breaking news
floods
-
ప్రమాదకరంగా గోదావరి వరద ఉధృతి
రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): ఎగువన కురిసిన వర్షాల కారణంగా ధవళేశ్వర వద్ద వరద ఉధృతి ప్రమాదకరంగా మారింది. గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 12.60 అడుగులకు చేరగా, 11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరొకవైపు కోనసీమలో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల కాజ్వేలపైకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో చాకలిపాలెం-కనకాయలంక కాజ్వేపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి వరద ఉగ్రరూపంఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లో గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా . ఎద్దువాగు, గుండేటి వాగుల పొంగి ప్రవహిస్తున్నాయి. వేలేరు నుంచి సీతారామనగర్కు రాకపోకలు నిలిచపోయాయి. దాంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. -
అస్సాంలో వరద విలయం.. 82 మంది మృతి
దిస్పూర్: అస్సాంలో భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 82కి చేరుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,92,799 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో వరద తీవ్రతఅధికారుల వివరాల ప్రకారం.. అసోంలోని శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, చరైడియో జిల్లాలలో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వాటిలో అత్యధికంగా చరైడియో జిల్లాలో 77,456 మంది, తర్వాతి స్థానాల్లో శివసాగర్లో 63,492 మంది, జోర్హాట్లో 34,067 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. వరదల ప్రభావితమైన వారి కోసం 54 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని అందులో దాదాపు 13,000 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. మరో 26 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పనిచేస్తుండగా, వాటి ద్వారా 5,384 మందికి సాయం అందుతోందన్నారు. బాధితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.వరద బాధితులకు ప్రభుత్వ ఊరట వరద పీడిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్య ఘర్ పెండింగ్ రాష్ట్ర సబ్సిడీ కింద 9,289 మంది లబ్ధిదారులకు రూ. 41.67 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDCL) ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా మంగళవారం (ఆగస్టు 4, 2026) నాటికి పూర్తి చేయాలని పవర్ డిపార్ట్మెంట్ను సీఎం ఆదేశించారు. అంతకు ముందు ప్రధాని మాట్లాడుతూ వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లోని వరద బాధితులందరికీ రుణాలు చెల్లించడంలో ఆరు నెలల మారటోరియం వర్తింపజేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. -
కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి!
ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా పలుచోట్ల సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇడుక్కి జిల్లా వాగమండ్లో కొండచరియలు విరిగిపడి ఒక ఇంటిపై పడటంతో వైకోమ్కు చెందిన ప్రభాకరన్ నాయర్ మృతి చెందారు. అయితే ఆయన మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అదూర్మలలో మరో కొండచరియ విరిగిపడటంతో ఒక వ్యక్తి గల్లంతయ్యారు. కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారిపై అడిమాలి సమీపంలోని మాచిప్లావు వద్ద కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Keralam: Heavy rainfall triggers widespread damage in Idukki district. One person was killed after a landslide struck a house at Vagamon in the district. The deceased has been identified as Prabhakaran Nair, a native of Vaikom. His body has not yet been recovered.A… pic.twitter.com/0TVGJSQjE8— ANI (@ANI) August 1, 2026మరోవైపు కొట్టాయం జిల్లా పయ్యనితోటంలో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా, అతని తల్లి శిథిలాల కింద కూరుకుపోయారు. జోసెఫ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, అతని తల్లి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉప్పుతుర ప్రాంతంలో పుల్లకాయరు నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొక్కయార్ వంతెన మునిగిపోయింది. చుట్టుపక్కల ఆరు ఇళ్లు జలమయం కావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఎరట్టుపేట, కాంజిరపల్లి, కూట్టిక్కల్, ఎరుమేలి ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వందలాది నివాసాలు నీట మునిగాయి. ఎరట్టుపేటలో అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని చిన్న ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేశారు.ఇది కూడా చదవండి: కుల్గామ్ ఉగ్రదాడి: ఆస్పత్రిలో మరో కార్మికుడు మృతి -
ఇన్స్టాలో 90% విరాళాల ఖాతాలు అనుమానాస్పదమే!
అస్సాంను ఇటీవల ముంచెత్తిన వరదలు ఒకవైపు వేలాది కుటుంబాలను దారుణంగా దెబ్బతీస్తే మరోవైపు సైబర్ నేరగాళ్లకు, అక్రమార్కులకు కాసులు కురిపించే అవకాశంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఆదుకోవాలనే పౌరుల ఉదారతను ఆసరాగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ వేదికగా భారీ విరాళాల దందా సాగుతోంది. నిధులు సేకరిస్తున్న ఖాతాల్లో ప్రతి పదింటిలో తొమ్మిది (దాదాపు 90%) వ్యాపార ఖాతాలు సందేహాస్పద రీతిలో ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.తనిఖీల్లో వెల్లడైన అంశాలుపరిశోధన బృందం విరాళాలు సేకరిస్తున్న 40 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను సమగ్రంగా పరిశీలించగా అందులో 35 ఖాతాలు ప్రధాన భద్రతా ప్రమాణాల్లో విఫలమయ్యాయి. విరాళాలు కోరుతున్న 40 ఖాతాల్లో 38 ఖాతాలు కేవలం జులైలోనే కొత్తగా ప్రారంభించినవి. వీటి వెనుక ఎలాంటి గుర్తింపు లేదా పూర్వాపరాల రికార్డులు లేవు. 39 ఖాతాలు నమోదు చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు లేదా ట్రస్టుల ఖాతాలకు కాకుండా వ్యక్తిగత యూపీఐ ఐడీలకు నిధులు మళ్లించేలా డిజైన్ చేశారు. 36 ఖాతాల్లో అందించిన ఫోన్ నంబర్లు అసలు పనిచేయడం లేదు లేదా సంప్రదించడానికి వీలు లేకుండా ఉన్నాయి.పాత వీడియోలు.. తప్పుడు ప్రచారాలుప్రజల సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు ఈ ఖాతాదారులు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సమయంలో ఉచిత ఆహార పంపిణీకి సంబంధించిన వీడియోలను రీ-ఎడిట్ చేసి అస్సాం వరద బాధితులకు సాయం చేస్తున్నట్లుగా ప్రచారం చేయడం గమనార్హం. మరికొందరు స్థానిక యంత్రాంగం ఉచితంగా పంపిణీ చేస్తున్న సహాయక సామగ్రినే తాము ప్రజల విరాళాలతో కొనుగోలు చేసి ఇస్తున్నట్లు క్లైమ్ చేస్తున్నారని స్థానిక ఇన్ఫ్లుయెన్సర్లు ఆరోపిస్తున్నారు.ఇలాంటి ప్రకృతి విపత్తుల వేళ దాతలు సోషల్ మీడియాలోని ప్రైవేట్ ఖాతాలకు నేరుగా డబ్బులు పంపకూడదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద నమోదైన ప్రామాణిక స్వచ్ఛంద సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలను సరిచూసుకున్న తర్వాతే విరాళాలు అందించడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: బ్యాంక్ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు -
చెట్టు మీద భర్త.. వరదలో కొట్టుకుపోయిన భార్యాపిల్లలు
క్షణాల్లో వచ్చిన వరద ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా.. తండ్రి చెట్టును పట్టుకుని బయటపడగలిగాడు. కానీ.. అందులో ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం అతడి కళ్ల ముందే ప్రవాహంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. యవత్మాల్ జిల్లాలో వరద ఉధృతికి ఓ ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా.. తండ్రి మాత్రం సమయస్ఫూర్తితో చెట్టును పట్టుకుని బయటపడ్డాడు. అయితే తన కళ్ల ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి వెళ్తున్న అవినాశ్ ఖండారే కుటుంబం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. అవినాశ్ తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ.. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయడంలో పొరపాటు జరగడంతో వాహనం ముందుకు కదిలింది. వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి ఉధృతమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.కారు కొట్టుకుపోతున్న సమయంలో అవినాశ్ ఖండారే అప్రమత్తమై సమీపంలోని ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే కారులో ఉన్న భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలను మాత్రం రక్షించలేకపోయాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా.. ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గగా.. స్థానికులు చెట్టు మీద ఉన్న అవినాశ్ను గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం వరదలో కొట్టుకుపోయిన వాహనాన్ని గుర్తించారు. కారుతో పాటు మాధవి, కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
ఉప్పొంగిన గోదావరి.. వరదలో చిక్కుకున్న 50 మంది
-
తెలంగాణలో వర్షాల బీభత్సం.. బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక
-
మెండుగా వానలు.. నిండుగా ప్రాజెక్టులు!
సాక్షి, హైదరాబాద్ /గద్వాల/మంచిర్యాలరూరల్: బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది..గలగలా గోదావరి పరుగులు పెడుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేని వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు వరదెత్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. దీంతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు జలాశయానికి 30,194 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రం 6 గంటల వరకు 89,240 క్యూసెక్కులకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 827.26 అడుగులకు చేరగా నిల్వలు 46.82 టీఎంసీలకు పెరిగాయి.ప్రాజెక్టు నిండాలంటే మరో 168 టీఎంసీల నీరు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలోకి వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్లోకి 82,111 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1.1లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. నారాయణపూర్ డ్యామ్లోకి 1.1 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఉజ్జయినీ జలాశయానికి 33,803 క్యూసెక్కుల వరద వస్తుండగా, 31,600 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో పైమూడు జలాశయాలకు దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 94,733 క్యూసెక్కుల వరద పోటెత్తింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, 7.66 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ 85,421 క్యూసెక్కుల నీటిని 12 గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా దిగువ వదులుతున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో నిలకడక వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్లోకి 14,922 క్యూసెక్కుల నీరు చేరుతుండగా..గరిష్ట నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలకుగాను 36.04 టీఎంసీలకు నిల్వలు చేరాయి. జూరాల నుంచి విడుదల చేస్తున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. దిగువన ఉన్న నాగార్జునసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136.99 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ గోదావరిలో.... మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ గోదావరిలో క్రమంగా వరద పెరుగుతోంది. దిగువ పరీవాహకంలోని ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారం వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకల్లో వరద ఉధృతమవుతోంది. గోదావరిపై మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టులోకి 33,328 క్యూసెక్కుల వరద చేరుతుండడంతో గరిష్ట సామర్థ్యం 102.73 టీఎంసీలకు గాను 79.79 టీఎంసీలకు నిల్వలు పెరిగాయి. ఉపనది సింగూరులో వరద ప్రారంభం కాకపోవడంతో రాష్ట్రంలోని సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఇంకా వరద ప్రారంభం కాలేదు.ఎగువ గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 75,432 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 80.5 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గానూ 21.51 టీఎంసీలకు నిల్వలు చేరాయి. మరో ఉపనది కడెంపై ఉన్న కడెం ప్రాజెక్టుకు 1.44 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 4.7 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గాను 1.91 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 16 గేట్లు ఎత్తడం ద్వారా 1.48 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కడెం నుంచి 1.56 లక్షల క్యూసెక్కులు, గోదావరి నుంచి 2.07 లక్షల క్యూసెక్కులు కలిపి మొత్తం 3.63 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 20.18 టీఎంసీల గరిష్ట నిల్వ సామరాŠథ్య్నికి గాను 19.09 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ నంది పంప్హౌస్ ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరుకు తరలిస్తున్నారు. ప్రాజెక్ట్లోని 62 గేట్లలో 15 గేట్లు ఎత్తి 1.57 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.గోదావరి–ప్రాణహిత నదుల సంగమ స్థలం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్లోకి ప్రాణహిత నుంచి 2.12 లక్షల క్యూసెక్కుల వరద రాగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాణహితకు ఇంద్రావతి ప్రవాహం తోడు కావడంతో దిగువన ఉన్న సమ్మక్క బరాజ్కు 8.05 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ బరాజ్కు 3.8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండంతో వచ్చింది వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. ప్రాణహిత, ఇంద్రావతి వరదెత్తిన నేపథ్యంలో శుక్రవారం నాటికి భద్రాచలం వద్ద వరద 10 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశముంది. -
బస్సులోకి వరద నీరు.. ఇరుక్కుపోయిన జనం.. వైరల్ అవుతున్న వీడియో
-
అస్సాం వరదల వెనుక భయంకర నిజాలు
అస్సాం మరోసారి జల విలయాన్ని చవిచూస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది వరదలను ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రం.. ఈసారి మాత్రం ఇటీవలి కాలంలోనే అత్యంత తీవ్ర వరద పరిస్థితుల్లో ఒకదాన్ని ఎదుర్కొంది. గ్రామాలకు గ్రామాలు నీట మునగడం, వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం.. అస్సాం వరదల భీకర రూపాన్ని చూపిస్తున్నాయి.ఈసారి వరదల బారిన పడి ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీట మునగగా.. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలిపోయాయి. 37 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ భూమి నీట మునిగింది. పశుసంపద, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి వరద నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే అస్సాం వరదలు కేవలం భారీ వర్షాల ఫలితమేనా? లేదంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కూడా ఈ విపత్తు తీవ్రతను పెంచుతున్నాయా?.. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినా వరదలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?.. Amid Assam's devastating floods, a father was seen swimming through floodwaters while carrying his children in a large tub to safety. The viral visuals have become a powerful symbol of a parent's courage, sacrifice, and unconditional love.#AssamFloods #FloodRescue #Father pic.twitter.com/uz5ZousOSM— Apka Aashish (@ApkaAashish) July 28, 2026అస్సాం భౌగోళిక పరిస్థితులే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మార్చాయి. టిబెట్ నుంచి భారత్లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర.. అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల నుంచి భారీగా నీటిని తీసుకొస్తుంది. దీనికి అస్సాంలో 50కిపైగా ఉప నదులు కలుస్తాయి. వర్షాకాలంలో ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది.బ్రహ్మపుత్ర నది మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భారీగా ఇసుక, మట్టిని (సిల్ట్) మోసుకొస్తుంది. దీంతో నది లోతు తగ్గి.. తక్కువ నీటిని మాత్రమే మోయగల పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నది తన గట్లను దాటి ప్రవహిస్తుంది.40 శాతానికి పైగా భూభాగం..అస్సాంలో వరద సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఒక గణాంకం చాలు. రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 39.58 శాతం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా గుర్తించారు. ఇది దేశ సగటు వరద ముప్పు ప్రాంతంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి ఏడాది సగటున లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. అంటే అస్సాంలో వరదలు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక వాస్తవం కూడా.ఈసారి ఎందుకు ఇంత భయంకరంగా?ఈ ఏడాది అస్సాం, పొరుగు నాగాలాండ్ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో భారీగా వర్షం కురవడంతో కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు మైదాన ప్రాంతాలకు చేరింది. దీనికి తోడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం తీరు మారుతోంది. గతంలో కొన్ని రోజుల్లో కురిసే వర్షం ఇప్పుడు కొద్ది గంటల్లోనే భారీగా పడుతోంది. ఇలాంటి ఆకస్మిక వర్షాలు నదులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.ప్రభుత్వం వల్ల కావట్లేదా?వరదలను పూర్తిగా ఆపడం అస్సాం లాంటి ప్రాంతంలో దాదాపు అసాధ్యం. కానీ నష్టాన్ని తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.👉పాతబడుతున్న కట్టలువరదలను నియంత్రించేందుకు అస్సాంలో వేల కిలోమీటర్ల మేర కట్టలు (ఎంబాంక్మెంట్లు) నిర్మించారు. రాష్ట్రంలో దాదాపు 4,473 కిలోమీటర్ల మేర కట్టలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది భారీ ప్రవాహాలతో కొన్ని చోట్ల ఇవి బలహీనపడుతున్నాయి. కట్టలు తెగిపోవడమో, బలహీన ప్రాంతాల్లో నీరు చొచ్చుకురావడం వల్లనో ఒక్కసారిగా గ్రామాలు మునిగిపోతున్నాయి.👉తాత్కాలిక చర్యలకే పరిమితంఅస్సాం వరద నిర్వహణలో ఎక్కువగా సహాయక చర్యలు, కట్టల మరమ్మతులు, తాత్కాలిక రక్షణ పనులపైనే దృష్టి ఉందనే విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాలైన నది నిర్వహణ, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ, వరద ప్రాంతాల ప్రణాళిక వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి.👉నదీ కోత మరో పెద్ద సమస్యఅస్సాంలో వరదలతో పాటు నదీ కోత కూడా పెద్ద ప్రమాదమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఏటా భూమిని కోతకు గురిచేస్తాయి. దీంతో ప్రజలు ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నారు.ఆ మార్పులు పెంచుతున్న ముప్పుప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాం వంటి నది పరివాహక ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో సమస్య కేవలం “వరద వస్తుందా?” అన్నది కాదు.. “ఎంత తీవ్రంగా వస్తుంది?” అన్నదే కీలక ప్రశ్నగా మారుతోంది.కావాల్సింది కొత్త విధానంఅస్సాం వరద సమస్యకు కేవలం మరిన్ని కట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. నదుల సహజ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరం. ప్రస్తుతం సహాయక చర్యలతో ప్రాణాలను కాపాడటం ముఖ్యం. కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే.. వరదలను ఎదుర్కొనే విధానంలో మూలమైన మార్పులు అవసరం.అస్సాం వరదలు మరోసారి చెప్పే నిజం ఒక్కటే.. ప్రకృతిని పూర్తిగా నియంత్రించలేం.. కానీ నష్టాన్ని తగ్గించే సిద్ధతను మాత్రం పెంచుకోవచ్చు. -
1.20 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..
ధవళేశ్వరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం రాత్రి కాటన్ బ్యారేజ్ నుంచి 1,20,608 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో పాటు ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి ఉధృతి పెరుగుతోంది.ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో కూడా నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతూ సోమవారం రాత్రికి 17.60 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మంగళవారం నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాటన్ బ్యారేజ్ వద్ద సోమవారం రాత్రి 10.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 5,000, మధ్య డెల్టాకు 2,800, పశ్చిమ డెల్టాకు 7,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
అసోంలో వరద భీభత్సం: 61కి చేరిన మృతుల సంఖ్య
డిస్పూర్: అసోంలో వరద పరిస్థితి అత్యంత భీకరంగా మారింది. గడచిన 24 గంటల్లో మరో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఈ ఏడాది వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 61కి చేరింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఏఎస్డీఎంఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 7,05,100 మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. చరైదేవ్ జిల్లాలో ఏడుగురు, శివసాగర్లో ఆరుగురు, జోర్హాట్లో ఒకరు వరద నీటిలో మునిగి మరణించారు. శివసాగర్ జిల్లాలో దాదాపు 3,50,000 మంది వరద బారిన పడగా, ఇది అత్యధికంగా ప్రభావితమైన జిల్లాగా నిలిచింది. చరైదేవ్లో 1,90,000 మంది, జోర్హాట్లో 1,30,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో సుమారు 856 గ్రామాలు నీటమునిగాయి. 56,606 హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమి దెబ్బతిన్నది.రవాణా వ్యవస్థ, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిఖౌ, ధన్సిరి, కుషియారా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో 7 జిల్లాల్లో 363 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, 1,15,200 మందికి పైగా బాధితులకు ఆశ్రయం కల్పించారు. ఆర్డీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే శివసాగర్, నాజిరా నియోజకవర్గాల్లో ఇంకా వేలాది మందికి సహాయక సామగ్రి అందలేదని, సుమారు 80,000 మందికి ఇంకా సహాయం చేరాల్సి ఉందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. -
మహోగ్రంగా బ్రహ్మపుత్ర!
దేశంలో అనేక ప్రాంతాలు వాన జాడలేక ఇబ్బంది పడుతుంటే అస్సాం ఎప్పట్లానే వరద నీటిలో తేలియాడుతోంది. బ్రహ్మపుత్ర నది మహోగ్రరూపం దాల్చి విరుచుకుపడటంతో జనావాసాల్లోకి వరద నీరు ప్రవేశించి 9 లక్షలమందికిపైగా జనం ఇళ్లూ వాకిళ్లూ వదిలి పోవాల్సివచ్చింది. ఇంతవరకూ 47 మంది మరణించగా, దాదాపు 25,000 హెక్టార్ల పంట నీట మునిగింది. మొత్తంగా 11 జిల్లాలు వరదలతో దెబ్బతినగా, శివసాగర్, జోర్హాట్, దిబ్రూగఢ్, చారైదేవ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హిమాలయా ల్లోని కైలాసశిఖరిలో పుట్టి, ప్రపంచంలోని అతి ఎత్తయిన ప్రాంతంలో పెను వేగంతో ప్రవహిస్తూ అటు తర్వాత అస్సాం మైదాన ప్రాంతాలకు ఆ నది చేరుతుంది. అక్కడ వేగం తగ్గినా అప్పటికే అది ఒండ్రుమట్టినీ, బురదనూ పోగేసుకొస్తుంది. ప్రపంచంలోని ఏ నదితో పోల్చినా అది తీసుకొచ్చే ఒండ్రుమట్టి, బురద పరిమాణం చాలా ఎక్కువ. ఇదంతా నదీ ప్రవాహ క్రమంలో ఎక్కడికక్కడ మేటలేస్తూ వస్తుంది. కాలం గడిచేకొద్దీ ప్రవాహమార్గం ఇరుకై ఆ నది దారి మార్చుకోవటం మొదలుపెడుతుంది. అందుకే బ్రహ్మపుత్రను స్థానికులు వలస నది అంటారు. ఎగువ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు ఒక్కసారిగా విరుచుకుపడటం పర్యవసానంగా కుంభవృష్టి, మంచు పర్వతాలు కరిగి పోవటం, భారీ వర్షాలు పడటం అస్సాంకు రివాజు. ఈసారి మేఘాలయ తదితరప్రాంతాల్లో పడిన భారీవర్షాలు వరదలకు కారణమయ్యాయి. బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతం దేశాలూ, రాష్ట్రాలూ దాటి విస్తరించివుంది. ఇది ప్రకృతి శాపమని, ఇందులో మనిషి నిమిత్తమాత్రుడని చెప్పే మాటల్లో నిజం లేదు. వేరే దేశాల సంగతి వదిలి, కనీసం నదీపరివాహ రాష్ట్రాలన్నీ కలసికట్టుగా దృష్టి పెడితే బ్రహ్మపుత్ర కలగజేసే నష్టాన్ని పరిమిత స్థాయికి కుదించవచ్చు. ఇందుకు భిన్నంగా దాన్ని కేవలం ఒక రాష్ట్రానికి చెందిన సమస్యగా పరిగణించటమే చివరికి కష్టనష్టాలన్నీ అస్సాం భరించాల్సివస్తోంది. వరదల్ని కట్టడిచేసేందుకు కరకట్టల నిర్మాణమే సరైందని ఆరాష్ట్రం అనుకుంటోంది. దశాబ్దాలుగా వాటిపైనే కేంద్రీకరిస్తోంది. కానీ నదీ గమనం మారినప్పుడల్లా ఈ కరకట్టలు నిరుపయోగమవుతున్నాయి. పూడికతీత ప్రధాన సమస్యగా మారుతున్నప్పుడు బురద నియంత్రణ విషయంలో ఏం చేయాలన్నప్రశ్న రావాలి. అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ చెప్పినట్టు ఇది కనీవినీ ఎరుగని ఉత్పాతం. ఆ రాష్ట్రానికి ఏటా వరదలు రివాజే అయినా, ఈసారి ముంచెత్తినంత వరద యాభైయ్యేళ్లలో ఎప్పుడూ లేదు. కానీ సహాయ చర్యలు ఏమంత సజావుగా లేవు. వరద ప్రభావం అధికంగా గల శివసాగర్ జిల్లా మొత్తానికి కేవలం 5 బోట్లు మాత్రమే కేటాయించారు. అధికార యంత్రాంగంనుంచి ముందస్తు హెచ్చరికలు లేకపోవటంవల్ల పశువుల్ని రక్షించుకోవటమైనా, తాము సురక్షిత ప్రాంతాలకు తరలడమైనా జనానికి కష్టమై పోయింది. చుట్టూ సముద్రాన్ని తలపించేలా నీరుంటే, అనేకులు పైకప్పులెక్కి నిస్సహా యంగా చూస్తూ ఉండాల్సివచ్చింది. ఆహారం, నీరు అందించటంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించారన్నది స్థానికుల ఆరోపణ. మొత్తం 872 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగి దీవుల్ని తలపిస్తున్నాయంటే ఈ తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తుంది. అడవుల పరిరక్షణ, అడవుల పెంపకం వంటివి అత్యంత కీలకమైన ప్రాథమిక రక్షణ కవచాలుగా తోడ్పడతాయి. కేవలం అవి మాత్రమే సంపూర్ణంగా నియంత్రిస్తాయను కోవటం సరైంది కాకపోయినా, నదీ పరివాహ ప్రాంతంలో ఉండే పర్వత శిఖరాల్లో దట్టమైన అడవులుంటే చెట్ల వేళ్లు మట్టిని గట్టిగా పట్టి ఉంచటంవల్ల కొండచరియలు విరగటం, వర్షపు నీటితోపాటు మట్టి కొట్టుకుపోవటం తగ్గుతుంది. హిమాలయాలు భూకంప ప్రభావిత జోన్లో ఉండటంవల్ల ఆ ప్రాంతంలోని కొండలు అత్యంత బలహీనమైన నాణ్యత కలిగిన మట్టి, రాళ్లతో నిండి ఉంటాయి. నదీ తీరం పొడవునా వెదురు, గడ్డి జాతుల మొక్కల పెంపకంవల్ల కోతను అరికట్టడం సాధ్యమవుతుంది. ఎన్ని చేసినా తాత్కాలిక ఉపశమనానికీ, నష్టాన్ని నియంత్రించటానికీ మాత్రమే అవి తోడ్పడ తాయి. మనం చేయాల్సిందల్లా పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడం. దాన్ని విస్మరించి చేసే ఏ చర్య అయినా మెరుగైన ఫలితాన్నివ్వలేదు. -
గుజరాత్ లో వర్ష బీభత్సం నీట మునిగిన ఇళ్లు, కార్లు
-
గుజరాత్లో నీట మునిగిన కార్లు.. వైరల్ వీడియో
వల్సాడ్: గుజరాత్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్ర దక్షిణ భాగంలో ఉన్న వల్సాడ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. వల్సాడ్లోని ఉంబర్గావ్ ప్రాంతంలో గురువారం ఉదయానికి కేవలం 16 గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,100 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో బాధితులను ప్రభావిత ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల పలు లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. వాపి ప్రాంతంలో భారీ వరదల కారణంగా పార్క్ చేసిన 50 కార్లకు పైగా నీట మునిగాయి. ఆ వీడియోలో ఓ భవనం పార్కింగ్ ఏరియా పూర్తిగా నీటితో నిండిపోయి.. నీటి మట్టం కార్ల కిటికీల వరకు చేరినట్లు కనిపిస్తోంది. పార్కింగ్ వెలుపల ఉన్న పరిసర ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) డేటా ప్రకారం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వల్సాడ్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది.ఔరంగా, పార్, దమన్ గంగ వంటి నదులు పొంగి పొర్లడంతో వల్సాడ్లో భారీగా వరదలు వచ్చాయి. సురత్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2,200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ గుజరాత్లోని వల్సాడ్, నవసారి, డాంగ్స్, సూరత్, తాపి జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేయడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు.Extreme torrential downpours struck Vapi in southern Gujarat, dumping nearly nine inches of rain that engulfed cars and washed livestock away in surging currents. The sudden deluge has caused widespread flooding throughout several areas of Valsad district. pic.twitter.com/6GZYIMHRcj— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) July 23, 2026 -
అస్సాంలో భీకర వరదలు: 21 మంది మృతి
దిస్పూర్: అస్సాంలో వరద పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్బరస్ట్ కారణంగా సంభవించిన వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. బుధవారం నాటి వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. ఏడాది వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం 31కి పెరిగింది. రాష్ట్రంలోని మొత్తం 16 జిల్లాల్లో దాదాపు 5,64,600 మందికి పైగా ప్రజలు ఈ వరదల బారిన పడ్డారు. శివసాగర్ జిల్లాలో గత 24 గంటల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, చరైడియోలో ఐదుగురు, గోలాఘాట్లో ఇద్దరు, జోర్హాట్లో ఒకరు మరణించారు.44 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 872 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. అత్యధికంగా శివసాగర్లో 3,59,535 మంది, జోర్హాట్లో 87,662 మంది, చరైడియోలో 72,646 మంది వరద ప్రభావానికి గురయ్యారు. బాధితుల సహాయార్థం 71 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయగా, వాటిలో 12,284 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరితో పాటు 202 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కూడా పనిచేస్తున్నాయి.పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ నేరుగా రంగంలోకి దిగారు. చరైడియో, నజిరా, శివసాగర్, సోనారి, జోర్హాట్ మరియు ట్యోక్ తదితర అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలు, సహాయ శిబిరాలను సందర్శించి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సహాయక, రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.వరద నీరు రైలు పట్టాలను ముంచెత్తడంతో వరుసగా రెండో రోజు కూడా రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. శివసాగర్ జిల్లాలోని సిమలుగురి ప్రాంతంలో తీవ్రమైన వరద కారణంగా సిమలుగురి-నమ్టియాలి, సిమలుగురి-సెలెంఘాట్ మార్గాల్లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, ఈ ప్రత్యేక రైళ్లు శుక్రవారం వరకు అందుబాటులో ఉంటాయన్నారు తెలిపారు.ఇది కూడా చదవండి: బాండీ బీచ్ హైదరాబాదీ ‘హీరో’కు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం! -
ప్రకృతి విపత్తు.. ఒకే కుటుంబాన్ని బలిగొన్న వరద విలయం
ఈశాన్య రాష్ట్రం అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చరైదేవో జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా మృతుల సంఖ్య 31కు చేరగా, 16 జిల్లాల్లో 5.64 లక్షల మందికిపైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషాద ఘటన జూలై 21 సాయంత్రం 7 గంటల సమయంలో చరైదేవో జిల్లా టెంగాపుఖురి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్వా అభయపురి గ్రామంలో జరిగింది. భారీ వర్షాల కారణంగా వరద నీరు ఒక్కసారిగా రోహిణి దువారా ఇంట్లోకి చేరింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో కుటుంబ సభ్యులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోహిణి దువారా భార్య తుతుమోని దువారా, కుమార్తె బిదిషా దువారా ఉద్ధృత వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు కుమారులు విద్యుత్ దువారా, బిప్లబ్ దువారా వరద నీటిలోకి దూకినా, వారు కూడా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. దీంతో క్షణాల్లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కనిపించకుండా పోయారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.Flood situation in Upper Assam has become extremely critical. Main SBI branch in Sonari town is now completely submerged. A large number of valuable documents and electronic systems have been damaged. The Army and the Indian Air Force are alert for rescue and relief operations. pic.twitter.com/aY5hC4nf4h— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) July 21, 2026ఘటన జరిగిన వెంటనే జిల్లా వరద నియంత్రణ హెల్ప్లైన్కు పలుమార్లు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం చరైదేవో జిల్లా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ నేహా యాదవ్ను సంప్రదించగా, వెంటనే రెస్క్యూ బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఈ జాప్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. చివరకు గ్రామస్థులే స్వచ్ఛందంగా గల్లంతైన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇదిలా ఉండగా, అస్సాంలో వరద పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, గత 24 గంటల్లో మరో 21 మంది మృతి చెందారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31కు చేరింది. దిఖౌ, దిసాంగ్, బ్రహ్మపుత్ర, బుర్హిదిహింగ్, ధన్సిరి నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరద ముప్పు మరింత పెరిగింది. సహాయక చర్యల్లో భారత వైమానిక దళం, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. వరదల కారణంగా రైల్వే ట్రాక్లు నీటమునిగిపోవడంతో ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో పలు రైళ్ల రాకపోకలు వరుసగా రెండో రోజూ నిలిచిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.𝐔𝐏𝐏𝐄𝐑 𝐑𝐀𝐈𝐋𝐖𝐀𝐘 𝐓𝐑𝐀𝐂𝐊 𝐖𝐀𝐒𝐇𝐄𝐃 𝐀𝐖𝐀𝐘 𝐁𝐘 𝐅𝐋𝐎𝐎𝐃𝐒; 𝐃𝐀𝐍𝐆𝐄𝐑𝐎𝐔𝐒 𝐒𝐈𝐓𝐔𝐀𝐓𝐈𝐎𝐍 𝐀𝐓 𝐍𝐀𝐙𝐈𝐑𝐀–𝐒𝐇𝐈𝐌𝐋𝐔𝐆𝐔𝐑𝐈𝐑𝐄𝐏𝐎𝐑𝐓 | 𝐊𝐊 𝐏𝐋𝐔𝐒+ 𝐃𝐈𝐒𝐀𝐒𝐓𝐄𝐑 𝐃𝐄𝐒𝐊𝐒𝐞𝐯𝐞𝐫𝐞 𝐟𝐥𝐨𝐨𝐝𝐢𝐧𝐠 𝐡𝐚𝐬 𝐜𝐚𝐮𝐬𝐞𝐝 𝐞𝐱𝐭𝐞𝐧𝐬𝐢𝐯𝐞… pic.twitter.com/UOyy2z3UX5— 𝐊𝐚𝐢𝐥𝐚𝐬𝐡 𝐁𝐚𝐠𝐚𝐫𝐢𝐚 (@bagaria_kailash) July 20, 2026 ఇదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం నుంచి చరైదేవో, నజిరా, శివసాగర్, సోనారి, జోర్హాట్, టియోక్ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ప్రజలకు అవసరమైన అన్ని సహాయ చర్యలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అయితే చరైదేవోలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతైన ఘటన, సహాయక బృందాల స్పందనలో ఆలస్యమైందన్న ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. -
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు
కాబూల్: అఫ్గానిస్తాన్ని భారీ వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న (సోమవారం) నూరిస్తాన్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. , మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వివరాలను అక్కడి అధికారులు ప్రకటించారు.భారీ వరదలకు నూరిస్తాన్ 'పరూన్' లో నది ఒడ్డున మార్కెట్లు, హోటళ్లు, వందలాది దుకాణాలు వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతంపూర్తిగా బురదతో నిండిపోయింది. దీంతో వరదలు తగ్గుముఖం పట్టాక క స్థానిక నివాసితులు బురద కుప్పలపై గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. అయితే ఈ వరదలలో పరూన్ నగర మేయర్తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.కాగా సహాయక చర్యలకు సరైన సామాగ్రి లేకపోవడంతో స్థానికులు తమ చేతులతోనే బురదను తొలగిస్తూ గాలింపు చర్యలు చేపట్టడం హృదయవిదారకంగా కనిపిస్తోంది. కాగా ఈ ఘటనపై తాలిబన్ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ, నూరిస్తాన్ ప్రాంతంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని బాధితులను రక్షించడానికి మరియు వారి ఆస్తులను కాపాడటానికి సంబంధిత ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు.భారీ వర్షాలు పడే అవకాశంఆ దేశ వాతావరణ పరిస్థితులపై విపత్తు నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రావిన్సుల్లో భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు నదీ తీరాలకు వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. -
కాఠ్మాండు రణరంగం: అటు వరద ముంపు.. ఇటు అణచివేత!
కాఠ్మాండు: నిలువ నీడ లేని నిరుపేదలను పునరావాసం కల్పించకుండానే బలవంతంగా వారిన ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారని, సామాజిక కార్యకర్తలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నేపాల్లో వందలాది మంది యువతీ యువకులు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. కాఠ్మాండులో నివాసాల ఖాళీ ప్రక్రియను నిరసిస్తూ, బాధిత నిరుపేదలకు న్యాయం చేయాలని, గృహ హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కార్యాలయం వెలుపల భారీ ఎత్తున బైఠాయించారు.‘జాయింట్ నేషనల్ స్క్వాటర్స్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో కాఠ్మాండులోని సింహదర్బార్ సెక్రటేరియట్ సమీపంలో ఉన్న మైతీఘర్ మండలా వద్ద ఈ నిరసన ప్రదర్శన జరిగింది. పేద కుటుంబాలను వేధించడం ఆపాలని, మానవ హక్కులను గౌరవించాలని, అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, నిరాశ్రయులైన నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలని నిరసనకారులు ప్లకార్డులతో డిమాండ్ చేశారు.పోలీసుల చర్యలతో పెరిగిన ఉద్రిక్తతలుశుక్రవారం రాత్రి కాఠ్మాండులోని కీర్తీపూర్ లో ఉన్న ఒక ప్రభుత్వ తాత్కాలిక పునరావాస కేంద్రం వరద ముంపునకు గురైంది. అక్కడ సుమారు 150 మంది నిరుపేదలు ఆశ్రయం పొందుతున్నారు. భద్రతా సిబ్బంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ, మరుసటి రోజు పరిస్థితిని సమీక్షించడానికి వెళ్లిన ‘జెన్ జీ’యువ సామాజిక కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, పలువురిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ లాఠీఛార్జ్లో ఒక నిరసనకారుడి ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు.పోలీసుల చర్యలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ కుమార్ థాపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను ఖండిస్తూ, అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆదివారం నాడు కోశి ప్రాంతంలోని మోరంగ్ జిల్లా పోలీసు కార్యాలయం వెలుపల శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివాదానికి ప్రధాన కారణం ఇదే..ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన నివాసాల ఖాళీ ప్రక్రియే ప్రస్తుత వివాదానికి కారణం. ఏప్రిల్ నెలలో కాఠ్మాండు లోయతో పాటు నేపాల్లోని ఇతర ప్రాంతాలలో ఉన్న పేదల బస్తీలను అధికారులు ఖాళీ చేయించారు. దీనివల్ల సుమారు 2,600 కుటుంబాలకు చెందిన 15,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో వందలాది మందిని తాత్కాలిక కేంద్రాలకు తరలించిన ప్రభుత్వం, జూలై 6 లోగా వాటిని కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే, శాశ్వత పునరావాస ప్రణాళిక ఏదీ లేకపోవడంతో డజన్ల కొద్దీ కుటుంబాలు ఇప్పటికీ ఆ తాత్కాలిక కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. -
చైనాపై ప్రకృతి విలయం.. టైఫూన్ దెబ్బకు అతలాకుతలం
చైనాలో ప్రకృతి విలయం కొనసాగుతోంది. శక్తివంతమైన టైఫూన్ బవి (Typhoon Bavi) తూర్పు తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు, చెట్లు విరిగిపడటం, రవాణా అంతరాయాలు చోటుచేసుకున్నాయి.TyphoonBavi.. టైఫూన్ బవి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు సుమారు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అనంతరం తుపాను బలహీనపడి తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారినప్పటికీ, భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో జెజియాంగ్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూకింగ్ ప్రాంతంలో వందల సంఖ్యలో చెట్లు నేలకూలగా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. అత్యవసర సిబ్బంది భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేసే పనులు చేపట్టారు.#China evacuated more than 1 million people & issued high alerts as eastern China braced for #TyphoonBavi, which brought strong winds and rain to #Japan's southern islands and #Taiwan. #floods #Phillipines #typhoon #Bavi #Beijing #heavyrain pic.twitter.com/hjSWM5y1kQ— Salar News (@EnglishSalar) July 11, 2026టైఫూన్ దెబ్బకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. విమాన సర్వీసులు రద్దయ్యాయి, హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షాంఘైలోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దు చేసినట్లు సమాచారం. చైనాతో పాటు తైవాన్, జపాన్ దక్షిణ దీవులపై కూడా టైఫూన్ ప్రభావం చూపింది. తైవాన్లో బలమైన గాలులు, వర్షాల కారణంగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. వాతావరణ నిపుణులు మరో హెచ్చరిక జారీ చేశారు. తుపాను బలహీనపడినప్పటికీ తూర్పు చైనా ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం చైనా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచి, ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ప్రకృతి ప్రకోపం నుంచి కోట్లాది మంది ప్రజలను రక్షించేందుకు భారీ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి.🇹🇼 Typhoon Bavi is battering Taiwan, forcing more than 14,000 people to evacuate. Keelung is being lashed by fierce winds and heavy rain, while over 27,000 households are already without power. 🌪️⚠️ #TyphoonBavi #Taiwan #Breaking pic.twitter.com/VU1Nrd0AkB— 呀婷 (Ya-Ting) (@YaTing542311) July 11, 2026Nature returning the trash with gigantic waves during the arrival of Typhoon Bavi in Taizhou, Zhejiang Province, China 🇨🇳 , on July 11, 2026.#TyphoonBavi pic.twitter.com/aX9ulp23gN— 🄲🄾🄻🄾🄽🄴🄻 🄱🄾🄶🄴🅈 (@alfadelta0108) July 11, 2026 -
పహల్గామ్పై ప్రకృతి దాడి.. పర్యాటకుల తరలింపు!
పహల్గామ్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. దీనివల్ల స్థానికంగా ఉన్న పలు హోటళ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే, పర్యాటకులందరూ సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం సాయంత్రం 6:00 గంటల నుంచి రాత్రి 9:30 గంటల మధ్య ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలోనే రాత్రి 8:00 నుంచి 9:00 గంటల మధ్య ఒక్కసారిగా వరద ముంచెత్తింది. పహల్గామ్లోని రావూరా, దేహ్వాథూ అటవీ ప్రాంతాల్లో మేఘ విస్ఫోటనం సంభవించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు నిపుణులు భావిస్తున్నారు.ఈ భారీ వర్షం కారణంగా స్థానిక వాగు ఉధృతంగా ప్రవహించి, బట్కుట్ వద్ద లిద్దర్ వాగులో కలిసింది. వరద నీరు కనీసం 3 నుంచి 4 హోటళ్లు, కొన్ని ఇళ్లలోకి చొరబడింది. హోటళ్లలోకి నీరు చేరిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత కొన్ని గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శేషనాగ్, లిద్దర్ వాగుల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇవి ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే దిగువనే ప్రవహిస్తున్నప్పటికీ, అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. Some videos from Pahalgam where flash floods struck this evening. https://t.co/uzn8Ygo5A4 pic.twitter.com/cUZEzr7qIS— Kashmir Weather (@Kashmir_Weather) July 11, 2026దోడా జిల్లాలోనూ ఆకస్మిక వరదలుఇటీవలే జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు థాత్రి పట్టణ ఎగువ ప్రాంతం ఆకస్మిక వరదల బారిన పడింది. ఈ వరద ధాటికి పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రాళ్లు, బురద, వ్యర్థాలు కొట్టుకువచ్చి థాత్రి పట్టణంపై పడ్డాయని అధికారులు తెలిపారు. బురద, బండరాళ్లు ఇళ్లు, దుకాణాలను ఢీకొట్టడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్డు పక్కన నిలిపిన పలు వాహనాలు బురద కింద చిక్కుకోగా, కొన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయి చీనాబ్ నదిలో కలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ హఠాత్ పరిణామంతో థాత్రి సమీపంలో డోడా-కిష్త్వార్ రహదారి మూతపడి రవాణా నిలిచిపోయింది. జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఇతర సహాయక సంస్థలతో కలిసి రహదారిని పునరుద్ధరించేపనులు చేపట్టారు. -
చైనాకు చుక్కలు..! ఒక వైపు వరదలు.. మరోవైపు విషసర్పాలు
-
పాముల రాజ్యం.. కోట్ల వ్యాపారం.. ఒక్క దెబ్బతో తారుమారు!
పాములు అంటే భయంతో మనం ఆమడ దూరం పరుగులు పెడతాం. కానీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పాములే ఒక పెద్ద వ్యాపారం. ముఖ్యంగా చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పాములను ప్రత్యేకంగా పెంచే స్నేక్ ఫారాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఔషధ పరిశ్రమ, శాస్త్రీయ పరిశోధనలు, పాము విషం సేకరణ, చర్మ ఉత్పత్తులు వంటి అవసరాల కోసం వేల సంఖ్యలో పాములను పెంచుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే..చైనా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల ధాటికి ఓ పాముల పెంపక కేంద్రం దెబ్బతింది. రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో 900కు పైగా పాములు బయటకు వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బయటకు వచ్చిన వాటిలో కొన్ని విషపూరిత జాతులకు చెందిన పాములు ఉండటంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక, వరద నీటిలో పాములు కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.“స్నేక్ విలేజ్”..అయితే, చైనాలో పాముల పెంపకం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన వృత్తిగా మారింది. ముఖ్యంగా జెజియాంగ్ ప్రావిన్స్లోని జిసికియావో (Zisiqiao) ప్రాంతం పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. దీనిని చాలా మంది “స్నేక్ విలేజ్”గా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు తరతరాలుగా పాములను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు రకాల సర్పాలను ప్రత్యేక ఫారాల్లో ఉంచుతారు. జిసికియావో గ్రామంలో పాములను పెంచి ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రతి వ్యక్తి సుమారు 30వేలకంటే ఎక్కువ పాములను పెంచుతారని చెబుతారు. ఒక లీటరు విషం ఏకంగా రూ. 3.5 కోట్లు వరకు ఉంటుంది.దక్షిణ చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతం కూడా పాముల పెంపకానికి మరో ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పాముల ఫారాల్లో విషసర్పాలను పెంచి వాటి నుంచి వివిధ ఉత్పత్తులను సేకరిస్తారు. ఇటీవల వరదల కారణంగా పాములు బయటకు వచ్చిన ఘటన కూడా ఈ ప్రాంతంలోని ఓ ఫారం నుంచే జరిగినట్లు సమాచారం. కాగా, పాముల పెంపకం వెనుక ప్రధానంగా ఔషధ పరిశ్రమ, పరిశోధన రంగాల అవసరాలు ఉన్నాయి. పాము విషాన్ని శాస్త్రీయ పరిశోధనలు, యాంటీ వెనం మందుల తయారీ కోసం ఉపయోగిస్తారు. విషం సేకరించే ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైనది కావడంతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అవసరం ఉంటుంది.Amd Chinese have startto catch these snakes.Food is important https://t.co/7DmN6tKr7c pic.twitter.com/RX24yp0ipi— GeoPanda (@Geotactix) July 8, 2026భద్రతపై టెన్షన్..అలాగే కొన్ని ప్రాంతాల్లో పాము చర్మానికి కూడా డిమాండ్ ఉంటుంది. పాము చర్మంతో కొన్ని రకాల లెదర్ ఉత్పత్తులు తయారు చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పాములను ఆహారంగా కూడా వినియోగించే సంప్రదాయం ఉంది. దీంతో పాముల పెంపకం ఒక ప్రత్యేక మార్కెట్గా అభివృద్ధి చెందింది. అయితే విషసర్పాలను పెద్ద సంఖ్యలో ఒకే చోట పెంచడం ఎప్పుడూ ప్రమాదకరమే. భారీ వర్షాలు, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఫారాల భద్రతా వ్యవస్థలు దెబ్బతింటే పరిస్థితి అదుపు తప్పుతుంది. తాజాగా జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.పాముల పెంపక కేంద్రాల్లో బలమైన రక్షణ గోడలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, యాంటీ వెనం నిల్వలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉండటం తప్పనిసరి. లేకపోతే వ్యాపారం కోసం పెంచిన విషసర్పాలే ప్రజలకు ప్రాణాంతక ముప్పుగా మారే అవకాశం ఉంది. వరదలతో బయటపడిన వందలాది పాముల ఘటన కేవలం ఓ ప్రమాదం మాత్రమే కాదు.. పాముల పెంపకం వెనుక ఉన్న భారీ వ్యాపారం, దాని వల్ల వచ్చే భద్రతా సవాళ్లను మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చింది.When floods become a haven for predators! 🛑 The terrifying side of the recent heavy rains in China... Snakes leaving their burrows and swimming through the floodwaters! 🐍🌊 pic.twitter.com/AbjbZYwjSg— Nature (@NNaturalanimals) July 10, 2026పాముల పెంపకాలు ఇక్కడే.. 1. జిసికియావో (Zisiqiao) – జెజియాంగ్ ప్రావిన్స్చైనాలో అత్యంత ప్రసిద్ధ ‘స్నేక్ విలేజ్’గా పేరు పొందిన ప్రాంతం ఇది.ఇది జెజియాంగ్ ప్రావిన్స్లోని డెక్వింగ్ కౌంటీ, జిన్షి టౌన్ (Xinshi Town) పరిధిలో ఉంది.ఇక్కడ దశాబ్దాలుగా గ్రామస్తులు పాముల పెంపకాన్ని వృత్తిగా కొనసాగిస్తున్నారు.కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు జాతులను పెంచుతారు.పాము విషం, పాము చర్మం, ఎండబెట్టిన పాము ఉత్పత్తులు, సంప్రదాయ ఔషధాల కోసం ఈ వ్యాపారం కొనసాగుతోంది.2. హెన్జౌ (Hengzhou).. గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ఇటీవల వందల సంఖ్యలో పాములు బయటకు వచ్చిన ఘటనతో వార్తల్లో నిలిచిన ప్రాంతం ఇదే.గ్వాంగ్సీలోని హెన్జౌ ప్రాంతంలో పాముల పెంపక కేంద్రాలు ఉన్నాయి.భారీ వరదల కారణంగా పాముల ఫారం దెబ్బతిని సుమారు 900 వరకు పాములు బయటకు వచ్చినట్లు సమాచారం.బయటకు వచ్చిన వాటిలో కోబ్రాలు, క్రైట్లు వంటి విషసర్పాలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు.3. గ్వాంగ్డాంగ్ (Guangdong) ప్రాంతంచైనాలో సంప్రదాయ ఔషధ పరిశ్రమకు ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి.పాము ఉత్పత్తులు, ఔషధ వినియోగాలకు సంబంధించిన వ్యాపారానికి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి.4. గ్వాంగ్సీ (Guangxi) ప్రాంతంవేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా కొన్ని రకాల సర్పాల పెంపకానికి అనుకూలంగా భావిస్తారు.పాముల పెంపకం, సంప్రదాయ వైద్య మార్కెట్లతో ఈ ప్రాంతానికి సంబంధం ఉంది.పాముల పెంపకంలో సాధారణంగా పెంచే జాతులుకోబ్రా (Cobra)క్రైట్ (Krait)వైపర్ (Viper)పైథాన్ (Python)రాట్ స్నేక్ (Rat snake) -
చైనాలో ఊహించని విపత్తు.. తప్పించుకున్న 900 పాములు
బీజింగ్: చైనాపై ప్రకృతి పగబట్టింది. తీవ్రమైన వరదలు, భారీ వర్షాలతో డ్రాగన్ దేశం అతలాకుతలమవుతోంది. దేశంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, గ్వాంగ్జీ (Guangxi) ప్రాంతంలో ఒక వింతైన, భయంకరమైన పరిస్థితి తలెత్తింది. వరద నీటి ఉధృతికి స్థానిక పెంపకం కేంద్రాల నుంచి వందలాది పాములు తప్పించుకుని ఊళ్లపై పడటంతో అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల ప్రకారం.. గ్వాంగ్జీ ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో దాదాపు 900కు పైగా పాములు పెంచే కేంద్రాల నుంచి బయటకు వచ్చాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు వంటి విషసర్పాలు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. లోతైన వరద నీటిలో పాములు ఈదుకుంటూ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.గ్వాంగ్జీ పరిధిలోని హెంగ్జౌ నగరంలో వరద నీరు,రోడ్లు బ్లాక్ అవ్వడం వల్ల ఒక విషాదం చోటుచేసుకుంది. వరదల్లో కొట్టుకువచ్చిన పాము కాటుకు గురైన ఒక మహిళ, సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో, పాము కాటు బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక వైద్య క్లినిక్లను ఏర్పాటు చేసింది.అలాగే తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. చైనాలోనే సాంప్రదాయ వైద్యం, తోలు ఉత్పత్తులు మాంసం కోసం వాడే వాణిజ్య పాముల పెంపకానికి గ్వాంగ్జీ అతిపెద్ద కేంద్రం. ఇక్కడ సుమారు 3 కోట్లకు పైగా సర్పాలను పెంచుతుంటారు. హెంగ్జౌ పరిసరాల్లోని పలు గ్రామాలు నీట మునగడంతో ఈ పాములన్నీ వరద నీటిలోకి చేరాయని ప్రాంతీయ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విపత్తులు, విషసర్పాల ప్రమాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అత్యవసర సహాయక చర్యలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. 📌 Hengzhou, #China 🇨🇳 July 6 /2026After days of heavy rain 🌧️ and flooding across China, around 900 snakes 🐍 escaped from a breeding farm in Hengzhou. Reports say the reptiles included venomous cobras, with villagers attempting to catch them in the floodwaters. pic.twitter.com/cTcgAZ4nZd— CAUGHTIN4KHQ (@CaughtIn4KHQ) July 9, 2026 -
పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం
-
వరుణుడు ఉగ్రరూపం మునిగిన ముంబై
-
ఎట్టకేలకు ఆల్మట్టికి వరద
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి ఎట్టకేలకు వరద ప్రారంభమైంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు కురవడంతో సోమవారం ఉదయం 6 గంటలకు జలాశయానికి 1,239 క్యూసెక్కుల వరద ప్రారంభమైంది. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో జలాశయానికి ఆలస్యంగా వరద ప్రారంభమైంది. ఆల్మట్టి జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, గతేడాది సరిగ్గా ఇదే సమయానికే నిల్వలు 92.17 టీఎంసీలకు చేరడంతో, గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన విడుదల చేశారు.ప్రస్తుతం జలాశయంలో 21.18 టీఎంసీలే నిల్వలే ఉన్నాయి. కృష్ణమ్మ జన్మస్థానమైన మహాబలేశ్వర్(మహారాష్ట్ర)లోని పశ్చిమ కనుమల నుంచి ఆల్మట్టి ప్రాజెక్టు వరకు మధ్యలో ఉన్న 518 కి.మీ.ల పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిస్తేనే ఆల్మట్టి జలాశయం నిండుతుంది. వర్షాలు లేక ఇప్పటికే జూన్ తీవ్ర నిరాశ కల్పించగా, జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు కురిస్తే ఎగువన కర్ణాటకలోకి ఆల్మట్టితోపాటు నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు నిండి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద వస్తుంది. ఆయా జలాశయాల్లో ఇలా... ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు గతేడాది 99 వేల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 19 క్యూసెక్కుల నీరే వచ్చింది. జలాశయ గరిష్ట సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 23.78 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండాలంటే 120 టీఎంసీలకు పైగా వరద రావాలి. ⇒ కృష్ణా ఉపనది భీమాపై మహారాష్ట్రలో ఉన్న ఉజ్జయినీ జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 72వేల క్యూసెక్కుల వరద రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు. జలాశయ నిల్వ సామర్థ్యం 123.29 టీఎంసీలు కాగా 49.07 టీఎంసీల నిల్వలున్నాయి. ⇒ కృష్ణా మరో ఉపనది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికి గతేడాది ఈ సమయానికి 72వేల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 1,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయ గరిష్ట సామర్థ్యం 105.78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.38 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. ⇒ తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు గతేడాది 1.17లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ప్రస్తుతం ఎలాంటి వరద రావడం లేదు. జూరాల గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, 5.85 టీఎంసీల నిల్వలున్నాయి. ప్రస్తుత సీజన్లో ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు 4.13 టీఎంసీల వరద వచ్చి చేరింది. ⇒ శ్రీశైలం జలాశయ గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 802 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ఉంది. నిల్వలు 42.21 టీఎంసీలకు తగ్గిపోగా, ప్రస్తుత సీజన్లో జలాశయంలోకి 5.6 టీఎంసీల వరద వచ్చి చేరింది. ⇒ నాగార్జునసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, 5,224 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 138.39 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ విద్యుదుత్పత్తి ద్వారా 4,168 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
జమ్ముకశ్మీర్లో కుండపోత వర్షాలు.. అంతటా హై అలర్ట్!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వరదలు రావడానికి తోడు కొండచరియలు విరిగిపడ్డాయి. కిష్త్వార్లోని 540 మెగావాట్ల క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో అక్కడి రహదారిపై వెళ్తున్న, నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి, వాహనాలను వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు.మరోవైపు దోడా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పౌరజీవనం అస్తవ్యస్తమైంది. దోడా జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో దోడా-కిష్త్వార్ రహదారిని సోమవారం ఉదయం అధికారులు పూర్తిగా మూసివేశారు. రహదారిపై భారీ బండరాళ్లు, బురద పేరుకుపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకలతో పాటు అత్యవసర వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. సంబంధిత శాఖల యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమైంది.కొండ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడం, నీరు నిలిచిపోవడం లాంటి సమస్యలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు తెలియరాలేదు. పరిపాలనా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకూ అనవసర ప్రయాణాలు చేయవద్దని, తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు స్థానికులకు, ప్రయాణికులకు సూచించారు.ఇది కూడా చదవండి: ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి -
అమెరికా వరదల్లో గల్లంతైన దేవరపల్లి యువకుడు
పర్చూరు (చినగంజాం): విద్య, ఉద్యోగ రీత్యా బాపట్ల జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువకుడు శనివారం ఉదయం అమెరికాలో సంభవించిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు దొప్పలపూడి వెంకటేష్ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం పొంది ఓక్లహామా సిటీలో ఉంటున్నాడు. అమెరికాలోని కాన్సాస్ వెల్లింగ్టన్కు వెళ్లిన వెంకటేష్ అక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుని ప్రవాహానికి కొట్టుకొనిపోయాడు. అతడు గల్లంతయిన విషయం శనివారం రాత్రి తల్లిదండ్రులకు తెలిసింది. -
అరుణాచల్లో జలప్రళయం.. ముగ్గురు గల్లంతు
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బుధవారం నాటికి తీవ్ర రూపం దాల్చాయి. వీటి ఫలితంగా సంభవించిన వరదలు, విరిగిపడుతున్న కొండచరియల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. కేయీ పన్యోర్ జిల్లాలో వరద ఉధృతికి ఇళ్లు దెబ్బతినడమే కాకుండా, ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.ముగ్గురు గల్లంతు.. నీట మునిగిన ఇళ్లుకేయీ పన్యోర్ జిల్లా యాజాలి పరిధిలోని పూసా సమీపంలో గల నీప్కో ప్రాజెక్ట్ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ఒక రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. దీంతో వరద నీరు ఒక్కసారిగా నివాస ప్రాంతాల్లోకి దూసుకెళ్లడంతో కాలనీ పరిసరాల్లోని కనీసం 18 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అదనపు డిప్యూటీ కమిషనర్, డీఎస్పీ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తోంది.రంగంలోకి రక్షణ బృందాలుపరిస్థితి తీవ్రతను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఇప్పటికే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమవగా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బలగాలను కూడా అలర్ట్ చేశారు. యాజాలి పరిధిలోని అందుబాటులో ఉన్న రిజర్వ్ సిబ్బందిని, వాహనాలను అత్యవసర సేవల కోసం మొబిలైజ్ చేశారు. స్థానిక మాజీ సైనికులు కూడా ఈ సహాయక చర్యల్లో భాగస్వామ్యమయ్యారు. 🚨HAPPENING NOW: Heavy rainfall and flash floods have caused widespread damage in Posa and Yazali, under Keyi Panyor District, Arunachal Pradesh, India. pic.twitter.com/LDeS2VU1Kq— Weather Monitor (@WeatherMonitors) June 24, 2026మూసుకుపోయిన రహదారులు.. డ్యామ్ గేట్లు ఎత్తివేతకొండచరియలు విరిగిపడటంతో పొటిన్, హోజ్ సమీపంలోని జాతీయ రహదారి మూడు చోట్ల పూర్తిగా స్తంభించిపోయింది. భారీగా మట్టి, శిథిలాలు రోడ్డుపై పేరుకుపోవడంతో వందలాది మంది ప్రయాణికులు నడిరోడ్డుపై చిక్కుకుపోయారు. రోడ్లను క్లియర్ చేయడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించారు. మరోవైపు, నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో నీప్కో సంస్థ ముందస్తు జాగ్రత్తగా రంగనాడి డ్యామ్ నుండి నీటిని దిగువకు విడుదల చేస్తోంది. రక్షణ దృష్ట్యా విద్యుత్ ఉత్పాదనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. BREAKING: Heavy rainfall and flash flooding have caused significant destruction at the NEEPCO Colony in Posa, Yazali, Keyi Panyor District, Arunachal Pradesh, India. According to the information so far, 15 quarters were destroyed and the main highway bridge was washed away. pic.twitter.com/PUnhvPkbl0— Weather Monitor (@WeatherMonitors) June 24, 2026 -
మునిగిపోయిందన్న మునిగిపోయింది, పేర్ని నానితో రైతు సరదా సన్నివేశం
-
వర్షం పడితే చాలు దోపిడీ
దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
సౌదీని ముంచెత్తిన వరదలు.. పరుగో పరుగు
ఎడారి దేశం సౌదీ అరేబియాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, తుపానుల బీభత్సానికి రాజధాని రియాద్తో పాటు పలు కీలక ప్రావిన్సుల్లో జనజీవనం అతలాకుతలమైంది. పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో అక్కడి ప్రభుత్వం విద్యార్థుల భద్రతను దృష్టా పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాలను హై అలర్ట్లో ఉంచింది.రాజధాని రియాద్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షంతో పాటు బలమైన ధూళి తుపానులు రావడంతో వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్-అహసా ప్రావిన్సులో రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.వరదలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ సర్వసన్నద్ధమైంది. రియాద్లో దాదాపు 143 అంబులెన్స్ యూనిట్లను, 25 రాఫ్ (RAF) బృందాలను సిద్ధంగా ఉంచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. వారికోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.కాగా ఇన్ని రోజుల పాటు యుద్దం నేపథ్యంలో అట్టుడికిపోయిన సౌదీ అరేబియా సీజ్ఫైర్ నేపథ్యంలో కాస్త పరిస్థితులు సద్దుమణిగాయి అనే లోగా అకస్మిక వరదలు ఆ దేశంలో కల్లోలం సృష్టిస్తున్నాయి.Massive flooding caused by intense rainfall in Riyadh, Saudi Arabia 🇸🇦 pic.twitter.com/OfjWoaSOUl— Disaster News (@Top_Disaster) April 12, 2026 -
కేరళ వరదలు.. సంచలన ఆడియో విడుదల
తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని 2018లో వణికించిన మహా వరదలు ప్రకృతి విపత్తు కాదు, కేవలం కొందరి ధనదాహంతో జరిగిన ‘మానవ తప్పిదమే’ అని వెల్లడించే ఒక సంచలన ఆడియో వెలుగులోకి వచ్చింది. అవినీతి, ఇసుక మాఫియాల వల్లే ఆ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ మువట్టుపుజ ఎమ్మెల్యే, యూడీఎఫ్ అభ్యర్థి మ్యాథ్యూ కుజల్నాదన్ ఒక ఆడియో క్లిప్ను తాజాగా విడుదల చేశారు.వివరాల్లోకి వెళితే.. కుజల్నాదన్ విడుదల చేసిన ఈ ఆడియో, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి కె. కృష్ణన్కుట్టి మాట్లాడినట్లుగా భావిస్తున్నారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి మాథ్యూ టి. థామస్ హయాంలో జరిగిన అవకతవకలు, లంచగొండితనమే ఈ భయంకరమైన వరదలకు కారణమని ఆ ఆడియోలో వెల్లడవుతోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్కు చెందిన కోట్ల రూపాయల ఇసుక నిల్వలను కాపాడేందుకు తోట్టప్పల్లి స్పిల్వేను ఒక నెల ముందే తెరవాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే మూసి ఉంచారని ఆ ఆడియోలో ఆరోపించారు.చీఫ్ ఇంజనీర్ జోషితో పాటు అప్పటి సీపీఎం ఎమ్మెల్యే జార్జ్ థామస్ సోదరి, మంత్రి మాథ్యూ టి. థామస్ కుమ్మక్కై.. కాంట్రాక్టర్కు రూ. 300 కోట్ల లాభం చేకూర్చేందుకు స్పిల్వే గేట్లు ఎత్తకుండా జాప్యం చేశారని అందులో పేర్కొన్నారు. ఒకవేళ గేట్లు సకాలంలో తెరిచి ఉంటే ఆ ఖనిజ ఇసుక కొట్టుకుపోయేది. ఒక ప్రైవేట్ విద్యుత్ కంపెనీకి రూ.8 కోట్ల లాభం చేకూర్చడానికి మణియార్ ప్రాజెక్టులో చట్టవిరుద్ధంగా నీటిని నిల్వ చేశారని ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ అదనపు నీటిని వదలడం వల్లే చెంగన్నూర్ లాంటి ప్రాంతాలు సర్వనాశనం అయ్యాయని అందులో పేర్కొన్నారు.దీనికి తోడు తమిళనాడుకు మళ్లించాల్సిన దాదాపు 1,400 క్యూసెక్కుల నీటిని, పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న రూ.200 కోట్ల నిర్మాణ ప్రాజెక్టును కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగా చాలకుడి నదీ పరీవాహక ప్రాంతంలోకి మళ్లించారని మరో తీవ్ర ఆరోపణ వెలుగుచూసింది. నీటి ప్రవాహం తమ పనులకు ఆటంకం కలిగించకుండా కాంట్రాక్టర్లు అధికారులకు భారీగా ముడుపులు చెల్లించారని ఆడియోలో ఉంది. కేరళ ప్రజల ప్రాణాలు, ఆస్తులను పణంగా పెట్టి ఈ నేత ఎన్ని కోట్లు వెనకేసుకున్నారో సమాధానం చెప్పాలని కుజల్నాదన్ మీడియా సమావేశంలో సూటిగా ప్రశ్నించారు. ఈ ఆడియో వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇది కూడా చదవండి: శబరిమల వివాదం: సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వాదన -
అత్యంత భారీ వరదలు.. హవాయి అతలాకుతలం
అమెరికా రాష్ట్రం హవాయి గత రెండు దశాబ్దాల్లో అత్యంత భారీ వరదలను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఈ ప్రాంతం అతలాకుతలమైంది. వేలాది మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఓహావు దీవిలోని ఓ ఆనకట్ట కూలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులు గంటకు 100 మైళ్ల వేగంతో వీచాయి. ఈ వరదలను గడిచిన 20 ఏళ్లలో అత్యంత భారీ వరదలుగా అధికారులు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. విమానాశ్రయాలు, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. కోనాలో అనే తక్కువ ఒత్తిడి వాతావరణ వ్యవస్థ కారణంగా ఈ వరదలు సంభవించాయని గుర్తించారు. ఇది హవాయి దీవులపై తేమతో నిండిన గాలులను లాగి, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను తెచ్చింది. హోనలూలు అత్యవసర నిర్వహణ విభాగం మరిన్ని ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. మావి, మోలోకై, బిగ్ ఐలాండ్లకు కూడా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. రహదారులు మూసివేయబడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఈ వరదల కారణంగా ఇప్పటికే బిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించిదని అంచనా. 2023లో లహైనా అగ్నిప్రమాదాల తర్వాత, ఇప్పుడు వరదలతో హవాయి మరోసారి ప్రకృతి విపత్తు భారాన్ని మోస్తోంది. -
ఉత్తరాఖండ్ వరదలు.. ఇస్రో కీలక రిపోర్ట్
గతేడాది ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో సంభవించిన వరదలపై ఇస్రో కీలక నివేదిక ఇచ్చింది. ఈ ఆకస్మిక వరదలకు కారణం క్లౌడ్ బరస్ట్ కాదని తెలిపింది. ఆపై ప్రాంతంలో ఉన్న మంచుపర్వతం కరగడం వల్లే ఈ వరదలు సంభవించాయని పేర్కొంది.2025 ఆగస్టులో ఉత్తరకాశీలోని ధారాలి ప్రాంతంలో ఆకస్మికంగా వరదలు సంభవించాయి. ఉన్నట్టుండి పెద్దఎత్తున వరదలు రావడంతో ఆ ప్రాంతమంతా మునిగిపోయింది. చాలా భవనాలు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. అయితే దీనికి కారణం క్లౌడ్ బరస్ట్ లేదా నదులు ఉప్పొంగడం అని అంతా భావించారు. అయితే దీనిపై పరిశోధన జరిపిన ఇస్రో దీని కారణం క్లౌడ్ బరస్ట్ కాదని తేల్చింది.దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆసమయంలో ఆ ప్రాంతంలో ఎటువంటి వర్షాలు పడలేదని గుర్తించారు. అదే విధంగా ఆ పై భాగంలోని పర్వతాలలో ఎటువంటి నదులు లేవని ఇస్రో తేల్చింది. ఆ ప్రాంతానికి 5200 అడుగుల ఎత్తుల పర్వతాలలో మంచు పర్వతం కరగడం మూలంగానే ఆకస్మిక వరదలు సంభవించినట్లు తెలిపారు.సాధారణంగా ఈ మంచు పర్వతాలకు రక్షణగా ఉండే పొరలు గ్లోబల్ వార్మింగ్ మూలంగా కరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కాలుష్య పరిస్థితుల దృష్యా తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కనుక ఆ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. -
బ్రెజిల్ అతలాకుతలం.. భీకర వరదలతో 46 మరణాలు..
జూయిజ్ డీ ఫోరా: బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రం మినాస్ గెరాయిస్ను భీకర వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రంలోని జూయిజ్ డీ ఫోరా, ఉబా నగరాల్లో లక్షలాది మంది ప్రజల జనజీవన అస్తవ్యస్థమైంది. వరద సంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 46 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఇంకా చాలా మంది జాడ తెలీకుండా పోయిందని సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు ప్రకటించారు. 21 మంది గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు.ఇక, రాత్రిళ్లు సైతం రిస్క్యూ బృందాలు తమ విధుల్లో నిమగ్నమయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని 3,000 మందిని బుధవారం ఉదయం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరి కొద్దిరోజులపాటు భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 5,60,000 జనాభా ఉండే జూయిజ్ డీ ఫోరా నగర వీధులన్నీ బురదలో నిండిపోయాయి. సమీపంలోని కొండచరియలు మరోసారి విరిగిపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.🇧🇷🔴 ارتفاع حصيلة القتلى في البرازيلأعلنت فرق الإنقاذ والسلطات المحلية وفاة ما لا يقل عن 20 شخصًا، مع فقدان العشرات، واضطرار أكثر من 400 شخص إلى إخلاء منازلهم، جراء الأمطار الغزيرة التي ضربت جنوب شرق البرازيل.#Brazil #HeavyRain #Floods #Landslides #ExtremeWeather #BreakingNews pic.twitter.com/CHZr6VoFw7— طقس_العالم ⚡️ (@Arab_Storms) February 24, 20261,07,000 జనాభా ఉన్న ఉబా నగరంలో జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి మొదలైన వానలకు ఇప్పటిదాకా 20 కొండచరియలు విరిగిన ఘటనలు నమోదయ్యాయని మేయర్ మార్గరీడా సాలమావో చెప్పారు. వరదబాధిత ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటోందని, బాధిత కుటుంబాలకు తగుసాయం అందిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లాలూ డ సిల్వా భరోసా ఇచ్చారు. కొండలు, లోయలు, లోతట్టు ప్రాంతాలకు వైద్య బృందాలను పంపించారు. 🇧🇷 Dozens are still missing in southeastern #Brazil after floods killed at least 36 people in the state of Minas Gerais, officials said 👇 pic.twitter.com/B5xvJ4M8iT— FRANCE 24 English (@France24_en) February 25, 2026🚨⚡️At least 23 people were killed due to floods and landslides that struck Juiz de Fora in the state of Minas Gerais, Brazil, after heavy rainfall totaling 584 mm over two days, prompting authorities to declare a state of public calamity. pic.twitter.com/3ZLptDPXTu— RussiaNews 🇷🇺 (@mog_russEN) February 25, 2026🚨 At least 30 people are dead and hundreds displaced in Brazil’s Minas Gerais after record-breaking rainfall triggered landslides and flash floods⚠️ Juiz de Fora was hardest hit, with rivers bursting their banks and entire neighborhoods submerged pic.twitter.com/ZrvhyWwm0u— Anadolu English (@anadoluagency) February 25, 2026 -
కుండపోత వర్షాలు.. 100 మంది మృతి!
ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. మరోవైపు.. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆఫ్రికాలోని మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలలో ఎడతెరిపిలేని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మొజాంబిక్లో వర్షాలు, వరదల కారణంగా రెండు లక్షల మందికి పైగా ప్రభావితులు అయ్యారు. భారీ వర్షాల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే వంద మందికిపైగా మృతి చెందారు. ఇక, జింబాబ్వేలో వర్షాల వల్ల 70 మంది మరణించగా.. 1000కి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. పాఠశాలలు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.BREAKINGMore than 100 dead in torrential rains and floods across southern Africa.Severe flooding hit Gigmoto on the Island of Catanduanes in the Philippines today, after heavy rain from Tropical Storm Ada triggered a landslide that blocked a river pic.twitter.com/dKicNBaCxq— Lee Golden (@LeeGolden6) January 17, 2026ఇదిలా ఉండగా.. దక్షిణ ఆఫ్రికాలో మృతుల సంఖ్య 30 చేరింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లను రంగంలోకి దించి, బాధితుల్ని రక్షిస్తున్నారు. ప్రఖ్యాత క్రుగార్ నేషనల్ పార్క్ను కూడా ఈ వరదలు ప్రభావితం చేశాయి. అందులో చిక్కుకున్న 600 మంది పర్యాటకులు, పార్కు సిబ్బందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. లా నినా వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆఫ్రికాలోని ఏడు దేశాలను వర్షాలు ముంచెత్తుతున్నాయని అమెరికా వాతావరణ హెచ్చరికల వ్యవస్థ తెలిపింది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Heavy rain, floods wreak havoc in South Africa:Torrential rains and severe flooding in northern South Africa have killed at least 19 people since last month, with Limpopo and Mpumalanga provinces hardest hit. pic.twitter.com/9JH0lJpDx5— CGTN Africa (@cgtnafrica) January 17, 2026 -
2026లో యుగాంతం, భయాలు ఇవిగో..
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘2026లో ప్రపంచం అంతం’ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాబా వంగా 2026లో ప్రపంచం అంతం గురించి చేసిన జోస్యాలు ప్రజల్లో ఆసక్తిని, భయాన్ని పెంచాయి. అలాగే, చర్చలకు కారణమవుతున్నాయి. అయితే, బాబా వంగా జోస్యాలు శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇవి ప్రజల్లో సాంస్కృతిక, మానసిక ప్రభావం చూపుతున్నాయి కానీ.. వాస్తవంగా 2026లో ప్రపంచం అంతమవుతుందనే ఆధారం లేదని చెబుతున్నారు. ఇంతకీ 2026 గురించి బాబా వంగా ఏం చెప్పారు...?బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి చాలా మంది అనేక సమయాల్లో వినే ఉంటారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం అయ్యాయి. చిన్న వయస్సులోనే చూపు కోల్పోయిన బాబా వంగా ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోస్యం చెప్పారు. అందులో చాలా వరకు నిజం అయ్యాయి కూడా. కరోనా మహమ్మారిని కూడా బాబా వంగా ముందే ఊహించారు. ఈ క్రమంలో 2026 ఏడాది గురించి బాబా వంగా పలు సంచలన విషయాలను వెల్లడించారు. 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆమె 2026 సంవత్సరాన్ని యుద్ధం వినాశన సంవత్సరంగా పేర్కొన్నారు. 2026తో ప్రపంచం అంతం అవుతుందని చెప్పడం టెన్షన్కు గురిచేస్తోంది. న్యూయార్క్ పోస్ట్, ది మిర్రర్, ఎక్స్ప్రెస్ వంటి పత్రికలలో విస్తృతంగా వచ్చిన నివేదికల ప్రకారం.. ఆమె అనుచరులు మరియు వ్యాఖ్యాతలు 2026 సంవత్సరానికి అనేక నాటకీయ సంఘటనలను ఆపాదిస్తున్నారు. దీంతో, ఈ విషయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మూడో ప్రపంచ యుద్దం..వీటిలో రష్యా, అమెరికా, చైనా, యూరప్ వంటి దేశాలు మధ్య ప్రపంచ సంఘర్షణలు తీవ్రతరం కావడం.. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విధ్వంసకర భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణం, వరదలు, తుఫానులతో సహా భారీ ప్రకృతి వైపరీత్యాలు భూమిపై 7–8% భూభాగాన్ని ప్రభావితం చేయడం వంటివి ఉన్నాయి. గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం, బహుశా నవంబర్లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే భారీ గ్రహాంతర నౌకతో సహా, AI ఆధిపత్యం, ఆర్థిక అస్థిరత.. ఆసియా లేదా చైనా వైపు ప్రపంచ శక్తిలో మార్పు పెరుగుతుందని కూడా అంచనా వేయబడింది.అయితే, ఇది బాబా వంగా మాత్రమే కాదు. పలువురు ప్రముఖులు సైతం ఆసక్తిగా దీనికి ఆజ్యం పోశారు. నోస్ట్రాడమస్ యొక్క క్వాట్రైన్ల వివరణల ప్రకారం "రక్త నదులు", ప్లేగులు, నిరంకుశుల గురించి హెచ్చరిస్తున్నాయి. 2003లో రహస్యంగా అదృశ్యమైన పాకిస్తాన్ ఆధ్యాత్మిక నాయకుడు రియాజ్ అహ్మద్ గోహర్ షాహి.. ఈ సంవత్సరం భూమిని తాకే మండుతున్న తోకచుక్క గురించి మాట్లాడారు. బ్రెజిల్కు చెందిన "లివింగ్ నోస్ట్రాడమస్" అథోస్ సలోమ్ 2024లో ప్రపంచ యుద్ధం, సైబర్ సంఘర్షణ మరియు AI ఆధిపత్యం దగ్గర పడుతున్నాయని అంచనా వేశాడు. మరోవైపు, ఘనా ప్రవక్త ఎబో నోహ్ విపరీతమైన వరదలు వస్తాయన్నారు. దీని కోసం అతను ఘనాలో అనేక చాపలను నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు నిజమవుతాయా? అనే ప్రశ్నలు ఎదరవుతున్నాయి. ఈ భయం ఎక్కడిది?‘2026 డూమ్స్ డే’ టాక్ మొదటి నుంచీ ఒక్క కారణం మీదే నడుస్తోంది. 1980ల్లో బెంజమిన్ క్రెమ్ అనే వ్యక్తి మైత్రేయ అలియాస్ కొత్త యుగం రాబోతోందని 2025-2026లో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వ్యవహారం ఆస్టరాయిడ్ వైపు మళ్లింది. మరికొద్ది రోజులకు నోస్ట్రడామస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతో జోతిష్యం కూడా తెరపైకి వచ్చింది. పలువురు జోతిష్యులు తమకు నచ్చిన విధంగా ప్రళయం అని ఒకరు అంటే.. ‘2026 మహా ప్రళయం’ అని మరికొందరు చెబుతున్నారు. అయితే, బాబా వంగా యొక్క అసలు "డూమ్స్డే" తేదీ చాలా దూరంలో ఉంది. ఆమె 5079లో ప్రపంచ ముగింపు (లేదా విశ్వ సంఘటన ద్వారా "సంపూర్ణ డూమ్స్డే") గురించి అంచనా వేసింది.ఆస్టరాయిడ్ ఢీకొడుతుందా?ఇంటర్నెట్లో ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోల్లో రెండు ఆస్టరాయిడ్స్ గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. ఒకటి Apophis (99942), రెండు 2024 YR4. Apophis 2029 ఏప్రిల్ 13న భూమికి 31,000 కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. కానీ 2021లోనే నాసా 100% సేఫ్ అని ధృవీకరించింది. 2026లో దాని దూరం లక్షల కిలోమీటర్లు. 2024 YR4 లేదంటే ఇంకా ఏదైనా ఆస్టరాయిడ్ 2026లో ఢీకొనే ఛాన్స్ ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు. నాసా, ESA, NEOWISE టెలిస్కోప్లు 99% పెద్ద ఆస్టరాయిడ్స్ ను ట్రాక్ చేస్తున్నాయి. ఏదైనా రిస్క్ ఉంటే ఇప్పటికే పెద్ద హెచ్చరికలు వచ్చేవి.అంతం తప్పదా? గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది కాస్త కష్ట సంవత్సరం కావచ్చు. వాతావరణ మార్పుల విషయం మరింత తీవ్రమవుతుంది. రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ లాంటి ఘటనలు పెరగవచ్చు. AI వల్ల కొత్త రకం ఆర్థిక మాంద్యం రావచ్చు. కానీ, ఇవన్నీ మనం ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలే. కొత్తగా ప్రపంచాన్ని నాశనం చేసేవి కావు. చివరిగా.. గతంలో Y2K (2000), మయన్ క్యాలెండర్ (2012), కరోనా ‘ప్రపంచం అంతం’ టాక్ (2020) గురించి విన్నాం. ప్రతిసారీ భయపడ్డాం. కానీ, ఏమీ కాలేదు. 2026 కూడా అలాగే గడిచిపోతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. -
ఇండోనేషియాలో వరద భీభత్సం.. 16 మంది మృతి..!
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటికే దాదాపు 16 మంది మృతి చెందారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్లో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు వేలాదిమందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇండోనేషియాలో తీవ్రమైన వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన వివరాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం తెల్లవారుజామున నదుల్లో జలపాతం అకస్మాత్తుగా పెరిగింది. ఈ బలమైన నది ప్రవాహాలకు సియావు టాగులాండాంగ్ బియారో జిల్లాలోని గ్రామాల కొట్టుకుపోయాయి. ఈ వరదలు అనేక గ్రామాలను ముంచెత్తాయి.సులవేసి ద్వీపం నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియావు ద్వీపంలోని నాలుగు ప్రభావిత గ్రామాలకు పోలీసులు, సైన్యం మద్దతుతో రెస్క్యూ బృందాలను మోహరించారు. అయితే దెబ్బతిన్న రోడ్లు, కమ్యూనికేషన్ అంతరాయం వల్ల రెస్క్యూ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ వరదల్లో దాదాపు ఏడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 140 కి పైగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి మరింత దిగజారడంతో ప్రజలను చర్చిలు, ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయ శిబిరాలకు తరలించారు. -
మునిగిన దుబాయ్.. బయటకు రావొద్దంటూ హెచ్చరిక
-
మొరాకోలో ఆకస్మిక వరదలు.. 37 మంది మృతి
కాసాబ్లాంకా: మొరాకోలోని తీరప్రాంత నగరం సాఫిలో ఆదివారం రాత్రి సంభవించిన భారీ వర్షం, ఆకస్మిక వరదలతో కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 70 నివాసాలు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి. పది వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. దీంతో, నగర యంత్రాంగం స్కూళ్లకు మూడు రోజులు సెలవు ప్రకటించింది. దేశంలోని టౌటొవాన్, టింఘిర్ తదితర నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో సైతం వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా నష్టం సంభవించింది. -
వరదల కారణంగా 1,300 మందికి పైగా మృతి
టాంగ్ టోరు: ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్లలో భారీ వర్షాలతో గత వారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 1,300 దాటింది. 800 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండోనేషియాలో 712 మంది, శ్రీలంకలో 410 మంది, థాయ్లాండ్లో 181 మంది మరణించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇండోనేషియాలో.. ఇండోనేషియాలోని సుమత్రా దీవులు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. 507 మంది గల్లంతైనట్లు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తప్పిపోయారు. ఉత్తర సుమత్రాలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల లక్షలాది క్యూబిక్ మీటర్ల కలప కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. చెట్లను అక్రమంగా నరికివేయడం విపత్తుకు కారణమై ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదని, మానవ నిర్మిత సంక్షోభమని ఇండోనేషియా పర్యావరణ ఫోరం ఆరోపించింది. తక్షణ పునరుద్ధరణ, కట్టుదిట్టమైన రక్షణ లేకపోతే వరదలు సాధారణమవుతాయని హెచ్చరించింది. ప్రాణ నష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేం: శ్రీలంక అధ్యక్షుడు ఇది దేశాన్ని ముంచెత్తిన అత్యంత దారుణమైన విపత్తని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే అన్నారు. ప్రాణనష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. వరదల్లో, కొండ చరియలు విరిగి పడటంతో చిక్కుకుపోయినవారిని చేరుకోవడానికి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. కొందరు మొత్తం కుటుంబాన్నే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. థాయ్లాండ్లో పబ్లిక్ కిచెన్లు.. థాయ్లాండ్లో భారీ వరదలు 15 లక్షలకు పైగా ఇళ్లను మంచెత్తాయి. 39 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వారికి మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. బాధితులకు ఆహారాన్ని అందించడానికి పబ్లిక్ కిచెన్లను ఏర్పాటు చేస్తామని థాయ్లాండ్ ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో రూ.74 లక్షల నష్టపరిహారం 26,000 మందికి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి సిరిపోంగ్ అంగ్కసకులి్కయాట్ తెలిపారు. -
కొనసాగుతున్న వరద సహాయక చర్యలు..
జకార్తా/న్యూఢిల్లీ: ఇండోనేసియా, థాయ్లాండ్, శ్రీలంకల్లో ఇటీవల సంభవించిన వర్షాలు, వరదలకు సంభవించిన ఘటనల్లో మరణాలు వెయ్యి దాటేశాయి. గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉంది. ఆయా దేశాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో కనీసం 708 మంది చనిపోయారని అధ్యక్షుడు ప్రబోవోసుబియాంతో తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారారని, ఇంకా 504 మంది జాడ తెలియాల్సి ఉందని వెల్లడించారు. గత వారం వరదలు సంభవించిన కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకునేందుకు వీలు కావడం లేదన్నారు. రోడ్లు, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. తీవ్రంగా దెబ్బతిన్న నార్త్ సుమత్ర, వెస్ట్ సుమత్ర, ఆసెహ్ ప్రావిన్స్లను ఆయన సోమవారం పర్యటించి, బాధితులను పరామర్శించారు. అదేవిధంగా, థాయ్లాండ్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 181మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.5 లక్షల కుటుంబాలపై వర్షాల ప్రభావం పడింది. దీంతో, ప్రభుత్వం మొదటి విడతలో తీవ్రంగా నష్టపోయిన 26 వేల మందికి 74 లక్షల డాలర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు, శ్రీలంకలో దిత్వా తుపాను సంబంధిత ఘటనల్లో 410 మంది చనిపోగా 336 మంది గల్లంతయ్యారని అధికారులు సోమవారం ప్రకటించారు. సుమారు 2.18 లక్షల మందికి ప్రభుత్వం తుఫాను షెల్టర్లలో ఆశ్రయం కలి్పంచింది. తేయాకు తోటలు ఎక్కువగా ఉండే కొండప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. భారత ప్రధాని మోదీ సోమవారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకెతో ఫోన్లో మాట్లాడారు. దిత్వా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం శ్రీలంకకు ఇప్పటికే రెండు విడతలుగా ఆహారం, అత్యవసర వస్తు సామగ్రితోపాటు సిబ్బందిని కూడా పంపించడం తెల్సిందే. -
శ్రీలంకలో తీవ్ర తుఫాను
కొలంబో: శ్రీలంకను శుక్రవారం దిత్వాహ్ తుఫాను అతలాకుతలం చేసింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మతాలె, పొలన్నరువా, యువ ప్రావిన్స్లను కలిపే వంతెనలు కొట్టుకుపోవడంతో ఆయా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కేబుళ్లు తెగిపోవడంతో రెండు పవర్ ప్లాంట్లను మూసివేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. రాజధాని కొలంబోతోపాటు అత్యధిక జనాభా కలిగిన గంపాహా జిల్లా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెలనీ, అట్టనగలు నదులు పొంగిపొర్లాయి. మొత్తం 80 మంది చనిపోగా 34 మంది జాడ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సుమారు 14 వేల మందిని 195 అత్యవసర కేంద్రాలకు తరలించామన్నారు. ‘ఆపరేషన్ సాగర్ బంధు’భారత ప్రభుత్వం శ్రీలంకకు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా మొదటి విడత తుఫాను సాయంగా ఆహార పదార్థాలను పంపించింది. ఇలా ఉండగా, తుఫాను ప్రభావం గత పది రోజుల వ్యవధిలోనే 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గత 24 గంటల వ్యవధిలో కొండప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల వాన కురిసిందని వివరించింది. -
థాయ్లాండ్: భారీ వర్షాలకు 145 మంది మృతి
భారీ వర్షాలతో థాయిలాండ్ అతలాకుతలం అవుతోంది. కుంభవృష్టి ధాటికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.దక్షిణ థాయిలాండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. 12 దక్షిణ ప్రావిన్సులలో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో 145 మంది మృతి చెందారు. కేవలం సాంగ్లా ప్రావిన్సులోనే 110 మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో భవనాలు నీటమునిగాయని.. వరదల దాటికి రోడ్లు కొట్టకుపోయాయని, తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. అయితే.. ఈ వరదల ప్రభావంతో 32 లక్షల మంది ప్రభావితం అయ్యారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాలు జలమయంలోనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు ప్రజల దైనందిన జీవితం దెబ్బతింది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో విపత్తు నిర్వహాణ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. -
కలత్తూరు బాధితులకు పెద్దిరెడ్డి భరోసా..
-
బద్దలయ్యేందుకు సిద్ధంగా 42 హిమానీ సరస్సులు
కాఠ్మండు: నేపాల్లో అత్యంత ఎత్తయిన పర్వతాల మధ్య ఏర్పడిన హిమానీ సరస్సులు(గ్లేసియర్ లేక్స్) ఇప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలపై యమపాశాలుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయన్న వార్త స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. నేపాల్లోని శంఖువసభ జిల్లా కేంద్రమైన ఖంద్బారీ పట్టణంలో శనివారం జరిగిన అంతర్జాతీయ సమీకృత పర్వతాభివృద్ధి కేంద్రం(ఐసీఐఎంఓడీ) చర్చా కార్యక్రమంలో విషయ నిపుణుడు శరద్ ప్రసాద్ జోషి ఈ వివరాలను వెల్లడించారు. హిమానీనదం(గ్లేసియర్) నుంచి ప్రవహించే నీటి కారణంగా పర్వత సానువుల వద్ద ఏర్పడే సరస్సును గ్లేసియర్ లేక్ అంటారు. ‘‘ఇలాంటి 42 సరస్సులు భారీ స్థాయిలో నీటితో నిండుకుండలా మారాయి. ఇవి ఏ క్షణంలోనైనా బద్దలై దిగువకు పెద్దమొత్తంలో నీరు దూసుకురానుంది. దిగువ ప్రాంతాల ప్రజల ఇల్లు, వ్యాపారాలు, పంటలు నాశనమవడం ఖాయం. నేపాల్లో 2,069 హిమానీ సరస్సులుండగా ఇప్పుడు కోషి ప్రావిన్స్లోని 42 సరస్సులు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయి’’ అని జోషి హెచ్చరించారు. శంఖువసభ జిల్లా పరిధిలో భోత్ఖోలా, మకాలూ ప్రాంతంలోని సరస్సులు సహా నాలుగు గ్లేసియర్ సరస్సుల్లో నీరు భారీగా చేరిందని ఆయన వెల్లడించారు. మూడు కిలోమీటర్ల పొడవు, 206 మీటర్ల లోతైన తల్లోపోఖారీ సరస్సు అత్యంత ప్రమాదకారిగా మారిందని చెప్పారు. ఐసీఐఎంఓడీ, హైడ్రోలజీ, మీటియోరాలజీ, ఐరాస అభివృద్ధికార్యక్రమం నేపాల్ సంస్థలు కలిసి ఈ ప్రమాదం నుంచి స్థానికులను, వారి ఆస్తులను పరిరక్షించేందుకు సహాయక చర్యలపై దృష్టిసారించాయి. అరుణ్ లోయలో పలు నివాసాలు, మౌలికవసతుల వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని మరో నిపుణురాలు నీరా శ్రేష్ఠ ప్రధాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభావిత ప్రాంత ప్రజల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషిచేయనుందని ఆమె తెలిపారు. -
చంద్రబాబు మరో టెండర్.. అమరావతికి వరద తప్పించేలా మరో భారీ ప్రాజెక్ట్
-
వరదనీటి రెస్టారెంట్
సాధారణంగా రెస్టారెంట్లలోకి నీరు చేరితే యజమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ, థాయ్లాండ్లోని ఈ రెస్టారెంట్ యజమానికి మాత్రం వరద నీరే అదృష్ట దేవతలా మారింది! డైనింగ్ టేబుళ్ల మధ్య చేపలు ఈదుతుంటాయి. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ వింత రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆహారం ఆస్వాదిస్తూ.. కాళ్ల దగ్గర ఈదే చేపలను చూసేందుకు ఇక్కడ జనం బారులు తీరుతున్నారు. చేపలతో కలిసి విందు! మధ్య థాయ్లాండ్లోని ఒక రెస్టారెంట్లో భోజనం చేయడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఆ భోజనానుభవం కోసమే కస్టమర్లు పోటెత్తుతున్నారు. వరద నీటిలో కూర్చున్నాక.. కాళ్ల కింద చేపలు చేసే సందడి చూస్తూ.. సరదా సరదాగా భోజనం చేస్తూ ఆస్వాదిస్తున్నారు. పక్కనే ఉన్న నది ఉప్పొంగి 11 రోజులైనప్పటి నుంచి, వరద ముంపునకు గురైన నదీతీర రెస్టారెంట్ ఇంటర్నెట్లో ఒక సంచలనంగా మారింది. నీటిలో కూర్చుని ఫొటోలు దిగడానికి లేదా చేపలకు మేత వేస్తూ.. ఆ హడావిడిని ఫొటోలు తీయడానికి కస్టమర్లు ఉత్సాహంగా వస్తున్నారు. బ్యాంకాక్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ పాఠోమ్ ప్రావిన్స్లోని పా జిత్ రెస్టారెంట్లో కుటుంబాలు లంచ్ ఆస్వాదిస్తున్నాయి. చుట్టూ చేపలు ఈదుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వెయిటర్లు చేపల సూప్ లేదా చికెన్ నూడుల్స్ గిన్నెలను నేర్పుతో టేబుల్స్ వద్దకు తీసుకొస్తున్నారు. ఎవరూ రారనుకున్నా.. పా జిత్ రెస్టారెంట్ 30 ఏళ్లకు పైగా నదీతీరంలో స్థిరంగా ఉందని యజమాని పోర్న్కామోల్ ప్రాంగ్ప్రెంప్రీ తెలిపారు. దాదాపు నాలుగేళ్ల క్రితం తొలిసారి రెస్టారెంట్ మునిగినప్పుడు ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘కస్టమర్లు ఎవరూ రారని అనుకున్నాను.. కానీ అప్పుడు ఒక కస్టమర్ వచ్చి, ఇక్కడ చేపలు ఉన్నాయని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అప్పటి నుండి చాలా మంది ఇక్కడ తినడానికి గుమిగూడారు’.. అని ఆమె గుర్తు చేసుకున్నారు. లాభాలే లాభాలు వరదల కారణంగా తన వ్యాపారం పెరిగిందని, రోజుకు దాదాపు 10,000 బాట్ల (భారత కరెన్సీలో సుమారు రూ.23,000) నుండి 20,000 బాట్ల (సుమారు రూ.46,000) వరకు తన లాభం రెట్టింపయ్యిందని ఆమె వివరించారు. పిల్లలు ఇష్టపడే రెస్టారెంట్ అదే ప్రావిన్స్లో నివసించే 29 ఏళ్ల చోంఫునట్ ఖంతనితి.. తన భర్త, కొడుకుతో కలిసి ఇక్కడికి వచ్చారు. ‘ఇక్కడ చాలా బాగుంది. పిల్లలను ఇక్కడికి తీసుకురావచ్చు. చేపలను చూసినప్పుడు వారు అల్లరి చేయడం తగ్గిస్తారు. థాయ్లాండ్లో ఇలా చేపలు పైకి వచ్చేది ఈ ఒక్కచోట మాత్రమేనని అనుకుంటున్నాను’.. అని ఆమె చెప్పారు. 63 ఏళ్ల బెల్లా విండీ.. తన కాళ్లను చేపలు కొరుకుతున్న అనుభూతిని ఆస్వాదించాలని ఈ రెస్టారెంట్కు వచ్చారు. ‘సాధారణంగా, నీరు చాలా ఎక్కువగా ఉంటే చేపలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడి ప్రకృతి అనుభవం ఈ రెస్టారెంట్ ముఖ్య ఆకర్షణ, ఇది ప్రజలను ఆకర్షిస్తుంది’.. అన్నారు. ఇతర ప్రాంతాలకు నష్టమే ఈ వరదలు పా జిత్ రెస్టారెంట్కు అసాధారణ అదృష్టాన్ని తెచి్చనప్పటికీ, థాయ్లాండ్లోని అనేక ఇతర ప్రాంతాలను మాత్రం తీవ్రంగా దెబ్బతీశాయి. జూలై చివరి నుండి, వరదల కారణంగా 12 మంది మరణించారని, ఇద్దరు తప్పిపోయారని ప్రకృతి విపత్తుల విపత్తుల నివారణ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. శుక్రవారం నాటికి, 13 ప్రావిన్స్లలో, ముఖ్యంగా ఉత్తర, మధ్య ప్రాంతాలలో 4,80,000 మందికి పైగా ప్రజలు వరదలతో ప్రభావితమయ్యారని వివరించింది.కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని.. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవచ్చని ’పా జిత్’ రెస్టారెంట్ నిరూపించింది. నదీతీరం మునిగిపోయినా, దాన్ని వినూత్న ’డైనింగ్ డెస్టినేషన్’గా మార్చుకుంది. కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అరుదైన అనుభవాన్ని ఆస్వాదించేందుకు థాయ్లాండ్ పౌరులే కాదు, ప్రపంచ పర్యాటకులు కూడా ఇక్కడికి క్యూ కట్టడం ఖాయం! మీకు కూడా ఈ వింత రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలనుందా?.. చూడాలనిపిస్తోందా?.. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు
-
పాత రికార్డులను తోడేసిన వరద
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. కృష్ణా పరీవాహక పరిధిలోని శ్రీశైలం, పులిచింతల జలాశయాలతోపాటు గోదావరి పరీవాహక పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల చరిత్రలోనే అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, మిడ్మానేరు, లోయర్ మానేరు, కడెం వంటి ఇతర ప్రాజెక్టులకు సైతం రికార్డు స్థాయి వరదలొచ్చాయి. సాగునీటి రంగ పరిభాషలో జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 మధ్య కాలాన్ని నీటి సంవత్సరంగా పరిగణిస్తారు. 2015–16లో కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు చరిత్రలోనే అత్యల్ప వరదలు రాగా, సరిగ్గా దశాబ్దం తర్వాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు రావడం గమనార్హం. శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీలు ప్రస్తుత నీటి సంవత్సరం (2024–25)లో ఇప్పటి వర కు శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీల భారీ వరద వచ్చింది. ఈ ప్రాజెక్టుకు అత్యధికంగా 1994– 95లో 2,039.23 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఆ తర్వాత 2022–23లో దానికంటే స్వల్ప అత్యధికతో 2,039.87 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశై లం జలాశయం నిర్మాణం 1960లో ప్రారంభించగా 1980 జూలై 26న నిర్మాణం పూర్తయ్యింది. 1984–85 నుంచి జలాశయంలో పూర్తిస్థాయి నిల్వలను కొనసాగిస్తున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. సాగర్కూ నాలుగో అత్యధిక వరద ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు సాగర్కు 1,766.24 టీఎంసీల వరద వచ్చింది. సాగర్ చరిత్రలోనే ఇది నాలుగో అత్యధిక వరద. 1955లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 1967లో పూర్తయిన సాగర్కు 1975–76లో అత్యధికంగా 2,639.9 టీఎంసీల వరద వచ్చింది. ఆ తర్వాతి కాలంలో కృష్ణానదిపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. దీంతో సాగర్కు వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. 1978–79లో 1,966.75 టీఎంసీలు, 1994–95లో 1,885.64 టీఎంసీల అత్యధిక వరదలు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గడిచిన 40 ఏళ్లలో సాగర్కు అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. పులిచింతల జలాశయానికి... సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయ చరిత్రలో అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. ఈ ఏడాది 1,477.1 టీఎంసీల వరద రాగా, అంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,285.86 టీఎంసీల వరద వచ్చింది. » ఈ ఏడాది కృష్ణానదికి నిరంతరంగా భారీ వరదలు కొనసాగడంతో ప్రకాశం బరాజ్ నుంచి రికార్డు స్థాయిలో 1,628 టీఎంసీల కృష్ణా జలాలను సముద్రంలో విడుదల చేశారు. 1990–91 తర్వాత ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన అత్యధిక వరద ఇదే కావడం గమనార్హం. ఇంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,331. 55 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు. గోదావరిలోనూ .... గోదావరి పరీవాహకంలోని సింగూరు జలాశయానికి 1998–99లో అత్యధికంగా 176.56 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఈ ఏడాది చరిత్రలోనే అత్యధికంగా 230.49 టీఎంసీల వరద వచ్చింది. » నిజాంసాగర్ ప్రాజెక్టుకు 1983–84లో అత్యధికంగా 328.93 టీఎంసీల వరద వచ్చింది. ఈ ఏడాది నిజాంసాగర్కు 306.83 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది. » శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అత్యధికంగా 1983–84లో 1,168.57 టీఎంసీల వరద రాగా, 1988–89లో 928.18 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది. ఈ ఏడాది జలాశయానికి 927.40 టీఎంసీల మూడో అత్యధిక వరద రావడం గమనార్హం. » శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 1,444.22 టీఎంసీల వరద ఈ ఏడాదే వచ్చింది. 2022–2023లో జలాశయానికి అత్యధికంగా 1,235.76 టీఎంసీల వరద రాగా, 2021–22లో 1077.23 టీఎంసీల ప్రవాహం వచ్చింది. 2015–16లో పూర్తయిన ఈ ప్రాజెక్టు చరిత్రలో ఏడాదికి 1,000 టీఎంసీలకు పైగా వరద మూడు పర్యాయాలు మాత్రమే వచ్చింది. » ధవళేశ్వరం బరాజ్ నుంచి ఈ ఏడాది 4,428 టీఎంసీల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలారు. -
వదలని వరద.. బురద
వరంగల్ అర్బన్/హన్మకొండ: సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్కన్నపేట(హుస్నాబాద్): డిండి: వరంగల్ నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గి మూడు రోజులు గడిచినా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండటం వల్ల తాము ఏమీ చేయలేమని బల్దియా అధికారులు చేతులెత్తేయడం పట్ల కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో మోంథా తుపానుతో 45 కాలనీలు నీట మునిగాయి. అందులో 39 కాలనీల్లో నీటి ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఇళ్లల్లోకి చేరుకున్నారు. కానీ, ఇళ్లన్నీ బురదతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద మేటలను తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నయ్యారు.హనుమకొండ పరిధిలోని వివేక్నగర్, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, కుడా కాలనీ, నందితా నగర్, రాంనగర్, రాజాజీ నగర్లో ఏ ఇంటిని చూసినా పేరుకు పోయిన ఒండ్రు మట్టిని తొలగిస్తూ కనిపించారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు బయట ఆరబెట్టారు. వరంగల్ ఎగువన ఉన్న చెరువులు మత్తళ్లు పోస్తుండటంతో వరద కొనసాగుతోంది. దీంతో హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, బృందవన కాలనీ, అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్ కాలనీల్లో ఇళ్లు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. సూమారు 300 కుటుంబాలు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నాయి. వరద తాకిడికి నగరంలోని పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. హనుమకొండలోని 100 ఫీట్ల రోడ్డు గోపాల్పూర్ చెరువు నుంచి సమ్మయ్య నగర్ క్రాస్ వరకు పూర్తిగా పాడైంది. శాంతించిన మున్నేరు: మోంథా తుపాను కారణంగా ఖమ్మంలో ఉప్పొంగి ప్రవ హించిన మున్నేరు వాగు శుక్రవారం శాంతించింది. గురు వారం రాత్రి ఖమ్మం కాల్వొడ్డు సమీపాన 26 అడుగుల మేర ప్రవహించగా, శుక్రవారం 15 అడుగులకు తగ్గింది. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. మున్నేరు పరీవాహకంలో ఖమ్మం నగరంలోని కాలనీలతోపాటు ఖమ్మంరూరల్ మండలం జలగం నగర్ లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.బ్యాక్ వాటర్తో పలు కాలనీలు నిండిపోయాయి. మరోపక్క ఆకేరు నదికి భారీగా వరద చేరింది. గురువారం తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వద్ద సీతారామ అక్విడక్ట్ను ఆనుకుని నది ప్రవహించింది. వరద తగ్గినా కాలనీల్లోని రోడ్లు, ఇళ్లలో బురద చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో వరి, పత్తితో పాటు ఇతర పంటలు దాదాపు 62,400 ఎకరాల్లో దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమి కంగా అంచనా వేశారు. అనధికారికంగా మరో 15 వేల ఎకరాలపై ప్రభావం చూపినట్లు సమాచారం.శ్రీశైలం హైవేపై బ్రిడ్జికి మరమ్మతునల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై కోతకు గురైన బ్రిడ్జి పునురుద్ధరణ పనులు శుక్రవారం కొనసాగాయి. వరద ప్రవాహం తగ్గటంతో అధికారులు రోడ్డు మరమ్మతు పనులను వేగవంతం చేశారు. ఈ మార్గం గుండా నాలుగు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో హైదరాబాద్, దేవరకొండ, కల్వకుర్తి, శ్రీశైలం, మద్ది మడుగు, ఉమామహేశ్వరం, అచ్చంపేట, తెల్కపల్లి, నాగర్కర్నూల్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం‘అమ్మ, చెల్లితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొందామని భర్తతో కలిసి బైక్పై బయలుదేరి, సిద్దిపేట జి ల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి శివారులో వా గు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయిన దంపతులు ప్రణయ్, కల్పన మృతదేహాలు శుక్రవారం ల భించాయి. దీంతో మృతదేహాల వద్ద బంధువులు, కు టుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కల్పన పుట్టిన రోజే డేత్డేగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషా దాన్ని నింపింది. ఘటనపై ప్రణయ్ తండ్రి ఇసంపల్లి ప్ర భాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపారు. -
Warangal: బాధితులతో ఇళ్లల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్న సీఎం
-
అమలాపురం వరదల డ్రోన్ విజువల్స్
-
జేసీబీలో వాగు దాటిన పెళ్లికుమార్తెలు
జరుగుమల్లి(సింగరాయకొండ): ఓ పక్క దగ్గర పడుతున్న పెళ్లి ముహూర్తం...మరో పక్క గ్రామాన్ని చుట్టుముట్టిన వరద.. ఈ స్థితిలో వివాహాలు జరుగుతుందా లేదా.. అని రెండు కుటుంబాలు ఆందోళన చెందాయి. చివరకు అధికారులు చొరవ తీసుకుని జేసీబీలో ఇద్దరు పెళ్లి కూతుళ్లను ఊరు దాటించడంతో వివాహాలు జరిగాయి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సాదువారిపాలేనికి చెందిన అద్దంకి శ్రీనివాసులు, విజయల కుమార్తె దుర్గకు గురువారం ఉదయం 10 గంటలకు చినగంజాంలో వివాహం జరగాల్సి ఉంది. అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అరుణ దంపతుల కుమార్తె అంజలి వివాహం కూడా అదే గ్రామానికి చెందిన సుధాకర్తో సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉంది. కానీ బుధవారం సాయంత్రం నుంచి ముసి వాగు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామం నుంచి గ్రామస్తులు బయటకు అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. దీంతో రెండు కుటుంబాల వారు అధికారులకు సమస్యను వివరించారు. దీంతో అధికారులు జేసీబీల సాయంతో పెళ్లికుమార్తెలను వరద నీటిని దాటించారు. -
ప్రియుడ్ని కాపాడబోయి.. కళ్లెదుటే జలసమాధై..
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాగులు, వంకలు ఉప్పొంగటంతో ఆరుగురు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) బుధవారం సాయంత్రం హనుమకొండలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రామానికి వెళ్లే కల్వర్టు వద్ద వరదనీటిలో పడి చనిపోయాడు. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్కు చెందిన అడపా కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరదనీటిలో పడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో కోల రామక్క (80) ఇంట్లో పడుకోగా వర్షానికి గోడ కూలి చనిపోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన పులి అనిల్ (30) ఖిలావరంగల్ సమీపం చింతల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బైక్పై వెళ్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ప్రేమికుడిని కాపాడే ప్రయత్నంలో.. హైదరాబాద్ నుంచి బైక్పై వస్తున్న ఓ ప్రేమజంట జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో వరదలో చిక్కుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడేపల్లికి చెందిన బరిగెల శివకుమార్ కలిసి బైక్పై వెళ్తుండగా తిమ్మంపేట గ్రామ శివారులోని బోల్ల మత్తడి కల్వర్టు వద్ద ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి శివకుమార్ బైక్తో సహా కొట్టుకుపోతుండగా శ్రావ్య అతన్ని కాపాడేందుకు వరదలోకి రావడంతో ఆమె కూడా కొట్టుకపోయింది.శివకుమార్ చెట్టుకొమ్మల సహాయంతో ప్రాణం కాపాడుకోగా, గల్లంతైన శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు బుధవారం బైక్పై సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తుండగా మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన గర్భవతిగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దంపతుల బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) జంపన్నవాగు (చిన్నవాగు) కల్వర్టుపై వరదలో కొట్టుకుపోయిన మరణించాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో తన ఇంటిలో పడుకున్న గద్దల సూరమ్మ (58)పై గురువారం తెల్లవారుజామున గోడ కూలి పడడంతో చనిపోయింది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన రాచ కృష్ణవేణి (45) తన భర్త ప్రభాకర్తో కలిసి గురువారం బైక్పై వెళ్తుండగా మజీద్పూర్– బాటసింగారం గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వరద కాల్వలో పడిపోయారు. స్థానికులు ప్రభాకర్ను కాపాడగా, కృష్ణవేణి నీట మునిగి మృతిచెందింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలోని కోళ్ల ఫారాల్లో వర్షాలతో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో పొలానికి వెళ్లిన రైతులు బుధవారం దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోయారు. తాడు సహాయంతో పోలీసు సిబ్బంది అవతలి ఒడ్డుకు చేరుకొని గురువారం రైతులకు ఆహారం అందజేశారు. వారు రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో మానకొండూర్ రూరల్ మండలం శ్రీనివాస్నగర్ శివారులో వాగు ఒడ్డున ఉన్న 16 వేల బాతులు కొట్టుకుపోయాయి. -
Warangal: వరదలో చిక్కుకున్న 473 మంది బాలికలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
-
Cyclone Montha: ఖమ్మం టౌన్లోకి వస్తున్న వరద నీరు
-
నీట మునిగిన వేలాది ఎకరాలు.. సహాయక చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్
-
ముందుకొస్తున్న మున్నేరు.. ఖమ్మంలో టెన్షన్ టెన్షన్
-
తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన వరంగల్
-
Ongole: రాత్రి నిద్రలో ఉండగా ఇంట్లోకి నీళ్లు
-
మున్నేరు ఉగ్రరూపం.. ఇళ్లలోకి వస్తున్న విషసర్పాలు
-
హైదరాబాద్-వరంగల్ హైవేపై భారీగా వరద!
మోంథా తుపాన్ ఓరుగల్లును పూర్తిగా ముంచెత్తింది. ట్రై సిటీస్.. కాజీపేట, హనుమకొండ, వరంగల్లు నీట మునిగాయి. భారీ వర్షాలు, వాగులు వంకు పొంగిపొర్లడంతో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. కార్లు మునిగేంత నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాఘవాపూర్ వద్ద హైవేపై డివైడర్ కూల్చేసి నీటిని దిగువకు పంపిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రాకపోకలు నెమ్మదిగా జరుగుతున్నాయి. మోంథా ధాటికి వరంగల్, హనుమకొండ జిలాలు ఆగమాగం అయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు కూలిపోయి.. రోడ్లు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరంగల్-హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుకాలనీల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.హంటర్ రోడ్డులో బొంది వాగు తీవ్ర ఉధృతితో ప్రవహిస్తోంది. మానుకోట, వరంగల్, హనుమకొండలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి.హనుమకొండ-ములుగు రహదారి లోలెవ్ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి. ముగ్దుంపురం చెరువు అలుగు పోస్తుండడంతో.. నర్సంపేట-చెన్నారావుపేట రహదారిపై లోలెవల్ కాజ్వేపై వరద ప్రవహిస్తోంది. దీంతో నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తుండగా.. 45 కాలనీలు నీట మునిగాయి. ఏడు ప్రత్యేక బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 1200 మందిని తరలించినట్లు సమాచారం. వేల ఎకరాల్లో పంట నీటి పాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్లో 9, హనుమకొండలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారువరద ప్రభావంతో భద్రకాళి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కాలేజీ దాకా రోడ్డుపై నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఆలయం వైపు మార్గాన్ని మూసేశారు. ఉమ్మడి వరంగల్లో మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసింది. హనుమకొండ భీమదేవరపల్లిలో 42.2 సెం.మీ వర్షం, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 41.5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 33.8 సెం.మీ వర్షం, వరంగల్ జిల్లా సంగెంలో 33.8 సెం.మీ, నెక్కొండలో 35 సెం.మీ వర్షం,ఖిలా వరంగల్లో 34.3 సెం.మీ వర్షపాతం కురిసింది. వర్ధన్నపేట్ లో 32.8 వర్షపాతం నమోదుకగా, జనగామ జిల్లా పాలకుర్తిలో 29.4 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 25.8 సెం.మీ వర్షం కురిసింది. -
వరదల్లో కొట్టుకుపోయిన ప్రేమ జంట..
-
ప్రాజెక్టులకు మళ్లీ జలకళ
కేతేపల్లి/నాగార్జునసాగర్/బాల్కొండ/జగిత్యాల అగ్రికల్చర్: విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రాగా, బుధవారం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 4.46 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 1,94,845 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 20 క్రస్ట్గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా 1,94,845 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వ, వరద కాల్వకు, ఏఎమ్మార్పికి నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్ జలాశయ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగుల మేర నీరు ఉంది. మోంథా తుపాను ప్రభావంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాగర్ శివారులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని ఎత్తిపోతల వద్ద జలపాతం ఉధృతంగా పారుతోంది. ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. బాబ్లీ గేట్ల మూసివేత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రి సభ్య కమిటీ సభ్యుల సమక్షంలో మూసివేశారు. ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి ఏటా అక్టోబర్ 29న మూసివేస్తారు. అయితే ప్రాజెక్టుకు 14 గేట్లు ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో పది గేట్లను మాత్రమే మూసి వేసి మిగతా నాలుగు గేట్లను తెరిచి ఉంచి ఎస్సారెస్పీలోకి నీటి విడుదల చేస్తున్నారు. వరద నీటి ఆధారంగా నాలుగు గేట్ల మూసి వేత, ఓపెన్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ ప్రాంక్లిన్, ఎస్సారెస్పీ ఎస్ఈ జగదీశ్, నాందేడ్ ఈఈ సీఆర్ బన్సద్, ఏఈఈ రవి తదితరులు పాల్గొన్నారు. -
భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక
-
Adimulapu Suresh: తాగటానికి నీళ్ళు కూడా ఇవ్వరా? అధికారులపై ఆదిమూలపు సురేష్ ఫైర్
-
డేంజర్ జోన్ లో ఇండియా
-
విజయవాడలో భారీ వర్షం.. వరదలో చిక్కుకున్న బస్సు
-
చిత్తూరులో నీవా నది పరివాహక ప్రాంతాన్ని ముంచేసిన వరద
-
కర్ణాటక: విహారయాత్రలో విషాదం.. చిన్నారులు మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విషాద యాత్ర సందర్భంగా విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లిన వ్యక్తులు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఏడుగురు గల్లంతు అవగా.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో మార్కోనహళ్లి ప్రాజెక్ట్ వద్దకు 15 మంది కలిసి విహార యాత్రకు వెళ్లారు. అనంతరం, వారిలో ఒక మహిళ, ఆరుగురు పిల్లలు కలిసి.. నీళ్లు ఉన్న ప్రాంతం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు నవాజ్ అనే వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.పిల్లలను కాపాడే క్రమంలో నవాజ్ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్య్కూ బృందాల అక్కడి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కేవలం నవాజ్ను మాత్రమే ప్రాణాలతో కాపాడారు. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, వీరంతా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించారు. విహార యాత్రకు వెళ్లి తమ పిల్లలు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
వరదలకు మానవ నిర్మిత విపత్తే కారణం: మమతా బెనర్జీ
కోల్కతా: రాష్ట్రంలో సంభవించిన వరదలకు, ముఖ్యంగా ఉత్తర బెంగాల్లో తలెత్తిన దుర్భర పరిస్థితులకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (వీడీవీసీ) కారణమంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వరదలను ఆమె మానవ నిర్మిత విపత్తుగా అభివర్ణించారు.దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎటువంటి సమన్వయం లేకుండా రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడమే ఈ పరిస్థితికి కారణమని మమతా ఆరోపించారు. శనివారం నుంచి నమోదవుతున్న రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న డార్జిలింగ్, చుట్టుపక్కల ప్రాంతాలలో డీవీసీ చేపట్టిన చర్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ. ఐదు లక్షల పరిహారం, ఒకరికి హోమ్గార్డ్ ఉద్యోగం ప్రకటించారు. డబ్బుతో ప్రాణ నష్టాన్ని పూడ్చలేమని, అయితే ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాగ్డోగ్రాకు బయలుదేరే ముందు కోల్కతా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన మమతా బెనర్జీ డీవీసీపై పలు ఆరోపణలు చేశారు. జార్ఖండ్ను వరదల నుంచి రక్షించేందుకు డీవీసీ మైథాన్,పాంచెట్ రిజర్వాయర్ల నుంచి ఇష్టం వచ్చినట్లుగా నీటిని విడుదల చేసిందని, ఇది దిగువ ప్రాంతమైన బెంగాల్లో పరిస్థితిని మరింత దారుణంగా మార్చిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. కేవలం 12 గంటల్లో 300 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని. దీని కారణంగా హైవేలు, వంతెనలు, ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. VIDEO | North Bengal floods: West Bengal CM Mamata Banerjee says, "All tourists have been rescued, except for one missing at Diamond Harbour. Today, 500 tourists are being brought in, while many were brought by buses yesterday. 250 tourists will be accommodated in Siliguri."… pic.twitter.com/dp00WJ6pzd— Press Trust of India (@PTI_News) October 6, 2025కాగా డార్జిలింగ్లోని మిరిక్, సుఖియాపోఖ్రి, జోరెబంగ్లో, అలాగే జల్పాయ్గురి జిల్లాలోని నాగర్కట వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్నాయని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. ఇప్పటివరకు ఉత్తర బెంగాల్ వరదలలో 23 మంది మృతి చెందారని మమత తెలిపారు. డార్జిలింగ్, మిరిక్, కాలింపాంగ్లలో 18 మంది, నాగర్కటలో ఐదుగురు మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. కాగా వరద ప్రభావిత జిల్లాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 45 బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపు 500 మంది పర్యాటకులను తరలించామని, మరో 250 మందికి సిలిగురిలో వసతి కల్పిస్తామని సీఎం తెలిపారు. డైమండ్ హార్బర్ నుండి తప్పిపోయిన ఒక వ్యక్తి మినహా మిగిలిన పర్యాటకులందరినీ రక్షించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చిక్కుకుపోయిన పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని, గదులు ఖాళీ చేయమని ఒత్తిడి చేయవద్దని హోటళ్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఖర్చులను తామే భరిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. -
బీజేపీ నేతలపై మూక దాడి
నగరాకాటా: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యట నకు వెళ్లిన సమయంలో జరిగిన మూకదాడిలో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే గాయాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా నగరాకాటా వద్ద సోమవారం చోటుచేసుకుంది. దుఆర్ ప్రాంతంలో ఇటీవల వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, అందుతున్న సాయాన్ని పరిశీలించేందుకు బీజేపీ ఏర్పాటు చేసిన బృందంలో ఎంపీ ఖగేన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ ఉన్నారు. వరద బాధితుల దగ్గరికి వెళ్తున్న ఆ నేతల కాన్వాయ్ని బమన్దాంగా వద్ద ఓ గుంపు చుట్టు ముట్టింది. ‘దీదీ, దీ దీ..’అని నినాదాలు చేస్తూ వాహనాలపై వారు రాళ్లు రువ్వారు. వాహనాల కిటికీల అ ద్దాలు పగిలిపోయా యి. ముర్ము తలకు గాయమై రక్తం కారింది. భయంతో ఘోష్ వణికిపోయారు. ఇందుకు సంబంధించిన లైవ్ వీడియో ఫేస్బుక్లో ఉంది. దుండగులు తమను దూషిస్తూ వెనుక నుంచి రాళ్ల దాడికి దిగారని శంకర్ ఘోష్ చెప్పారు. ఖగేన్కు రాళ్లు తగలడంతో భయపడి సీటు వెనుక దాక్కున్నట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎంపీ ఖగేన్ను సిలిగురిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన టీఎంసీ ఆటవిక పాలనకు మరో నిదర్శనమంటూ బీజేపీ మండిపడింది. ఈ ప్రాంతంలో ప్రజల్లో రాజుకుంటున్న అసమ్మతిని అణచివేసేందుకే సీఎం మమతా బెనర్జీ ఇలాంటివి చేయిస్తు న్నారని ఆరోపించింది. పోలీసుల సమక్షంలోనే తమ నేతల బృందంపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించింది. ఒక వైపు ప్రజలు వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయి ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తుంటే కోల్కతాలో సీఎం మమత మాత్రం ఉత్సవాలు చేసుకుంటున్నారని పేర్కొంది. ఇలా ఉండగా, సిలిగురిలోని వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు వెళ్లిన తమకు టీఎంసీ శ్రేణులు పదేపదే అడ్డు తగిలారని బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఆరోపించారు. తమ బృందంలో ఎంపీలు రాజు బిస్తా, జయంత రాయ్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. BJP MP Khagen Murmu (Malda Uttar PC) and BJP MLA Shankar Ghosh (Siliguri AC) attacked in Nagrakata in Jalpaiguri.This seems to be a case of public outrage against BJP leaders of North Bengal who prioritize accompanying LOP Suvendu Adhikari over attending to their areas. pic.twitter.com/Rf5vnPGdlK— Sandipan Mitra (@SMitra_) October 6, 2025 -
ఉత్తరాంధ్ర అతలాకుతలం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికింది...! ఎడతెరిపి లేని భారీ వర్షంతో తడిసి ముద్దయింది...! మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది...! విజయనగరం విలవిల్లాడింది...! విశాఖపట్నంలోనూ తీవ్రత కనిపించింది..! ఏకధాటిగా కురిసిన వానకు నదులు, వాగులు పొంగి ప్రవహించాయి...! గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అనేకచోట్ల చెట్లు రోడ్లపై కూలిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునగడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కాగా, వేర్వేరు ఘటనల్లో గోడకూలి వృద్ధ దంపతులు సహా ముగ్గరు మృతిచెందారు. నది ప్రవాహంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. రికార్డు స్థాయిలో 18.03 సెంటీమీటర్ల వర్షం కురవడంతో శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ పట్టణాలు చెరువుల్లా మారాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ పలుచోట్ల అతి భారీ వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. – సాక్షి, అమరావతిశ్రీకాకుళం జిల్లా అంతటా కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. మెలియపుట్టి మండలం చుట్టూ నీరు చేరింది. మందసలో 13.9, హరిపురం (13.7), నందిగం (13.4), కంచిలి మండలం ఎంఎస్ పల్లె (13.1), టెక్కలి మండలం రావివలస (10.1), సోంపేట మండలం కొర్లాం (9.6), మెలియపుట్టి (9.3), కోట»ొమ్మాళి (9), సంత»ొమ్మాళి (8.9), పార్వతీపురం మన్యం సీతంపేటలో (8), సిరిగం (7.9), రాస్తకుంటబాయి (7.4), నిమ్మాడ (6.8), గార (6.7) వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా పాఠశాలలకు స్థానికంగా ఎక్కడికక్కడ సెలవు ప్రకటించారు. అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో 5 సెం.మీ పైగా వర్షం శ్రీకాకుళం జిల్లా రణస్థలం, కవిటి, పొలాకి, బుర్జ, ఆమదాలవలస, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, లావేరు, నరసన్నపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, విజయనగరం జిల్లా మెరకముడిదం, గరివిడి, పైడి భీమవరం, రాజాపురం, పార్వతీపురం మన్యం జిల్లా పచి్చపెంట ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. విజయనగరం విలవిల విజయనగరం జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగాయి. పొలాలను వరద ముంచెత్తింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగింది. ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళికి వరద పోటెత్తింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరటి, చెరకు, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఏసూరిగెడ్డ ఉధృతికి రావుపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన వంద ఎకరాల వరి ముంపునకు గురైంది.గొట్టా, భగీరథపురం, నీలాదేవిపురం, అంబావల్లి, పిండ్రువాడ, రెల్లివలస, అక్కరాపల్లి, కిట్టాలపాడు, పాతహిరమండలం, జిల్లోడిపేట, కల్లట, గులుమూరు గ్రామాల్లో వందల ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయి. పొట్ట, వెన్ను దశలో ఉన్న సమయంలో వరదతో పంటంతా పోయింది. వీరఘట్టం మండలంలో 850 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.వట్టిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో కురుపాం–రావాడ గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పుముఠాలో ఉన్న సుమారు 30 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.తీరం దాటిన వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం ఒడిశాలోని గోపాల్పూర్–పారదీప్ మధ్య తీరం దాటింది. శుక్రవారానికి అతి బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.ఈపీడీసీఎల్కు రూ.1.78 కోట్ల నష్టంవాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో రూ.1.78 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వెల్లడించారు. గాలుల కారణంగా ఆరు సర్కిళ్లలోని విద్యుత్ లైన్లపై భారీ వృక్షాలు, ఫ్లెక్సీ బ్యానర్లు, చెట్లకొమ్మలు విరిగిపడ్డాయని తెలిపారు. 33 మండలాలకు గాను 25 మండలాల్లో విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు.వంశధార ఉధృతిభీతిల్లిన పరివాహక గ్రామాల ప్రజలు గొట్టాకు మూడో ప్రమాద హెచ్చరిక జారీవర్షాల దెబ్బకు నాగావళి, వంశధార నదులు ప్రమాద స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంశధార ఐదారేళ్లుగా చూడని స్థాయిలో ఉగ్రరూపం దాల్చింది. 1.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో నదీ తీర గ్రామాల ప్రజలు భీతిల్లారు. శుక్రవారం సాయంత్రం నుంచి వంశధార శాంతించింది. తోటపల్లి, మడ్డువలస, జంఝావతి, పెదంకలాం, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది.ఒడిశాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గొట్టా బ్యారేజీలోకి నీటి మట్టం పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ధాటికి నదీ తీర ప్రాంత ప్రజలు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. బాహుదా నది కూడా పొంగి ప్రవహించడంతో తీర గ్రామాలు, పొలాలు నీట మునిగాయి. మహేంద్రతనయకూ వరద ఉధృతి కొనసాగుతోంది.నేలకొరిగిన చెట్లు ఈదురుగాలులు విశాఖను వణికించాయి. దసరా రోజున భారీ గాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. 80 ప్రాంతాల్లో 170 పైగా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. అల్లూరి జిల్లాలో కూలిన బడులు భారీ వర్షాలకు అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ వనభరంగిపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గురువారం తెల్లవారుజామున కుప్పకూలింది. ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ సింధుపుట్టులో పాఠశాల నిర్వహించే రేకుల షెడ్డు గురువారం సాయంత్రం పడిపోయింది.మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా ముూడు జిల్లాల్లో నలుగురు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.వృద్ధ దంపతులను బలిగొన్న గోడమరో రెండు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం క్యాబేజీ పంటంతా పోవడంతో రైతు ఆత్యహత్యాయత్నంశ్రీకాకుళం జిల్లా మందస మండలం హంసరాలి పంచాయతీ చిన్నటూరులో గురువారం రాత్రి మట్టి గోడ కూలి పెళ్లలు మీద పడడంతో వృద్ధ దంపతులు సవర బుద్దయ్య (65), రూపమ్మ(60) ప్రాణాలు కోల్పోయారు. హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా బయట ఉంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు వీరి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురంలో వర్షాలకు నానిన గోడ కూలడంతో అరవింద్ మృతి చెందాడు. ఇతడి సోదరుడు వినయ్ను స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.శ్రీకాకుళం జిల్లా పలాస మొగిలిపాడు గ్రామానికి చెందిన సైని గోపాలరావు (47) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గురువారం జాతీయ రహదారి వెంట పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండగా... అవతల ఉన్న పొలాన్ని చూసేందుకు వెళ్లిన గోపాలరావు తిరిగి రాలేదు. పొలం దగ్గర ఉన్న ఖానాలో పడిపోయి చనిపోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జె.రంగరాయపురంలో వేగావతి నదిలో యోగేశ్వరరావు (22) గల్లంతయ్యాడు.పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కళ్లికోటకు చెందిన కౌలు రైతు బి.రాంబాబు క్యాబేజీ పంట మొత్తం నీట మునగడంతో పురుగుమందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
పోటెత్తిన ‘కృష్ణవేణి’
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/కంకిపాడు/ధవళేశ్వరం/విజయపురిసౌత్/మలికిపురం: ప్రకాశం బ్యారేజ్కు ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పోటెత్తింది. రెండ్రోజులుగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. అయితే, సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికి 6,74,971 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో రాత్రి ఏడు గంటల సమయానికి 6,54,876 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగుల నీటి మట్టం ఉంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఒక అడుగు మేర వరద పెరిగింది.ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దాములూరు, మూలపాడు, కొటికలపూడి, జూపూడి, త్రిలోచనాపురం, లంక గ్రామాల్లో మినుము పంట ముంపునకు గురైంది. 700 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముక్త్యాల–జగ్గయ్యపేట రహదారిలో చంద్రమ్మ కయ్య పొంగి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రావిరాల బీసీ కాలనీ వాసులు రెండో రోజు కూడా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. ముక్త్యాల, రావిరాల, కె.అగ్రహారం గ్రామాల్లోని పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పోటెత్తడంతో భవానీపురం బెరంపార్క్లోకి నీరు వచ్చి చేరింది. ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసినప్పటికీ ప్రవాహం ఆగలేదు. దీంతో హరిత బెరంపార్క్లోకి పర్యాటకులు, సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు.ఏటిపాయ ప్రాంతాల్లో వరద ముంపుకృష్ణాజిల్లాలోని పెనమలూరు, పామర్రు మండలాలు, దివిసీమ ప్రాంతాల్లో ఏటిపాయ వెంబడి ఉన్న ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదనీరు కరకట్ట అంచులు తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. తోట్లవల్లూరు, పెనమలూరు, కంకిపాడు మండలాల్లో కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాలు ముంపుబారిన పడ్డాయి. ప్రధానంగా అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగాయి. పెనమలూరు మండలంలో కరకట్ట వెంబడి గ్రామాల్లో వేలాది నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే, దివిసీమ పరిధిలోని ఎడ్లంక గ్రామంలోకి కూడా వరద చొచ్చుకొచ్చింది. రహదారి మార్గం మూసుకుపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు నివాసాల్లోకి నీరు చేరింది. నివాసితులు సామాన్లను తరలిస్తున్నారు. అలాగే, ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో లంక గ్రామాలు, కరకట్ట వెంబడి ప్రాంతాలు ముంపుబారిన పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం నుంచి 5,91,456 క్యూసెక్కులు విడుదల శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 5,91,456 క్యూసెక్కులు వచ్చి చేరటంతో వచ్చిన నీరు వచి్చనట్టు దిగువకు వదులుతున్నారు. సోమవారం 24 క్రస్ట్గేట్లు 15 అడుగులు, రెండు గేట్లు 20 అడుగుల మేర ఎత్తి 5,41,516 క్యూసెక్కులను దిగువకు వదిలారు. కుడికాలువకు 9,533, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,333, ఎస్ఎల్బీసీకి 1,200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.నిలకడగా గోదావరి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. సోమవారం ఉదయం 6.15 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.70 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అదే స్థాయిలో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 9,59,784 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు 12,500 క్యూసెక్కులు వదిలారు. ఎగువన నీటి ఉధృతి పెరుగుతుండటంతో కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరంలో అలజడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం ముందుకు వస్తుండటంతో ప్రజల్లో అలజడి మొదలైంది. అంతర్వేది నుంచి కరవాక వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర సోమవారం సముద్రం 300 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. వరద కారణంగా గోదావరి పాయల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో సముద్రం ముందుకొస్తోంది. సముద్రపు అలలు వేగంగా దూసుకురావడం వల్ల తీర ప్రాంతం కోతకు గురవుతోంది. ముఖ్యంగా అంతర్వేది లైట్ హౌస్ వద్ద తీరం అధికంగా కోతకు గురవుతున్నట్లు కనిపిస్తోంది. -
భయపెట్టిన మూసీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, రంగారెడ్డి జిల్లా/పాపన్నపేట(మెదక్): హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వణికించింది. దాదాపు మూడు దశాబ్దాలలో ఎన్నడూ చూడని విధంగా ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తటంతో శుక్రవారం సాయంత్రం నుంచి నది గట్టుదాటి ప్రవహించింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల గేట్లను ఒకేసారి ఎత్తడంతో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా వరద వచ్చి నగరంపై పడింది. దీంతో ఎన్నడూలేని విధంగా మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్)ను వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. శనివారం కాస్త శాంతించినప్పటికీ వరద ఉధృతి కొనసాగింది. ఎంజీబీఎస్ బస్స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు. మూసీ పరీవాహక ప్రాంతాలైన బాపూఘాట్ నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జి వరకు అనేక లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, కాలనీలు నీటమునిగాయి. మూసానగర్, శంకర్నగర్, మలక్పేట తదితర చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరటంతో దాదాపు 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.చాదర్ఘాట్ బ్రిడ్జి, ఎంజీబీఎస్ బస్స్టేషన్, మలక్పేటలోని పునరావాస కేంద్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి సందర్శించారు. వరద నీరు చేరటంతో చాదర్ఘాట్, మూసారాంబాగ్ కాజ్వేలను మూసివేశారు. మూసారాంబాగ్ కాజ్వే పక్కనే నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జిని సైతం వరద నీరు తాకింది. నార్సింగి, హిమాయత్సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును మూసివేశారు. మంచిరేవుల – నార్సింగి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పూరానా పూల్ బ్రిడ్జి వద్ద మూసీ ప్రమాదకర స్థాయికి చేరింది. శివాలయం నీటమునిగింది. ఆలయ పూజారి కుటుంబం గుడిలోనే చిక్కుకుపోవడంతో హైడ్రా సిబ్బంది క్రేన్¯ సాయంతో బయటికి తీసుకొచ్చారు. మూసీ వరద ఉధృతిపై అధికారులతో సీఎం రేవంత్ ఆరా తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కాస్త తగ్గిన వరద మూసీ నదికి శనివారం సాయంత్రానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. జంట జలాశయాల నుంచి మూసీలోకి వదులుతున్న వరద 36 వేల క్యూసెక్కుల నుంచి 15 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఉస్మాన్సాగర్ జలాశయానికి 9,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 11 గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి దిగువకు 9,284 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. హిమాయత్సాగర్కు ఎగువ నుంచి 7,000 క్యూసెక్కుల వరద వస్తుండగా, నాలుగు గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 6,420 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్ష భీభత్సం రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో శనివారం భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీర్శెట్టిపల్లి, సంగెంకలాన్, జీవన్గీ గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఓగిపూర్ సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తూ జుట్టూరు వాగులో చిక్కుకున్న ఇద్దరు లారీ డ్రైవర్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. కాగ్నా నది ఉధృతికి యాలాల మండలంలోని కోకట్ బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తాండూరు, పరిగి, హైదరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. విశ్వనాథ్పూర్ వాగు దాటే క్రమంలో కొందుర్గు మండలం వెంకిర్యాలకు చెందిన లింగమయ్య (42) కొట్టుకుపోయి మరణించాడు. కోట్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన చింతకింది రవికుమార్ (35) కొత్తపల్లి చెరువు అలుగులో కొట్టుకుపోయిన చనిపోయాడు. బషీరాబాద్ మండలం జీవన్గీలోని కాగ్నా ఒడ్డున ఉన్న గోశాలను వరద ముంచెత్తటంతో గోవులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంగారెడ్డి జిల్లాలో శనివారం కూడా భారీ వర్షాలు కురిశాయి. మనూరు మండలంలో 9.2 సెం.మీల వర్షపాతం రికార్డయింది. సదాశివపేట మండలం పెద్దాపూర్లో ఉన్న హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు పంప్హౌజ్ పూర్తిగా నీట మునిగింది. దీంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు నీటిసరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో రహదారి కొట్టుకుపోవటంతో సదాశివపేట, టేకులపల్లి, అనంతసాగర్, మోమిన్పేటల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మునిపల్లి మండలంలో పంటలు నీట మునిగాయి. పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. జహీరాబాద్ ప్రాంతంలో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొండాపూర్ మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు వరద
నాగార్జునసాగర్/కన్నాయిగూడెం/ దోమలపెంట: కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారిగా 5 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు స్పిల్వే ద్వారా 5,03,100, సుంకేసుల నుంచి 71,136, హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కులు మొత్తం 5,77,986 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను ఒక్కొక్కటి 20 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 4,61,560 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. అలాగే ఎడమ, కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 64,695 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,26,255 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.5 అడుగుల వద్ద 202.0439 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్ 26 గేట్లను 10 అడుగులు ఎత్తి స్పిల్వే మీదుగా 3,76,402 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో మరో 33,373 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 587.30 అడుగులు (305.6838 టీఎంసీలు) ఉంది. భారీ వర్షాల వల్ల ఆయకట్టు పొలాలకు నీటి అవసరాలు తగ్గడం, కాల్వల కరకట్టలు జారిపోయే ప్రమాదం ఉండటంతో సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లే కుడి కాల్వకు మాత్రం 8,023 క్యూ సెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో గోదావరిలో నీటిమట్టం కూడా వేగంగా పెరుగుతోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తు పాకులగూడెం గ్రామంలోని సమ్మక్కసాగర్ బరాజ్కు 6,72,140 క్యూసెక్కుల వరద వస్తోంది. బరాజ్ 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. -
మూసీ మునిగిపోవాలనే..! 15 గేట్లు ఒకేసారి..!! రేవంత్ కుట్ర బట్టబయలు చేసిన కేటీఆర్
-
రిటర్నింగ్ వాల్ కూలడంతో MGBS వైపు వరద వచ్చింది : రంగనాథ్
-
MGBSకి రావొద్దు.. భయంకరమైన వరద
-
మూసీ ఉగ్రరూపం.. MGBSను ముంచెత్తిన వరద
-
ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఎంజీబీఎస్ వరదపై సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసీ మహోగ్రరూపంతో(Moosi Floods) వరద పోటెత్తి ఇమ్లీబన్(ఎంజీబీఎస్) బస్టాండ్ను ముంచెత్తింది. దీంతో అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులంతా ఆందోళనతో ఆగం అయ్యారు. అయితే ఈ వరదపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసర సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.మూసీ వరదలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా.. ప్రయాణికులెవరూ ఆందోళనకు గురికావొద్దని.. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టిందని అన్నారాయన. అదే సమయంలో బస్టాండ్ వద్ద ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్ధరాత్రి నుంచే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. గేట్లు ఎత్తేయడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. నది వెంట హైదరాబాద్లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. పురానాపూల్ వంతెనపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎంజీబీఎస్ జలదిగ్బంధంలో ఉండడంతో బస్సులను ఎక్కడిక్కడే ఆపేస్తున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, ఖమ్మం నుంచి వచ్చే బస్సులను ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ వరకే అనుమతిస్తున్నారు. అలాగే.. మహబూబ్నగర్, కర్నూల్ నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్లోనే ఆపేస్తున్నారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ రింగ్రోడ్.. ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జూబ్లీ బస్టాండ్ వరకే అనుమతిస్తున్నారు. ఇంకోవైపు..మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసేయడంతో.. దిల్సుఖ్ నగర్-అంబర్ పేట్ రాకపోకలు ఆగిపోయాయి. వరద నీళ్లతో కాలనీలు మునుగుతుండగా, ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. ఎగువన వరద నీరు పోటెత్తుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
గోదావరి ఉగ్రరూపం
రెంజల్ (బోధన్): తెలంగాణ–మహారాష్ట్రల మధ్య రాకపోకలను రెండు రాష్ట్రాల అధికారులు నిలిపివేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనపైనుంచి అడుగున్నర ఎత్తులో గోదావరి వరద నీరు ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మాబాద్ పోలీసులు, రెవెన్యూ అధికారులు వంతెనకు మహారాష్ట్ర భాగంలో చెక్పోస్టును ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. కందకుర్తి వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ తహసీల్దార్ శ్రావణ్కుమార్లు అక్కడికి చేరుకున్నారు. వరద పెరగడంతో గ్రామ శివారులో బారికేడ్లను పెట్టి రాకపోకలను నియంత్రించారు. స్థానికులు, రైతులు అటువైపు వెళ్లకుండా కందకుర్తి చెక్పోస్టు వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ నెలలో వంతెన పైనుంచి గోదావరి ప్రవహించడం ఇది రెండోసారి. మంజీరా నది కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. దీంతో రెండు నదుల నుంచి వరద నీరు పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరో రెండు రోజుల వరకు వరద తగ్గే అవకాశం లేదని గ్రామాల్లో దండోరా వేయించారు. ఆశ్రమంలో చిక్కుకున్న వారి తరలింపు కందకుర్తి పుష్కర క్షేత్రంలోని సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరడంతో ఆశ్రమంలో త్యాగి మహారాజ్, మరో నలుగురు చిక్కుకుపోయారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు స్థానికుల సహకారంతో ట్రాక్టర్లో వారిని సురక్షితంగా గ్రామంలోని శ్రీరామాలయానికి చేర్చారు.శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదపది గేట్లు ఎత్తి సాగర్కు నీటివిడుదలదోమలపెంట: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు స్పిల్వే, విద్యుదుత్పత్తి, సుంకేసుల, హంద్రీ నుంచి మొత్తం 2,68,831 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను ఒక్కొక్కటి 14 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 3,45,730 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ అదనంగా 65,341 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.1 అడుగుల వద్ద 199.7354 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,409, ఎంజీకేఎల్ఐకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.614 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 15.114 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. -
రూ.10 కోట్ల రోల్స్రాయిస్ కంటే రూ.10 లక్షల కారే నయం కదా!
రూ.కోట్లు పెట్టి కొన్న వస్తువులు కూడా కొన్ని సందర్భాల్లో పనికిరాకుండా పోతుంటాయి. సాధారణ సగటు వస్తువులే మేలనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఇది. సుమారు రూ.10 కోట్ల ధర ఉండే రోల్స్రాయిస్ (Rolls Royce ) కారు.. వరద నీటిలో చిక్కుకుని ఇక నావల్ల కాదంటూ ముందుకెళ్లకుండా మొరాయిస్తే.. రూ.10 లక్షల లోపుండే మామూలు కార్లు రయ్మంటూ దూసుకెళ్లాయి.కోల్కతాలో (Kolkata) అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచి ఉంది. ఈ క్రమంలో ఓ రోల్స్ రాయిస్ కారు ఆ వరద నీటిలో నిలిచిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియోలో టాటా వాహనంలో ప్రయాణిస్తున్న ఒక వాహనదారుడు రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు వరద నీటిలో ఎలా చిక్కుకుపోయిందో పేర్కొన్నారు. రూ .10 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కారు కంటే తన రూ .10 లక్షల టాటా కారే నయం అంటూ ఈ క్లిప్లో ఆ వాహనదారుడు వ్యాఖ్యానించారు. ఈ ఘటన దక్షిణ కోల్కతాలోని బాలీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: మార్కెట్లోకి కొత్త ఈవీ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 172 కి.మీ.!వైరల్గా మారిన ఈ వీడియోపై పలువురు ఇన్స్టాగ్రామ్ యూజర్లు ప్రతిస్పందించారు. రోల్స్ రాయిస్ లగ్జరీ కారని, నీటితో నిండిన వీధుల్లో నడపడానికి ఉద్దేశించినది కాదని కొందరు వ్యాఖ్యానించగా, కోల్కతా నగర రోడ్ల దుస్థితిని మరికొంతమంది ప్రశ్నిస్తూ కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Ravi DAS (@kolkata_cab_riders) -
జల దిగ్బంధం... ట్రాఫిక్ చక్రబంధం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: భాగ్యనగరాన్ని వరుణుడు బెంబేలెత్తించాడు. హోరు వానతో నగరాన్ని అతలాకుతలం చేశాడు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉరుములు మెరుపులతో మొదలైన మేఘగర్జన రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రహదారుల పక్కన నిలిపిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఓపెన్ నాలాలు, మ్యాన్హోల్స్ పొంగిపోర్లాయి. ఫలితంగా రోడ్లన్నీ చెరువులను తలపించడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమైంది.గంటలకొద్దీ, కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. విజయవాడ, వరంగల్, ముంబై, బెంగళూరు, కరీంనగర్ వెళ్లే మార్గాల్లో ఇళ్లకు, ఆఫీసులకు బయలుదేరిన వాహనదారులు ముందుకు కదల్లేక నానా అవస్థలు పడ్డారు. ప్రధానంగా అసెంబ్లీ నుంచి ఖైరతాబాద్, మెహిదీపట్నం నుంచి మాసాబ్ ట్యాంక్, ఎల్బీ నగర్ నుంచి మలక్పేట వరకు కేవలం కిలోమీటర్ ప్రయాణానికి గంటలకొద్దీ సమయం పట్టింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా బంజారాహిల్స్లో సుమారు 10.5 సెం.మీ. వర్షం కురవగా శ్రీనగర్ కాలనీలో 9.9 సెం.మీ., ఖైరతాబాద్లో 8.9 సెం.మీ. వర్షం కురిసింది. శ్రీనగర్, ఖైరతాబాద్, మైత్రివనం, యూసుఫ్గూడ, వనస్థలిపురం, హయత్నగర్, బహదూర్పురా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక నగరు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి ఇంజాపూర్–తొర్రూర్ మార్గంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు వరదలో చిక్కుకున్నారు. మున్సిపల్ సిబ్బంది అతికష్టం మీద వారిని కాపాడారు. వరదలో కొట్టుకుపోయిన కారు కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దిమ్మెకు తగిలి ఆగిపోయింది. సీఎం కాన్వాయ్కూ తప్పని ట్రాఫిక్ తిప్పలు.. కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడంతో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్ సైతం ట్రాఫిక్లో చిక్కుకొని నత్తనడకన ముందుకు సాగింది. సాయంత్రం 6:30 గంటలకు సీఎం సచివాలయం నుంచి జూబ్లీహిల్స్లోని తన ఇంటికి బయల్దేరగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వీవీ స్టాచ్యూ వద్దకు రాగానే ఖైరతాబాద్ కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. అక్కడి నుంచి ఖైరతాబాద్, కేసీపీ జంక్షన్, ఎర్రమంజిల్ తాజ్ కృష్ణా, వెంగళ్రావు పార్కు, ఎన్ఎఫ్సీఎల్ చౌరస్తా, పంజగుట్ట శ్మశానవాటిక, టీవీ 9 మీదుగా సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్కు చౌరస్తా వరకు కాన్వాయ్ ముందుకు కదిలేందుకు చాలా సమయం పట్టింది.సరిగ్గా 7:25 గంటలకు సీఎం కాన్వాయ్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తాకు వెళ్లేందుకు 20 నిమిషాలు పట్టింది. జూబ్లీహిల్స్ చౌరస్తా నుంచి సీఎం ఇంటికి వెళ్లకుండా కేబుల్ బ్రిడ్జి మీదుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. సరిగ్గా 8 గంటలకు ఆయన మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్నారు. వాస్తవానికి సచివాలయం నుంచి సీఎం నేరుగా తన ఇంటికి వెళ్లేందుకు 13 నిమిషాల సమయం పడుతుంది.కేబీఆర్ పార్కు చౌరస్తాలో నిలిచిపోయిన సీఎం కాన్వాయ్ కానీ సోమవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ దాటడానికే గంటంపావు సమయం పట్టింది. అయితే తన కోసం వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దని.. తాను ట్రాఫిక్లో ఇరుక్కున్నా పరవాలేదని పోలీసులను ఆదేశించిన సీఎం రేవంత్.. గంటన్నరపాటు స్తంభించిన ట్రాఫిక్లోనే మెల్లగా ముందుకు కదిలారు.జిల్లాల్లోనూ జోరు వాన వరంగల్, ములుగు, సిద్దిపేట జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక గ్రామంలో పొలం దున్నుతున్న రైతు ఊకే కృష్ణ (45) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందగా మరో రైతు పూనెం చిట్టిబాబు గాయపడ్డాడు. అలాగే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో పొలంలో మిరప నారు వేస్తుండగా వర్షం కురుస్తోందని చెట్టు కింద నిలబడిన మొద్దు రాకేష్ (25)పై పిడుగుపడటంతో మృతిచెందాడు.వరంగల్ నగరంలోని వరంగల్ అండర్బ్రిడ్జి, భవాని నగర్–వికాస్నగర్ కూడలి, అంబేడ్కర్ భవన్, హనుమకొండ జిల్లా బస్స్టేషన్ కూడలి, బస్స్టేషన్, కాకాజీ నగర్, హనుమకొండ, వరంగల్ చౌరస్తా ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో వాహనదారులు అవస్థలుపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో 8.5 సెం.మీ. వర్షం కురవగా కొమురవెల్లి మండల కేంద్రంలో 7.2, సిద్దిపేట పట్టణంలో 7.15 సెం.మీ. వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ శాఖ కార్యాలయంపై పిడుగు పడటం సుమారు రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. -
దయనీయుడు కాకూడదు!
‘మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయు’డంటాడు కవి ఆరుద్ర ఒక సినీ గీతంలో! సందేహమేముంది? ఆయనే అన్నట్టు, మంచిని తలపెడితే మనిషికి అడ్డే లేదు, దివిజ గంగ భువి దించిన భగీరథుడు మానవుడే, సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే; చంద్రలోకమైన, దేవేంద్రలోకమైన బొందితో జయించి భువికి తిరిగి రాగలిగినవాడూ మానవుడే! కానీ, అంతటి మహనీయుడు కూడా ఒక్కోసారి దయనీయుడైపోతాడు. ఎంతో ముందుకు చూడగలిగి కూడా తరచూ హ్రస్వ దృష్టికి లోనవుతాడు. పదిమందికీ మంచిని తలపెట్టేవాడు కూడా స్వప్రయోజనాన్ని మరిగి చివరికి సొంతానికే చేటు తెచ్చుకుంటాడు. సర్వతోముఖ వికాసం మనిషికి వరమే కానీ, తనకు తనే చెరుపు చేసుకునే బహుముఖ వైఫల్యం పెనుశాపం. అసాధారణ వర్షాల కారణంగా హిమాలయ ప్రాంత రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. హఠాత్తుగా అతివృష్టి, మెరుపు వరదలు, మట్టిపెళ్ళలు విరిగిపడటం వగైరా ఉత్పాతాల కారణంగా ఈ సంవత్సరం ఇప్పటికి దాదాపు మూడు వేల మంది మరణించారు, లక్షల కోట్ల విలువైన ఆస్తినష్టం సంభవించింది. అడ్డూ అదుపూ లేని పట్టణాభివృద్ధి, అడవుల నిర్మూలన, రోడ్ల నిర్మాణం, విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అభివృద్ధి చర్యలను ఇందుకు కారణంగా పర్యావరణ వాదులు ఎత్తిచూపుతున్నారు. ఇటువంటివి లేని రోజుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిన సంగతిని కొందరు ఉదాహరిస్తున్నారు. కారణమేమైనా ప్రాణనష్టం, ఆస్తినష్టం కళ్లముందు కటిక నిజాలు. పటిష్ఠమైన ముందస్తు హెచ్చరిక యంత్రాంగాన్ని ఇప్పటికీ ఏర్పరచుకోలేక పోవడం – దీనంతటి వెనుకా మహనీయుడైన మానవుడి పరంగా చెప్పుకోవలసిన ఒకానొక వైఫల్యం. దీనికితోడు, దేశంలో ప్రకృతి విపత్తులకు గురికాగల ప్రాంతాల గురించిన గణాంకాలు గుండె గుభేలుమనిపిస్తాయి. ఏకంగా 27 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులోకి వస్తాయి. వ్యవసాయ యోగ్యమైన 68 శాతం భూమి ఏ క్షణంలోనైనా అనావృష్టికి గురికావచ్చు, 15 శాతం ప్రాంతంలో ఉన్నట్టుండి రాళ్ళవర్షం కురవచ్చు, 12 శాతం ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించవచ్చు. ఈ విపత్తులు ఏటా పెరగడమే తప్పే తగ్గే అవకాశం లేదట! శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిలో మానవుడి బుద్ధి ఎంతో చురుగ్గా పని పనిచేయడం ఎంతైనా శ్లాఘనీయమే; అభివృద్ధిని ప్రజలకు మరింత సుఖమయ జీవన యోగ్యంగా మలచే దిశగా శరవేగంతో కదలడమూ అభినందనీయమే; కానీ, దానిని అంటిపెట్టుకుని వచ్చే సమస్యల నివారణలో మాత్రం అతని అడుగు చురుగ్గా పడటం లేదు. దాంతో అభివృద్ధి అస్తవ్యస్తానికీ, అభద్రతకూ చిరునామా అవుతోంది. దేశంలోని మహా నగరాలలో రోడ్ల పరిస్థితే ఇందుకు మరో ఉదాహరణ. ఆయా నగరాలలో జనాభా పెరుగుదలా, కొత్త జనావాసాల విస్తరణా, రాకపోకల అవసరాలూ, వాహనాల పెంపూ విమాన వేగాన్ని అందుకున్నాయి; కానీ, ఆ దామాషాలో రోడ్ల నిర్వహణా, ఇతర వసతుల కల్పనలో ప్రభుత్వాల ప్రణాళికలు ఎడ్లబండి వేగంతో నడుస్తున్నాయి. అనేక నగరాలలో రాకపోకల రద్దీ ఎంతటి సమస్యాత్మక స్థాయికి చేరిందంటే, జనం గంటల తరబడి కాలాన్ని ట్రాఫిక్ జామ్ లోనే గడపవలసి వస్తోంది, ఎంతో విలువైన ఉత్పాదక సమయం రోడ్లపాలైపోతోంది. రకరకాల జీవనోపాధి పనుల మీద తిరిగే జనాలను అది మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది తొలి అయిదారు మాసాల్లోనే దేశవ్యాప్తంగా నగరాల రోడ్లపై సంభవించిన దుర్ఘటన మరణాలు వేలసంఖ్యను దాటిపోయాయి. అయినాసరే, పౌరరవాణా సదుపాయాల అభివృద్ధీ వగైరాలు కాగితాల దశను దాటి కార్యరూపం ధరించడానికి ఏళ్లూపూళ్లూ పట్టిపోతోంది. మొత్తంమీద కవి చెప్పినట్టు గ్రహరాశుల నధిగమించి ఘనతారల పథము తొక్కగలిగిన మహనీయుడే తన లోకాన్ని సర్వతోభద్రంగా మార్చుకోవడంలో విఫలమవుతున్నాడు. మనిషి జైత్రయాత్రలో ఎక్కడో అడుగు తడబడి అపజయపు దారి పడుతోంది. తనను దయనీయుడిగా రూపుకట్టే ఆ తడబాటును సరిదిద్దుకుని మహనీయుడన్న ఖ్యాతి నిలుపుకోవడం మనిషి తక్షణావసరం -
ఉక్కపోత.. కుండపోత
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఒకేరోజు మిశ్రమ వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు భానుడు ప్రతాపం చూపగా.... ఆ తర్వాత ఒకేసారి ఆకాశం మేఘావృతమై వరుణ దేవుడు విశ్వరూపం ప్రదర్శించాడు. భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. గురువారం గంటన్నర పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర జీవనం కకావికలమైంది. ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం పడింది. అత్యధికంగా పాతబస్తీ బహదూర్పురాలోని జూపార్క్ వద్ద 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బస్తీల్లోని నివాసాల్లో వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం వేళ విద్యాసంస్థలు వదలడంతో విద్యార్ధులు, డ్యూటీలు ముగించుకొని ఇంటి దారి పట్టిన ఉద్యోగులు ట్రాఫిక్లో గంటల కొద్దీ నరక యాతన పడ్డారు. వరద ఉధృతికి రోడ్లపై అడుగు పెడితే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పక్కన నిలిపిన ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకొని పోయాయి. జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీసు, హైడ్రా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. నాలుగు దిక్కులా చక్ర బంధం భారీ వర్షానికి హైదరాబాద్ నలుదిక్కులా చక్రబంధంగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. నాంపల్లి నుంచి మాసాబ్ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్, సోమాజిగూడ నుంచి మియాపూర్, సచివాలయం నుంచి ట్యాంక్బండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్, మెహిదీపట్నం నుంచి రాయదుర్గం, చాంద్రాయణ గుట్ట నుంచి మలక్పేట, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ తదితర మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్దీ వాహనదారులు నరకయాతన పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం మూడు రోజుల్లో పడాల్సిన వర్షం 30 నిమిషాల్లోనే కుంభవృష్టిగా కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. -
‘నా రోజువారి సంపాదన రూ.50’.. వరద బాధితులతో కంగనా రనౌత్ ఆవేదన
ధర్మస్థల: నా రోజువారి ఆదాయం కేవలం రూ.50 మాత్రమే. కానీ నెలకు రూ.15 లక్షల జీతాలు చెల్లించాల్సి వస్తోంది. నా బాధను అర్థం చేసుకోండి," అంటూ బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ మాన్సూన్ సీజన్లో కుండపోత వర్షాలు, క్లౌడ్బరస్ట్లు హిమాచల్ను అతలాకుతలం చేశాయి. జూన్ 20 నుంచి ప్రారంభమైన వర్షాల కారణంగా ఇప్పటివరకు 419 మంది మరణించారు. వీరిలో 237 మంది వరదలు, కొండచరియలు, నీటి ప్రవాహం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఇటీవల జరిగిన క్లౌడ్బరస్ట్ దాటికి రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గమైన మండి జిల్లాలో పర్యటించిన కంగనా, వరద బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో మనాలీలో ప్రారంభించిన ‘ది మౌంటెన్ స్టోరీ’ రెస్టారెంట్ వరదల కారణంగా పర్యాటకులు తగ్గిపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది.‘నిన్న నా రెస్టారెంట్ ఆదాయం కేవలం రూ.50 మాత్రమే. కానీ నెలకు రూ.15 లక్షల జీతాలు చెల్లించాలి. నా బాధను అర్థం చేసుకోండి. నేనూ హిమాచలీనే’ అని ఆమె అన్నారు.సోలాంగ్, పల్చన్ ప్రాంతాల్లో పర్యటించిన కంగనాకు స్థానికులు 15–16 ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయని వివరించారు. బియాస్ నది కొండచరియలు విరిగిపడి గ్రామాలను ప్రమాదంలోకి నెట్టాయని చెప్పారు. అందుకే బియాస్ నది ప్రవాహాన్ని మళ్లించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు సూచించారు.MP Kangana Ranaut listens to a flood victim in Himachal, but responds by complaining about her own restaurant’s poor earnings — "only ₹50" made.#KanganaRanaut #HimachalFloods #Controversy@KanganaTeam pic.twitter.com/iANqskVacm— Atulkrishan (@iAtulKrishan1) September 18, 2025 -
హిమాచల్, ఉత్తరాఖండ్లలో మళ్లీ క్లౌడ్ బరస్ట్
డెహ్రాడూన్/సిమ్లా: హిమాలయాల్లోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో మళ్లీ మేఘ విస్ఫోటం సంభవించింది. సోమవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఘటనల్లో ఉత్తరాఖండ్లో 15 మంది, హిమాచల్ ప్రదేశ్లో ముగ్గురు చనిపోయారు. వీరిలో యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు ట్రాక్టర్ ట్రాలీలో డెహ్రాడూన్లో టాన్స్ నదిని దాడుతుండగా వచ్చిన వరదలో కొట్టుకు పోయినవారున్నారు. ఉత్తరాఖండ్లో గల్లంతైన 16 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఫైర్ సిబ్బంది రంగంలోకి అన్వేషణ చేపట్టారు.వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జఝ్రా ప్రాంతంలో చిక్కుకుపోయిన మరో ఎనిమిది మందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొండప్రాంతాల నుంచి వచ్చి పడుతున్న వరదల్లో కార్లు కొట్టుకుపోగా, ఇళ్లు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. గంగ, యమున నదులు ప్రమాద స్థాయికి దగ్గర్లో ప్రవహిస్తున్నాయి. వివిధ ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. టామ్సా నది ప్రమాద స్థాయికి చేరుకుంది.దీంతో–ముస్సోరి రోడ్డుపై పలు ప్రాంతాల్లో వరద చేరడంతో పర్యాటకులు, సందర్శకులు ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోనూ పరిస్థితి దాదాపు ఇంతే తీవ్రంగా ఉంది. సిమ్లాలో 12 గంటల వ్యవధిలో 14.2 సెంటీమీటర్ల వాన కురిసింది. అతిభారీ వర్షం కురియడంతో మండి జిల్లాలోని ధరంపూర్లో ప్రధాన బస్స్టాండ్ వరదలో మునిగిపోయింది. ఒక వర్క్షాప్, పంప్ హౌస్తోపాటు దుకాణాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 20 బస్సులు నీట మునిగిపోయాయి. ఒక వ్యక్తి గల్లంతైనట్లు చెబుతున్నారు. పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.మండి జిల్లా బ్రాగ్టా గ్రామంలో ఇల్లు కూలి ఇద్దరు మహిళలు, చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు. గల్లంతైన మరో నలుగురి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా గాలింపు చేపట్టారు. సిమ్లాలోని హిమ్ల్యాండ్ సమీపంలో మట్టి చరియలు విరిగి ప్రధాన రహదారి మూసుకుపోయింది. పలు వాహనాలను మట్టి, బురద కప్పేశాయి. ధరంపూర్లో వరద కారణంగా ఆర్టీసీ బస్సులకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లిందని డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్ని హోత్రి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొనసాగు తున్న ప్రకృతి బీభత్సం వె -
అదీ భారతదేశమే కదా.. నన్ను రక్షించలేరా?: రాహుల్ గాంధీ
పంజాబ్ వరద ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. భద్రతా కారణాలను చూపిస్తూ ఆయన్ని పలు గ్రామాల్లోకి పోలీసులు అనుమతించలేరు. దీంతో అధికారులను ఆయన నిలదీయగా.. మరోవైపు పంజాబ్ పోలీసులు, ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.పంజాబ్లో భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి, ప్రజలకు అండగా నిలుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అయితే..बाढ़ ने पंजाब में भीषण तबाही मचाई है।आज घोनेवाल में गांववासियों से मिला - उजड़े आशियाने, बर्बाद खेत, बिखरी ज़िंदगियां। दर्द आंखों में साफ दिखता है, मगर हौसला अटूट है।राज्य और केंद्र सरकार दोनों हर हाल में ये सुनिश्चित करें कि राहत पैकेज और मुआवज़ा बिना देरी पीड़ितों के हाथों… pic.twitter.com/f1nUxJ945S— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2025గురుదాస్పూర్ జిల్లాలో రావి నది వరదలతో దెబ్బ తిన్న టూర్ గ్రామంలోకి వెళ్లనీయకుండా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులతో ఆయన సంభాషణ ఇలా సాగింది..రాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఏమిటంటే, భారత భూభాగంలో మీరు నన్ను రక్షించలేరు. అదేనా?పోలీస్ అధికారి: మేము ఎప్పుడూ మీ రక్షణకు సిద్ధంగా ఉన్నాంరాహుల్ గాంధీ: మీరు చెబుతున్నది ఇది భారతదేశమే (రవి నదికి అటుపక్కనున్న గ్రామాన్ని చూపిస్తూ), కానీ మీరు నన్ను అక్కడ రక్షించలేరు. అది భారతదేశం కాదా?.. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్లలేరు అంటే, పంజాబ్ పోలీస్ రక్షించలేరు అని అర్థమా?పోలీస్ అధికారి: అది భారత్ భూభాగమే అయినా, ప్రస్తుతం అక్కడ రక్షణ కల్పించడం కష్టంఅయినప్పటికీ రాహుల్ గాంధీ బోటు ద్వారా ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు వారించడంతో ఆయన మరోసారి వాళ్లను నిలదీశారు.నది ప్రశాంతంగానే ఉంది. ఇది నిజమైన కారణం కాదు అంటూ టూర్ గ్రామానికి వెళ్లకుండా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలు ఘోనేవాల్ (అమృత్సర్) మరియు గుర్చక్ (గుర్దాస్పూర్) గ్రామాల్లో పర్యటించారు. ఇక ఈ ఘటనపై పంజాబ్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలోనే మనం సురక్షితంగా లేకపోతే.. మరెక్కడ సురక్షితంగా ఉంటాం? అని ప్రశ్నిస్తోంది.पंजाब: गुरदासपुर में राहुल गांधी पाकिस्तान सीमा के पास प्रभावित गांवों का दौरा करने गए◆ सुरक्षा कारणों से SP जुगराज सिंह ने उन्हें आगे जाने से रोका, दोनों में बहस हुई◆ राहुल गांधी गांवों का दौरा किए बिना लौट आए, सुरक्षा मुद्दों पर विवाद बना@RahulGandhi | Punjab | pic.twitter.com/n8OtBTUjOc— Zuber Chaudhary (@ZuberChaudhar18) September 16, 2025మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ.. అక్కడ మన ప్రజలే(భారతీయులే) ఉన్నారు. రాహుల్ గాంధీ వాళ్ల పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. మూడు రోజులుగా కాంగ్రెస్ తరఫున అక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. అలాంటిది ప్రజల్ని కలవనివ్వకపోవడం దురదృష్టకరం అని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ.. భారతదేశంలో రాహుల్ గాంధీకి పాకిస్తాన్ నుంచి ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాహుల్ గాంధీని రవి నదికి అటుపక్కనున్న గ్రామానికి వెళ్లనివ్వకుండా భద్రతా కారణాలు చూపడం సరైంది కాదు. ఇది భారతదేశమే, అక్కడ మన ప్రజలే ఉన్నారు. ఆయన వారి సమస్యలు తెలుసుకోవాలనుకున్నారు అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పార్థాప్ సింగ్ బాజ్వా ఈ పరిణామంపై కాస్త తీవ్రంగానే స్పందించారు. ‘‘అధికారులు చెబుతున్నట్లు అది భద్రతా సమస్య కానేకాదు. ఇది రాజకీయ నిర్ణయం. బాధ్యత తప్పించుకునేందుకు ప్రభుత్వం నిరాధార భద్రతా కారణాలు చూపుతోంది. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని ఆయన అన్నారు.పంజాబ్ పోలీసులు ఏం చెబుతున్నారంటే..రాహుల్ గాంధీ పర్యటించాల్సిన టూర్ గ్రామం భారత్లోనే ఉంది. పంజాబ్ గుర్దాస్పూర్ జిల్లా రావి నది ఒడ్డున ఉంది. అయితే, ఆ ప్రాంతం ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఇటీవల వరదలతో బార్డర్ ఫెన్సింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి నిఘా పటిష్టం చేశారు. అందుకే పంజాబ్ పోలీస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రాహుల్ గాంధీకి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. రాహుల్కే కాదు.. మరేయితర పార్టీ నేతలకూ అక్కడికి వెళ్లేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదు. -
మునిగిన ముంబై.. స్కూళ్లు, కాలేజీలు బంద్
-
భారీ వర్షానికి భాగ్యనగరం జలమయం
-
ఒక్క గంటలో ఆగమాగం
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి/ముషీరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ఆదివారం రాత్రి అతలాకుతలం చేసింది. దాదాపు గంటపాటు వాన దంచికొట్టడంతో ప్రధాన రహదారులన్నీ నదుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. దాదాపు నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నా.. రాత్రి ఎనిమిది గంటల తర్వాత మొదలైన వాన గంటపాటు కుండపోతగా కురిసింది. రాత్రి పది గంటల వరకు అత్యధికంగా నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తట్టి అన్నారం, ముషీరాబాద్ బౌద్ధనగర్లలో 12 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్ల కింద తలదాచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు, ఆటోలు, బైక్లు నీటిలో కొట్టుకుపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,పంజాగుట్ట, అమీర్ పేట, ముషీరాబాద్, తార్నాక, లక్డీకాపూల్, కాచిగూడ, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రధాన రహదారులపై నిలిచిన వర్షపు నీరు నాలాల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. కాగా, ఆదివారం రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 24.3 సెంటీమీటర్లు నమోదైంది. అఫ్జల్సాగర్ నాలాలో మామా అల్లుళ్లు గల్లంతు భారీ వర్షానికి అఫ్జల్సాగర్ నాలా పొంగి ప్రవహించింది. ఈ నాలాలో మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్ (26), రాము (25) అనే యువకులు కొట్టుకుపోయారు. వీరిద్దరూ మామా అల్లుళ్లుగా తెలిసింది. వీరికోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. అర్జున్, రాము ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు అఫ్జల్సాగర్ నాలా ప్రక్కనే ఉండటంతో ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లోని సామాన్లు బయటకు తెచ్చే క్రమంలో రాము అదుపు తప్పి నాలాలో పడ్డాడు. అతడిని కాపాడే క్రమంలో అర్జున్ కూడా నాలాలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడికి చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్లో నాలాలో దినేశ్ (సన్నీ) అనే యువకుడు గల్లంతయ్యాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే వినోబా నగర్కు చెందిన దినేశ్ (24) విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వచ్చే క్రమంలో నాలాలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో తన వాహనాన్ని ఆపి అక్కడ ఉన్న గోడ పక్కన నిలుచున్నాడు. ఇదే సమయంలో గోడ కూలడంతో దినేశ్ బైక్తోపాటు నాలాలో పడి కొట్టుకుపోయాడు. దినేశ్కు భార్య రాజశ్రీ, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. దినేశ్ కోసం ముషీరాబాద్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. -
జలాశయాలల్లో నీళ్లు ఫుల్లు
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలతో గోదావరి, కృష్ణా పరీవాహకంలోని జలాశయాల్లో నీటి నిల్వలు దాదాపుగా గరిష్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1,069.34 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన 87 జలాశయాలుండగా, వాటిలో నిల్వలు 879.52 టీఎంసీ (82శాతం)లకు చేరాయి. కృష్ణా పరీవాహకంలో మొత్తం 649.53 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 30 జలాశయాలుండగా ప్రస్తుతం వాటిలో 611.53 (94%) టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ మిగిలిన వరదను కిందకు విడుదల చేస్తున్నారు. జలాశయాల నిర్వహణలో భాగంగా వరదలు పోటెత్తినప్పుడు వాటిని పూర్తిగా నింపకుండా కొంత భాగం ఖాళీ (సాంకేతిక భాషలో ఫ్లడ్ కుషన్ అంటారు)గా ఉంచుతారు. వరదలు తగ్గు ముఖం పట్టిన తర్వాత పూర్తి సామర్థ్యం మేరకు నింపుతారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలు పూర్తిగా నిండినట్టు భావించవచ్చు. ఇక గోదావరి పరీవాహకంలో మొత్తం 419.81 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 57 జలాశయాలుండగా వాటిలో నిల్వలు 267.76 (63.78%) టీఎంసీలకు పెరిగాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ పంప్హౌస్ల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి జలాశయాలను నింపుతుండడంతో గోదావరి పరీవాహకంలోని జలాశయాల్లో నిల్వలు సైతం గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత వానాకాలంలో సాగు చేసిన పంటలతో పాటు యాసంగిలో సాగుచేయనున్న పంటలకు సైతం పుష్కళంగా సాగునీరు లభించే అవకాశాలున్నాయి. జోరుగా కృష్ణా.. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద కొనసాగుతుండడంతో జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో 72 వేల క్యూసెక్కులు వస్తుండగా, 69,903 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి మరో 13,124 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల, తుంగభద్రకు దిగువన శ్రీశైలం జలాశయంలోకి 2.14 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.87 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. సాగర్కు మొత్తం 2,39,978 క్యూసెక్యుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఎత్తి 2,73,872 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదనతో 32,927 క్యూసెక్కులు.. మొత్తం 3,06,799 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 588.40 అడుగుల (307.2834 టీఎంసీలు) మేర నీరు ఉంది. గోదారి పరవళ్లు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలోని జైక్వాడ్ నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ వరకు ప్రాజెక్టులన్నింటికీ నిరంతర వరద కొనసాగుతోంది. రాష్ట్రంలో మంజీరపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా 12.41 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ మిగిలిన నీళ్లను కిందికు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.07 టీఎంసీలకు పెరిగాయి. శ్రీరామ్సాగర్ పూర్తిగా నిండింది. దీని గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీల మేర నిల్వలను కొనసాగిస్తూ వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, నిల్వలు 4.48 టీఎంసీలను కొనసాగిస్తూ మిగిలిన నీళ్లను కిందికి విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 18.7 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2.98 లక్షల క్యూసెక్కుల వరదను కిందికి విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్కు 7.25 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.600 మీటర్ల నీటిమట్టంతో గోదావరి పుష్కరఘాట్ను తాకుతూ ప్రవహిస్తోంది. -
మళ్లీ కృష్ణా, గోదావరికి వరద
కాళేశ్వరం/నాగార్జునసాగర్/దోమలపెంట: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద శనివారం గోదావరి పుష్కర ఘాట్ను తాకుతూ 10 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహించింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వద్ద 5.25 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలివెళ్తోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు ఇంజనీర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో పలుమార్లు గోదావరి, ప్రాణహితలు ఉగ్రరూపం దాల్చి శాంతించాయి. మళ్లీ వరద పెరుగుతుండటంతో గోదావరి పరీవాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగు సాగర్ వద్ద 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగులిడుతోంది. సాగర్ జలాశయం క్రస్ట్గేట్ల నుంచి 2,09,794 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,764 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణా నదిలోకి వదులుతున్నారు. కాగా, ఈ సీజన్లో జూలై 29 నుంచి ఇప్పటివరకు సాగర్ గేట్లు తెరుచుకోవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. శ్రీశైలంలో 7 గేట్ల ఎత్తివేత: ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో శనివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఏడు గేట్లను ఎత్తి స్పిల్వే ద్వారా దిగువన నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్వే ద్వారా 1,27,260, విద్యుదుత్పత్తి చేస్తూ 35,350, సుంకేసుల నుంచి 61,306, హంద్రీ నుంచి 250 మొత్తం 2,24,166 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వస్తుంది. దీంతో శ్రీశైలంలో ఆనకట్ట వద్ద 7 గేట్లను.. ఒక్కొక్కటి 10 అడు గుల మేర పైకెత్తి 1,93,634 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 66,280 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు. -
Penna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది, పెన్నా నది
-
పంజాబ్లో వరద బాధితులకు రిలయన్స్ సాయం
పంజాబ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండగా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనంత్ అంబానీ భరోసా కల్పించారు. బాధితుల కష్టాలు తీర్చే ఉద్దేశంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అందులో భాగంగా స్థానిక అధికారులు, రాష్ట్ర పరిపాలన విభాగం, పంచాయతీలు, వివిధ కమ్యూనిటీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఈమేరకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమృత్సర్, సుల్తాన్పూర్ లోధిలోని 10,000 కుటుంబాలకు సహాయం అందించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.‘ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది. తీవ్ర వర్షాభావం వల్ల చాలా కుటుంబాలు ఇళ్లు, జీవనోపాధి, భద్రతను కోల్పోయాయి. రిలయన్స్ కుటుంబం వారికి తోడుగా ఉంటుంది. ఆహారం, నీరు, ఆశ్రయం, పారిశుద్ధ్య కిట్లు.. వంటి వాటితో ప్రజలు, జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు అందిస్తోంది. పంజాబ్ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో వారితో కలిసి ఉంటాం’ అని అనంత్ అంబానీ అన్నారు.రిలయన్స్ అందిస్తోన్న సహాయక చర్యలు..న్యూట్రిషన్ సపోర్ట్వరద బాధితుల కోసం అత్యవసర పోషకాహార అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతుంది. వారికి అవసరమైన ఆహార సామాగ్రి, డ్రై రేషన్ కిట్లను 10,000 కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒంటరి మహిళలు, వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 వంతున వోచర్ ఆధారిత సహాయం అందించనున్నారు. తక్షణ పోషణను నిర్దారించేందుకు కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పోర్టబుల్ వాటర్ ఫిల్టర్లను సిద్ధం చేస్తున్నారు.షెల్టర్ సపోర్ట్వరదల నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలను రక్షించడానికి రిలయన్స్ టార్పాలిన్లు, గ్రౌండ్ షీట్లు, దోమతెరలు, తాళ్లతో కూడిన అత్యవసర షెల్టర్ కిట్లను అందిస్తోంది. వరద నీటి నుంచి అత్యవసరంగా ఆశ్రయం అవసరమైన కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ప్రజారోగ్య ప్రమాద నిర్వహణలో భాగంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి రిలయన్స్ ఆరోగ్య అవగాహన ప్రచారాలను చేపడుతోంది. నీటి వనరుల్లో క్రిమిసంహారక చర్యలకు పూనుకుంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రతి ప్రభావిత కుటుంబానికి అవసరమైన పారిశుద్ధ్య కిట్లను అందజేస్తున్నారు.పశువుల ఆరోగ్యానికి మద్దతుగా..వరదల వల్ల పశుసంవర్ధక రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశువుల ఆవాసాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జంతువుల మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్, పశుసంవర్ధక శాఖ సహకారంతో పశువైద్య సర్వేలు నిర్వహిస్తోంది. పశువుల సంరక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభావిత జంతువులకు మందులు, చికిత్సలు అందిస్తున్నారు. దాదాపు 5,000 పశువులకు ఆహారం ఇవ్వడానికి 3,000 కట్టల సైలేజ్ (పశుగ్రాసం) పంపిణీ చేస్తున్నారు.జంతు సంరక్షణజంతు సంరక్షణ కోసం రిలయన్స్కు చెందిన వంటారాలోని ప్రత్యేక బృందం సహాయక చర్యలను అందిస్తోంది. 50 మందికి పైగా శిక్షణ పొందిన నిపుణులతో ఈ బృందం జంతువులను రక్షించడం, వైద్య సంరక్షణను అందించడం, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి పని చేస్తోంది.కమ్యునికేషన్ పునరుద్ధరణవరద ప్రభావిత ప్రాంతాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో జియో బృందం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉండేలా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)తో కలిసి పనిచేస్తోంది. విపత్తు సహాయ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సర్వీసులు అందించేందుకు చర్యలు చేపడుతోంది.రిలయన్స్ ఫౌండేషన్ స్థానిక వాలంటీర్ల సహకారంతో క్యూరేటెడ్ డ్రై-రేషన్, పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేస్తోంది. పోషణ, పరిశుభ్రత కోసం 21 నిత్యావసర వస్తువులను కలిగి ఉన్న ఈ కిట్లను స్థానిక పంచాయతీల పరిధిలోని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. -
దంచికొట్టిన వాన.. రోడ్లపై పొంగి పార్లుతున్న వరద
-
ట్రాన్స్జెండర్ల గొప్ప మనసు.. పంజాబ్ వరద బాధితులకు భారీ విరాళం
ఆగ్రా: సామాజిక సేవకు లింగ భేదం అడ్డుకాదని మరోసారి నిరూపించే సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో ట్రాన్స్జెండర్లు తమ ఉదారతను చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ సహాయాన్ని సమీకరించేందుకు ఆగ్రాలోని ట్రాన్స్జెండర్ సంఘాలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి.మనదేశంలో కష్టాల్లో ఎవరున్నా సరే మానవత్వం చూపించాల నినాదంతో తమ ఆదాయంతో పాటు దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంగా వచ్చిన మొత్తాన్ని పంజాబ్కు పంపించారు. आगरा में किन्नरों ने 25 लाख रुपए इकट्ठा करके बाढ़ पीड़ितों को मदद भिजवाई है pic.twitter.com/rEPuXEw5uQ— Birendra Kumar Yadav (@BirendraYdvSP) September 11, 2025 ఆగ్రాలోని ఫతేహాబాద్ రోడ్డులో 'ఆల్ ఇండియా కిన్నార్ సమాజ్ కాన్ఫరెన్స్' జరుగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు పది వేల మంది ట్రాన్స్జెండర్ల ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించింది. ఇతర ట్రాన్స్జెండర్ల నుంచి నుండి వచ్చిన విరాళాలు 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పంజాబ్ వరద బాధితుల కోసం డబ్బును విరాళంగా ఇచ్చిన తర్వాత బిడ్లు వేసింది. కొందరు రూ.50,000 విరాళంగా ఇవ్వగా ..మరికొందరు రూ.లక్ష వరకు విరాళం ఇచ్చారు. అత్యధిక విరాళం గోరఖ్పూర్ నుండి వచ్చింది. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ధర్మశాల/చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నీట మునిగిన పంట పొలాలు, ధ్వంసమైన ఇళ్లు, రహదారులను స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్కు తక్షణ సాయం కింద రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు.హిమాచల్ ప్రదేశ్లో ఏరియల్ సర్వే అనంతరం కాంగ్రా పట్టణంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్ సుఖూ పాల్గొన్నారు. వరద బాధితులు సైతం హాజరై తమ గోడు వినిపించారు. తమను ఆదుకోవాలని ప్రధాని మోదీని వేడుకున్నారు. కచ్చితంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వరదల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పునరి్నరి్మంచాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 20 నుంచి సెపె్టంబర్ 8 దాకా వరదలు, కొండచరియల కారణంగా ఏకంగా 370 మంది మృతిచెందారు. పంజాబ్లో సహాయక చర్యలపై ఆరా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్లో పర్యటన అనంతరం పంజాబ్కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను కలిసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోనూ మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. గురుదాస్పూర్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్కు తక్షణ సాయం కింద రూ.1,600 కోట్లు అందజేస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతోపాటు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పంజాబ్లో భారీ నష్టం వాటిల్లింది. 51 మంది మరణించారు. 1.84 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రూ.13,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.20,000 కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని మోదీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.చిన్నారి నీతికతో మోదీ హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రాలో సమీక్షా సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ 14 నెలల చిన్నారి నీతికను ఎత్తుకొని బుజ్జగించారు. ప్రకృతి విలయం వల్ల అనాథగా మారిన నీతిక దీనగాథ విని ఆయన చలించిపోయారు. హిమాచల్ప్రదేశ్లో మండీ జిల్లాలోని తల్వార గ్రామంలో జూన్ 30న రాత్రిపూట హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఓ ఇంట్లో రమేశ్ కుమార్(31), రాధాదేవి(24) దంపతులు తమ కమార్తె నీతికతోపాటు తల్లి పూనమ్దేవితో కలిసి నిద్రిస్తున్నారు. ఇంట్లోకి బురద చొచ్చుకొచ్చింది.నీతికను వంట గదిలో పడుకోబెట్టి బురదను తొలగించేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. ఇంతలో భారీ కొండచరియ ఆ ఇంటిపైకి దూసుకొచ్చింది. వంట గది మినహా ఆ ముగ్గురున్న గది నేలమట్టమైంది. రమేశ్ కుమార్, రాధాదేవి, పూనమ్దేవి బురదతోపాటు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వంట గదికి నష్టం జరగకపోవడంతో నీతిక ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో నీతిక వయసు 11 నెలలే. నీతికను హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం ‘చైల్డ్ ఆఫ్ ద స్టేట్’గా ప్రకటించింది. ఆమె చదువుతోపాటు జీవనానికి అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించింది. -
మరొకరి వీపుపై కూర్చుని.. వరద ప్రాంతాల్లో ఎంపీ పర్యటన
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు మోసుకెళ్తుండగా, వరద ప్రభావిత ప్రాంతాలను తిలకిస్తున్నట్లుగా ఉన్న ఎంపీ తారిఖ్ అన్వర్కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. కాంగ్రెస్ నేత, బిహార్లోని కటిహార్ ఎంపీ అయిన తారిఖ్ అన్వర్ తన నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు సోమవారం బయలుదేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించాలనుకున్నారు. అయితే, ఓ వ్యక్తి మోస్తుండగా ఆయన పర్యటన కొనసాగించారు. ఎంపీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఓ వ్యక్తి వీపుపై మోసుకెళ్తూండగా వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకున్నా మారుమూల ప్రాంతాలకు వెళ్లారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ యాదవ్ పేర్కొన్నారు. ఎంపీ తారిఖ్ అన్వర్ తీరును బీజేపీ తప్పుబట్టింది. వరద ప్రభావిత ప్రాంతాలకెళ్లినా కాంగ్రెస్ నేతలకు వీవీఐపీ ప్రొటోకాల్ కావాల్సి వచ్చిందా? అని ఆ పార్టీ నేత పూనావాలా పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ ఎంపీ వీవీఐపీ మోడ్. రాహుల్ గాంధీ వెకేషన్ మోడ్. ఆమ్ఆద్మీ పార్టీ హైడింగ్ మోడ్. ప్రధాని మోదీ మాత్రమే వర్క్ మోడ్’అని వ్యాఖ్యానించారు. -
సాగర్ 14 క్రస్ట్గేట్ల నుంచి నీటి విడుదల
విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల): నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. సోమవారం సాగర్లో 14 క్రస్ట్గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,12,224 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 1,67,448 క్యూసెక్కులు వచ్చి చేరడంతో ఆ మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. ఇక్కడ నుంచి కుడి కాలువకు 9,700, ఎడమ కాలువకు 9,166, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,658, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయ నీటిమట్టం 589.20 అడుగులకు చేరింది. పులిచింతలకు 1,23,369 క్యూసెక్కులు నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ ద్వారా 1,23,369 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. గరిష్ట నీటిమట్టం 75.50 మీటర్లు కాగా ప్రస్తుతం 74.48 మీటర్లకు నీటిమట్టం చేరుకున్నట్టు వివరించారు. రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.066 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి 1,45,882 క్యూసెక్కులు వస్తుందని, పైనుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
Flood Alert: ‘తాజ్’ గోడలు తాకిన ‘యమున’.. తరలివస్తున్న పర్యాటకులు
న్యూఢిల్లీ: వరదల కారణంగా యమునా నది నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఆగ్రాలోని అద్భుత తాజ్ మహల్ గోడలను యమునా నది తాకింది. సోషల్ మీడియాలో దీనికి సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. యమునా నదిలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో నది ఘాట్లు, చుట్టూ ఉన్న ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి.పెరుగుతున్న నీటి మట్టాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దిగువ హిమాలయ ప్రాంతంలో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ వర్షపాతం కారణంగా యమునలోకి నీరువచ్చి చేరింది. Yamuna River floods reach Taj Mahal walls, surpassing danger mark. Heavy rains in Himachal and Uttarakhand triggered the surge, flooding Agra homes and prompting evacuations and flood alerts....#YamunaRiver #TajMahal #AgraFloods #HeavyRainfall #Uttarakhand #HimachalPradesh… pic.twitter.com/NQsjqiDez5— The Daily Guardian (@DailyGuardian1) September 8, 2025 ప్రస్తుతం యమునలో నీటిమట్టం 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటిందని స్థానిక జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. దసరా ఘాట్, యమునా కారిడార్ సమీపంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. 2023లో యమునలోని నీటి మట్టాలు కూడా ఇదే స్థాయికి చేరుకున్నాయని స్థానిక చరిత్రకారుడు రాజ్ కిషోర్ రాజే తెలిపారు. అయితే అన్ని పరిస్థితులను తట్టుకునేలా నిర్మించిన తాజ్ మహల్కు వరదల కారణంగా ఎటువంటి హాని జరగదన్నారు. ఆగ్రా జిల్లా యంత్రాంగం యమునలోని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. యమునా నదిలోని నీటిమట్టం 206 మీటర్ల మార్కును దాటితే సమీప ప్రజలను ఇక్కడి నుంచి ఖాళీ చేయవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
9న పంజాబ్కు ప్రధాని మోదీ.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
చండీగఢ్: పంజాబ్ను ఇటీవల వరదలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని గురుదాస్పూర్ను సందర్శించి, వరద పరిస్థితిని, సహాయక చర్యలను సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వరద బాధితులతో, రైతులతో నేరుగా మాట్లాడతారని బీజేపీ పంజాబ్ యూనిట్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపింది.ప్రధాని మోదీ గురుదాస్పూర్ పర్యటన‘ఎక్స్’ పోస్ట్లో బీజేపీ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 9న పంజాబ్లోని గురుదాస్పూర్కు వస్తున్నారు. వరద బాధిత రైతులతో ఆయన నేరుగా సమావేశమై వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. వారికి సహాయం చేయడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటారు’ అని పేర్కొంది. ఈ పర్యటన ద్వారా బీజేపీ ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు అండగా ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలో సహాయాన్ని అందిస్తుందని పోస్ట్లో వివరించారు.ਮਾਨਯੋਗ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਜੀ 9 ਸਤੰਬਰ ਨੂੰ ਪੰਜਾਬ ਦੇ ਗੁਰਦਾਸਪੁਰ ਵਿੱਖੇ ਆ ਰਹੇ ਹਨ।ਹੜ੍ਹ ਪੀੜਿਤ ਭਰਾਵਾਂ-ਭੈਣਾਂ ਅਤੇ ਕਿਸਾਨਾਂ ਨਾਲ ਸਿੱਧੀ ਮੁਲਾਕਾਤ ਕਰਕੇ ਦੁੱਖ ਵੰਡਾਉਣਗੇ ਅਤੇ ਪੀੜਿਤਾਂ ਦੀ ਮਦਦ ਲਈ ਹਰ ਸੰਭਵ ਕਦਮ ਚੁੱਕਣਗੇ।ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਜੀ ਦਾ ਇਹ ਦੌਰਾ ਸਾਬਤ ਕਰਦਾ ਹੈ ਕਿ ਕੇਂਦਰ ਦੀ ਭਾਜਪਾ ਸਰਕਾਰ ਹਮੇਸ਼ਾ…— BJP PUNJAB (@BJP4Punjab) September 7, 2025పంజాబ్లో వరదలుప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 500 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ పంజాబ్తో పాటు జమ్ముకశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లను సందర్శించనున్నారు. పంజాబ్లోని 23 జిల్లాల్లో సుమారు 1,650 గ్రామాలు నీటి మునిగాయి. దాదాపు 1.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు, ముఖ్యంగా వరి పంట దెబ్బతింది. బియాస్, సట్లజ్, రావి, ఘగ్గర్ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భాక్రా, పాంగ్, రంజిత్ సాగర్ వంటి ప్రధాన ఆనకట్టల నుంచి నీటిని నియంత్రించి విడుదల చేయడం వల్ల సంక్షోభం మరింత తీవ్రమైంది. గురుదాస్పూర్ జిల్లాలో అత్యధికంగా 1.45 లక్షల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. అలాగే అమృత్సర్, ఫిరోజ్పూర్, ఫాజిల్కా జిల్లాలు కూడా ప్రభావితమయ్యాయి. పంజాబ్లో ఇప్పటివరకు 37 మంది మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు. సైన్యం, వైమానిక దళం, బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, సెప్టెంబర్ 7 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.గత కొన్ని రోజులుగా పంజాబ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. రవాణా వ్యవస్థను స్తంభించిపోయింది. గత నెల రోజులుగా సంభవిస్తున్న వరదల కారణంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈరోజు (ఆదివారం), రాబోయే రెండు రోజులలో పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
Punjab: ముదిరిన ఆప్- బీజేపీల ‘వరద’ రాజకీయం.. ‘2027’ కోసమే?
చండీగఢ్: పంజాబ్ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. నిరాశ్రయులైనవారి సంఖ్య అధికంగానే ఉంది. దీంతో వరద బాధితులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న బీజేపీ- ఆప్లు బాధితులకు సాయం అందిస్తూ.. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు నిచ్చెన వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంజాబ్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అమృత్సర్, గురుదాస్పూర్, కపుర్తలాలోని పలు గ్రామాలను సందర్శించిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు, తాను రాష్ట్రానికి వచ్చానన్నారు. ‘పంజాబ్లో సంభవించిన వరదలను సమీక్షించేందుకు ప్రధాని నన్ను పంపారు. మేము పంజాబ్కు అండగా నిలుస్తున్నాం’ అని ఆయన అన్నారు. వరదలు పలు పంటలను నాశనం చేశాయని, తదుపరి సీజన్ సాగుకు కూడా ముప్పు కలిగించాయని ఆయన అన్నారు. తాను ఒక మంత్రిగా ఇక్కడికి రాలేదని, పంజాబ్ రైతుల సేవకునిగా వచ్చాయని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.అయితే శివరాజ్ సింగ్ మాటలకు స్పందించిన అధికార అప్ నేతలు2023లో హిమాచల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు పంజాబ్ను అతలాకుతలం చేసినప్పుడు కేంద్ర మంత్రులెవరూ రాష్ట్రంలో పర్యటించలేదని, ఆ సమయంలో బీజేపీ ముందుకొచ్చి ఎందుకు వరద సహాయక చర్యలు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు. 2024–25 కేంద్ర బడ్జెట్లో బీహార్కు వరద ఉపశమనంగా రూ.11,500 కోట్లు కేటాయించినప్పటికీ, పంజాబ్కు కేవలం ప్రకటన మాత్రమే చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. అయితే ప్రస్తుత వరదల సమయంలో మేమున్నామంటూ బీజేపీ నేతలు వస్తున్నారని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు.కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ స్వయంగా ట్రాక్టర్ను నడిపి, చౌహాన్ను వరద ప్రభావిత గ్రామాలకు తీసుకెళ్లారు. జలంధర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ట్రక్కుపై సహాయ సామగ్రిని లోడ్ చేస్తూ, తన భుజాలపై రేషన్ సంచులను మోసుకెళ్లారు. అలాగే బీజేపే మహిళా నేత, మాజీ కేంద్ర సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ భార్య అనితా సోమ్ ప్రకాశ్ ఫగ్వారాలో రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీలో బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2024 ఎన్నికల్లో 18.5శాతం ఓట్ల వాటాను పొందినప్పటికీ పార్టీ రాష్ట్రం నుండి ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 2020-21లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పార్టీకి ఇటువంటి పరిణామాలు ఏర్పడ్డాయి. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. -
పాకిస్థాన్ మునిగిపోనుందా? AI సంచలనం
-
వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ‘వందేళ్లలో రాని వరదలొచ్చి పెద్ద నష్టమే జరిగింది. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లాలో అమలు చేసే విధానం రాష్ట్రమంతటికీ విస్తరిస్తాం. ఇందుకు ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సమగ్ర నివేదిక రూపొందించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాలో గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు చూసి తగిన సాయం అందించాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చానని చెప్పారు. మళ్లీ వరదలు వచ్చి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. జిల్లా అధికారులంతా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్తవ నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ఇక్కడ అమలు చేసే ప్రణాళిక రాష్ట్రమంతటికీ విస్తరించేందుకు ఉపయోగపడుతుందని, విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలని చెప్పారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్లతో కలిసి సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ రివ్యూ చేశారు. రైతులను ఓదార్చిన సీఎం సీఎం రేవంత్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లింగంపేట మండలంలోని లింగంపల్లి కుర్దు వద్ద వరదలతో దెబ్బతిన్న వంతెనను, బూరుగిద్ద వద్ద కొట్టుకుపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అక్కడి నుంచి కామారెడ్డి పట్టణంలో ముంపునకు గురైన జీఆర్ కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వపరంగా సాయం అందించామని, ఫార్మా, బీడీ కంపెనీల ద్వారా పిల్లల అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమీకృత కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావ్, లక్ష్మీకాంతరావ్, భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో వరద నష్టంపై సుదీర్ఘంగా సమీక్షించారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. నివేదికలు మార్గదర్శకాలకు లోబడి ఉంటేనే కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సాయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. లేకపోతే మన ప్రతిపాదనలు తిరస్కారానికి గురై మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుందన్నారు. వరదలతో మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడిందని, తక్షణమే మరమ్మతులు చేశామన్నారు. అంతకుముందు తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ శివారులోని హెలిపాడ్ వద్ద దిగిన రేవంత్రెడ్డికి షబ్బీర్అలీ, జిల్లా కలెక్టర్ సంగ్వాన్ స్వాగతం పలికారు. పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ లోపు అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి జరిగిన నష్టాలపై సరైన నివేదిక రూపొందించాలన్నారు. అలాగే, శాశ్వత పరిష్కారం చూపడానికి అయ్యే వ్యయానికి సంబంధించిన నివేదికలు కూడా తయారు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో కలిసి మంత్రి సీతక్క సమీక్ష చేస్తారని, ఆ లోపు నివేదికలు రూపొందించాలన్నారు. ఆ తరువాత తాను అందరితో కలిసి సమీక్ష చేస్తానని తెలిపారు. వరదలతో ఇసుక మేటలు వేసిన పొలాలను సరి చేయడానికి అధికారులంతా సమన్వయం చేసుకుని ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. యూరియా పంపిణీలో మార్పులు చేయాలి సహకార సంఘంలోనే యూరియా పంపిణీ చేయడం వల్ల వేలాది మంది రైతులు రావడం, వారికి సరిపోవడం లేదంటూ నెగెటివ్ ప్రచారం జరుగుతోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అలాకాకుండా రెండు మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని తెరిచి అక్కడి రైతులకు అక్కడే యూరియా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల మధ్య సరైన సమన్వయం, సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రభుత్వం బద్నాం అవుతోందన్నారు. ఆస్పత్రుల్లో వైద్యుల హాజరుకోసం ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం అమలు చేయాలని వైద్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వైద్యులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కొడంగల్తో సమానంగా కామారెడ్డి కామారెడ్డి నియోజక వర్గాన్ని కొడంగల్తో సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తాను రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలు చూడాలి కాబట్టి ప్రజలు స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి చెబితే తనకు చెప్పినట్టేనని, ఆయన సహకారంతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులను, రోడ్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్లు కూలిపోయిన పేదలకు ప్రత్యేక కోటా కింద ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిçస్తున్నామని, అలాగే పశువులు చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పారు. -
ఈ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ఢిల్లీ: ఇటీవల తెలంగాణలో సంభవించిన వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణమే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణకు వరద సాయం కింద తక్షణమే రూ. 5,018 కోట్ల నిధులను విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావులు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతి పత్రం సమర్పించారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే కేంద్ర బృందాలను తెలంగాణకు పంపాలన్నారు. ‘తెలంగాణలో వరదల వల్ల రూ. 5, 018 కోట్ల రూపాయల నష్టం జరిగిందనేది అంచనాగా ఉంది. ఈ నిధులను తక్షణమే విడుదల చేయండి. 2024కు సంబంధించి 11713 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. మొత్తం కలిపి 16,732 కోట్ల రూపాయలు విడుదల చేయండి. ఆగస్టు 25 28 తేదీలో తెలంగాణలో భారీ వర్షాల వల్ల మెదక్ నిజామాబాద్ నిర్మల్ ప్రాంతాలలో తీవ్ర నష్టం జరిగింది. కామారెడ్డిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందివరదలలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు , అనేక పశువులు చనిపోయాయి. అనేక ఇల్లు వర్షాలతో దెబ్బతిన్నాయి. వరదలకు రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. దెబ్బతిన్న రోడ్లు విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించేందుకు పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయాలి’ అని తెలంగాణ మంత్రులు విజ్ఞప్తి చేశారు. నిర్మలా సీతారామన్తో భేటీతెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కార్యక్రమానికి ప్రత్యేక ఆర్థిక సహాయం కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మల్లు, తుమ్మల నాగేశ్వరరావులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. -
చెట్ల నరికివేతతోనే చేటు!
న్యూఢిల్లీ: వరద విలయంలో తరచూ ఉత్తరాది రాష్ట్రాలు చిక్కుకుపోతున్న ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేసింది. విపరీతంగా, విచ్చలవిడిగా వృక్షాలను నేలకూల్చడమే ఈ ప్రకృతివినాశనానికి అసలు కారణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. వరద నీటిని బలంగా ఎదుర్కొనే భారీ వృక్షాలను విపరీతంగా నరికేయడం వల్లే వరదల ప్రభావం అత్యధిక స్థాయిలో ఉంటోందని, చెట్ల అక్రమ నరికివేత పర్వానికి ఇకనైనా ముగింపు పలకాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వరదల బారినపడి అవస్థలు పడుతున్న హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పులు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. చెట్ల నరికివేతను అడ్డుకునేలా ఏమేం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ సంజాయిషీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో కొండచరియలు విరిగిపడటం, వరదల విలయం సర్వసాధారణంగా మారిన విషయం తెల్సిందే. దీంతో కొండప్రాంతాల్లో చెట్ల అక్రమ నరికివేత కారణంగానే వరద ప్రభావం అధికమైందని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాలంటూ అనామికా రాణా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారణచేపట్టింది. ఈ సందర్భంగా వరద విలయంపై కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్లో కొండచరియలు పడటం, వరదల వార్తలు మనందరం చూస్తూనే ఉన్నాం. వరద నీటిలో ఎన్నడూలేనంతటి భారీ స్థాయిలో పెద్ద దుంగలు కొట్టుకుపోవడం మీడియా కథనాల్లో గమనించాం. ఇన్ని దుంగలు ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నాయి? అక్రమంగా భారీ చెట్లను నరికివేసి ప్రకృతి విలయానికి కారణమవుతున్నారు. ఈ విషయంలో బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తక్షణం స్పందించాల్సిందే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీరియస్గా తీసుకోండి వేరే కేసు విచారణ నిమిత్తం అదే కోర్టు హాల్లో ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్రం తగు చర్యలు తీసుకునేలా చూడాలని ఆయనను ఆదేశించింది. ‘‘ ఇది చాలా తీవ్రమైన అంశం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రధానంగా దృష్టిసారించాలి. చెట్లను నరికేస్తుండటంతో ఆ దుంగలన్నీ వరద ప్రవాహంలో దిగువకు కొట్టుకొస్తున్నాయి. పంజాబ్లో వరదనష్టానికి సంబంధించిన ఫొటోలను చూశాం. లక్షల ఎకరాల్లో పంట పాడైంది. కొండప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాల్సిందే. కానీ పర్యావరణం పాడవకుండా అభివృద్ధిని సుసాధ్యంచేయాలి. పర్యావరణానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూడాలి’’ అని మెహతాకు కోర్టు సూచించింది. దీంతో మెహతా స్పందించారు. ‘‘ ప్రకృతితో మనం అనవసరంగా అతిగా జోక్యం చేసుకున్నాం. అందుకే ప్రకృతి మన విషయాల్లోనూ జోక్యం చేసుకుంటోంది. ఇలాంటి విలయాలను సాధ్యమైనంతమేరకు నివారించేందుకు ప్రయతి్నస్తాం. ఈరోజే నేను కేంద్ర పర్యావరణ మంత్రికి విషయాన్ని వివరిస్తా. బాధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతోనూ మాట్లాడతా’’ అని మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. పిటిషనర్ అనామికా రాణా తరఫున న్యాయవాదులు ఆకాశ్ వశిష్ట, శుభం ఉపాధ్యాయ్ వాదించారు. ‘‘ఆకస్మిక వరదల కారణంగా కొందరు సొరంగమార్గాల వద్ద చిక్కుకుపోతున్నారు. మరికొందరి పరిస్థితి ప్రాణసంకటంగా మారింది. ఈ అంశంలో ప్రభుత్వాలు వెంటనే కార్యాచరణతో ముందుకురావాలి. విపత్తులు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. బాధిత పౌరులకు నష్టపరిహారం, పునరావాసం, సాయం అందించాలి’’ అని న్యాయవాదులు వాదించారు. వీరి వాదనలపై కోర్టు స్పందించింది. సీరియస్ విషయం కాబట్టే ఈ కేసును మరో రెండువారాల్లో మళ్లీ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. Timber mafia knows no borders! 🌲💰In Himachal Pradesh, floods carried away illegally felled trees reminding many of a scene straight out of Pushpa. Nature always exposes the greed of mafias! 🌊⚡#HimachalPradesh #Floods #TimberMafia #Pushpa #ClimateCrisis #IllegalLogging#DAAR… pic.twitter.com/eymf6tTGjX— Daar News (@DaarNews) September 3, 2025 -
Punjab Floods: ఇది రాష్ట్ర విపత్తు.. పంజాబ్ కీలక ప్రకటన
చండీగఢ్: పంజాబ్ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 1,400 కి పైగా గ్రామాలు నీట మునిగాయి. 30 మంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో పంజాబ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. పంజాబ్ అంతటా నదులు ఉప్పొంగుతున్నాయి. VIDEO | Punjab: Heavy rain floods homes in Hoshiarpur’s Hukumat village; 28 villages affected.(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/7VT5BcaTF2— Press Trust of India (@PTI_News) August 31, 2025రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని పలు గ్రామాల రోడ్లను వరదలు ధ్వంసం చేశాయి. 1,400 కి పైగా గ్రామాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. 3.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను దెబ్బతిన్నాయి. భారీ వర్షాల దృష్ట్యా సెప్టెంబర్ ఏడు వరకు కళాశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఏపీ సిన్హా ఇతర అధికారులు వరద పరిస్థితులను అనుక్షణం గమనిస్తున్నారు.మరోవైపు బాధితులను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.పీడబ్ల్యుడీ, జల వనరులు, పీఎస్పీసీఎల్ విభాగాలను అత్యవసర విధుల్లో ఉంచారు. పంజాలోని గురుదాస్పూర్లో 94.7 మి.మీ వర్షం పడగా, మొహాలిలో 55.5 మి.మీ వర్షం కురిసింది. రోపర్లో, సట్లెజ్ నది తీరం వెంబడి ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
సాగర్కు తగ్గిన వరద ఉధృతి
విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. దీంతో మంగళవారం సాగర్లో 18 క్రస్ట్గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 18 క్రస్ట్గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,37,790 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 1,89,344 క్యూసెక్కులు వచ్చి చేరడంతో మొత్తం ఔట్ఫ్లోగా 1,89,344 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 5,156, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,698, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 585.80 అడుగులు కాగా ఇది 299.7430 టీఎంసీలకు సమానం. ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద కృష్ణానదికి ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం బ్యారేజ్కు 3,52,772 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఇందులో 3,37,525 క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదిలివేస్తున్నారు. మిగిలిన 15,247 క్యూసెక్కులు డెల్టాలోని పంట కాలువలకు వదిలారు. పులిచింతలకు 1,43,704 క్యూసెక్కులు విడుదల నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 8 క్రస్ట్గేట్లు ద్వారా 1,43,704 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం మంగళవారం తెలిపారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 8 క్రస్ట్గేట్లు 3.50 మీటర్లు ఎత్తు ఎత్తి 1,43,704 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటి మట్టం ప్రాజెక్టు 75.50 మీటర్లకు గాను 74.38 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. -
‘నీటిని బకెట్లలో నింపుకోండి’.. వరదల పరిష్కారానికి పాక్ మంత్రి వింత సలహా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తన విచిత్రమైన వ్యాఖ్యలతో ట్రోల్ అవుతున్నారు. పాకిస్తాన్ను వరదలు ముంచెత్తిన వేళ.. ఆ వరదల్ని ప్రజలు వరంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు వరద ప్రవాహనాన్ని అడ్డుకునేందుకు వరద నీటిని బకెట్లు,ట్యూబ్లలో నింపాలని విజ్ఞప్తి చేశారు.పాక్లో ఇటీవల రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఫలితంగా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పంజాబ్ ప్రావిన్స్ మొత్తం నీట మునిగింది. 24 లక్షల మంది పౌరులు వరద ముంపుకు గురయ్యారు. వేలాది గ్రాముల నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం,ప్రాణ నష్టం సంభవించింది. ఈ క్రమంలో ఆదేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్థానిక మీడియా సంస్థ దున్యా న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ..వరద ముంపు గురైన ప్రజలే.. వరద నీటిని ఇంట్లోకి తోడుకోవాలి. ప్రజలు ఈ వరద నీటిని తమ ఇళ్లలో టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి. వరద నీటిని దేవుడి ఆశీర్వాదంగా చూడాలి. అందుకే ఆ నీటిని నిల్వచేయాలని’ పిలుపునిచ్చారు. అంతేకాదు, పాకిస్తాన్ 10-15 సంవత్సరాలు మెగా ప్రాజెక్టుల కోసం వేచి ఉండకుండా త్వరగా పూర్తి చేయగల చిన్న,చిన్న డ్యామ్లను నిర్మించాలని ఆసిఫ్ సూచించారు.మనం నీటిని కాలువలోకి వదిలేస్తున్నాం.అలా వదిలేయకూడదు.ఆ నీటిని నిల్వ చేసుకోవాలన్నారు. పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో వరద పరిస్థితి నెలకొంది. 5 లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు పాకిస్తాన్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 854కి పెరిగింది. 1100 మందికి పైగా గాయపడ్డారు. NDMA ప్రకారం మరణాలలో మూడింట రెండు వంతుల మంది ఇళ్ళు కూలిపోవడం, ఆకస్మిక వరదల కారణంగా సంభవించగా వందలాది మంది మృతి చెందారు. పంజాబ్ చరిత్రలో ఇది అతిపెద్ద వరద అని పంజాబ్ మంత్రి ఔరంగజేబ్ అన్నారు. సట్లెజ్, చీనాబ్, రావి నదుల నీటి మట్టం ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి.Strongly condemn tone deaf comments by Defence Minister Khawaja Asif against the people of Sindh."Sindhis were blocking roads for the river. They should consider these floods as a blessing and keep the water in their homes." pic.twitter.com/UkKdBHCeis— Kumail Soomro (@kumailsoomro) September 1, 2025 -
పంజాబ్ను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది: శుబ్మన్ గిల్
ఉత్తరాది రాష్ట్రం పంజాబ్ను భారీ వరదులు ముంచెత్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 29 మంది మరణించారు. సుమారు వెయ్యి గ్రామాలు వాననీటిలో మునిగిపోయాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల 2.65 లక్షలకు పైగా నివాసితులు ప్రభావితమయ్యారు. అంతేకాకుండా పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఈ వరదలు వల్ల పంజాబ్లోని గురుదాస్పూర్, పఠాన్కోట్, ఫజిల్కా, కపుర్తలా, తరన్ తరణ్, ఫిరోజ్పూర్, హోషియార్పూర్ అమృత్సర్తో సహా 12 జిల్లాలు అతలకుతలమయ్యాయి. ఆగస్టు నెలలో రాష్ట్రంలో 250 మి.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. గత 25 సంవత్సరాలలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. సట్లెజ్, బియాస్, రావి వంటి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తీవ్రమైన విఫత్తుపై పంజాబ్ లోకల్ బాయ్, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు."వరదలతో అతలాకుతలం నా పంజాబ్ చూస్తుంటే నా హృదయం తరుక్కుపోతుంది. పంజాబ్ ఎన్ని కష్టాల్లు వచ్చినా ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. మేము ఈ స్థితి నుంచి మళ్లీ పైకి వస్తాం. బాధిత కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలకు నా పూర్తి మద్దతు ఉంటుంది" అని గిల్ ఎక్స్లో రాసుకొచ్చాడు. కాగా శుబ్మన్ ఆసియాకప్ కప్-2025 కోసం సిద్దమవుతున్నాడు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ టీ20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు వైస్ కెప్టెన్గా గిల్ వ్యవహరించనున్నాడు.చదవండి: ‘ది హండ్రెడ్’లో ఇరగదీశారు.. ఆ నలుగరికి ఐపీఎల్లో భారీ ధర! -
డేంజర్ మార్క్ దాటేసిన యమునా.. ఢిల్లీకి వార్నింగ్ బెల్
యమునా నది ఉగ్రరూపంతో.. దేశ రాజధాని పరిధిలోని పలు ఇళ్లలోకి మంగళవారం ఉదయం నీరు చేరింది. నది ప్రవాహం డేంజర్ మార్క్ దాటేయడం, ఎగువ నుంచి వరద పోటెత్తుతుండడంతో కొనసాగుతుండడంతో ఢిల్లీకి ముంపు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. భారీ వర్షాలతో గురుగ్రామ్లోనూ జనజీవనం స్తంభించిపోగా, మరోసారి భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునా నదికి వరద నీరు పోటెత్తుతోంది. హర్యానా హాథ్నికుండ్ బ్యారేజ్ నుంచి భారీగా వరద నీరు కిందకు విడుదల అవుతోంది. దీంతో.. రాజధాని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, హెచ్చరికలు జారీ చేశామని అధికారులు అంటున్నారు. మరోవైపు షాదరా జిల్లాలో యమునా నదిపై ఉన్న లోహపుల్ వంతెన మీదుగా మంగళవారం సాయంత్రం రాకపోకలు పూర్తిగా బంద్ చేయనున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ప్రకటించారు. VIDEO | After incessant heavy rains in Delhi-NCR, the Yamuna River has risen and crossed the danger mark.Drone visuals from Loha Pul (Old Iron Bridge). As per officials, it will remain shut as water levels approach the evacuation mark of 206 meters.#DelhiFloods #YamunaRiver… pic.twitter.com/aa4rOiKjRU— Press Trust of India (@PTI_News) September 2, 2025 #YamunaRiver is flowing above the #DangerMark due to #ContinuousRainfall since yesterday. pic.twitter.com/cxSizrOdQp— Upendrra Rai (@UpendrraRai) September 2, 2025 సోమవారం కురిసిన భారీ వర్షంతో గురుగ్రామ్ అతలాకుతలం అయ్యింది. గురుగ్రామ్ ట్రాఫిక్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని, అలాగే ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం వెసులు బాటు కల్పించాలని కంపెనీలకు అధికార వర్గాలు సూచించాయి. రోడ్ల మీద భారీగా నీరు చేరడంతో జనాలు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ద్వారాకా ఎక్స్ప్రెస్ వే సర్వీస్ లేన్పై భారీగా వరద నీరు చేరడంతో మూసేశారు. -
Devastating Monsoon Rains: దేశాన్ని ముంచేస్తోన్న వరద
-
ఏడాది దాటినా తీరని బుడమేరు కష్టాలు..
-
Devineni Avinash: విజయవాడకు వెన్నుపోటు పొడిచి ఈ రోజుతో సంవత్సరం..
-
Punjab: భీకర వరదలు.. లక్షల ఎకరాల్లో పంట నష్టం.. 1,018 గ్రామాలు నీట మునక
చండీగఢ్: పంజాబ్లో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా మూడు లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. 1,018 గ్రామాలు నీట మునిగాయి. 1988లో సంభవించిన వరదల తర్వాత ఇప్పుడు అదే స్థాయిలో వరదలు పంజాబ్ను చుట్టుముట్టాయి. పంజాబ్లో తాజాగా సంభవించిన వరదలు వెయ్యికి పైగా గ్రామాలను ప్రభావితం చేశాయి. మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద విపత్తులకు ముగ్గురు మరణించినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, జమ్ముక కశ్మీర్లో భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పంజాబ్లోని గురుదాస్పూర్, అమృత్సర్, తర్న్ తరణ్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, కపుర్తలా హోషియార్పూర్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. On one hand, Indian Punjab is drowning, people are starving & struggling but the lapdog media is only staging pictures to show that it is “helping.” The truth is, this disaster is the very fire it ignited itself which has now come back to haunt it.#PunjabFloods2025 #FloodAlert pic.twitter.com/llwTgL9LzY— Noor Fatima (@Fatima_Zahra120) August 29, 2025ప్రాథమిక నివేదికల ప్రకారం సరిహద్దు జిల్లా ఫాజిల్కాలో 41,099 ఎకరాల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. పంజాబ్ జల వనరుల మంత్రి బరీందర్ కుమార్ గోయల్ మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న గ్రామాలలో దాదాపు మూడవ వంతు గ్రామాలు గురుదాస్పూర్ జిల్లాలో ఉన్నాయన్నారు. గురుదాస్పూర్లో 2,571 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఫజిల్కాలో 1239 మందిని తరలించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 77 సహాయ శిబిరాల్లో 4,729 మంది ఆశ్రయం పొందుతున్నారు. Reality of Punjab Floods Full Report Linkhttps://t.co/xktLuLGoLb pic.twitter.com/zzrD89WfWd— Rattandeep Singh Dhaliwal (@Rattan1990) August 27, 2025 -
ఆశల బల్లకట్టు
ఓడించడానికి వరద వస్తుంది. మనిషిని ఓడగొట్టి చూద్దామని వరద వస్తుంది. వేయి చేతులతో లక్ష కాళ్లతో రాత్రికి రాత్రి... చీకటి దారిలో... దొంగదెబ్బ తీద్దామని వరద వస్తుంది. పగటి వేళ బందిపోటులా నీటితూటాల తుపాకీ పేలుస్తూ వరద వస్తుంది. అది ఇంటి పాదాల కిందుగా వస్తుంది. ఇంటి యజమాని తల మీదుగా వస్తుంది. చావిట్లోని ఎడ్ల కొమ్ముల మీద నుంచి, బరెగొడ్ల పొదుగుల మీద నుంచి, చంటి పిల్లల బెదురు ఏడుపుల మీద నుంచి, అమ్మ వెలిగించాల్సిన పొయ్యి మీద నుంచి, నాన్న జేబు మీద నుంచి భీతావహం చేస్తూ బీభత్సం సృష్టిస్తూ వస్తుంది. నేనెక్కువ అని ప్రకటించడానికి వస్తుంది. నెట్టుకుంటూ, తోసుకుంటూ, కూలగొడుతూ, పెళ్లగిస్తూ, కుళ్లగిస్తూ ప్రతాపం చూపించడానికి వస్తుంది.ఈ దెబ్బతో మనిషి సఫా– అనుకుంటుంది అది. విర్రవీగుతుంది అది. ఉధృతంగా నవ్వుతుంది అది. అప్పటికి మనిషి సిద్ధమైపోయి ఉంటాడు. సరే... కొన్నాళ్లు అని నిర్ణయం తీసుకుని ఉంటాడు. భార్యాబిడ్డలను ఒడ్డుకు బయల్దేరదీస్తూ ఉంటాడు. మిగిలిన నూకలను మూటగట్టుకుంటూ ఉంటాడు. గొడ్డూ గోదాను తీసుకెళ్లేందుకు బల్లకట్టును వెతుకుతూ ఉంటాడు. మధ్య మధ్య భార్యను కేకేసి ‘ఇంటి ముందుకు నీళ్ల పిశాచి వచ్చింది... దానిక్కాస్త చీపురు చూపించు’ అని పురమాయిస్తుంటాడు. ఎన్ని చూసి ఉంటాడతడు? తుఫాన్లు కొత్తా? కుంభవృష్టి కొత్తా? వడగండ్లు కొత్తా? వడగాడ్పులు కొత్తా? కరువు కొత్తా? బతుకు నెత్తిన పడేసే బరువు కొత్తా? రోగాలు.. రొష్టులు.. మహమ్మారులు.... పాలకుల నమ్మకద్రోహాలు... వ్యాపారుల నిలువు దోపిడీలు... డబ్బు రాజేసే పెను మంటలు... వరదకు భయపడతాడా? మనిషి ఆగడు. జీవితాన్ని ఆగనివ్వడు. ఆశను చావనివ్వడు. ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. నాలుగు రోజులు ఉండి వెళ్లే అతిథికి తగిన మర్యాదలు చేసి పంపడం అతనికి వచ్చు. కష్టాలను మెల్లగా సాగనంపడం వచ్చు. వాటిని వదిలిపెట్టడం వదుల్చుకోవడం వచ్చు. అందుకు సాటి మనిషిని తోడు చేసుకోవడమూ వచ్చు. ఇది తెలియని వరద అతడిని జయించాలని చూసినప్పుడల్లా ఓడిపోయింది. మళ్లీ మళ్లీ ఓడిపోతూనే ఉంది. మహా అయితే సాధించగలిగేది కాసింత బురద జల్లి పోవడమే. మనిషి సాగించే అనంత జీవన ప్రయాణంలో వరదది లిప్తపాటు కలకలం. అతడు రేపో మర్నాడో మళ్లీ తన ఇల్లు చేరుతాడు. ఆరబెట్టిన వస్తువులు లోపల పెట్టుకుంటాడు. తల స్నానం చేసి, పొడి బట్టలు కట్టుకుని, భార్య వండిన వేడి వేడి భోజనాన్ని పిల్లలతో పాటు భుజిస్తూ ఆశను ఊత చేసి సాగిపోతూనే ఉంటాడు. -
మాచారెడ్డి వద్ద పల్వంచ వాగు పొంగిపొర్లడంతో కొట్టుకుపోయిన రోడ్డు
-
విజయవాడలో పడవలో కూర్చొని CPM నేతల వినూత్న నిరసన
-
jammu Kashmir: రంబన్లో క్లౌడ్ బరస్ట్.. అంతటా హాహాకారాలు.. ముగ్గురు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఫలితంగా ఆకస్మిక వరదలు తలెత్తాయి. అనేక ఇళ్లు జల సమాధి అయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. నలుగురు గల్లంతయ్యారు. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.రంబన్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగిస్తున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా అకస్మాత్తుగా వచ్చిన వరదలతో పలు ఇళ్లు జలమయమయ్యాయి. కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనకు సంబంధించిన హెచ్చరిక జారీ చేసింది.ఆగస్టు 14న చిసోటిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులకు 65 మంది మృతిచెందారు. వీరిలో అధిక సంఖ్యలో పర్యాటకులున్నారు. ఈ ఘటనల్లో 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఇదేవిధంగా కథువా జిల్లాలో ఆకస్మిక వరదకు ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు. మంగళవారం రియాసి జిల్లాలోని వైష్ణో దేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఆకస్మిక వరదల తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగస్టు 24న జమ్మూను సందర్శించారు. J&K| Cloudburst in Rajgarh area of Ramban district. 3 bodies recovered, 2 more reportedly missing⁰Rescue operation underway#Ramban #Cloudburst #JammuAndKashmir pic.twitter.com/oACzmLMy7B— Saahil Suhail (@SaahilSuhail) August 30, 2025 -
కోలుకోలేని దెబ్బ!
సాక్షి ప్రతినిధులు/సాక్షి నెట్వర్క్: ఒక్కసారిగా వరుణుడు సృష్టించిన బీభత్సం కామారెడ్డి జిల్లాను వణికించింది. బుధ, గురువారాల్లో జిల్లాలో దంచికొట్టిన వానలతో అపార నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా వరదలతో అన్ని విధాలుగా దాదాపు రూ.350 కోట్ల మేర నష్టం జరిగినట్టు తెలుస్తోంది. రోడ్లు కొట్టుకుపోయి, వంతెనలు దెబ్బతిని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలకు నష్టం వాటిల్లింది. పోచారం ప్రాజెక్టు దెబ్బతినడం, ఆపై 62 చెరువులు తెగిపోవడంతో నీటిపారుదల శాఖకు కూడా భారీ నష్టం జరిగింది.జిల్లాలో దాదాపు రూ.150 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇక భారీ వరదలతో జిల్లాలో పలు రోడ్లు విధ్వంసానికి గురయ్యాయి. 44వ నంబరు జాతీయ రహదారి పలు చోట్ల కోతకు గురయ్యింది. 375 డీ నంబరు గల జాతీయ రహదారిపై పోచారం ప్రాజెక్టు దిగువన వంతెన దెబ్బతినడంతో రాకపోకలు ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి లేదు. తాత్కాలిక మరమ్మతులు చేసినా, పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు రూ.60 కోట్ల మేర అవసరం అవుతాయని అంటున్నారు.జిల్లా మొత్తంగా 13 ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతినడంతో వాటి పునర్నిర్మాణానికి రూ.35 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. పంచాయతీరాజ్ రోడ్లకు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పోచారం ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగి ప్రాజెక్టు కట్టకు కొంతమేర నష్టం జరిగింది. తాత్కాలికంగా మరమ్మతుల కోసం రూ.25 లక్షల వరకు ఖర్చవుతుండగా, దెబ్బతిన్నదాన్ని పునరుద్ధరించడానికి అంచనాలు వేయాల్సి ఉంది.దానికి రూ. కోట్లల్లోనే వ్యయం అవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు. తెగిపోయిన 62 చెరువులను పూర్తి స్థాయిలో పునర్నిర్మించడానికి దాదాపు రూ.10 కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ఇక జిల్లాలో విద్యుత్తు శాఖకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 763 కరెంటు స్తంభాలు పడిపోగా, 147 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.ఇళ్లు గుల్ల..: జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌసింగ్బోర్డు కాలనీలలో 107 ఇళ్లల్లోకి వరద రావడంతో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్, వంట పాత్రలు, తిండిగింజలు, బట్టలు మొత్తం నాశనమయ్యాయి. ఐదారు కార్లు కొట్టుకుపోగా, నీట మునగడంతో 15 కార్లు, 40 బైకులు దెబ్బతిన్నాయి. ఒక్కో ఇంట్లో కనీసం రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కొందరి ఇళ్లు వరద తాకిడికి దెబ్బతిన్నాయి. జిల్లాలో 487 ఇండ్లు పాక్షికంగా, 14 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. అన్ని నష్టాలు లెక్కిస్తే రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్టు అంచనా. మెదక్ జిల్లాలో రోడ్లు ధ్వంసం.. తెగిన చెరువులుభారీ వర్షాలతో మెతుకుసీమకు అపారనష్టం జరిగింది. 77 కిలోమీటర్ల పొడవు పీఆర్, ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసం కాగా, 92 చెరువులు, కుంటలు, కల్వర్టులు తెగిపోయాయి. వేలాది విద్యుత్ స్తంభాలు, వందలాది ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఈ నాలుగు శాఖల పరిధిలో రూ.18.60 కోట్ల పైచిలుకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 681 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, 4 ఇళ్లు నేలమట్టం అయినట్లు అధికారులు తెలిపారు.దూప్సింగ్ తండా దుఃఖంరెండు రోజులుగా వరద నీటిలో చిక్కుకుపోయిన మెదక్ జిల్లా దూప్సింగ్ తండా కన్నీరు పెడుతోంది. గంగమ్మ వాగు ఉప్పొంగడంతో వరద తాకిడికి గుడిసెలు నేలమట్టం కాగా, ఇళ్లలోకి బురద చేరి నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లో బురద పేరుకుపోయిందని, తాము ఎక్కడ తలదాచుకోవాలంటూ తండా వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు.ఇంట్లో ఉన్న బియ్యం వంటి నిత్యావసరాలు తడిచిపోవడంతో సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం యశోద అనే మహిళ తడిచిపోయిన ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని చూపిస్తూ విలపించింది. ఇంట్లో చేరిన బురదతో తాము ఎట్లా ఉండాలంటూ వనిత కంట నీరు పెట్టుకుంది.తన పూరి గుడిసె కూలిపోవడంతో బీమ్లీ అనే వృద్ధురాలు నిరాశ్రయురాలైంది. విద్యుత్ స్తంభాలు పూర్తిగా కూలిపోయి తండాలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. స్థానికులు శుక్రవారం కూడా చీకట్లోనే గడిపారు. ఈ తండాలో సుమారు 41 కుటుంబాలు నివసిస్తున్నాయి. -
చేలన్నీ చెరువులే..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాల వరకు నష్టం వాటిల్లగా, మెదక్, నిజామాబాద్, భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో జరిగిన నష్టంపై ప్రాథమిక వివరాలను అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. కామారెడ్డి, మెదక్లో అపార నష్టం క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం.. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడం, ఇసుక మేటలు వేయడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, ఎల్లారెడ్డి, రామారెడ్డి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జుక్కల్ నియోజక వర్గంలోని పిట్లం, పెద్దకొడప్గల్, మహ్మద్నగర్, నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి.ఇక కామారెడ్డి నియోజక వర్గంలోని కామారెడ్డి, భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట మండలాల్లో, అలాగే బాన్సువాడలో పంటలు నీట మునిగాయి. మెదక్ జిల్లాలో ఇసుక మేటలు వేసి పంట చేతికందకుండా పోయింది. భారీగా వరద నీరు చేరడంతో పంట చేనులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు.ప్రధానంగా వరి, పత్తి, చెరుకు పంటలకు నష్టం వాటిల్లింది. నార్సింగి జాతీయ రహదారి పక్కన ఉన్న గన్నేరు వాగుకు వరద పోటెత్తడంతో పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల ప్రాజెక్టు అలుగు వరదతో సిరాల, దేగాం గ్రామాల్లో పత్తి, సోయా పంటలు నీటమునిగాయి. శ్రీరాంసాగర్ అవుట్ ఫ్లో వరద కారణంగా లక్ష్మణచాంద, ఖానాపూర్, దస్తురాబాద్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మండలాల వారీగా వివరాలు సేకరించండి: మంత్రి శుక్రవారం అధికారులతో సమావేశమైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండలాల వారీగా జరిగిన నష్టం వివరాలను సేకరించి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటనష్టంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని సూచించారు.ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. త్వరలో 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రామగుండం ఎరువుల పరిశ్రమ (ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తి నిలిచి పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని తుమ్మల తెలిపారు. రానున్న రెండురోజుల్లో రాష్ట్రానికి వివిధ కంపెనీల నుంచి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని వెల్లడించారు. కాగా,సెపె్టంబర్ ఎరువుల కోటాను బకాయితో కలిపి వెంటనే విడుదల చేయాలని మరోసారి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు. -
కృష్ణా, గోదావరిలో కొనసాగుతున్న వరద
సాక్షి, అమరావతి, విజయపురిసౌత్, పోలవరం రూరల్: వర్షాలు కొనసాగుతుండటంతో వరద ప్రవాహం నిలకడగా ఉంది. కృష్ణా నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,43,377 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,38,626 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 197 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి 2,61,404 క్యూసెక్కులు చేరుతుండగా దిగువకు 2.43 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. సాగర్లో ప్రస్తుతం 305.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టులోకి 2,71,310 క్యూసెక్కులు చేరుతుండగా 39.55 టీఎంసీలను నిల్వ చేస్తూ 2,60,881 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 3,08,838 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 11,938 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,96,900 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,58,779 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 6,200 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 7,52,579 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పోలవరానికి క్రమేపీ వరద పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 31.750 మీటర్లకు చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 8.07 లక్షల క్యూసెక్కులను అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: నగరంలో భారీవర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆఫీసులు ముగించి ఇంటికి వచ్చే సమయం కావడంతో వరదనీరు రోడ్డుపైకి చేరింది. ఫలితంగా పలు కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, మాదాపూర్,కొండాపూర్ ఫిలింనగర్, హైటెక్సిటీ, కూకట్పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ, సనత్నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మోహిదీపట్నం, బహదూర్పల్లి, సూరారాం, చింతల్, జీడిమెట్ల, శాపూర్నగర్, గాజులరామారంలలో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం తీవ్రతతో జీహెచ్ఎంసీ,హైడ్రాతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. కురుస్తున్న వర్షం ధాటిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు నగర వాసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. -
వర్షం దెబ్బకు కామారెడ్డిలో ప్రస్తుత పరిస్థితి
-
తెలంగాణలో జల విలయం... కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి... భారీ వర్షాలతో మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల తదితర జిల్లాలు అతలాకుతలం
-
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నా ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫల మైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు. సహాయక చర్యల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని.. బాధితులకు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువా రం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హించి జిల్లాలవారీగా వరద నష్టంపై ఆరా తీశారు. జనజీవనం అస్తవ్యస్తంపై కేసీఆర్ ఆందోళన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం, జనజీవనం అస్తవ్యస్తం కావడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరదలతో ఇళ్లు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలం కావడంపై దిగ్బ్రాంతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలతో గురువారం ఫోన్లో మాట్లాడారు. తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని కేటీఆర్ను ఆదేశించారు. -
జల విలయం
సాక్షి, నెట్వర్క్: ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుంభవృష్టి కామారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించింది. జల ప్రళయాన్ని తలపిస్తూ.. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 24 గంటల్లో 43.35 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 2023 జూలైలో ములుగు జిల్లా వెంకటాపూర్లో కురిసిన 64.9 సెంటీమీటర్ల తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. అటు మెదక్, నిర్మల్ జిల్లాలను కూడా వాన ముంచెత్తింది. సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలను సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. కన్యాకుమారి – కశ్మీర్ నేషనల్ హైవే 44 సహా పలుచోట్ల ప్రధాన రహదారులు కోతకు గురికావడం, అనేకచోట్ల వంతెనలు, కాజ్వే లు కొట్టుకు పోవడంతో పట్టణాలు, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వందేళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టును వరద ముంచెత్తగా డ్యామ్కు ఒకవైపు గుంత పడటంతో ఒకదశలో ప్రాజెక్టు తెగిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ముందుజాగ్రత్తగా మూడు గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. రైల్వే ట్రాక్లు సైతం కోతకు గురి కావడంతో పట్టాలు వరదలో తేలుతున్నట్టుగా కన్పించాయి. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మరణించగా, ఆరుగురు గల్లంతయ్యారు. రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కామారెడ్డి కకావికలం కుండపోతగా కురిసిన వర్షంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణం చిగురుటాకులా వణికిపోయింది. కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల్లో జిల్లాలోని 11 మండలాల్లో 30 సెం.మీ. నుంచి 43 సెం.మీ. దాకా వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. వేలాది మంది వరద ముంపుబారిన పడ్డారు. జాతీయ రహదారులతో పాటు జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. రాజంపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గోడ కూలి ఇప్పకాయల పల్లె దవాఖాన వైద్యుడు వినయ్ (28) ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పొలం వద్దకు వెళ్లిన బీబీపేట మండలం జనగామకు చెందిన రైతు రాజిరెడ్డి (63) ఎడ్లకట్టవాగులో గల్లంతయ్యాడు. గురువారం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. బీబీ పేట మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన బాలరాజు వరదలో గల్లంతవగా ఆయన ఆచూకీ దొరకలేదు. జిల్లాలోని బీబీ పేట చెరువుకు గండిపడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎస్ బృందాలు 25 చోట్ల రెస్క్యూ చేసి 775 మందిని కాపాడారు. నీట మునిగిన సిద్దిపేట నగరం మెతుకుసీమ అతలాకుతలం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెతుకుసీమ కకావికలమైంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా హవేళీ ఘన్పూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. మెదక్ నుంచి రాజుపేట వైపు వెళ్తున్న ఓ ఆటో గంగమ్మ వాగులో కొట్టుకుపోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న రాజుపేటకు చెందిన బెస్త సత్యనారాయణ మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన యాదగౌడ్ ఆచూకీ ఇంకా లభించలేదు. వాస్తవానికి వీరిద్దరు వాగులో ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతికి వీరు కొట్టుకుపోయారు. మరోవైపు ఇదే మండలంలోని నక్కవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న నరేందర్గౌడ్ ఓ పొదను పట్టుకుని 100కు ఫోన్ ద్వారా లొకేషన్ పంపడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. గంగమ్మ వాగుపై రాజుపేట బ్రిడ్జిపై 8 మంది చిక్కుకుపోగా, వీరిని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. దూప్సింగ్ తండాను వరద నీరు ముంచెత్తింది. నిజాంపేట మండలం చల్మెడలోని సోమయ్య చెరువు, బ్రాహ్మణ చెరువు నిండిపోయి గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉండటంతో చెరువు కట్టకు గండి పెట్టి నీటిని దిగువకు వదిలేశారు. కొల్చారం మండలంలోని తుక్కాపూర్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన టేక్మాల్ మల్లప్ప భార్య ప్రమీల మంజీర నదిలో గల్లంతయ్యింది. గురువారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల ప్రకారం..జిల్లాలో 49 రోడ్లు తెగిపోయాయి. 24 కాజ్వేలు, కల్వర్టులు కూలిపోయాయి. 21 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 22 చెరువులకు గండ్లు పడ్డాయి. మెదక్, రామాయంపేట పట్టణాలతో పాటు, పలు గ్రామాల్లో 20 కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 6,341 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జలదిగ్బంధంలో రామాయంపేట రామాయంపేటలో రెండురోజుల్లో 20 సెం.మీ వరకు వర్షం కురిసింది. పట్టణంలోని శ్రీనగర్కాలనీ, అక్కలగల్లి, బీసీ కాలనీ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రామాయంపేట – కామారెడ్డి– సిద్దిపేట మార్గంలో వరద నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్లో నీరు చేరడంతో 50 మంది విద్యార్థినులను తాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. రైతులు, ఇటుక బట్టీ కార్మీకుల రెస్క్యూ మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు బుధవారం వరద పోటెత్తింది. రికార్డు స్థాయిలో వచ్చిన నీటితో మానేరు పరవళ్లు తొక్కుతోంది. దిగువన ఉన్న పరీవాహక వాగులో ఒక రైతు గల్లంతు కాగా.. ఐదుగురు రైతులు, ఇద్దరు ఇటుక బట్టీ కార్మీకులు ప్రవాహంలో చిక్కుకున్నారు. గురువారం భారత వైమానిక దళ హెలికాప్టర్ సాయంతో రైతులను, కార్మీకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గేదెల కోసం వెళ్లిన గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య అనే రైతు వరదలో గల్లంతయ్యాడు. నర్మాలకు చెందిన పలువురు రైతులు పశువులను తోలుకెళ్లి వాగులో చిక్కుకుపోయారు. అదే ప్రాంతంలో ఉన్న ఇటుకబట్టీలో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు కార్మీకులు అక్కడే ఉండిపోయారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే వరదలో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు పంపించారు. బండి సంజయ్ చొరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో భారత వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్ సాయంతో రైతులను, కార్మీకులను ఒడ్డుకు చేర్చారు. గురువారం సంఘటన స్థలానికి చేరుకున్న సంజయ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రైతులతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఎగువ మానేరుకు వచ్చి వరద ఉధృతిని పరిశీలించారు. మధ్యాహ్నం ఆర్మీ హెలీకాప్టర్లు బాధితులను రక్షించేంతవరకు ఆయన ఘటనాస్థలంలోనే ఉండటం గమనార్హం. కాగా వరదలో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి సంజయ్ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. నాగం కుమారుడు సాయికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. నీటమునిగిన నిర్మల్ నిర్మల్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. నిర్మల్ పట్టణంలో పలు కాలనీలు నీటమునిగాయి. జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో మునిపల్లి శివారులోని గోదావరి కుర్రులో చిక్కుకుపోయిన పశువుల కాపరి శంకర్ను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు మీదుగా ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో సుమారు 24 గంటల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తెగిన ఎన్హెచ్– 44.. కశ్మీర్ టూ కన్యాకుమారి ఎన్హెచ్–44 పై పలుచోట్ల రోడ్డు, వంతెనలు తెగిపోవడంతో జాతీయ రహదారిపై బుధ, గురువారాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి వద్ద వరద 44వ నంబర్ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. దీంతో హైదరాబాద్ – నిజామాబాద్ మార్గంలో పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ – సిద్దిపేట రహదారిపై నిజాంపేట వద్ద ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఈ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ రహదారిపై పోచారం ప్రాజెక్టు పొంగి ప్రవహించడంతో వంతెన దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ప్లాజా వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కామారెడ్డి–భిక్కనూరు మండలాల సరిహద్దులో జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపైకి భారీగా వచ్చిన వరద నీటితో రోడ్డు కోతకు గురైంది. సదాశివనగర్ మండలం కల్వరాల వద్ద కూడా ఎన్హెచ్ 44 కోతకు గురైంది. టేక్రియల్ వంతెన కోతకు గురైంది. హైదరాబాద్–నిజామాబాద్ ఆర్టీసీ సరీ్వసులు నిలిచిపోయాయి. కామారెడ్డి జాతీయ రహదారిలోని జీఆర్ కాలనీలో కల్వర్టు కింద నుంచి ప్రవాహంలో కొట్టు కొచ్చిన కార్లు కొట్టుకుపోయిన రైల్వే లైన్లు సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే లైనుపై పలు చోట్ల మట్టికొట్టుకుపోయి ట్రాక్లు గాలిలో వేలాడడంతో రైళ్లను రద్దు చేశారు. మెదక్ జిల్లా శమ్నాపూర్ దేవుని చెరువు నీళ్ల ధాటికి రైల్వే ట్రాక్ కోతకు గురైంది. దీంతో అక్కన్నపేట – మెదక్ మార్గంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా తలమడ్ల సమీపంలో కూడా ట్రాక్ కోతకు గురికావడంతో సికింద్రాబాద్– మన్మార్డ్ మా ర్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ఈ రూట్లో రైళ్లు పునరుద్ధరించాలంటే రెండు రోజులైనా పట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.మెదక్ జిల్లాలో నీట మునిగిన దూప్సింగ్ తండా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో..భూపాలపల్లి జిల్లా ఎగువనుంచి వరద నీరు వస్తుందటంతో మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశవపూర్ మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బ మల్హర్ మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్లో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, భూపాలపల్లి ఏరియాలో మంగళవారం, బుధవారం కురిసిన వర్షానికి ఓపెన్కాస్ట్ 2,3 ప్రాజెక్టుల్లో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లా మొండ్యాల తోగు వద్ద జాతీయ రహదారి వరద తాకిడికి భారీగా కోతకు గురైంది. ఊరట్టం తూ ముల వాగు వరద తాకిడికి బ్రిడ్జి సమీపంలో రోడ్యాం వద్ద సీసీ రోడ్డు కోతకు గురైంది. రంగాపూర్ పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. జల దిగ్బంధంలో సిద్దిపేట రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సిద్దిపేట జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఎగువ నుంచి కోమటి చెరువుకు వరద నీరు చేరడంతో పొంగి పొర్లుతోంది. దీంతో పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, హరిప్రియానగర్, శ్రీనివాసనగర్, సీతారామంజనేయ థియేటర్ జలమయంగా మారాయి. హరిప్రియానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వరద నీరు చేరడంతో..వరద ప్రవాహంలోనే రోగులను స్ట్రెచర్పై మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గజ్వేల్లోని లక్ష్మీప్రసన్న కాలనీ, ఎలైట్ ప్రజ్వల్ కాలనీ కూడా నీట మునిగాయి. కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గజ్వేల్–దుబ్బాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంట పొంగి పొర్లుతుండటంతో వరద నీరంతా తూప్రాన్ రోడ్డు వై జంక్షన్ వద్ద నిలిచి 33/11 కేవీ సబ్ స్టేషన్ జలమయంగా మారింది. వరద ముంపులో చిక్కుకున్న సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు 22 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవ ద్వారా వారిని ఒడ్డుకు చేర్చారు. పోచారం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు భారీ ముప్పు తప్పింది. భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు పైభాగం నుంచి నీరు పడడంతో స్ట్రక్చర్కు ఒకచోట గొయ్యి ఏర్పడింది. ప్రాజెక్టు తెగిపోయినట్టేనని అందరూ భావించారు. కానీ వరద తీవ్రత తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలుకు ఎదురెళ్లి నిలిపేసిన గ్యాంగ్మన్ గ్యాంగ్మన్ అప్రమత్తతతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని రామేశ్వర్పల్లి–తిప్పాపూర్ మధ్య 528 మైలురాయి వద్ద రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టికట్ట 50 గజాల మేర కొట్టుకుపోయింది. దీంతో రైలు పట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. గ్యాంగ్మన్ రమేష్ దీన్ని గమనించి అప్రమత్తమయ్యాడు. భిక్కనూరు నుంచి వస్తున్న కాచిగూడ–పెద్దపల్లి ప్యాసింజర్ రైలుకు ఎదురుగా వెళ్లి అది ఆగిపోయేలా చూశాడు. ట్రాక్ కొట్టుకుపోయిన విషయాన్ని లోకో పైలట్కు తెలియజేయడంతో ఆయన స్టేషన్ మాస్టర్ భానుశేఖర్కు సమాచారం అందించారు. ఆయన ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో వారు వెంటనే సికింద్రాబాద్–నిజామాబాద్ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి, కొన్ని రైళ్లను వేరే మార్గంలోకి మళ్లించారు. కాచిగూడ–పెద్దపల్లి ప్యాసింజర్ రైలులో 167 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగకుండా వీరిని కాపాడిన గ్యాంగ్మన్ రమేష్ను డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్, ప్రయాణికులు అభినందించారు. -
కూలిన స్తంభాలు... నీళ్లలో సబ్స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్/మిరుదొడ్డి (దుబ్బాక)/తొగుట (దుబ్బాక): వరద ప్రభావిత ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో అంధకారం అలముకుంది. సబ్ స్టేషన్లలోకి నీళ్లు చేరడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. వరదల నేపథ్యంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు సరఫరా పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. అయినా మరో 3–4 రోజుల వరకు విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, కర్నాటి వరుణ్రెడ్డి తాజా పరిస్థితిని గురువారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాల్లో వరుణ్రెడ్డి పర్యటించారు. కరీంనగర్ సర్కిల్ ఆఫీ సులో లోడ్ మానిటరింగ్ సెల్ను పరిశీలించి విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ల పనితీరు, స్తంభాలు, లైన్ల పనితీరును పర్యవేక్షించారు. కాగా, క్షేత్రస్థాయి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో ‘విద్యుత్’ నష్టం ఇలా.. » మెదక్ జిల్లాలో వరద ప్రభావానికి కొన్నిచోట్ల సబ్స్టేషన్లలోకి నీళ్లు చేరాయి. 33 కేవీ ఫీడర్లు 11, 11 కేవీ ఫీడర్లు 175, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 262 సహా 971 విద్యుత్ స్తంభాలకు నష్టం వాటిల్లింది. వందల కి.మీ. మేర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. » నల్లగొండ, గద్వాల్, యాదాద్రి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల పరిధిలో వరదల ప్రభావానికి 33 కేవీ ఫీడర్లు 39, 11 కేవీ ఫీడర్లు 296, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 280, 1,357 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలోని కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 108 విద్యుత్ స్తంభాలు నేలకూలగా వాటిల్లో 87 స్తంభాలను అధికారులు పునరుద్ధరించారు. అలాగే 21 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా అన్నింటినీ బాగుచేశారు. అయితే 86 ట్రాన్స్ఫార్మర్లు నీటమునగగా వాటిలో ఆరింటిని పునరుద్ధరించారు. ప్రాణాలకు తెగించి వాగులోకి వెళ్లి..9 గ్రామాలకు ఉద్యోగుల వెలుగులు భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడంతో విద్యుత్ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సర ఫరా పునరుద్ధరించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట– భూంపల్లి మండలం ఖాజీపూర్ పరిధిలోని 33/11 కేవీ ఫీడర్ లైన్కు సంబంధించిన విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కాసులాబాద్, రుద్రారం, మల్లుపల్లి, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, మదన్నపేట, బేగంపేట, అల్మాస్పూర్, ఖాజీపూర్, గుర్రాలపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సీ చంద్రమోహన్, డీఈ రామచంద్రయ్య, ఏడీ గంగాధర్, ఏఈ కనకయ్యలు తమ సిబ్బందితో కలిసి వాగులోకి వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తొమ్మిది గ్రామాలకు సరఫరాను పురుద్ధరించారు. మరోవైపు తొగుట మండలం వెంకట్రావుపేట వనం చెరువు మధ్యలో ఉన్న ఓ విద్యుత్ స్తంభానికి పిన్ ఇన్సులేటర్ ఊడి పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జేఎల్ఎం మల్లేశం చెరువులోకి ఈదుకుంటూ వెళ్లి స్తంభంపైకి చేరుకొని.. పిన్ ఇన్సులేటర్ను బిగించాడు. దీంతో సరఫరా పునరుద్ధరణ అయింది. జేఎల్ఎం మల్లేశంను అధికారులు అభినందించారు. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్/పెద్దపల్లి/మెదక్జోన్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణ మే అంచనాలు తయారు చేసి అత్యవసర నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలతో బుధ, గురువారాల్లో పోటెత్తిన వరదలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని సీఎంకు రెండు జిల్లాల కలెక్టర్లు నివేదించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద హెలికాప్టర్ దిగి వరదల పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులను ఏరియల్ సర్వే నిర్వహించారు. కామారెడ్డిలో హెలికాప్టర్ దిగి జిల్లా కలెక్టర్తో సమీక్షించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవటంతో సాధ్యం కాలేదు. దీంతో మెదక్ జిల్లా చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్ను మెదక్ ఎస్పీ కార్యాలయంలో దించి జిల్లాలో వరదల పరిస్థితిపై అక్కడే సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరద పరిస్థితిని కలెక్టర్ సీఎంకు నివేదించారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పని చేసిందని సీఎం కితాబిచ్చారు. సమీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ నుంచే సీఎం కామారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. సత్వరం సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నష్టంపై అత్యవసరంగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అప్రమత్తంగా ఉండాలిభారీ వర్షాల నేపథ్యలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవా లని సీఎం ఆదేశించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్కతో కలిసి వరద పరిస్థితిపై సమీక్షించారు. హైదరాబాద్ నగరంతోపాటు అన్నిచోట్లా శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆస్పత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతోపాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. మామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంమామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంలా రూ.లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, ఏనాడో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రస్తుతం తెలంగాణకు వరప్రదాయినిగా మారిందని అన్నారు. మామ, అల్లుడు కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్నారని, వాళ్లలా తాము 80 వేల పుస్తకాలు చదవలేదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై సెటైర్ వేశారు. యూరియాపై ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తున్నామని సీఎం తెలిపారు. తదుపరి పంటలకు సైతం కొందరు రైతులు యూరియాను నిల్వ చేసుకోవడంతో కొరత ఏర్పడిందని చెప్పారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ ఉన్నారు. -
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రధాన ఉపనదులైన మంజీర, మానేరు, పెన్గంగా, వార్ధా, వెయిన్గంగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరితోపాటు గోదావరి నది ఎగువ, మధ్య, దిగువ పాయలు భీకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులకు గంటగంటకూ భీకర వరద పోటెత్తడంతో అప్రమత్తత ప్రకటించారు. మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ వరకు పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు పైకి ఎత్తారు. » భదాచలం వద్ద గోదావరిలో 7.45 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నీటిమట్టం 38.6 అడుగులకు చేరుకుంది. ప్ర వాహం 9.32 లక్షల క్యూసెక్కులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. » మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు 44,650 క్యూసెక్కుల వరద వస్తుండగా, 18.32 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 1.81లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 16.14 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 27 గేట్లు పైకెత్తి 2.2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. » శ్రీరాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 3.2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 67.05 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 39 గేట్లు పైకెత్తి 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 30న శ్రీరాంసాగర్కు గరిష్టంగా 3.7లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తనుందని అంచనా వేశారు.» కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 66,605 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 3.78 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ, 62,407 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి 5,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో అదేస్థాయిలో రెండుగేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 17,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో మూడుగేట్ల ద్వారా 18,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. » దిగువన ఉన్న ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 5.14 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 14.63 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 38 గేట్లు పైకెత్తి 5.9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం రాత్రి నాటికి 9 లక్షల క్యూసెక్కులకు వరద పెరుగుతుందని అంచనా వేశారు. » కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్కు 8.36 లక్షలు, అన్నారం బరాజ్కు 6.19 లక్షలు, మేడిగడ్డ బరాజ్కు 5.52 లక్షల క్యూసెక్కులతోపాటు సమ్మక్క బరాజ్కు 5.13 లక్షలు, సీతమ్మసాగర్ బరాజ్కు 7.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్కు శనివారం నాటికి గరిష్టంగా 9.48 లక్షల క్యూసెక్కుల వరద రానుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మంగళ, బుధవారాల్లో అత్యంత ప్రమాదకర స్థాయికి పెరగనున్నట్టు అంచనా వేస్తున్నారు. మిడ్మానేరు గేట్లు ఎత్తివేత.. భారీ వర్షాలతో మానేరు నది పోటెత్తింది. దీంతో మిడ్మానేరు రిజర్వాయర్కు మానేరు నుంచి 45,565 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మరో 12,000 క్యూసెక్కులు కలిపి మొత్తం 57,566 క్యూసెక్కులు వచ్చి మిడ్మానేరులో కలుస్తుండడంతో జలాశయ 17 గేట్లను పైకెత్తి 47,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ మానేరు జలాశయానికి వరద ప్రవాహం 56,944 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం నిల్వ సామర్థ్యం 24.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.97 టీఎంసీలకు నిల్వలు చేరాయి. మంగళవారం ఉదయం నాటికి జలాశయం పూర్తిగా నిండొచ్చు.సాగర్కు పెరిగిన వరద 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు నాగార్జునసాగర్/డిండి: సాగర్ జలాశయానికి 3,18,791 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 26 క్రస్ట్ గేట్లు, విద్యుదుత్పాదనతో దిగువ కృష్ణానదిలోకి 2,35,058 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఆయకట్టుకు నీటి అవసరాలు తగ్గాయి. దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. అవసరమైన సమయంలో మళ్లీ నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలుగు పారుతున్న డిండి ప్రాజెక్టుడిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి వరద మరింత పెరిగింది. ఈ నెల 14 నుంచి ప్రాజెక్టు అలుగుపోస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం నుంచి ప్రాజెక్టులోకి 10,202 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అలుగు నుంచి నీటి విడుదల కూడా పెరిగింది. డిండి ప్రాజెక్టు అందాలను చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. -
కామారెడ్డిలో మళ్లీ దంచికొడుతున్న వర్షం
-
అలర్ట్గా ఉన్నాం.. 1,200 మందిని రక్షించాం: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కుండపోత వానలు, వరదల నేపథ్యంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. వర్షాలు, వరదలపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగానే ఉందని.. 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వర్షాలు, వరదలపై అన్నిప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థ అలర్ట్గా ఉంది. ఇప్పటివరకు 1,200మందిని కాపాడాం. కామారెడ్డి, రామయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో వరద ఉధృతి తగ్గింది. అయినా రెస్క్యూ చేస్తూనే ఉన్నాం. పోలీసులు 24గంటలు రెస్క్యూ టీమ్తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉన్నారు.ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో కలిసి పోలీసులు పని చేస్తున్నారు. సకాలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్కు చేరుకోవడంతో భారీ ముప్పు తప్పింది. కామారెడ్డిలో చాలా మందిని రక్షించాం. బోట్స్, లైఫ్ జాకెట్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. వరదలపై కంట్రోల్ రూం నుంచి 24 గంటలు మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం అని డీజీపీ జితేందర్ వెల్లడించారు.చిత్రాల కోసం క్లిక్ చేయండి👉 సముద్రం కాదహే.. కామారెడ్డి రోడ్లు!! -
రోడ్లను ముంచెత్తిన వరద.. వాహనదారులకు గండం
-
ఏపీలో కుండపోత.. హెచ్చరికలు జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ
విజయవాడ, సాక్షి: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లి ఒడిశాతో ఏపీకి రాకపోకలు బంద్ అయ్యాయి. కోస్తా తీరం అతలాకుతలం అవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంటోంది.ఈ తరుణంలో ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నదిపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. భారీ వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి మళ్లీ వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. -
భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం
-
జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు
సాక్షి, మెదక్: కనీవినీ ఎరుగని రీతిలో మెతుకుసీమ చరిత్రలో లేనంతగా వరుణుడు వణికించేస్తున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్లాష్ఫ్లడ్స్ హెచ్చరికల నేపథ్యంలో నీటి ఉపద్రవం తమను ముంచెత్తుతుందో అని జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలతో మెదక్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్ (మం) మర్పల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల కోసం ఓ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గొల్ల వాగు వరద నీటి ప్రవాహా ఉదృతితో జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.గత రెండు రోజులుగా మెదక్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి. గజ్వేల్, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరి, మక్క, కందుల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నారు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జాగ్రత్తలు చెబుతోంది. -
కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు
-
తెలంగాణపై వరుణుడి ఉగ్రరూపం
-
వరదల్లో చిక్కుకున్న బాధితులు.. రాజ్నాథ్ సింగ్కు బండి సంజయ్ ఫోన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షం బీభత్సం నేపథ్యంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నడుం బిగించారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకున్న బాధితుల్ని రక్షించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకున్నారని, బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ను పంపించాలని బండి సంజయ్ రాజ్ నాథ్ సింగ్ను కోరారు. అందుకు రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ను పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను కేంద్ర రక్షణ మంత్రి కార్యాలయం ఆదేశించింది. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు. -
తెలంగాణలో వర్ష బీభత్సం.. బీహార్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
సాక్షి,తెలంగాణ: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బీభత్స సృష్టిస్తోంది. వర్షం కారణంగా వాగులు,వంకలు,లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. వరద ధాటికి వరదనీరు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహాతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని గడుపతున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో వర్ష బీభత్సంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బీహార్లో ఎన్నికల యాత్ర చేస్తున్నారు. ఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం..తెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లిందిఅధిష్ఠానం ఆశీస్సులతో.. పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు..420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. వరదలతో ప్రజలు..యూరియా దొరక్క రైతులు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారుచాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో,లేదో ?కాంగ్రెస్ నేతలారా.ఓట్లు కాదు..ప్రజల పాట్లు చూడండి..ఎన్నికలు కాదు..ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నదిప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారుసీఎం మాత్రం తీరిగ్గా బీహార్ లో ఎన్నికల యాత్ర చేస్తున్నాడుఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసంతెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం… pic.twitter.com/AuZrpbwjN7— KTR (@KTRBRS) August 27, 2025 -
Bandi Sanjay: బాధితులెవరూ భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా
-
చైనా-భారత్-పాక్.. కనివినీ ఎరుగని రీతిలో విధ్వంసం!
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే.. భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.ఇక.. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు. చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అంటే..మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్లో ఈ సీజన్లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ✅ పరిష్కార మార్గాలు• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. -
హవేలి ఘన్పూర్లో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన కారు
సాక్షి, మెదక్: జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. హవేలి ఘన్పూర్ మండలం నక్కవాగులో ఘటన జరిగింది. భారీ వర్షాలు కారణంగా నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వద్దని స్థానికులు వారించినా పట్టించుకోని కారు డ్రైవర్.. అత్యుత్సాహంతో వరద ప్రవాహంలో కారు నడిపారు. దీంతో వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.కాగా, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్సింగ్ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్భంధంలో తండా ఉండటంతో తమ కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు.మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
భారీ వర్షాలకు ఛండీగఢ్ ఉప్పొంగిన జయంతి దేవి నది... కొట్టుకుపోయిన జీప్
-
‘నేటికీ విజయవాడ ప్రజలు కోలుకోలేదు’
విజయవాడ: గతేడాది వచ్చిన బుడమేరు వరదతో విజయవాడ ప్రజలు నేటికీ కోలుకోలేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు. బుడమేరుకు వరద వచ్చి ఏడాది పూర్తి అవుతుందని, ఇప్పటికీ ఎన్టీఆర్, కృష్ణా జిల్లా వాసులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ సమయంలో వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, నేటికీ విజయవాడ ప్రజలు ఇంకా తిరిగి కోలుకోలేదని విమర్శించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఎం పాదయాత్రలో భాగంగా ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘వర్షానికే నీరు రోడ్ల మీద నిలిస్తేనే ప్రజలు భయపడుతున్నారు..బుడమేరు వల్ల ప్రమాదం లేదనే భరోసా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఆపరేషన్ బుడమేరు అమలు కాలేదు. కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొని రాలేకపోయింది. రూ. 700కోట్లు దాతలు విరాళాలు ఇస్తే కొవ్వొత్తులు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్కి ఖర్చు చేశారు. శాశ్వత నివారణ చర్యలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రాజెక్టు రిపోర్ట్ లేదు, ఒక్క ఇటుక పడలేదు. కేవలం గండి పడిన చోట రూ. 30కోట్లతో పని చేశారు.. మిగిలిన చోట అసలు పని జరగలేదు. ఆపరేషన్ బుడమేరు కోసం పోరాటానికి సిద్ధం అవుతున్నాం. రూ. 10వేల కోట్లు శాశ్వత పనులు చేయాలి. సమాంతరంగా మరో కాలువ తవ్వాలి. బుడమేరుకు కూడా రిటనింగ్ వాల్ నిర్మించాలి. దిగువకు నీరు పోయే ప్రదేశాన్ని పెంచాలి. కలెక్టరేట్లో ఉండి హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు. అమరావతి ముంపుపై మాట్లాడుతున్న చంద్రబాబు బుడమేరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మొద్దు నిద్రలో ఉన్నారు. గతంలో నష్టపోయిన వారికి నేటికి నష్ట పరిహారం అందలేదు. దాతలు ఇచ్చిన డబ్బును కూడా బాధితులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. బుడమేరు పరివాహక ప్రాంతంలో పాదయాత్ర. 30వ తేదీన బారి సభ నిర్వహిస్తున్నాం. ఎంత నిధులు ఖర్చు చేశారు.. ఎమ్ చర్యలు తీసుకున్నారో శ్వేతా పత్రం విడుదల చేయాలి.బుడమేరు డైవర్షన్ చానల్ లోతు, వెడల్పు పెంచారా?, బుడమేరు కనీసం పూడిక కూడా తీయించలేదు. తూటుకాడే తీయించలేని ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేసిందంటే ఎలా నమ్మాలి. ఎమ్మెల్యే అవివేకంతో మాట్లాడుతున్నారు.ప్రచార ఆర్బాటం తో కాకుండా శాశ్వత పనులు చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇక సీపీఎం రాష్ట్ర కమిటీ సభయులు కాశీనాథ్ మాట్లాడుతూ.. ‘ బుడమేరు వద్ద తూటు కదా పేరుకుపోయింది. నిమ్మల రామానాయుడు నిర్మించమని చెప్పిన పని కూడా బీట్ల బారుతుంది. సింగినగర్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు బుడమేరు నివారణ చర్యలు తీసుకోవాలని పాదయాత్ర చేస్తున్నాం. 10వేలు కేంద్రాన్ని బుడమేరు కోసం అడగాలి...అప్పుడు కేంద్రం అప్పు ఇస్తుందో.. ముష్టి వేస్తారో తెలుస్తుంది. బుడమేరు కోసం మాట్లాడమంటే కొండవీటి వాగు కోసం మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.


