shilpamanjunathofficial) -
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్తో రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్)'జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు.ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ముంబయిలో బిజినెస్ చేస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి జాన్వీ కపూర్తో రిలేషన్లో ఉన్నాడు. అతడితో బాండింగ్ గురించి జాన్వీ కూడా పలుమార్లు బయటపెట్టింది. అయితే ఇప్పుడు పెళ్లి గురించి గోల ఎక్కువైంది. అయితే జాన్వీ కెరీర్ పరంగా చూస్తే ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోకపోవచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!) -
ప్రేమకథ ఆరంభం
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ల కొత్త ప్రేమకథ మొదలైంది. ‘బవాల్’ సినిమా తర్వాత వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలిసి ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే ప్రేమకథా చిత్రంలో జోడీగా నటిస్తున్నారు. సన్నీ పాత్రలో వరుణ్, తులసీ కుమారి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని ఊహించవచ్చు.శశాంక్ కేతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శనివారం మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వరుణ్ ధావన్తో పాటు ఈ సినిమా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల కానుంది. -
Janhvi Kapoor Photos: షార్ట్ డ్రస్లో జాన్వీ కపూర్.. చూస్తే మతి పోతుందంతే! (ఫొటోలు)
-
సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాలు విస్తరించే దిశగా ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్ఫాం ఎయిర్బీఎన్బీ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్ తదితర రంగాల సెలబ్రిటీలతో జట్టు కడుతోంది. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్తో చేతులు కలిపింది. ’భారత్లో బాలీవుడ్ స్టార్ జాన్వి కపూర్లా జీవించండి’ స్లోగన్తో ఆమె బాల్యంలో నివసించిన చెన్నై ఇంటిని బస కోసం ప్రమోట్ చేస్తోంది. తమ కార్యకలాపాలకు సంబంధించి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటని, టాప్ 10 మార్కెట్ల జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఎయిర్బీఎన్బీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డేవ్ స్టీఫెన్సన్ తెలిపారు. 2022తో పోలిస్తే 2023లో బుకింగ్స్ 30 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విదేశాలు వెళ్లేవారితో పాటు దేశీయంగా కూడా పర్యటించే టూరిస్టులను ఆకట్టుకునేందుకు భారత్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్టీఫెన్సన్ వివరించారు. తమ కార్యకలాపాల ద్వారా భారత్లో 85,000 పైచిలుకు ఉద్యోగాలకు, జీడీ పీ వృద్ధికి 920 మిలియన్ డాలర్ల మేర తోడ్పా టు అందించినట్లు పేర్కొన్నారు. -
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ ఎయిర్బీఎన్బీ (Airbnb) తన వెబ్సైట్ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి మే 12 నుంచి బుకింగ్ చేసుకోచ్చు. కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని ఎయిర్బీఎన్బీ వెల్లడించింది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్లోని ఓ హోటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
దేవర భామ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ చూశారా!
దేవర మూవీతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా జాన్వీ ప్రధాన పాత్రలో తెరెకక్కుతోన్న తాజా చిత్రం ఉలజ్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ విదేశీ రాయబారి పాత్రలో కనిపించనుంది. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో గూఢచర్యంపై కథాంశంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాతో యాక్షన్ అవతార్లోకి అడుగు పెట్టింది. కాగా.. ఈ యాక్షన్ థ్రిల్లర్లో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్, మెయాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జంగిల్ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ యాక్షన్ జోనర్లో అడుగు పెట్టింది. కాగా.. టాలీవుడ్లో కొరటాల డైరెక్షన్లో వస్తోన్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఆ తర్వాత రామ్ చరణ్తోనూ జతకట్టనుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఆర్సీ16లో జాన్వీ హీరోయిన్గా నటించనుంది. అంతే కాకుండా బాలీవుడ్లోనూ కరణ్ జోహార్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. -
దేవర భామ జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీ .. పెళ్లికి రెడీనా?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర చిత్రంలో జూనియర్ సరసన కనిపించనుంది. ఈ మూవీ ద్వారానే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది. అయితే ఇటీవల జాన్వీ కపూర్ పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆమె మైదాన్ సినిమాకు చూసేందుకు వెళ్లిన జాన్వీ తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా పేరుతో నెక్లెస్ ధరించి కనిపించారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా శిఖర్పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి చేసుకోవడం ఖాయమని బీ టౌన్లో టాక్ నడుస్తోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. అదేంటీ అప్పుడే పెళ్లికి సిద్ధమైపోయిందనుకుంటున్నారా? కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. జాన్వీ కపూర్ తన ఫ్రెండ్ రాధికా మర్చంట్ బ్యాచిలరేట్ పార్టీని నిర్వహించింది. జాన్వీతో పాటు రాధిక ఫ్రెండ్స్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. జాన్వీ కపూర్ హోస్ట్ చేసిన ఈ పార్టీలో ఆమె స్నేహితులందరూ గులాబీ రంగు దుస్తులు ధరించారు. ఈ పార్టీకి హాజరైన వారిలో అంజలి మర్చంట్ కూడా ఉన్నారు. కాగా.. ఇటీవలే గుజరాత్లోని జామ్నగర్లోని అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ 2022 డిసెంబర్లో రాజస్థాన్లో జరిగిన వేడుకలో అనంత్ అంబానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది జూలైలో జరగనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
Janhvi Kapoor : పీకల్లోతు ప్రేమలో జాన్వీ.. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం (ఫోటోలు)
-
వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్.. డేటింగ్ చేసి తప్పు చేశా: హీరో
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేం. తెలియకుండానే కొందరు ప్రేమలో పడిపోతారు. కానీ కొందరే చివరివరకు ఆ ప్రేమను నిలుపుకుంటారు. చాలామటుకు ప్రేమలు మధ్యలోనే పుటుక్కుమంటాయి. ఇది సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా గతంలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దేనికీ శుభం కార్డు పడలేదు. లవ్ ఆజ్ కల్ 2 సినిమా షూటింగ్ సమయంలో సారా అలీ ఖాన్తో, దోస్తానా 2 మూవీ చిత్రీకరణ టైంలో జాన్వీ కపూర్తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడిచింది. ఇద్దరమ్మాయిలతో డేటింగ్ దోస్తానా 2 షూటింగ్ మొదలుపెట్టిన కొంతకాలానికే ఆ మూవీ అటకెక్కింది. అప్పుడే వీరి ప్రేమ కూడా ముగిసిపోయింది. తాజాగా నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్.. తన పాత లవ్ కహానీల గురించి ప్రస్తావించాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్తో డేటింగ్ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఫీలవుతున్నారా? అన్న ప్రశ్నకు అవునని బదులిస్తూనే.. ఒకవేళ నాతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుంటే..? ఏదేమైనా అందుకు గిల్టీగానే ఫీలవుతున్నాను అన్నాడు. కనిపిస్తే అదే అడుగుతా మాజీ ప్రేయసి కనిపిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతావు? అని హోస్ట్ ప్రశ్నించగా.. ప్రస్తుతం నీ లైఫ్ ఎలా ఉంది? అని ఆరా తీస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సారా అలీఖాన్, జాన్వీ కపూర్.. ఇద్దరూ క్లోజ్ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే! కార్తీక్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చాందు చాంపియన్ సినిమా చేస్తున్నాడు. అలాగే భూల్ భులయ్యా 3, ఆషిఖి 3 చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి. చదవండి: నటి భర్తకు గుండెపోటు.. క్షమాపణలు చెప్తూ పోస్ట్! -
మెడలో బాయ్ఫ్రెండ్ నెక్లెస్.. దేవర భామ డేటింగ్ నిజమేనా!
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆ తర్వాత బుచ్చిబాబు- చెర్రీ కాంబోలో వస్తోన్న మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలో మెరిసింది జాన్వీ. అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇటీవలే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అదే సమయంలో తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా వెంటే ఉన్నారు. అయితే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. అదే సమయంలో ఇటీవల ఆమె తండ్రి బోనీకపూర్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. శిఖర్ చాలా మంచివాడని ప్రశంసలు కురిపించారు. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ మైదాన్ సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న వారి పోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్ తన భాయ్ఫ్రెండ్ పేరు ఉన్న నెక్లెస్ను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పేరుతో నెక్లెస్ జాన్వీ కపూర్ ధరించిన నెక్లెస్పై శిఖు అని రాసి ఉంది. ఈ పేరుతోనే జాన్వీ అతన్ని ముద్దుగా పిలుస్తుందట. అంతేకాదు మంగళవారం ఉదయం నటి శిఖర్ తల్లి స్మ్రుతి షిండేతో కలిసి బాంద్రా ప్రభాదేవిలోని సిద్ధివినాయక ఆలయానికి చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. మార్చిలో జాన్వీ తన పుట్టినరోజు సందర్భంగా శిఖర్తో కలిసి తిరుపతి బాలాజీ ఆలయానికి నడిచి వెళ్లారు. మోకాళ్లపై ఆలయ మెట్లను కూడా ఎక్కారు. ఇవన్నీ చూస్తుంటే శిఖర్ పహారియాకు జాన్వీ కపూర్ కుటుంబం ఓకే చెప్పినట్లు అర్థమవుతోంది. ఇటీవల జాన్వీ తండ్రి బోనీ కపూర్ మాట్లాడుతూ.. తమ జీవితంలోకి ఇలాంటి యువకుడు ఉన్నందుకు తాము ఆశీర్వదంగా భావిస్తున్నామని తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ నిజమేనని తెలుస్తోంది. -
Janhvi Kapoor: జిమ్లో శ్రీదేవి కూతురి కష్టాలు.. ఫ్యాన్స్ ఫిదా (ఫోటోలు)
-
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్బస్టర్ మూవీ యానిమల్లో విలన్గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే? -
'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్ చేసిన మరాఠీ బ్యూటీ
జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జోడీగా దేవర సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే... దేవర చిత్రంలో నటించనుందంటూ కొన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. దేవరలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే ఇందులో జాన్వీకపూర్ తంగం అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఆమె హైదరాబాద్లో జరిగిన ‘దేవర’ షూటింగ్లోనే జాయిన్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. 'దేవరలో సినిమాలో నేను భాగం అయినట్లు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్లొ ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానుల మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని చెప్పారు. దీంతో దేవరలో ఇద్దరు హీరోయిన్లు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్లో నటిస్తున్న విషయం దాదాపు ఖాయం అని తేలిపోయింది. తాజాగా ఈ మూవీ షూట్లకు సంబంధించిన జూనియర్ లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. -
Jahnvi Kapoor: ఓరీతో కలిసి తిరుమలను దర్శించిన హీరోయిన్ (ఫోటోలు)
-
మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన హీరోయిన్ జాన్వీకపూర్
శ్రీదేవి కుమార్తె, ప్రముఖ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని తరచూ దర్శించుకుంటారు. మార్చి 6న తన పుట్టినరోజు సందర్భంగా కాలి నడక ద్వారా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆమె తన స్నేహితులు అయిన శిఖర్ పహారియా, ఒరీతో కలిసి వెళ్లారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోను ఒరీ తన ఇన్స్టాలో షేర్ చేశారు. తిరుమల వెళ్లిన సమయంలో వారి యాత్ర ఎలా జరిగిందో అభిమానులతో పంచుకున్నారు. చెన్నైలోని జాన్వీ కపూర్ ఇంటి నుంచి కారులో బయలుదేరిన తమకు తిరుపతి చేరుకునేందుకు మూడు గంటలు పట్టిందని వారు తెలిపారు. అక్కడి నుంచి జాన్వీ కపూర్ బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామని తెలిపారు. ఆ వీడియోను పంచుకున్న అనంతరం జాన్వీ గురించి ఒక ఆసక్తకరమైన విషయాన్ని షేర్ చేశారు. కాలి నడక మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ కపూర్ - శిఖర్ మోకాళ్లపై మెట్లెక్కారని తెలిపారు. దాదాపు 50 సార్లు తిరుమల శ్రీవారిని జాన్వీ దర్శించుకున్నట్లు ఓరీ చెప్పారు. ఈ దేవాలయమంటే తనకెంతో ఇష్టమని గతంలో పలుమార్లు జాన్వీ చెప్పిన విషయం తెలిసిందే. శ్రీదేవి కూడా లెక్కలేనన్ని సార్లు కుటుంబంతో పాటు తిరుమలకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఓరీ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) పూజా కార్యక్రమంగా తాజాగ జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ప్రారంభమైంది.మెగాస్టార్ చిరంజీవి ‘ఆర్సీ 16’ ప్రాజెక్ట్కు క్లాప్ కొట్టారు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) -
తనకు అంత పిచ్చి ఉంటుందనుకోలేదు
‘‘డైరెక్టర్ సుకుమార్గారి టీమ్లో బుచ్చిబాబు బెస్ట్. తనకు సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్గారు నాకు నలభై నిమిషాలు చె΄్పారు. ఆ తర్వాత ప్రతి రోజూ నాకు రెండేసి గంటలు నెరేష¯Œ ఇచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందనుకోలేదు’’ అని హీరో రామ్చరణ్ అన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ్రపారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిరంజీవి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ను యూనిట్కి అందించారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘‘నేను, జాన్వీ కలిసి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ లాంటి మూవీ చేయాలని చాలామంది అనుకున్నారు. మా కాంబినేషన్ ‘ఆర్సీ 16’తో నిజం కావడం హ్యాపీ’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో రామ్చరణ్గారు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటాను’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘బుచ్చిబాబు ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపై తనకు ఉన్న నమ్మకం అలా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘ఈ సినిమాకి ఇప్పటికే మూడు ట్యూ¯Œ ్స పూర్తి చేశాం’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం’’ అన్నారు జాన్వీ కపూర్. ‘‘బుచ్చిబాబు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్ కొడతాడు’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ఈ ్రపారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, ‘దిల్’ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పకుడు: సుకుమార్, కెమెరా: రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
RC 16 Launching Ceremony: గ్రాండ్గా ప్రారంభమైన బుచ్చి బాబు-రామ్ చరణ్ సినిమా (ఫొటోలు)
-
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబో.. గ్రాండ్గా పూజా కార్యక్రమం!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ సినిమా తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈవెంట్కు ప్రముఖ దర్శకుడు శంకర్, సుకుమార్, చిరంజీవి, అల్లు అరవింద్, బోనీకపూర్,సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్తో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రామ్చరణ్ మాట్లాడారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని చెర్రీ అన్నారు. కాగా.. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్చరణ్ పాత్ర పవర్ఫుల్గా ఉండనుంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించనుండగా... మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాను వర్కింగ్ టైటిల్ ఆర్సీ16తో రూపొందించనున్నారు. The stunning #RC16 pair looks soo adorable 😍✨@AlwaysRamCharan #JanhviKapoor #RC16PoojaCeremony #GameChanger pic.twitter.com/cdmMcnLajZ — Aℓω︎α︎yѕ🕊️ (@ALWAYSRAM16) March 20, 2024 They Called him a Mad Mann 🔥#RC16 #RC16PoojaCeremony pic.twitter.com/QipGxd9nzx — Raees (@RaeesHere_) March 20, 2024 -
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
రామ్చరణ్ పెద్ది?
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తారు. కాగా ఈ నెల 20న హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరగనుందని తెలిసింది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని, ఈ నెల 27న రామ్చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్పై స్పష్టత వచ్చే చాన్స్ ఉందని భోగట్టా. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం వైజాగ్లో జరుగుతున్న ‘గేమ్చేంజర్’ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement