అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు!
కూర్చుని తింటే కొండలైన కరిగిపోతాయనే మాట చాలామంది వినే ఉంటారు. కానీ అంబానీ సంపదను రోజుకు రూ. 5కోట్లు చొప్పున ఖర్చు చేస్తే.. కరిగిపోవడానికి ఏకంగా వందల సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం.. వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే 16వ ధనవంతుడు. ఆయన నికర విలువ దాదాపు USD 113.5 బిలియన్లు, అంటే దాదాపు రూ. 1,01,40,00,00,00,000 కోట్లు. ఈ సంపదను రోజుకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తే.. మొత్తం కరిగిపోవడానికి 2,02,800 రోజులు అవుతుంది. సంవత్సరాల రూపంలో చెప్పాలంటే 555 ఏళ్లు (2,02,800 ÷ 365) పడుతుందన్నమాట.రిలయన్స్ ఆదాయం ఇలా..1966లో ధీరూభాయ్ సారథ్యంలో ఒక చిన్న వస్త్ర తయారీదారుగా ప్రారంభమైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇప్పుడు దాదాపు 125 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్.. పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, ముఖేష్ అంబానీ & అతని తమ్ముడు అనిల్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని పంచుకున్నారు.
ఉన్నమాటతో ఉలికిపడుతున్న చంద్రబాబు!
సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఏపీలో రైతుల దుస్థితి తెలుపుతూనే.. సేవ్ ఏపీ ఫార్మర్స్ (#SaveAPFarmers) పేరుతో సదీర్ఘమైన పోస్ట్ ఒకటి ఉంచారాయన. ఈ ఉదయం మరోసారి ఆ ట్వీట్ సారాంశాన్ని తెలుగులో ప్రస్తావిస్తూ రీట్వీట్ చేశారు.కిలో అరటిపండ్లను రైతుల నుండి కొంటున్నది కేవలం 50 పైసలకే!. ఒక అగ్గిపెట్టె, ఒక బిస్కెట్ కంటే కూడా అరటిపండ్లు చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. నెలల తరబడి కష్టపడి వ్యవసాయం చేస్తే.. చివరికి రైతులకు దక్కే ప్రతిఫలం ఇదేనా? అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొంటూ ఏపీ అన్నదాతలు అవస్థలను దేశం దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి!ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే!అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు… https://t.co/6HVqS4Wk1N— YS Jagan Mohan Reddy (@ysjagan) December 2, 2025జగన్ ట్వీట్తో చంద్రబాబు ప్రభుత్వం భుజాలు తడుముకుంటోంది. సాధారణంగా జగన్ ప్రెస్మీట్ పెట్టినా.. ఏదైనా ట్వీట్ చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి అబద్ధపు ప్రకటనలు చేయడం టీడీపీ అండ్ కోకు అలవాటుగా మారింది. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు సరైనవి కావడం, పైగా కళ్ల ముందు ప్రత్యక్షంగా పరిస్థితులు కనిపిస్తుండడంతో ఖండించలేని స్థితిలో ఉండిపోయింది. మరోవైపు.. అవి వాస్తవాలు కావడంతో ఎలా కవరింగ్ చేసుకోవాలో అర్థంకాక ఇటు ఎల్లో మీడియా అవస్థలు పడుతోంది. 📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025
కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీలోని ప్రధాని కొత్త భవన సముదాయం పేరును సేవాతీర్థ్ గా మార్చుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటితో పాటు అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇదివరకే పలు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ ల పేరును కేంద్రం లోక్ భవన్ లుగా మార్చింది. ఈ నేపథ్యంలో మిగతా వాటి పేర్లను మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.దీనితో పాటు రేస్ కోర్స్ రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చింది. రాజ్ భవన్ పేరు మార్చినట్లు నోటిఫికేషన్ రావడంతో హైదరాబాద్ లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రికార్డులన్నింటిలోనూ లోక్ భవన్ పేరును ప్రచురించబోతున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ భవనాలలోకి పీఏంఓతో పాటు ఇతర కీలకమైన శాఖల కార్యాలయాలను మార్చారు. పీఎంఓకు ప్రక్కనే క్యాబినెట్ సెక్రటేరియేట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియేట్, ఇండియా హౌస్ ఇతర కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2016లో ప్రధాని నివాసం పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చారు. కేంద్ర సచివాలయాన్ని కర్తవ్య భవన్ గా, రాజ్ పథ్ ని కర్తవ్యపథ్ గా నామకరణం చేశారు.
సమంత రెండో పెళ్లి.. ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా?
ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా మామూలుగా కాదు.. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్లో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన సమంతకు అభినందనలు వెల్లువెత్తాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. మరో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది.అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. కొందరేమో వీరి వయస్సుల గురించి చర్చిస్తే.. మరికొందరు డేటింగ్, పరిచయం ఎలా మొదలైంది అంటూ ఆరా తీస్తున్నారు. సమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కావడం.. రాజ్ నిడిమోరు సైతం తెలుగువాడు కావడంతో బ్యాక్ గ్రౌండ్ గురించి తెగ వెతికేస్తున్నారు. అదే క్రమంలో సామ్-రాజ్ ఆస్తులు కూడా హాట్ టాపిక్గా మారాయి. ఎవరికెంత ఆస్తులున్నాయి?.. ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఉన్నాయని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. కొద్ది కాలంలోనే స్టార్ హోదాను సొంతం చేసుకుంది. తెలుగులో అగ్రహీరోల సరసన వరుసపెట్టి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదించింది సామ్. పలు టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. దీంతో ఓవరాల్గా డిసెంబర్ 2025 నాటికి సమంత ఆస్తుల విలువ దాదాపు రూ.110 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.సమంత ఆస్తులే ఎక్కువ.. ఇక రాజ్ నిడిమోరు ఆస్తుల విషయానికొస్తే బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ దాదాపు రూ.85 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన రాజ్ కంటే సమంతనే 29 శాతం అధికంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి ఆస్తులను కలిపితే ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్స్ అంచనా వేస్తున్నారు.కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టింది.
అధిష్టానం ప్రకటిస్తే డీకే శివకుమార్ సీఎం అవుతారు- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
గోల్డ్లోన్స్లో దక్షిణాది రాష్ట్రాలే టాప్
హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట
కాళ్లలో కట్టెలు పెట్టడం.. రాజకీయాల్లో గేమ్ రూల్: సీఎం రేవంత్రెడ్డి
వైకల్యాలకు చికిత్స అందాలి
రెండోరోజూ అదే తీరు
భారత్ నావికా దళంలోకి ‘అరిదమన్’ వచ్చేస్తోంది!
వైద్యచరిత్రను మలుపు తిప్పిన రోజు.. తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇదే
వీల్పవర్ యాంకర్
విప్రో చేతికి హర్మన్ డిజిటల్
అధిష్టానం ప్రకటిస్తే డీకే శివకుమార్ సీఎం అవుతారు- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
గోల్డ్లోన్స్లో దక్షిణాది రాష్ట్రాలే టాప్
హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట
కాళ్లలో కట్టెలు పెట్టడం.. రాజకీయాల్లో గేమ్ రూల్: సీఎం రేవంత్రెడ్డి
వైకల్యాలకు చికిత్స అందాలి
రెండోరోజూ అదే తీరు
భారత్ నావికా దళంలోకి ‘అరిదమన్’ వచ్చేస్తోంది!
వైద్యచరిత్రను మలుపు తిప్పిన రోజు.. తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇదే
వీల్పవర్ యాంకర్
విప్రో చేతికి హర్మన్ డిజిటల్
పరువు పేరుతో ప్రేమకు సమాధి; తప్పెవరిది?
మరో పెళ్లి చేసుకున్న సమంత
కేంద్రం కీలక నిర్ణయం
గంభీర్, అగార్కర్లతో బీసీసీఐ అత్యవసర భేటీ!
గోబ్యాక్.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు
హైదరాబాద్: ముంబైలో ఇండిగో విమానం సేఫ్ ల్యాండింగ్
డీకే సీఎం అయ్యేది అప్పుడే: సిద్దరామయ్య
‘హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండి’
ఒక్క మ్యాచ్కే అతడిపై వేటు.. డేంజరస్ బ్యాటర్కు ఛాన్స్?
ఉన్నమాటతో ఉలికిపడుతున్న చంద్రబాబు!
ప్రాణాలు పోతుంటే చర్యలు తీసుకోరా?
అంగట్లోకి ఇంటిగుట్టు
ఉత్తమ పోలీస్ స్టేషన్గా మెరిసిన శామీర్పేట పీఎస్
లలిత్ మోదీ 63వ పుట్టినరోజు : మాల్యాతో ఆటాపాట
‘క్షమాపణలు చెప్పకుంటే సినిమాలు ఆడనీయం’
హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా.. ప్రొద్దుటూరువాసి మృతి
రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్
కదం తొక్కిన అనంత అరటి రైతులు.. వైఎస్సార్సీపీ మద్దతు
‘మీరు ఎన్ని నిధులు విడుదల చేశారో చర్చకు సిద్ధమా?’
ఫొటోలు
వరల్డ్కప్ గెలిచి నెల రోజులు.. భారత మాజీ క్రికెటర్ భావోద్వేగం (ఫోటోలు)
మాల్దీవుస్లో ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ సినీతారలు (ఫోటోలు)
ఉప్పల్లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున ఆలయంలో యాంకర్ శ్రీముఖి ప్రత్యేక పూజలు.. (ఫోటోలు)
లైట్ గ్రీన్ శారీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. ఫోటోలు
'కాంతార' రుక్మిణి వసంత్ హ్యాపీ మెమొరీస్ (ఫొటోలు)
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా పాట రిలీజ్ (ఫొటోలు)
#CycloneDitwah : తమిళనాడులో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో చెన్నై (ఫొటోలు)
ఆనంద్, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ (ఫొటోలు)
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
సినిమా
సడన్గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక దెయ్యం సినిమా
రష్మిక నటించిన రెండు సినిమాలు ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్నాయి. అందులో ఒకటి 'ద గర్ల్ఫ్రెండ్'. ఇది నెట్ఫ్లిక్స్లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈ బ్యూటీ చేసిన హారర్ మూవీ కూడా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)రష్మిక ఓవైపు తెలుగు, మరోవైపు హిందీ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలా ఈ ఏడాది దీపావళికి 'థామా' అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్లోని 'స్త్రీ' యూనివర్స్లో భాగంగా వచ్చిన చిత్రమిది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్గా చేశాడు. ఇందులో రష్మిక.. రక్తం తాగే అమ్మాయి అంటే వ్యాంపైర్ పాత్రలో కనిపించింది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడినప్పటికీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.థియేటర్లలో అక్టోబరు 21న రిలీజైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉచితంగా ఎప్పటినుంచి అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)'థామా' విషయానికొస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. ఫ్రెండ్స్తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది. అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)
బాలయ్య సినిమాకు నజరానా.. భారీగా అఖండ-2 టికెట్ ధరల పెంపు
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో యాక్షన్ మూవీ అఖండ-2. ఈ సినిమా రిలీజ్కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. అఖండకు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.భారీగా ధరల పెంపు.. అఖండ-2 మూవీకి భారీగా టికెట్ ధరలు పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్లో ఏకంగా రూ.75 పెంచుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టకెట్పై అదనంగా రూ.100 పెంపునకు అనుమతులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ టికెట్ ధరలు 10 రోజుల వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వులిచ్చింది. దీంతో పాటు ఎన్నడూ లేనివిధంగా ప్రీమియర్ షోలకు కూడా అనుమతిలిచ్చింది. ఈ నెల 4న ప్రీమియర్ షో టికెట్ ధర ఏకంగా రూ.600లుగా నిర్ణయించింది. ఇంత భారీ స్థాయిలో టికెట్స్ పెంచడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడంతో భారీగా ధరలు పెంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించకునేందుకు ఉత్తర్వులిచ్చారు. భారీగా టికెట్ ధరల పెంపుతో సినీ ప్రేక్షకుల జేబులు గుల్ల కావడం ఖాయంగా కనిపిస్తోంది. #Akhanda2 కి అనుమతి 👍#Akhanda2Thaandavam 🔥 https://t.co/gvFHBdGH3f pic.twitter.com/GdqfNfYdwc— Kakinada Talkies (@Kkdtalkies) December 2, 2025
త్రివిక్రమ్- వెంకీ కాంబో.. ఆ టైటిల్ ఫిక్స్..!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్పై టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.అయితే మరోవైపు ఈ మూవీ టైటిల్పై కూడా టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఆడియన్స్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్పై సినీ ప్రియుల్లో చర్చ మొదలైంది.త్రివిక్రమ్ శ్రీనివాస్- వెంకటేశ్ మూవీకి టైటిల్ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. 'బంధు మిత్రుల అభినందనలతో' అనే టైటిల్ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రం వెంకీ మామ కెరీర్లో 77వ సినిమాగా నిలవనుంది. ఈ సినిమా వెంకీతో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. గతంలో నువ్వు నాకు నచ్చవ్, వాసు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ మూవీని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
అంత మాస్ సాంగ్ నేనెప్పుడు చేయలేదు: సంయుక్త మీనన్
అఖండ 2 సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉంటుంది. అది విన్న తర్వాత నాకు నెర్వస్గా అనిపించింది. ఇంతవరకు అలాంటి మాస్ సాంగ్ నేనెప్పుడు చేయలేదు. డ్యాన్స్ విషయంలో తగ్గొద్దు అనుకున్నాను. రెండు రోజుల ప్రాక్టీస్ చేసిన తర్వాత మోకాలు సహకరించలేదు. దీంతో ఫిజియోథెరపీ తీసుకొని మరీ ఆ పాట పూర్తి చేశాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా స్టైలిష్ ఉంటుంది’ అన్నారు హీరోయిన్ సంయుక్త. నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంయుక్త మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ విరూపాక్ష తర్వాత తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేను మాత్రం సెలెక్టెడ్గా చేస్తున్నాను. బింబిసారా, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక్ ఒకేసారి సైన్ చేశాను. అయితే రిలీజ్ టైమ్స్ డిఫరెంట్ గా అయ్యాయి. తర్వాత స్వయంభు, నారీ నారీ, ఆ తర్వాత అఖండ 2 సైన్ చేశాను. ఆ తర్వాత పూరి గారి సినిమా చేశాను.→ బోయపాటి అఖండ 2 కథ చెప్పగానే చాలా నచ్చింది. డేట్స్ ఉన్నాయో లేదో మా టీం ని అడిగాను. లేవని చెప్పారు. ఎలాగైనా ఈ సినిమా చేయాలని చెప్పడంతో డేస్ట్ అడ్జస్ట్ చేశారు. బోయపాటి చాలా గ్రేట్ విజన్ తో ఈ సినిమా తీశారు. మన ఊహకి మించి ఉంటుంది.→ బాలయ్య చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఆయన్ని తొలిసారి ఒక యాడ్ షూట్ లో కలిసాను. అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషి లాగా మాట్లాడారు. ఆయన డైరెక్టర్ల యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.→ ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నిటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పాటలు లార్డ్ శివ కి ట్రిబ్యూట్ లాగా ఉండబోతున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సంస్కృతంలో వినిపించే పదాలు అద్భుతమైన సాహిత్యం ఒక ట్రాన్స్ లో తీసుకెల్తాయి→ కొత్త సినిమాల విషయాలకొస్తే.. స్వయంభులో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వానంద్ ‘ నారి నారి నడుమ మురారి’లో చాలా మంచి పాత్ర లభించింది. దీంతో పాటు పూరీ జగన్నాథ్ సినిమాలో నటిస్తున్నాను.
క్రీడలు
వండర్ కిడ్ వచ్చేస్తున్నాడు.. సైడ్ ప్లీజ్!
మొన్న ఐపీఎల్.. నిన్న ఆసియాకప్.. నేడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. ఆ 14 ఏళ్ల యువ సంచలనం దూకుడును ఎవరూ ఆపలేకపోతున్నారు. తన విధ్వంసకర బ్యాటింగ్తో చిన్ననాటి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలను గుర్తు చేస్తున్నాడు. అవతలి ఎండ్లో బౌలర్ ఎవరైన డోంట్ కేర్. అతడికి తెలిసిందల్లా బంతి బౌండరీకి తరలించడమే.అతడు క్రీజులో ఉన్నాడంటే సీనియర్ బౌలర్లకు సైతం గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. వయస్సుతో సంబంధం లేకుండా సీనియర్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు అత్యద్భుతం. 15 ఏళ్ల నిండకముందే రికార్డులకు కేరాఫ్ అడ్రాస్గా మారిన ఆ చిచ్చరపిడుగు ఎవరో ఈపాటికే మీకు ఆర్ధమైపోయింటుంది. అతడే భారత అండర్-19 స్టార్ ఓపెనర్, బిహార్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మందకొడి పిచ్పై ఇతర బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన చోట.. వైభవ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బిహార్ జట్టును వైభవ్ తన అద్బుత బ్యాటింగ్తో ఓ యోధుడిలా పోరాడాడు. ఆకాష్ రాజ్, అయూష్తో విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 58 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. అయితే ఇది అతడి స్టాండర్డ్స్ ప్రకారం "స్లో నాక్" అనే చెప్పాలి. ఎందుకంటే టీ20లలో అతని సగటు స్ట్రైక్ రేట్ 217.88. అంతకుముందు వైభవ్ టీ20ల్లో 32, 35 బంతుల్లో రెండు శతకాలు బాదాడు. ఓవరాల్గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని మహారాష్ట్ర 7 వికెట్లు కోల్పోయి చేధించింది.తొలి ప్లేయర్గా..ఈ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. . సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో జోల్ ఆల్టైమ్ రికార్డును ఈ బిహారీ బ్రేక్ చేశాడు.సీనియర్ జట్టు ఎంట్రీ ఎప్పుడు?వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో యూఏఈపై 42 బంతుల్లో 144 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అదేవిధంగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో బిహార్ సీనియర్ ఆటగాళ్లు తడబడినప్పటికీ వైభవ్ మాత్రం మేఘాలయపై 93 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్గా ఈ ఏడాదిలో వైభవ్ కేవలం 15 టీ20 ఇన్నింగ్స్లు ఆడి మూడు సెంచరీలు సాధించాడు. దీంతో అతడు త్వరలోనే భారత సీనియర్ టీ20 జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇంత చిన్న వయస్సులో అతడి నిలకడైన ఆట తీరు, సీనియర్ బౌలర్లపై అతను చూపిస్తున్న ఆధిపత్యం బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ను ఖచ్చితంగా ఆలోచింపజేస్తోంది. అతడు వయస్సు తక్కువ కావడం వల్ల టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి జట్టులోకి రాకపోయినా.. 15 ఏళ్ల నిండగానే జాతీయ జట్టు తరపున డెబ్యూ చేయడం ఖాయం.గిల్ చోటుకు ఎసరు?అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో అరేంగ్రటం చేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి. వైభవ్ మార్చి 27, 2011 న జన్మించాడు. కాబట్టి అతడు మార్చి 27, 2026 తర్వాతే సీనియర్ జాతీయ జట్టు తరపున ఆడేందుకు అర్హత సాధిస్తాడు. అంటే వచ్చే టీ20 ప్రపంచకప్ సైకిల్లో భారత జట్టు తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఒకవేళ అతడు రాబోయో రోజుల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తే వైస్ కెప్టెన్ గిల్ స్ధానం డెంజర్లో పడినట్లే. ప్రస్తుతం టీ20ల్లో భారత జట్టు ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ, గిల్ ప్రారంభిస్తున్నారు. అభిషేక్ దుమ్ములేపుతున్నప్పటికి గిల్ ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు. తదుపరి మ్యాచ్లో కూడా గిల్ ఇదే పేలవ ఫామ్ను కొనసాగిస్తే అతడి స్ధానాన్ని శాంసన్ లేదా వైభవ్తో భర్తీ చేసే అవకాశముంది.స్పీడ్ గన్స్ను ఎదుర్కోగలడా?అయితే సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఇది సరైన వయస్సు కాదు అని, జోష్ హాజిల్వుడ్, కగిసో రబాడ లేదా మార్క్ వుడ్ వంటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం అతనికి చాలా కష్టమని కొంతమంది మాజీలు వాదిస్తున్నారు. కానీ సూర్యవంశీ ఇప్పటికే ఐపీఎల్లో మహ్మద్ సిరాజ్, వెటరన్ ఇషాంత్ శర్మ, అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్ వంటి స్పీడ్స్టార్లను ఉతికారేశాడు. కాబట్టి అతడికి ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడం పెద్ద టాస్క్ ఏమి కాదు.చదవండి: IND vs SA: అతడిపై మీకు నమ్మకం లేదా? మరెందుకు సెలెక్ట్ చేశారు?
హార్దిక్ పాండ్యా విధ్వంసం..
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా.. మంగళవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దుమ్ములేపాడు.ఆసియాకప్-2025లో గాయపడిన తర్వాత పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. తన పునరాగమనంలో పాండ్యా బంతితో రాణించలేకపోయినప్పటికి బ్యాట్తో మాత్రం విధ్వంసం సృష్టించాడు. 225పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను హార్దిక్ ఉతికారేశాడు.తన ఇన్నింగ్స్ను నెమ్మదిగా మొదలపెట్టినప్పటికి.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 183.33గా ఉంది. అతడితో పాటు విష్ణు సోలంకి(43), శివాలిక్ శర్మ(47) మెరుపులు మెరిపించారు.225 పరుగుల లక్ష్యాన్ని బరోడా కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్లో హార్దిక్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులిచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. పాండ్యా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ టీ20 సిరీస్కు ముందు హార్దిక్ మరో రెండు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లు ఆడనున్నాడు.చదవండి: IND vs SA: అతడిపై మీకు నమ్మకం లేదా? మరెందుకు సెలెక్ట్ చేశారు?Hardik Pandya is back with a bang. smashed 77 not out and won the game for Baroda against Punjab.#SMAT2025 #HardikPandya pic.twitter.com/KmmVpawkgQ— The last dance (@26lastdance) December 2, 2025
అతడిపై మీకు నమ్మకం లేదా? మరెందుకు సెలెక్ట్ చేశారు?
రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 అధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. అయితే తొలి మ్యాచ్లో గెలుపొందినప్పటికి జట్టు ఎంపికపై మాత్రం స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.రాంచీ వన్డేలో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడాన్ని అశ్విన్ తప్పు బట్టాడు. ఆసియాకప్లో గాయపడ్డ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో వన్డేలకు నితీశ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే తొలి వన్డే తుది జట్టులో నితీశ్ ఉంటాడని అంతా భావించారు. కానీ టీమ్ మెనెజెమెంట్ మాత్రం ప్లేయింగ్ ఎలెవన్లో నితీశ్ బదులుగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు అవకాశమిచ్చింది. కానీ సుందర్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తాయి. రెండో వన్డేలోనైనా నితీశ్ను ఆడించాలని పలువురు సూచిస్తున్నారు."జట్టులో హార్దిక్ పాండ్యా లేనప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి కచ్చితంగా చోటు ఇవ్వాలి. ఒకవేళ నితీశ్ జట్టులో ఉన్నప్పటికి అతడిని బెంచ్కే పరిమితం చేస్తే కచ్చితంగా టీమ్ సెలక్షన్లో తప్పుందనే చెప్పాలి. తుది జట్టులో ఆడించినప్పుడు నితీశ్ను ఎందుకు ఎంపిక చేశారు? హార్దిక్ ఏమి చేయగలడో నితీశ్ కూడా అదే చేయగలడు. అతడికి అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడు. కానీ అతడు ఎక్కువ శాతం బెంచ్కే పరిమితం చేస్తున్నారు. అటువంటి అప్పుడు అతడి ప్రధాన జట్టుకే ఎంపిక చేయడం మానేయండి" అని తన యూట్యూబ్ ఛానల్లో అశూ పేర్కొన్నాడు.చదవండి: Ashes 2025-26: అనుకున్నదే జరిగింది..! ఆస్ట్రేలియా భారీ షాక్
అనుకున్నదే జరిగింది..! ఆస్ట్రేలియా భారీ షాక్
ఇంగ్లండ్తో రెండో యాషెస్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. గురువారం నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టుకు ఆసీస్ స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దూరమయ్యాడు. ఖవాజా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఈ కారణం చేతనే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేదు. అయితే రెండో టెస్టుకు దాదాపు పది రోజుల విశ్రాంతి లభించడంతో అతడు కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. కానీ ఉస్మాన్ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు.మంగళవారం 30 నిమిషాల పాటు ప్రాక్టీస్ సెషన్లో ఖవాజా పాల్గోన్నాడు. కానీ అతడు అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ఖవాజాను రెండో టెస్టు జట్టు నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది. అతడి స్ధానంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న విషయాన్ని మాత్రం సీఎ వెల్లడించలేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. సెకెండ్ టెస్టులో కూడా ఓపెనర్గా వచ్చే అవకాశముంది. అదే విధంగా ఖవాజా స్ధానంలో తుది జట్టులోకి ఆల్రౌండర్ వెబ్స్టర్ రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా ఈ టెస్టుకు కూడా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, పేసర్ జోష్ హాజిల్వుడ్ దూరమయ్యాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ వరుసగా రెండో మ్యాచ్లను కంగారుల జట్టుకు సారథ్యం వహించనున్నాడు.రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: మరోసారి పేట్రేగిపోయిన వైభవ్ సూర్యవంశీ
న్యూస్ పాడ్కాస్ట్
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలి.... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధి మాటున భూ దోపిడీ...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం... రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో వరి రైతుల పరిస్థితి దయనీయం... ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం... దళారుల కనుసన్నల్లోనే ధాన్యం సేకరణ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం, దళారులతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టికొడుతున్నారు... సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
తెలంగాణలో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఆంధ్రప్రదేశ్లో ఐటీ ముసుగులో రియల్ దందా...
ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచిందెక్కడ?... ఏపీ సీఎం చంద్రబాబుపై ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు విడుదల, జీవో జారీ చేసిన ప్రభుత్వం
బిజినెస్
రూ.58 వేలకోట్లు!.. విజయ్ మాల్యాతో సహా 15 మంది అప్పు
ప్రముఖ వ్యాపారవేత్తలుగా వెలుగొంది.. అప్పులపాలై దేశాన్ని విడిచిపెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15మంది ఆర్ధిక నేరస్థులు బ్యాంకులకు రూ. 58,082 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు.లోక్సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు, పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. మొత్తం 15మంది ఆర్ధిక నేరస్థులలో.. 9 మంది పెద్ద మొత్తంలో ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని, ఇద్దరు మాత్రమే పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నారని అన్నారు. 15మంది బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు రూ.26,645 కోట్లు. వడ్డీ మొత్తం రూ. 31,437 కోట్లు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 58,082 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం, 2018 (FEOA) నిబంధనల ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 15మంది నుంచి ఇప్పటివరకు 33 శాతం (రూ. 19187 కోట్లు) రికవరీ చేసినట్లు పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఇంకా వెనక్కి రావాల్సిన మొత్తం రూ. 38,895 కోట్లు అని అన్నారు.అత్యధికంగా విజయ్ మాల్యావిజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎక్కువ అప్పు తీసుకున్నట్లు సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రూ.6,848.28 కోట్లు అప్పు తీసుకోగా.. అది వడ్డీతో కలిపి రూ.11,960.05 కోట్లకు పెరిగింది. అలాగే విజయ్ మాల్యాకు సంబంధించిన అప్పులపై ఇతర బ్యాంకులు సైతం ప్రకటనలు చేశాయి. నీరవ్ మోదీ ఫైర్ స్టార్, డైమండ్ గ్రూప్ కంపెనీల ద్వారా మొత్తం రూ.7800 కోట్ల అప్పు తీసుకున్నారు. పీఎన్బీ వద్దే ఒకే మొత్తంలో రూ.6799.18 కోట్లు అప్పు తీసుకున్నారు.
‘సంచార్ సాథీ’పై కలకలం
సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్ను అన్ని కొత్త స్మార్ట్ఫోన్ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్ ఇన్స్టాల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రీ-ఇన్స్టాల్పై డాట్ పట్టుడిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్, శామ్సంగ్, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్సెట్ల్లో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..డూప్లికేట్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.యాపిల్ గోప్యతా ప్రమాణాలుప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్ ప్లాట్ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్సంగ్, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్లో టాప్లో నీతా అంబానీ..
యాపిల్ కొత్త వైస్ ప్రెసిడెంట్: ఎవరీ అమర్ సుబ్రమణ్య?
యాపిల్ కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ వైదొలగనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో, సంస్థ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కొత్త వైస్ ప్రెసిడెంట్గా 'అమర్ సుబ్రమణ్య' నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్గా ఉన్న జాన్ జియానాండ్రియా స్థానంలో అమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన (జాన్ జియానాండ్రియా) పదవీ విరమణ చేసేవరకు సలహాదారుగా కొనసాగుతారు.ఏఐ రేసులో.. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ కొంత వెనుకబడి ఉంది. ప్రత్యర్థులకు ధీటుగా ఎదగాలంటే.. తప్పకుండా ఏఐపై ద్రుష్టి పెట్టాలి. కాబట్టి సంస్థ.. వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను అమర్ సుబ్రమణ్యకు అప్పగించింది. కాగా ఈయన యాపిల్ ఫౌండేషన్ మోడల్స్, ఎంఎల్ రీసర్చ్, ఏఐ సేఫ్ట్ అండ్ ఎవాల్యువేషన్ వంటి విభాగాలకు కూడా సారథ్యం వహించనున్నారు.ఎవరీ అమర్ సుబ్రమణ్య?ఏఐ రంగంలో గొప్ప అనుభవం ఉన్న.. అమర్ సుబ్రమణ్య, 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత IBMలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. 2005లో వాషింగ్టన్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. కొన్ని నెలలు మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ పనిచేశారు.పీహెచ్డీ పూర్తయిన తరువాత.. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గూగుల్లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్గా చేరాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, అతను ప్రిన్సిపల్ ఇంజనీర్గా, తరువాత 2019లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందాడు. కొంతకాలం తరువాత ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా మైక్రోసాఫ్ట్కు మారాడు. గూగుల్లో 16 సంవత్సరాల పని చేసిన తరువాత.. సుబ్రమణ్య ఇప్పుడు ఆపిల్లో సీపీవీగా చేరారు.
గూగుల్ ట్రెండ్స్లో టాప్లో నీతా అంబానీ..
భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం అంటే గుర్తుకొచ్చే పేరు అంబానీ ఫ్యామిలీ. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం, ప్రపంచ స్థాయి విలాసవంతమైన జీవనం.. ఇవన్నీ ఉన్నా మనుషులతో మమైకమయ్యే గొప్ప మనసు ఆ కుటుంబానిదని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి చాటారు. ఒక సాధారణ సిబ్బంది పుట్టినరోజు వేడుకలో ఆమె పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదికాస్తా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీని ఫలితంగా గూగుల్ ట్రెండ్స్లో నీతాఅంబానీ టాప్ స్థానంలో నిలిచారు.వైరల్ వీడియోలో..‘అంబానీ ఫ్యామిలీ’ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ అయిన వీడియోలని వివరాల ప్రకారం.. నీతా అంబానీ తన ఇంటి సిబ్బంది పక్కన నిలబడి తన పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా ఆమె చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు. కేక్ కటింగ్ పూర్తయిన వెంటనే ఆమె ఎలాంటి హడావుడి లేకుండా ఒక స్పూన్తో చాక్లెట్ కేక్ ముక్కను తీసి ఆ సిబ్బందికి ప్రేమగా తినిపించారు. ఈ ఊహించని చర్యతో సంతోషం పట్టలేకపోయిన సిబ్బంది చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ‘సో డౌన్ టు ఎర్త్’ క్యాప్షన్ ఉన్న ఈ వీడియో కేవలం ఒక్క రోజులోనే లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: వెండి మెరుపులు.. కారణాలు ఏమై ఉండొచ్చు?
ఫ్యామిలీ
అడవి జంతువులతో పంట నష్టానికి బీమా రక్షణ!
పంటలకు అడవి జంతువుల వల్ల, వరి పంటకు నీటి ముంపు వల్ల కలిగే పంట నష్టాల నుంచి రైతులకు ఉపశమనం కలిగించడానికి 2026 ఖరీఫ్ నుంచి బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోతులు, అడవి పందులు, ఏనుగులు, దుప్పులు, కృష్ణజింకల వంటి అడవి జంతువుల వల్ల కూరగాయలు, పండ్లు, వరి, పత్తి వంటి పంటలకు కూడా చాలా ప్రాంతాల్లో తీరని నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీటి ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎటువంటి అధికారిక శాస్త్రీయ సర్వేలు ఇప్పటివరకు జరగకపోవటం వల్ల ఆధారపడదగిన గణాంకాలేవీ అందుబాటులో లేవు.ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం కింద ఈ బీమా సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సవరించిన నియమ నిబంధనల ప్రకారం అడవి జంతువుల దాడి కారణంగా పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు వచ్చే ఖరీఫ్ నుంచి బీమా పరిహారం చెల్లిస్తారు. అడవి జంతువుల దాడిని ‘స్థానిక ప్రమాదం’గా గుర్తించి పీఎంఎఫ్బీవై కింద ఐదో యాడ్–ఆన్ కవర్గా చేర్చుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టానికి కారణమవుతున్న అడవి జంతువుల జాబితాను ప్రకటిస్తాయి. గతంలో జరిగిన పంట నష్టాల గణాంకాల ఆధారంగా ఈ బీమా వర్తించే జిల్లాలు లేదా బీమా యూనిట్లను గుర్తిస్తాయి. జియోట్యాగ్ చేసిన ఛాయాచిత్రాలను పంట బీమా యాప్లోకి 72 గంటల్లోపు నష్టాలను రెతులు అప్లోడ్ చేయడం ద్వారా నివేదించాల్సి ఉంటుంది. అటవీ జంతువుల వల్ల రైతులకు పంట నష్టం జరుగుతోందని, దీనికి పరిష్కారం వెతకాలని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన దీర్ఘకాలిక అభ్యర్థనల మేరకు కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఆకస్మికంగా స్థానికంగా జరిగే తీవ్రమైన పంట నష్టం నుంచి రైతులకు రక్షణ కల్పించటమే ప్రభుత్వ లక్ష్యం. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి శాస్త్రీయ, పారదర్శక, కార్యాచరణపరంగా సాధ్యమయ్యే విధివిధానాలు సిద్ధమయ్యాయి. వీటిని 2026 ఖరీఫ్ పంట కాలం నుంచి అమల్లోకి వస్తాయి. దేశవ్యాప్త దీర్ఘకాలిక సమస్యమన దేశం అంతటా రైతులు ఏనుగులు, అడవి పందులు, నీల్గాయ్, జింకలు, కోతులు వంటి వన్యప్రాణుల దాడుల కారణంగా చాలా సంవత్సరాలుగా పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు. అడవులు, వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలు, కొండల సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య సర్వసాధారణం. ఇప్పటివరకు, ఇటువంటి నష్టాలు పంట బీమా పరిధిలోకి రాకపోవడంతో రైతులు పరిహారం పొందలేకపోయారు. అదేవిధంగా, వరద పీడిత, తీరప్రాంత రాష్ట్రాల్లోని వరి రైతులు భారీ వర్షాలు, వరదల వల్ల పదేపదే నష్టపోతున్నారు. మునిగిపోయిన పంటలను అంచనా వేయడంలో ఇబ్బంది కారణంగా 2018లో వరి ముంపునకు బీమా సదుపాయం తొలగించారు. అయితే, ప్రతి ఏటా వరదలకు గురయ్యే జిల్లాల్లోని రైతులకు బీమా రక్షణ అందకుండా పోయింది.ఈ సవాళ్లను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయం–రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా నిర్ణయించారు. ఈ ముఖ్యమైన నిర్ణయంతో స్థానికంగా పంట నష్టం వాటిల్లిన రైతులు ఇప్పుడు పీఎంఎఫ్బీవై కింద సాంకేతికత ఆధారిత క్లెయిమ్ ద్వారా సకాలంలో పరిహారం పొందబోతున్నారు.మానవ–వన్యప్రాణుల సంఘర్షణ ఎక్కువగా ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, హిమాచల్ప్రదేశ్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలోని రైతులకు బీమా సదుపాయం గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ముంపు నుంచి వరి పంటకు స్థానిక విపత్తుగా బీమా రక్షణను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల తరచూ వరదల పాలయ్యే తీరప్రాంత, తదితర రాష్ట్రాలలోని రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. మన దేశ పంటల బీమా వ్యవస్థను ఈ కొత్త సవరణలు మరింత బలోపేతం చేస్తాయి.రెండు రాష్ట్రాల్లో శాస్త్రీయ సర్వే చెయ్యాలివిశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ వైద్యుల వాసుదేవరావు సూచన పంటలకు అడవి జంతువుల వల్ల బీమా సదుపాయాన్ని సరిగ్గా అమలు చెయ్యాలన్నా గణాంకాలు అవసరం. ఏయే జంతువుల వల్ల ఎంత మేరకు నష్టం జరుగుతోందో రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తెలుసుకోవాలి. శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర సర్వే ద్వారా గణాంకాలు సేకరించిన తర్వాత స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ వైద్యుల వాసుదేవరావు సూచిస్తున్నారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం అధిపతిగా, ప్రధాన శాస్త్రవేత్తగా దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఉద్యోగ విరమణ చేశారు. ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు: వచ్చే ఖరీఫ్ నుంచి బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కదా. రైతులకు ఉపశమనం కలుగుతుందంటారా? కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. అయితే, ఇది ఒక్క రోజులో పరిష్కారం అయ్యే సమస్య కాదు. జటిలమైనది. ఏమి చెయ్యాలన్నా ముందు అధికారికంగా గణాంకాలు సేకరించాలి. పైపై అంచనాల ఆధారంగా కాకుండా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ సర్వే ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలి?వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాల నిపుణులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రామాణిక పద్ధతుల్లో సర్వే జరపాలి. ఏయే అడవి జంతువుల వల్ల ఏయే పంటలకు ఏయే దశల్లో ఎంత మేరకు పంట నష్టం జరుగుతున్నది? అనే గణాంకాలను ప్రాజెక్ట్ మోడ్లో పక్కాగా సేకరించాలి. ఏయే ప్రాంతాల్లో సమస్య ఏ(ఎక్కువ, మధ్యస్థం, తక్కువ) స్థాయిలో ఉందో గుర్తించాలి. తదనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి.తెలుగు రాష్ట్రాల్లో అడవి జంతువుల వల్ల పంటలకు నష్టం ఎంత మేరకు జరుగుతోందని మీరనుకుంటున్నారు?ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలతో పాటు తెలంగాణలో 90% పంట పొలాలకు కోతుల సమస్య ఉంది. కోతులను వన్యప్రాణుల జాబితా నుంచి తొలగించారు. కాబట్టి, వీటికి కుటుంబ నియంత్రణ చేయించవచ్చు. కోతులన్నిటినీ పట్టుకొని ఆపరేషన్ చెయ్యలేం కాబట్టి, ఆహారంలో మందు కలిపి పెట్టి మేటింగ్ కంట్రోల్ చెయ్యాలి. 50% పొలాలకు అడవి పందుల సమస్య ఉంటుంది. వీటితో పాటు గద్వాల్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నాగర్కర్నూలు జిల్లాల్లో కృష్ణజింకల సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోతులు, అడవి పందులు, కృష్ణజింకలు, దుప్పులతో పాటు చిత్తూరు జిల్లాలో అదనంగా ఏనుగుల సమస్య కూడా ఉంది. పంటలకే కాదు, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు కూడా కోతుల సమస్య ఉంది. ఒక పార్టీ ఎన్నికల వాగ్దానం చెయ్యాల్సి వచ్చిందంటే ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. శాస్త్రీయ సర్వే ఎంత త్వరగా, సమగ్రంగా చేస్తే.. సమస్య పరిష్కారం దిశగా అంత వేగంగా అడుగులు పడతాయి. ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి సర్వే జరిగిందా?హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసింది. కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటి సంఖ్యను తగ్గించగలిగారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకోవటంలో సాంకేతిక సాధనాలు ఎంతవరకు ఉపయోగకరం?ఎన్ని సాంకేతిక ఉపకరణాలను రూపొందించినా కొంత మేరకు ప్రభావం చూపుతాయి. కానీ, పూర్తిగా సమస్యను పరిష్కరించలేవు.
ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్
పేరెంటింగ్కు సంబంధించి ఇప్పుడు సరికొత్త ట్రెండ్... ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్. కొందరికి నచ్చినా, నచ్చకపోయినా ఇన్స్టాగ్రామ్ అనధికారికంగా కొత్త పేరెంటింగ్ మాన్యువల్గా మారింది. పేరెంటింగ్కు సంబంధించిన సలహాల కోసం పెద్దలు, ఇరుగు పొరుగువారు, వైద్యులు, పుస్తకాల మీద ఆధారపడడం అనేది ఒక విధానం. దీనికి భిన్నంగా ఆన్లైన్ దారిలో వెళ్లడమే ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్.శిశువుకు పాలివ్వడం నుంచి పిల్లలను స్కూలుకు పంపడం వరకు పేరెంటింగ్కు సంబంధించి ఆన్లైన్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. మనసులోని సందేహాన్ని టైప్ చేస్తే చాలు సెకన్ల వ్యవధిలో వందలాది వీడియోలు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడతాయి. ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ ప్రత్యేకత ఏమిటంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది.బేబీఫుడ్, రెండు సంవత్సరాల పిల్లలకు కలర్ఫుల్ ప్లేట్స్, సూటబుల్ డయపర్స్... మొదలైన ఎన్నో విభాగాల ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. ‘గతంలో పేరెంటింగ్కు సంబంధించి సందేహాలు, సమస్యలు, సవాళ్లు కుటుంబ పరిధిలోనే ఉండేవి. ఇప్పుడు మాత్రం పేరెంట్స్ తమ అనుభవాలను షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి సలహాల కోసం ఇతరుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. సోషల్ మీడియా విస్తృతస్థాయిలో పేరెంటింగ్ విధానాలను పరిచయం చేయడంతో, చిన్న కుటుంబాల వారు పేరెంటింగ్కు సంబంధించిన సలహాల కోసం సోషల్మీడియాపై ఆధారపడుతున్నారు. ట్రెండ్ సంగతి ఎలా ఉన్నా, నిజంగా ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ తల్లిదండ్రులకు సహాయపడుతుందా? లేక ఒత్తిడిని పెంచుతుందా?‘కంటెంట్లో కొంత భాగం పరిశోధన ఆధారితమైనప్పటికీ, ఎక్కువ శాతం ట్రెండ్ ఆధారితమైనది. పేరెంటింగ్కు సంబంధించి సలహాలు, సూచనలు త్వరగా తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రొఫెషనల్, పర్సనలైజ్డ్ మెడికల్, ఫ్యామిలీ గైడెన్స్కు ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్ సమానం కాదు. ఇన్స్టాగ్రామ్ రీల్ శిశువు చరిత్ర, స్వభావం, ఆహార అలవాట్లు, ఆరోగ్య అవసరాలు తల్లిదండ్రుల మానసిక పరిస్థితులను అంచనా వేయదు’ అంటున్నారు నిపుణులు.
ఉద్యోగం కన్న ఊరు మిన్న
‘అందరూ ఉద్యోగాలు చేస్తే ఊరిని ఎవరు ఉద్ధరిస్తారు’ అని ప్రశ్నించుకుంది సాక్షి రావత్. అందుకే బీటెక్ చేసి ఉద్యోగం చేయకుండా 22 ఏళ్ల వయసులో తన ఊరికి సర్పంచ్గా ఎన్నికైంది. ‘ఉత్తరాంచల్’ మొత్తానికి ఈ వయసులో సర్పంచ్ అయిన వాళ్లు లేరు. ‘చదువుకుంటున్నవాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఊరు బాగుపడుతుంది’ అంటున్న సాక్షి రావత్ పరిచయం.పల్లెలో పుట్టి పెరిగిన యువత చదువు పూర్తి కాగానే పట్టణాలకు చేరి ఉపాధి వెతుక్కుంటారు. ఆ తర్వాత ఏ పండగకో, సెలవులకో ఊరికి వచ్చి, ఊరి వారిని పలకరించి, ఇంట్లో వారితో గడిపి తిరిగి పట్టణాలకు చేరుకుంటారు. అనేక సందర్భాల్లో జరుగుతున్నది ఇదే. ఉద్యోగ, ఉపాధి మార్గాల అన్వేషణలో యువత పట్టణాలకు చేరుతుండటంతో పల్లెలు బోసిపోతున్నాయి. అటువంటి చోట కొత్త అంకురమై నిలిచారు 22ఏళ్ల సాక్షి రావత్. ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వల్ జిల్లా ‘కుయీ’ గ్రామానికి ఈమె అతి చిన్నవయసులో గ్రామ ప్రధాన్ (సర్పంచి)గా మారారు. దేశంలో ఈ ఘనత సాధించిన వ్యక్తుల్లో ఒకరిగా వార్తల్లో నిలిచారు.బాల్యం నుంచే సామాజిక అవగాహనఉత్తరాఖండ్ పౌరీ గఢ్వాల్ జిల్లాలో యువత లక్ష్యం ఒక్కటే... ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లి ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవడం. అక్కడ ఉంటూ ఊరికి అతిథుల్లా మారిపోవడం. ఈ పరిస్థితిని చిన్ననాటి నుంచి గమనిస్తోంది సాక్షి. ఆమె ఆ గ్రామంలో పుట్టి పెరిగింది. చిన్ననాటి నుంచి సామాజిక అంశాలను అర్థం చేసుకోవడం, దానిగురించి చర్చించడం, ఇతరులకు చేతనైన సాయం అందించడం ఆమెకు అలవడింది. అందుకు ఆమె కుటుంబం ఏనాడూ అడ్డు చెప్పలేదు. ఈ క్రమంలో బీటెక్ బయో టెక్నాలజీ పూర్తి చేసిన ఆమెకు మరేదో నగరానికి వెళ్లి ఉద్యోగం చేయాలని అనిపించలేదు. తను పుట్టి పెరిగిన ఊరికి తనవంతుగా ఏదైనా చేయాలని అనుకుంది.యువత రాజకీయాల్లోకి రావాలంటూ..పల్లెల్లో ఉపాధిమార్గాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చదువుకున్న వారికి అక్కడ దొరికే ఉద్యోగాలు దాదాపు శూన్యం. దీంతో వారంతా దూరంగా వెళ్లి బతకాల్సి వస్తోంది. దీనికితోడు స్థానికంగా మహిళలకు ఉపాధి లేక కుటుంబాలు పేదరికంతో మగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తేవాలంటే యువత రాజకీయాల్లోకి రావడం అవసరం అని సాక్షి భావించింది. అందుకు తొలి అడుగు తనదే కావాలని నిశ్చయించుకుంది. 21 ఏళ్లు దాటిన వ్యక్తులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న నిబంధనను అనుసరించి పోటీ చేసింది. చదువుకున్న అమ్మాయి. పైగా చిన్ననాటి నుంచి తోటివారి కోసం పాటు పడే తత్వం, ఊరి బాగు కోసం ఆలోచించే యుక్తి ఉన్న అభ్యర్థి కావడంతో అందరూ కలిసి సాక్షిని గెలిపించారు. తమ ఊరికి నాయకురాలిగా ఎన్నుకున్నారు.ఇది కొత్త ప్రయాణం కాదు‘ఇది ఇవాళ కొత్తగా మొదలైన ప్రయాణం కాదు. ఎన్నో ఏళ్లుగా నాలో నాటుకున్న భావన. నా ఊరికి ఏదైనా చేయాలి. నా ఊరి పరిస్థితులను మార్చాలి’ అంటున్నారు సాక్షి రావత్. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించడం, మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం, విద్యార్థులకు విద్యాబోధన సౌకర్యాలు పెంచడంపై దృష్టి సారిస్తానని అంటున్నారు. తను చదివిన బయో టెక్నాలజీ అనుభవంతో రైతులతో కలిసి వ్యవసాయ పద్ధతుల్లో నూతన రీతుల్ని ప్రవేశపెట్టాలని ఉందని అంటున్నారు. ‘సొంత ఊరిని, కన్నతల్లిని విడిచిపెట్టడం ఎక్కడో దూరంగా బతకడం ఎవరికైనా కష్టమైన విషయమే. మా ఊళ్లో ఈ పరిస్థితి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. దానికి అడ్డుకట్ట వేయాలన్నదే నా ప్రణాళిక. అందుకు తగ్గ ఆలోచనలు నాకున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం, వారి సమస్యలు తీర్చడం, ఆదాయ మార్గాలు పెంచడంపై దృష్టి నిలుపుతాను’ అని నమ్మకంగా చెప్తున్నారు సాక్షి.తను చదివిన బయో టెక్నాలజీ అనుభవంతో రైతులతో కలిసి వ్యవసాయ పద్ధతుల్లో నూతన రీతుల్ని ప్రవేశపెట్టాలని ఉందని అంటున్నారు సాక్షి రావత్.
క్రియేటివ్, డిజైన్ రంగాలపై తెలంగాణ విద్యార్థులు మొగ్గు
దశాబ్దాలుగా భారతదేశంలో ఇంజనీరింగ్, వైద్యం వంటి సాంప్రదాయ కెరీర్లే ఆధిపత్యం చెలాయించాయి. ప్రస్తుతం భారత్ యువతలో మార్పు సంతరించుకుంది. డిజైన్, ష్యాషన్, యానిమేషన్, క్రియేటివ్ సాంకేతిక కెరీర్లను ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా. ఈ మార్పుని ప్రతిబింబింబించేలా వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ (WUD) ఈ క్రియేటివ్ రంగం ప్రాముఖ్యతను హైలెట్ చేసేలా హైదరాబాద్లో కౌన్సలర్ల సమావేశాన్ని నిర్వహించింది. ఆంధ్ర తెలంగాణ అంతటా దాదాపు వెయ్యి మందికి పైగా పాఠశాల ప్రిన్సిపాల్లు, కౌన్సలర్లను అనుసంధానించిన ఈ డ్రైవ్లో సృజనాత్మక రంగాలపై పెరుగుతున్న క్రేజ్ని చర్చించడమే కాకుండా ఈ జెన్ జెడ్ తన ఆకాంక్షలను ఎలా రూపొందించుకోగలదు అనే దానిపై అంతర్దృష్టిని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు రాష్ట్రం దాటి అవకాశాలను అన్వేషించడంలో తమ వంతు పాత్రను పోషిస్తామని వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ డీన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ షలీన్ శర్మ అన్నారు. అలాగే ఈ యూనివర్సిటికి చెందిన విద్యార్థుల్లో సుమారు 12-15% మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే కావడం విశేషం. అంతేగాదు ఈ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అవకాశాలను బలోపేతం చేసేలా WUD ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ విశ్వవిద్యాలయం అండ్ రీడింగ్ UK విశ్వవిద్యాలయం, ఎమిలీ కార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ అండ్ వాంకోవర్ ఫిల్మ్ స్కూల్, కెనడా; కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ USA; ENSAIT, ఫ్రాన్స్; ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్; వంటి ప్రముఖ సంస్థలతో కూడా అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. చివరగా ఈ కౌన్సలర్ల సమావేశం ద్వారా తెలంగాణ, హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులను సాధికారపర్చడానికి WUD తన నిబద్ధతను పునరుద్ఘాటించడమే కాకుండా ఈ డిజైన్ ఎడ్యుకేషన్ని పూర్తి స్థాయి కెరీర్ మార్గంగా ఎంచుకునులా ప్రోత్సహిస్తోంది కూడా. (చదవండి: ఈ పర్ఫెక్ట్ క్రిస్పీ దోసె వెనుక ఇంత సైన్సు ఉందా? సాక్షాత్తు ఐఐటీ ప్రొఫెసర్)
అంతర్జాతీయం
గగనతలం మూసివేత.. అసలు ఆ హక్కు ఎవరిది?
వెనిజులా అమెరికా మధ్య ఉద్రిక్తతల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడాడని.. అది హాట్హాట్గా సాగిందని.. పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఈ తరుణంలో.. గగనతలం మూసివేత అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.. వెనిజులా గగనతలం మూసివేయమని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనిని వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది చెల్లదని.. ట్రంప్ ప్రకటన తమ దేశ సార్వభౌమాధికారంపై దాడేనని అభివర్ణించింది. అసలు గగనతలంపై నిషేధం విధించే అధికారం ఎవరికి ఉంటుంది?.. ఎవరు ఎవరిపై విధిస్తారు? దానికంటూ ఏమైనా ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయా? .. ఈ నిర్ణయంతో కలిగే నష్టాలేంటి?.. పరిశీలిస్తే.. గగనతలం మూసివేత అంటే.. ఒక దేశం తన భూభాగం పై ఉన్న ఆకాశాన్ని (airspace) ఇతర దేశాల విమానాలకు పూర్తిగా లేదంటే కొంతవరకు నిషేధించడం. అది పరిస్థితులను బట్టి ఆ దేశం తీసుకుంటుంది. ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, రాజకీయ నిరసనల కారణంగా గగనతలాన్ని మూసేసుకోవచ్చు. అప్పుడు ఆ దేశం మీదుగా ఇతర దేశాలకు సంబంధించిన విమానాలేవీ ప్రయాణించకూడదు. కానీ, ట్రంప్ అందుకు భిన్నంగా ఇతర దేశాన్ని(వెనిజులా) ఎయిర్స్పేస్ని మూసేయాలని ఆదేశించారు. ఒక దేశం మరొక దేశం గగనతలాన్ని మూసివేయమని చెప్పే హక్కు లేదు. దీంతో ఇది చెల్లదని.. కేవలం రాజకీయ ఉద్రిక్తతల్లో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఎందుకు ప్రకటించారుట్రంప్ గగనతలం మూసివేతకు చూపిస్తున్న కారణాలు అనేకం ఉన్నాయి. వెనిజులా గగనతలం ద్వారా నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారాయన. డ్రగ్ ట్రాఫికింగ్తో పాటు మానవ అక్రమ రవాణా అరికట్టడం కోసమేనని చెబుతున్నారు. వెనిజులా గగనతలాన్ని పూర్తిగా మూసివేయాలని ఎయిరలైన్స్, పైలట్స్, డ్రగ్ డీలర్స్, హ్యూమన్ ట్రాఫికర్స్కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కరేబియన్ ప్రాంతంలో భారీ సైనిక దళాలను (ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సహా) మోహరింపజేశారు.రూల్స్ ఇవిగో.. ప్రతి దేశానికి తన ఆకాశంపై సార్వభౌమాధికార హక్కు ఉంటుంది. చికాగో కన్వెన్షన్ (1944) అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ఆధారంగా రూపొందిన ఒప్పందం ఈ విషయంలో ప్రస్తుతానికి అమల్లో ఉంటోంది. ఇందులో భాగంగా.. ఆర్టికల్ 1: ప్రతి దేశానికి తన భూభాగం పై గగనతలంపై పూర్తి సార్వభౌమాధికార హక్కు ఉంటుంది.ఆర్టికల్ 9: ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయవచ్చు.ఆర్టికల్ 89: యుద్ధం లేదా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో, దేశాలు ICAO నిబంధనలను పక్కన పెట్టి తమ గగనతలాన్ని నియంత్రించవచ్చు.గతంలో.. తమ జాతీయ భద్రతా కారణాల వల్ల గగనతలాన్ని మూసివేయడం సమర్థిస్తాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో తరచూ ఇది చూసిందే. అలాగే.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్ దేశాలు రష్యా విమానాలకు గగనతలాన్ని మూసివేశాయి. మొన్నీమద్యే ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాక్ నడుమ కూడా ఎయిరోస్పేస్ మూసివేత కనిపించింది. అయితే.. గగనతలం మూసివేతను తాత్కాలిక, అవసరమైన చర్యగా మాత్రమే ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు సమర్థిస్తాయి. విమర్శకులు మాత్రం దీన్ని రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని అంటుంటారు.ప్రభావం.. తమ గగన తలం నుంచి విమానాలు ప్రయాణించకూడదని ఒక దేశం ఆంక్షలు విధించడం లాంటిదే ఈ నిర్ణయం. దీంతో అంతర్జాతీయ విమానాలు ఆ దేశం మీదుగా ప్రయాణించడానికి వీలుండదు. అవి మార్గం మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణాలకు సమయం.. ఇంధన ఖర్చు పెరుగుతాయి. ఫ్లైట్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతాయి. అంతర్జాతీయ కనెక్టివిటీలో అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బంది పడొచ్చు. అలాగే.. ఆర్థిక నష్టాలకూ అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల వాణిజ్యం, పర్యాటకం దెబ్బతింటాయి.ఎయిర్లైన్స్ ఆదాయం తగ్గుతుంది. కొన్నిసార్లు ఇది యుద్ధ ముప్పుగా కూడా మారొచ్చు. గగనతలం మూసివేత అనేది ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని వినియోగించే చర్య. ఇందుకు చికాగో కన్వెన్షన్ రూల్స్ ఉన్నాయి. కానీ అమెరికా–వెనిజులా ఉద్రిక్తతల్లో ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అధికారిక ICAO రూల్స్ ప్రకారం చెల్లుబాటు కాదు. దీని వల్ల విమానయాన రంగం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితం అన్నీ ప్రభావితం అవుతాయనే అందోళన వ్యక్తమవుతోంది.
అన్నంత పని చేయబోతున్న ట్రంప్?!
ఇల్హాన్ ఒమర్ను అమెరికా నుంచి వెళ్లగొడతారా? ఆమెను పంపించేయాల్సిందేనని అక్కడి ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?. ట్రంప్ చెబుతున్నట్లు ఆమె నిజంగానే ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్కు పాల్పడ్డారా? భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది?.. అసలు ఇంతకీ ఇల్హాన్ ఒమర్ నేపథ్యం ఏంటి?.. అమెరికా చట్ట సభ్యురాలు, మిన్నెసోటా రాష్ట్రానికి చెందిన డెమోక్రాటిక్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్. తాజాగా ఆమె వివాహం,ఇమ్మిగ్రేషన్ విషయంలో మోసానికి పాలపడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా పౌరసత్వం కోసం సొంత సోదరుడినే వివాహం చేసుకున్నారని ప్రధాన ఆరోపణ. దీంతో పాటు ఆమె చేస్తున్న యాంటీ అమెరికా కామెంట్లకు అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. డీనేచురలైజ్ చేసి (పౌరసత్వం రద్దు చేసి) దేశం నుంచి వెల్లగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ట్రంప్ అలా అనేసరికి.. 2009లో ఒమర్ అహ్మద్ నూర్ సయీద్ ఎల్మీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె అక్రమంగా అమెరికాకు వలస వచ్చారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తిని ఆమె వివాహమాడారని.. కేవలం అమెరికాలో స్థిరపడేందుకు ఆమె మోసం చేశారని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆమెను అమెరికా నుంచి బయటకు పంపించేస్తామని వ్యాఖ్యానించారు. వలసల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో సాధారణంగానే చర్చ పెద్దదైంది. ఈ ఆరోపణలను ఒమర్ ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇస్లామోఫోబిక్, రాజకీయ ప్రేరేపితమైనవిగా అభివర్ణించారామె. రాజకీయంగా తనను బలహీనపర్చేందుకు జరుగుతున్న దాడి అని అన్నారామె. అయితే.. గతంలోనూ..ఇల్హాన్ ఒమర్పై ఈ ఆరోపణలు కొత్తవేం కావు. 2016లో సోమాలి-అమెరికన్ ఫోరమ్ ఒకటి ఈ అభియోగాన్ని తెరపైకి తెచ్చింది. 2018 కాంగ్రెస్ ఎన్నికల సమయంలోనూ ఈ అంశంపై పెద్ద చర్చ నడిచింది. తీవ్ర అభియోగాల నేపథ్యంతో కొన్ని మీడియా సంస్థలు ఇన్వెస్టిగేషన జర్నలిజంతో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయతనం చేశాయి. 2019-20 మధ్య ఎఫ్బీఐ, హౌజ ఎథిక్స్ కమిటీ ఈ అభియోగాన్ని పరిశీలించి ఏం తేలకపోవడంతో కేసులు మూసివేశాయి కూడా. అయినా కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఈ ఆరోపణలను మళ్లీ ప్రస్తావించారు. దీంతో అమెరికా రాజకీయాల్లో ఇమ్మిగ్రేషన్ & పౌరసత్వంపై పెద్ద చర్చకు దారితీస్తోంది. వెళ్లగొట్టాల్సిందే..! ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఆమెను అమెరికా నుంచి పంపించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ఉద్యమిస్తున్న మాగా కార్యకర్తలు, కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కోరుతున్నారు. ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఆమె మ్యారేజ్ సర్టిఫికెట్ను ఎక్స్ ఖాతాలో వైరల్ చేస్తూ.. సాగనంపాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు.ఇల్హాన్ ఒమర్(43).. పుట్టింది సోమాలియాలో. ఆ దేశ అంతర్యుద్ధంతో 8 ఏళ్ల వయసులో కెన్యాకు చేరుకుని నాలుగేళ్లపాటు శరణార్థ శిబిరాల్లో గడిపింది. అక్కడి నుంచి అమెరికాకు చేరుకున్న ఆమె.. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందింది. 2018 నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు ఆమె చట్టసభకు ఎన్నికయ్యారు. అది సాధ్యమేనా?అమెరికా చట్టం ప్రకారం, నేచురలైజ్డ్ సిటిజన్ (పౌరసత్వం పొందిన వ్యక్తి)ను డీనేచురలైజ్ చేయవచ్చు, కానీ అది స్పష్టమైన, బలమైన ఆధారాలతో మాత్రమే సాధ్యం. డీనేచురలైజేషన్ జరిగితే, ఆ వ్యక్తి పర్మనెంట్ రెసిడెంట్ లేదంటే అక్రమ వలసదారుగా మారతారు. తర్వాతే డిపోర్టేషన్ జరుగుతుంది. ఈ మధ్యలో కోర్టు జోక్యాలతో ఏదైనా జరగొచ్చు. అయితే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా ఇలాంటి చర్యలు ప్రధానంగా యుద్ధ నేరస్తులు, ఉగ్రవాదులపై మాత్రమే జరిగాయి. ఒమర్పై వినిపిస్తున్న ఈ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు(ఫోరెన్సిక్ సహా) లేకపోవడం వల్ల చట్టపరంగా చర్యలు తీసుకోవడం కష్టమే. భారత్కు ఎందుకు అంత కోపంవివాదాలు ఆమెకు కొత్తేం కాదు. ఆమె బహిరంగంగా చేసిన పలు ప్రకటనలు తీవ్ర దుమారం రేపాయి. సోమాలియా నా సొంతం దేశం అంటూ అమెరికాను ఆమె కించపరిచేలా వ్యవహరించారనే విమర్శ ఒకటి బలంగా వినిపిస్తుంటుంది. అంతేకాదు.. గాజా సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్, అమెరికాను ఉగ్ర గ్రూపులతో పోల్చారామె. అలాగే.. ఇల్హాన్ ఒమర్ గతంలో భారత వ్యతిరేక వైఖరితో వార్తల్లో నిలిచారు. 2022లో ఆమె పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ను సందర్శించి, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆమె భారతదేశంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ ఈ పర్యటనను తీవ్రంగా ఖండించింది.
సూట్కేస్లో ఇన్ఫ్లుయెన్సర్ మృతదేహం
వియన్నా / స్లోవేనియా: వారం రోజులుగా అదృశ్యమైన ఆస్ట్రియన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ స్టెఫానీ పైపర్ (31) విగతజీవిగా కనిపించింది. స్లోవేనియన్ అడవిలో ఒక సూట్కేస్లో ఆమె మృతదేహం లభ్యమైంది. దీనికి ముందు స్టెఫానీ పైపర్ మాజీ ప్రియుడు తన నేరాన్ని అంగీకరించి, పోలీసులను స్టెఫానీ మృతదేహాన్ని దాచిన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఆస్ట్రియన్ అధికారులు తెలిపారు.పైపర్ కనిపించకుండా పోవడంతో కలకలం చెలరేగింది. క్రిస్మస్ పార్టీ తర్వాత స్నేహితులు ఆమెను చివరిసారిగా చూశారు. స్థానిక నివేదికల ప్రకారం పార్టీ ముగిశాక పైపర్ తన ఇంటికి చేరుకున్నట్లు స్నేహితులకు వాట్సాప్ సందేశం పంపింది. ఆ తర్వాత తన ఇంటి మెట్ల మార్గంలో ఎవరో తనను అనుసరిస్తున్నట్లు మరో సందేశాన్ని పంపింది. ఆస్ట్రియన్ వార్తాపత్రిక క్రోనెన్ జైటంగ్ నివేదిక ప్రకారం ఆమె మాజీ ప్రియుడు ఆమెను గొంతు కోసి చంపి, ఆపై మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి అడవిలో పడేశాడని పోలీసుల ముందు వెల్లడించాడు. పీపుల్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ఆమె అదృశ్యమైన రోజున ఆమె మాజీ ప్రియుడిని భవనంలో చూసినట్లు స్థానికులు తెలిపారు.పైపర్ తప్పిపోయినట్లు ఫిర్యాదు అందిన వారం తర్వాత, ఆమె మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రియన్ సరిహద్దు సమీపంలోని ఒక క్యాసినోలో అతని కారు మంటల్లో చిక్కుకున్న తరుణంలో పోలీసులు అతనిని పట్టుకున్నారు. అరెస్టు తర్వాత అతను నేరాన్ని అంగీకరిస్తూ, స్లోవేనియన్ అడవిలో మృతదేహాన్ని పడవేసిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లాడు. హత్యకు గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ప్రియుడితో పాటు, ఈ కేసులో అతని ఇద్దరు బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరంలో వారి ప్రమేయంపై సమాచారం ఇంకా తెలియరాలేదు.ఇది కూడా చదవండి: అణుశక్తి బిల్లు.. గేమ్ చేంజర్ అయ్యేనా?
దిత్వా తుపాను.. శ్రీలంక అతలాకుతలం
కొలంబో: దిత్వా తుపాను బీభత్సం ధాటికి శ్రీలంక అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా 334 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శ్రీలంక జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం (డీఎంసీ) వెల్లడించింది. దాదాపు 11.18 లక్షల మందిపై విపత్తు ప్రభావం పడిందని తెలిపింది.దిత్వా తుపాను ప్రభావం శ్రీలంకపై కొనసాగుతోంది. తుపాను కారణంగా లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో వరదలు రావడం, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. ఒక్క కాండీ జిల్లాలోనే 88 మంది మృతి చెందగా.. 150 మంది కనిపించకుండా పోయారు. బదుల్లాలో 71 మంది మృతి చెందారు. డీఎంసీ ప్రకారం ఈ తుపాను.. దేశవ్యాప్తంగా 3,09,607 కుటుంబాలను ప్రభావితం చేసింది. ఇక, ఇటీవలి కాలంలో శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలలో ఈ తుపాను నిలిచింది. వరదల కారణంగా పలు పట్టణాలు మునిగిపోయాయని, ప్రధాన వంతెనలు కొట్టుకుపోయాయని, మౌలిక సదుపాయాలకు ఆటంకం కలిగిందని అధికారులు చెబుతున్నారు.🚨🇱🇰 CYCLONE DITWAH just tore through Sri Lanka. Death toll hits 153, half a million flooded, 191 missing, entire tea estates buried, suburbs turned into death traps. 44,000 crammed in shelters, 15,000 homes gone, 1.75 million without power. The Air Force rescued 121 in 50mph… pic.twitter.com/fsLDducOss— TheCommonVoice (@MaxRumbleX) November 30, 2025మరోవైపు.. దిత్వా నేపథ్యంలో ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో శ్రీలంకలో భారత్ చేపడుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్, రెండు చేతక్ హెలికాప్టర్లతో పాటు 80 మంది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని శ్రీలంకకు పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. అంతకు ముందురోజు వాయుసేనకు చెందిన సీ-130జే, ఐఎల్ 76 విమానాలు 21 టన్నుల సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించాయి.Cyclone ‘Ditwah’ Batters Sri Lanka; Government Appeals for International Aid pic.twitter.com/oGwmHUb5gA— Indian News Network (@INNChannelNews) November 29, 2025కొలంబో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 323 మంది భారతీయులను ఆదివారం రవాణా విమానాల్లో స్వదేశానికి తరలించారు. 247 మంది తిరువనంతపురానికి, 76 మంది దిల్లీకి చేరుకున్నారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల్లో 45 మందిని భారత వాయుసేన (ఐఏఎఫ్) హెలికాప్టర్లు కొలంబోకు తరలించాయి. ప్రభావిత ప్రాంతాలకు 57 మంది శ్రీలంక సైనికుల్ని కూడా ఐఏఎఫ్ తరలించింది. శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులెవరైనా అత్యవసర హెల్ప్డెస్క్ను +94 773727832 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు.
జాతీయం
వైకల్యాన్ని జయించిన సంకల్పం.. ఆ వైద్యుడి తదుపరి కల ఇదే!
విధి వెక్కిరించినా, సమాజం వెక్కిరించినా, తన కలను వదులకోలేదు. పట్టుదలగా తను అనుకున్నదిసాధించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఆయనే భారతదేశానికి చెందిన 3 అడుగుల డాక్టర్ గణేష్ బరయ్య. తన కల సాకారం కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంతాకాదు. గుజరాత్లోని భావ్నగర్కు చెందిన మూడు అడుగుల గణేష్ ( 25) తాను పోరాడి సాధించిన MBBS కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ వైద్య అధికారిగా నియమితుడయ్యారు. వికలాంగులకు చట్టపరమైన అడ్డంకులను అధిగమించి సివిల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేస్తున్నారు. అందుకే ఆయన పేరు దేశ మంతా మారిమోగిపోతోంది. గ్రోత్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా పుట్టుకనుంచి గణేష్ ఎదుగుదల సమస్య వచ్చింది. అందుకే ఆయన ఎత్తు మూడు అడుగులకే పరిమితం అయింది. మరుగుజ్జుత్వం కారణంగా 72శాతం లోకోమోటర్ వైకల్యంతో జన్మించిన గణేష్ బరయ్య కేవలం మూడు అడుగుల పొడవు , 20 కిలోల బరువు మాత్రమే. శారీరకంగా ఉన్న సమస్య కారణంగా చిన్నతనంనుంచే ఎన్నో అవమానాలు, అవహేళలను తప్పలేదు. 2018లో నీట్ యుజి పరీక్ష రాసిన సందర్భంగా అతనిలోని వైకల్యం కారణంగా భారత వైద్య మండలి ఆయన్ను తిరస్కరించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MBBS కోర్సుకు అడ్మిషన్ తిరస్కరించడంతో గుజరాత్ హైకోర్టులో కేసు వేశారు. అక్కడా ఫలితం దక్కలేదు. అక్కడితో ఆగిపోలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి 2019లో మీకు సీటు రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వైకల్యం కారణంగా ఎవరూ మిమ్మల్ని ఆపలేరని గణేష్ బరయ్యకు హామీ ఇచ్చింది. చట్టపరమైన ఖర్చులను భరించడంలో సహాయపడిన గణేష్ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దల్పత్భాయ్ కటారియా మద్దతుతో, బరయ్య సంకల్పం ఫలించింది.ఇదీ చదవండి: సమంత-రాజ్ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!రోగులు మొదట్లో చికిత్సను నిరాకరించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అయినా తను అలాంటి వాటి గురించి పట్టించుకోనని, దానికి బదులుగా తనతో సానుకూలంగా ఉన్న చాలా మంది రోగులపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు. వైద్య అధికారిగా తనతదుపరి లక్ష్యం తన కుటుంబంకోసం ఒక మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనేది. భావ్నగర్ జిల్లాలోని గోర్ఖి గ్రామంలోని కచ్చా ఇంట్లోనే నివసిస్తోంది. వారికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇటుక ఇల్లు నిర్మించడం అనేది తన డ్రీమ్ అని చెప్పారు. #WATCH | Bhavnagar, Gujarat: Dr Ganesh Baraiya overcomes legal hurdles being differently abled and works as a medical officer in a civil hospital. He says, "... My primary education was from my village... I took the NEET UG exam in 2018 but at that time, the Medical Council of… pic.twitter.com/K2Ai2VeJ8c— ANI (@ANI) December 2, 2025
ఒంటరిగా ఉంటున్న వదినపై కన్నేసి..!
తమిళనాడు: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని కట్టుకుడలూర్ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్ భార్య తమిళరసి (35). వీరికి ఇద్దరు కుమారులు హరికృష్ణన్ (13), హరిశక్తి (10) ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా గత 10 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళరసి తన ఇద్దరు కుమారులతో కలిసి తన భర్త తమ్ముళ్లయిన బాలకృష్ణన్, మురుగనాథం ఇంట్లో నివసిస్తోంది. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం, బాలకృష్ణన్, మురుగానందం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మురుగానందాన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలకృష్ణన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలకృష్ణన్ తాగి ఇంటికి వచ్చాడు. తర్వాత తమిళరసితో గొడవ పడ్డాడు. తర్వాత తన వద్ద దాచిన కత్తితో తమిళరసి తలను నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న బాలకృష్ణన్ను అరెస్టు చేశారు.
మోదీ.. పాత కేసులతో వేధించే ప్రయత్నం: ఖర్గే ఆగ్రహం
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఖర్గే పలు విమర్శలు చేశారు. ఇది బీజేపీ, మోదీ రాజకీయ ప్రతీకారం అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ఈడీ కలిసి కొత్త ఆరోపణలు లేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాయని అన్నారు.నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘12 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా గాంధీ కుటుంబంపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం, ఈడీ వద్ద కొత్త ఆరోపణలు లేవు. వాస్తవాలు తక్కువగా ఉన్నప్పుడు నాటకీయ అంశాలు రంగంలోకి దిగాయి. రాజకీయ ప్రతీకార చర్య, పాత ఆరోపణలు తీసుకురావడం అన్నీ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నం. ఇది రాజకీయ ప్రతీకార చర్య. దీనిని న్యాయవ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని పోస్టులో పేర్కొన్నారు.కేసు వివరాలు ఇలా.. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1938లో వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్ స్థాపించారు. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వాటిలో రాహుల్కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్(AJL)కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతోపాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేటు కంపెనీ కుట్రకు, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది.
అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!
హీరోయిన్ సమంత రూతు ప్రభు, రాజ్ నిడుమోరు (Samantha and Raj Nidimoru Wedding) తమ పెళ్లివార్తను ప్రకటించి ఎన్నో ఊహాగానాలకు చెక్ పెట్టారు. రాజ్ నిడిమోరుతో తన వివాహ చిత్రాలను అప్లోడ్ చేయడంతో అటు ఫ్యాన్స్, ఇటు నెటిజన్లు సంబరాల్లో మునిగితేలారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో సాంప్రదాయ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వివాహం చేసుకున్నారు. సమంత అందమైన ఎర్రచీర, చోకర్ నెక్లెస్, భారీ చెవిపోగులు సంప్రదాయ నగలతో ఆకట్టు కున్నారు. రాజ్ కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా సమంత ధరించిన మొగల్ శైలి పోట్రెయిట్కట్ డైమండ్ రింగ్ విశేష ప్రాధాన్యంగా నిలిచింది. పోట్రెయిట్ కట్ను బలం, తేజస్సు, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఫ్యాషన్ డిజైనర్, సమంత సన్నిహితురాలు శిల్పా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివాహం నుండి మరిన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలో అరటి ఆకులో వడ్డించిన థాలీ ఏంటి అనేది హాట్ టాపిక్గా నిలిచింది. View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official)అరటి ఆకులో కమ్మటి భోజనంసమంత & రాజ్ వివాహానికి సాత్విక విందు మరో ప్రత్యేక ఆకర్షణ. అరటి ఆకుపై అన్నం, పప్పు,కూరలతో కలర్పుల్గా కనిపించిన సాంప్రదాయ దక్షిణ భారత విందు ఇది. ఇషా ఫౌండేషన్ విలువలు, నమ్మకాలకు ప్రతిబింబిస్తూ సాత్విక నియమాలను ఖచ్చితంగా పాటించారు. తమిళనాడు రుచులు మరియు సంస్కృతికి అనుగుణంగా అన్నం, పప్పు క్యారెట్ , బీన్స్ పల్యా, రాగి బాల్స్, దోసకాయ సలాడ్, ఊదా రంగు స్వీట్ రైస్ ఉన్నాయి. ఇషా యోగా సెంటర్లోని ది పెప్పర్ వైన్ ఈటరీ అనే కేఫ్ అందించిన ఎలాంటి మసాలా దినుసులు లేకుండా ఈ ఫుడ్ను వడ్డించారు.ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?
ఎన్ఆర్ఐ
మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..
ఒక వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అలాంటి క్షణం అత ఈజీగా మర్చిపోలేం కదూ..ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందింటే..శుభం గౌతమ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. "నా అమ్మ రష్యాలో సెలబ్రిటీ" అనే క్యాప్షన్తో షేర్ చేయడంతో మరింత వైరల్గా మారింది. ఆ వీడియోలో అతడు తన తల్లితో రష్యా వీధుల్లోకి రాగానే.. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆ తల్లిని చూసి రష్యన్ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు..ఒక్క సెల్ఫీ అంటూ ఎగబెట్టారు. ఏదో సెలబ్రిటీ మాదిరిగా అంతా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటే..మా అమ్మకు ఒక్కసారిగా ఎంత క్రేజ్ పెరిగిపోయిందో అంటూ మురిసిపోయాడు ఆమె కుమారుడు. విదేశాల్లో మన సంప్రదాయ దుస్తులో గనుక మనం కనిపిస్తే కచ్చితంగా ప్రత్యేకంగా నిలబడటమే గాక, అందరి దృష్టిని ఆకర్షిస్తాం..అందుకు ఈ తల్లే నిదర్శనం. అంతేగాదు ఆమె కొడుకు నా తల్లి రష్యాకు ఇష్టమైన సెలబ్రిటీ అని వీడియోలో చెబుతుండటం స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె కూడా అక్కడి వాళ్ల రియాక్షన్కు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ వారితో సెల్ఫీలు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. భారతదేశం వెలుపల మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు దరిస్తే..అవి మనల్ని ప్రత్యేకంగా నిలబడేల చేయడమే గాక, రియల్ సెలబ్రిటీకి అర్థం చెప్పేలా మనల్ని నిలబెడతాయి కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడమే కాదు..ఆ తల్లి నిజంగా భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రేమగా పిలుస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Shubham Gautam (@samboyvlogs) (చదవండి: సాత్విక ఆహారంతో బరువు తగ్గగలమా..? నటి, గాయని షెహ్నాజ్ సైతం..)
జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు
తెలుగువారు ఏ దేశంలో ఉన్న వారి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పడంలో ఎపుడు ముందుంటారు. అందుకు నిదర్శనం జపాన్లో టోక్యో నగరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (తాజ్) అధ్వర్యంలో జరిగిన కార్తీక మాసం వనభోజనాలు. నవంబర్ 8న ఈ వేడుక స్థానిక కొమట్సుగవ పార్కులో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరు పాల్గొని ఆట పాటలతో సరదాగా గడిపారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్క తినుబండారం తెచ్చి వనభోజన కార్యక్రమం నిర్వహించడం విశేషం. ప్రతి ఏటా ఇలాగే వేడుక జరుపుకోవాలని వారంతా ఆకాంక్షించారు. (చదవండి: ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్)
ఫీనిక్స్లో సాంస్కృతిక వేడుకలు.. శంకర నేత్రాలయ యూఎస్ఏకు భారీ విరాళం
మెసా(అరిజోనా): ఫీనిక్స్లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.దాతలకు సన్మానంగ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.హాస్యంతో హృదయాల హరివిల్లు“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.శంకర నేత్రాలయ సేవా లక్ష్యం1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.నిర్వాహకుల కృషివంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు.
శ్రీ శ్రీ రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి.
క్రైమ్
వీడు మనిషి కాదు.. భార్యను చంపి సెల్ఫీ..
తమిళనాడు: నెల్లై జిల్లాలో మహిళా హాస్టల్లో చొరబడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన వ్యక్తి బాలమురుగన్. అతని భార్య శ్రీప్రియ(32). వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలమురుగన్, శ్రీప్రియల మధ్య కుటుంబ కలహాలున్నాయి. దీంతో శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి టౌన్హాల్ ప్రాంతంలోని ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం చేస్తోంది. రేస్కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఆమె ఉంటోంది. ఆదివారం ఉదయం శ్రీప్రియను కలిసేందుకు బాలమురుగన్ నెల్లై నుంచి వచ్చాడు. భర్త వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీప్రియ బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలమురుగన్, తాను దాచి ఉంచిన కత్తిని తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. కత్తి వేటు మెడపై బలంగా పడడంతో ఆమె అక్కడికక్కడే విలవిల్లాడుతూ మృతి చెందింది. భార్య రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడుతూ మృతి చెందింది. శ్రీప్రియ చనిపోయిందని నిర్ధారించుకున్నాక, మృతదేహం పక్కన ఒక కుర్చీ వేసి అందులో కూర్చుని సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాడు. అందులో ద్రోహానికి జీతం మరణం అని పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలమురుగన్ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో శ్రీప్రియ ఒక యువకుడితో వివాహేతర సంబంధం కలిగి ఉందని, అందుకే హత్య చేశానని బాలమురుగన్ పోలీసులకు తెలిపాడు. శ్రీప్రియను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆదివారం వచ్చానని, సముదాయించినట్లు నటించి ఆమెను హత్య చేశానని తెలిపాడు.
హనుమకొండలో నర్సింగ్ స్టూడెంట్ పై యాసిడ్ దాడి
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో సోమవారం యువతిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. స్థానికులు, మడికొండ పోలీసులు వివరాలు తెలిపారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన సునంద హనుమకొండ పద్మాక్షి కాలనీలోని జయ నర్సింగ్ హోం కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం పరీక్ష ఉండగా హాల్టికెట్ కోసం సోమవారం కళాశాలకు వచ్చింది. చీకటి పడటంతో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చి పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. కడిపికొండ మీదుగా తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలితో కలిసి బయల్దేరింది. కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపానికి చేరుకోగా.. అప్పటికే మాటువేసిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం నడుపుతున్న యువతిపై యాసిడ్ దాడిచేసి పారిపోయారు. కాగా, యువతి ధరించిన హెల్మెట్పై నుంచి యాసిడ్ కాలిపై పడటంతో స్వల్పంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ప్రభావం చూపే యాసిడా లేదా బ్యాటరీలో పోసే కెమికలా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా, పాత కక్షలా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కడిపికొండ గ్రామంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల ఆచూకీ తెలియలేదు. పోలీసులు వివిధ దుకాణాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటే నిందితుల ఆచూకీ లభించేది. హనుమకొండలో 2008, డిసెంబర్ 10న స్వప్నిక, ప్రణీతపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేసిన ఘటనను నేటికీ నగరవాసులు మర్చిపోలేదు. సోమవారం చోటుచేసుకున్న యాసిడ్ దాడితో నగరం ఉలిక్కిపడింది.
పెళ్లికి ఒప్పుకోవడం లేదని..
రంగారెడ్డి జిల్లా: తమ ప్రేమను అంగీకరించని పెద్దలు, పెళ్లికి సైతం నిరాకరిస్తారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన నవనీత్దత్త తన ఇద్దరు కూతుళ్లు అనామిక(21), అనీషదత్తతో కలిసి నాలుగేళ్ల క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు.నవనీత్దత్త ఐఓసీఎల్ ప్లాంట్లో డ్రైవర్గా, ఇద్దరు కూతుళ్లు పట్టణ సమీపంలోని ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కాగా, అనామికకు ఇదే పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్కు చెందిన ధనుంజయ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడు రోజులుగా అనామిక పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నవనీత్ సోమవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి చేరుకోగా, లోపలి నుంచి తలుపులు పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి వెళ్లి చూడగా, అనామిక కింద పడి మృతిచెంది ఉండగా, ధనుంజయ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనామిక పనికి వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్కు ఉరేసుకోవడంతో, ఆమెను కిందికి దింపి, అదే ఫ్యాన్కు తాను ఉరేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతురాలి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు.
బాలికపై మేనమామ అత్యాచారం
ధర్మవరం అర్బన్: ఆ తల్లికి ఇద్దరు మగ పిల్లలు. దర్శనం కోసం బోయకొండ గంగమ్మ ఆలయానికి వెళ్లగా అక్కడ ఓ ఆడశిశువు ఏడుస్తూ కనిపించింది. ఎవరిని అడిగినా వారి బిడ్డ కాదన్నారు. దీంతో ఆమె అమ్మవారే తనకు బిడ్డను ఇచ్చారనుకుని ఇంటికి తెచ్చుకుని పెంచింది. ఇప్పుడా చిన్నారికి 14 ఏళ్లు. అయితే.. పెంచిన తల్లి తమ్ముడే ఆ పసిమొగ్గను తుంచేశాడు. కామంతో కళ్లుమూసుకుపోయి తరచూ బాలికపై అత్యాచారం జరిపాడు. చివరికి బాలిక గర్భం దాలి్చంది. వివాహమై ముగ్గురు పిల్లలున్నా.. ఆరో తరగతి వరకు చదివిన ఆ బాలిక ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. పెంచిన తండ్రి అనంతపురంలో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. పెంపుడు తల్లి రెండో తమ్ముడు సాకే నరసింహ (వరుసకు మేనమామ) ఆ సమీపంలోని కాలనీలోనే నివసిస్తున్నాడు. అతనికి వివాహం కాగా.. ముగ్గురు పిల్లలున్నారు. అక్క కూలి పనులకు వెళ్లిన సమయంలో బాలికను తన ఇంటివద్ద చెత్త ఊడ్చేందుకు, ఇల్లు శుభ్రం చేసేందుకు తీసుకుని వెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక ఎవరికీ చెప్పలేదు.రెండు రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో ఆమె బోరున విలపించింది. బాలికను మందలించి విషయం ఆరా తీయగా.. మేనమామ సాకే నరసింహ దీనికి కారణమని చెప్పింది. దీంతో తల్లి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రితోపాటు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి పంపించి వైద్యం చేయించారు. సాకే నరసింహను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వీడియోలు
Kakani: కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో హత్యలు పెరిగాయి
మీకు తెలియని హిందూ వివాహ రకాలు..
Perni Nani: చంద్రబాబు అనైతిక రాజకీయాల్లో భాగంగానే ఎమ్మెల్సీల రాజీనామాలు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో అగ్నిప్రమాదం
Kamareddy: కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు
తండ్రి కొడుకులకు ఒకటే చెప్తున్నా జేసీకి పెద్దారెడ్డి వార్నింగ్
గుంటూరు KL వర్సిటీలో విషాదం ఉరేసుకొని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఓట్ చోర్ నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
Gadwala: ఉప్మాలో పురుగులు 12 మంది విద్యార్థులకు అస్వస్థత
నేను చచ్చి బతికాను ఏడ్చేసిన సౌదీ మృత్యుంజయుడు

