Flood Alert: ‘తాజ్‌’ గోడలు తాకిన ‘యమున’.. తరలివస్తున్న పర్యాటకులు | Yamuna Floods Reach Taj Mahal Walls as Water Level Crosses Danger Mark | Sakshi
Sakshi News home page

Flood Alert: ‘తాజ్‌’ గోడలు తాకిన ‘యమున’.. తరలివస్తున్న పర్యాటకులు

Sep 8 2025 1:09 PM | Updated on Sep 8 2025 1:44 PM

Taj Mahal Yamunas Rising Waters Reach Monuments Sidewalls

న్యూఢిల్లీ: వరదల కారణంగా యమునా నది నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఆగ్రాలోని అద్భుత తాజ్ మహల్ గోడలను యమునా నది తాకింది. సోషల్ మీడియాలో దీనికి సంబందించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. యమునా నదిలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో నది ఘాట్‌లు, చుట్టూ ఉన్న ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి.

పెరుగుతున్న నీటి మట్టాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దిగువ హిమాలయ ప్రాంతంలో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షపాతం కారణంగా యమునలోకి నీరువచ్చి చేరింది. 

 

 ప్రస్తుతం యమునలో నీటిమట్టం 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటిందని స్థానిక జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. దసరా ఘాట్, యమునా కారిడార్ సమీపంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

 

2023లో యమునలోని నీటి మట్టాలు కూడా ఇదే స్థాయికి చేరుకున్నాయని స్థానిక చరిత్రకారుడు రాజ్ కిషోర్ రాజే తెలిపారు. అయితే అన్ని పరిస్థితులను తట్టుకునేలా నిర్మించిన తాజ్ మహల్‌కు వరదల కారణంగా ఎటువంటి హాని జరగదన్నారు. ఆగ్రా జిల్లా యంత్రాంగం యమునలోని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. యమునా నదిలోని నీటిమట్టం  206 మీటర్ల మార్కును దాటితే  సమీప ప్రజలను ఇక్కడి నుంచి ఖాళీ చేయవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement