ఈ రాశివారు ఊహలు నిజం చేసుకుంటారు, ఆస్తిలాభం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: శు.షష్ఠి రా.7.22 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: శ్రవణం రా.10.04 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.2.08 నుండి 3.46 వరకు, దుర్ముహూర్తం: ప.11.23 నుండి 12.08 వరకు, అమృత ఘడియలు: ప.11.07 నుండి 12.46 వరకు, సుబ్రహ్మణ్య షష్ఠి.సూర్యోదయం : 6.14సూర్యాస్తమయం : 5.20రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకుమేషం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఉద్యోగయోగం.వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.కన్య: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.తుల: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.వృశ్చికం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.ధనుస్సు: వ్యయప్రయాసలతో పనులు పూర్తి. బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.మకరం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.కుంభం: దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.మీనం: బాకీలు వసూలవుతాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.
హెచ్1బీ వీసాదార్లను వెళ్లగొట్టబోం
న్యూయార్క్: అమెరికాలో క్షణక్షణ గండంగా గడుపుతున్న భారత హెచ్–1బీ వీసాదారులకు భారీ ఊరట. వారిని అమెరికన్లతో భర్తీ చేసి వారిని భారత్కు తిప్పి పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు వైట్హౌస్ ఫుల్స్టాప్ పెట్టింది. అలాంటి ఆలోచనకు అధ్యక్షుడు అస్సలు మద్దతివ్వడం లేదని స్పష్టం చేసింది. హెచ్–1బీ వీసాలను గురించి ఆయనకున్న అవగాహన అత్యంత పరిమితమని వెల్లడించింది! ఈ విషయమై ట్రంప్కు ఉన్నది కేవలం సాధారణ పరిజ్ఞానంతో కూడిన అవగాహన మాత్రమేనని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు.హెచ్–1బీ వీసాదార్లను అమెరికన్లతో భర్తీ చేస్తారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా ఆమె ఈ మేరకు స్పష్టతనిచ్చారు. దీనిపై ట్రంప్ వైఖరిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అధ్యక్షుని కోరికల్లా ఒక్కటే. విదేశీ కంపెనీలు అమెరికాలో లక్షలాది కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాలి. విదేశీ వృత్తి నిపుణులతో తమతో పాటు వెంటబెట్టుకు రావాలి. కొత్త తరం వాణిజ్య పోరులో ఏ దేశాన్నైనా ముందు వరుసలో నిలిపే బ్యాటరీల వంటి కీలక ఉత్పత్తుల్లో అమెరికాను అగ్రగామిగా నిలపాలి.అయితే, అంతిమంగా ఆయా ఉద్యోగాల్లో అమెరికన్లే ఉండేలా చూడాలన్నది ట్రంప్ లక్ష్యమని కూడా లెవిట్ చెప్పుకొచ్చారు! ‘మా దేశంలో వ్యాపారం చేయాలంటే మా దేశస్తులనే ఉద్యోగాల్లోకి తీసుకోవడం మంచిది’అని ఆయా కంపెనీలకు ట్రంప్ స్పష్టంగా చెప్పారన్నారు. ‘‘ప్రస్తుత గందరగోళం అంతటికీ ఆ స్టేట్మెంటే కారణం. కానీ అధ్యక్షుని ఉద్దేశం అంతా అనుకుంటున్నది మాత్రం కాదు’’అంటూ ముక్తాయించారు. అమెరికా ఉత్పత్తి రంగం మున్నెన్నడూ లేనంతగా కోలుకుని దూసుకుపోవాలన్నదే ట్రంప్ కల అన్నారు. నిజానికి ఆయా దేశాలపై టారిఫ్ల విధింపు వెనక అధ్యక్షుని ఏకైక ఉద్దేశం కూడా ఇదేనని చెప్పారు. విదేశీ కంపెనీలు తమతో పాటు సొంత వృత్తి నిపుణులను వేలాదిగా అమెరికాకు తీసుకు రావాలని, వారంతా కీలక వృత్తి నైపుణ్యాలను అమెరికన్లకు నేర్పి స్వదేశాలకు వెళ్లిపోవాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే.
శవపేటికలో శబ్దాలు.. అసలేం జరిగిందంటే..
బ్యాంకాక్: అది బ్యాంకాక్ శివార్లలో నిశ్శబ్దం తాండవించే వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయం. అంత్యక్రియల కోసం వచ్చేవారితో రద్దీగా ఉండే ప్రదేశం. ఆ రోజు, ఆలయ జనరల్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే ఫిత్సనులోక్ ప్రావిన్స్ నుండి 500 కిలోమీటర్లు ప్రయాణించి ఒక వ్యక్తి 65 ఏళ్ల తన సోదరి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకొచ్చాడు.ఇంతలో శవపేటికలో శబ్దాలు వినిపించడంతో.. ఆలయ సిబ్బంది నిశ్చేషు్టలయ్యారు. లోపల కదులుతున్న వృద్ధురాలిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. బ్యాంకాక్ శివార్లలోని నాన్థాబురి ప్రావిన్స్లోని వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. అసలేం జరిగిందంటే.. ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్ మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం ఒక వృద్ధురాలు ఊపిరి ఆగిపోయి, చనిపోయినట్లు కనిపించడంతో ఆమె సోదరుడు శవపేటికలో భద్రపరిచి తీసుకొచ్చాడు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతుండగా, శవపేటిక నుండి సన్నని శబ్దం వినిపించింది. నాకు కాస్త ఆశ్చర్యం వేసింది, అందుకే శవపేటిక తెరవమని కోరాను. ఆమె మెల్లగా కళ్లు తెరుస్తూ, శవపేటిక పక్కకు తడుతూ కనిపించింది. ఆమె చాలా సేపటి నుండి తడుతూ ఉందేమో’.. అని ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.మరణ ధ్రువపత్రం లేక.. వాస్తవానికి, ఆ మహిళ గతంలోనే తన అవయవదానానికి సమ్మతించడంతో.. ఆమె సోదరుడు మొదట బ్యాంకాక్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ, అధికారిక మరణ ధ్రువపత్రం లేకపోవడంతో ఆసుపత్రి తిరస్కరించింది. అనంతరం వాట్ రాట్ ప్రకోంగ్ థామ్ బౌద్ధ ఆలయంలో ఉచిత దహన సంస్కారాలు చేస్తారని తెలిసి ఆదివారం శవపేటికను తీసుకురాగా, అక్కడ కూడా అదే ధ్రువపత్రం అడిగారు. ఆలయ జనరల్, ఫైనాన్షియల్ అఫైర్స్ మేనేజర్ పైరాట్ సూద్ధూప్.. ఆ పత్రం గురించి వృద్ధురాలి సోదరునికి వివరిస్తున్నప్పుడే.. శవపేటికలో శబ్దం వినిపించింది.వెంటనే ఆలయ సిబ్బంది ఆమెను పరీక్షించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఖర్చులను తామే భరిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రకటించారు. చనిపోయిందనుకున్న మహిళ తిరిగి ప్రాణాలతో రావడం, ఆలయ సిబ్బందికి, ఆమె సోదరుడికి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చింది.
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి,అమరావతి: అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
కొత్తగా మరో మూడు జిల్లాలు
హెచ్1బీ వీసాదార్లను వెళ్లగొట్టబోం
వాయుగుండంగా మారిన అల్పపీడనం
శవపేటికలో శబ్దాలు.. అసలేం జరిగిందంటే..
శతాబ్దాల నాటి గాయాలు మానాయి
రోడ్డు లేక.. ఫోన్ సిగ్నల్ రాక..
రాష్ట్రంలో తొలి బ్యాటరీ సోలార్ ఎనర్జీ స్టోరేజ్
స్క్రీన్పై 'బ్యాన్'
‘ఈ–చలాన్’ చట్టబద్ధతపై స్పష్టత ఇవ్వండి
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల ఘనత వైఎస్దే
చలిలో వెచ్చని టీ తాగుతున్న స్టార్ హీరోలు (ఫోటోలు)
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’!
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
రైతన్న కోసం ఎంతో చేశానని అలా శూన్యంలోకి చూపిస్తున్నాడేంటీ!!
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
డోంట్ వర్రీ సార్! అవి మీ దగ్గరకు రావడానికి భయపడతాయ్లేండి!!
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన
బెస్ట్ హారర్ సినిమా.. ఎట్టకేలకు తెలుగులో స్ట్రీమింగ్
...మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేదు!!
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
శాంతంగా ఉన్న సింహాన్ని గెలికితే ఏమవుతుందో చూడండి
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు
మంటకలిసిపోతున్న బంధుత్వాలు
ఇమ్మడి రవి ఒక్కడే ఐబొమ్మతో..
గోల్డెన్ న్యూస్: పసిడి ప్రియులకు ఆనందమే..
బాబర్ మెరుపులు.. ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్తాన్
దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్
కొత్తగా మరో మూడు జిల్లాలు
హెచ్1బీ వీసాదార్లను వెళ్లగొట్టబోం
వాయుగుండంగా మారిన అల్పపీడనం
శవపేటికలో శబ్దాలు.. అసలేం జరిగిందంటే..
శతాబ్దాల నాటి గాయాలు మానాయి
రోడ్డు లేక.. ఫోన్ సిగ్నల్ రాక..
రాష్ట్రంలో తొలి బ్యాటరీ సోలార్ ఎనర్జీ స్టోరేజ్
స్క్రీన్పై 'బ్యాన్'
‘ఈ–చలాన్’ చట్టబద్ధతపై స్పష్టత ఇవ్వండి
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల ఘనత వైఎస్దే
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’!
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
రైతన్న కోసం ఎంతో చేశానని అలా శూన్యంలోకి చూపిస్తున్నాడేంటీ!!
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
డోంట్ వర్రీ సార్! అవి మీ దగ్గరకు రావడానికి భయపడతాయ్లేండి!!
జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన
బెస్ట్ హారర్ సినిమా.. ఎట్టకేలకు తెలుగులో స్ట్రీమింగ్
...మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేదు!!
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు
మంటకలిసిపోతున్న బంధుత్వాలు
ఇమ్మడి రవి ఒక్కడే ఐబొమ్మతో..
గోల్డెన్ న్యూస్: పసిడి ప్రియులకు ఆనందమే..
బాబర్ మెరుపులు.. ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్తాన్
AP: 30 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు
దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్
ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది
ఫొటోలు
మరింత గ్లామరస్గా అనసూయ లేటేస్ట్ లుక్ (ఫొటోలు)
ఇది జగనన్న అంటే..(చిత్రాలు)
ఆత్మీయుడి కొడుకు పెళ్లి వేడుకలో మెరిసిన అంబానీ కుటుంబం (ఫొటోలు)
పులివెందులలో జనసందోహం నడుమ వైఎస్ జగన్ (చిత్రాలు)
23 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట (ఫొటోలు)
వెరైటీ డ్రస్తో కీర్తి సురేశ్ వెరైటీ పోజులు (ఫొటోలు)
ఈషా రెబ్బా..ఇంతందం ఎలాగబ్బా.. (ఫొటోలు)
ధ్వజారోహణం..దివ్య కాంతులతో వెలిగిపోతున్న అయోధ్య (ఫొటోలు)
రైతును గాలికొదిలి.. చంద్రబాబు దొంగజపం!
బండరాయిపై యాంకర్ రష్మీ మార్నింగ్ వైబ్స్.. ఫోటోలు
సినిమా
ప్రభాస్ స్పిరిట్.. సందీప్ రెడ్డి మరో బిగ్ ప్లాన్.!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)- యానిమల్ డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఇటీవలే ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ అఫీషియల్గా లాంఛ్ అయింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు ఎదురు చూసినా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ప్రకటించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత షూట్ స్టార్ట్ చేయడం విశేషం. ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెగ టాక్ వినిపించింది. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్పై మరో టాక్ నడుస్తోంది.ఈ చిత్రంలో యానిమల్ హీరో రణ్బీర్ కపూర్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రణ్బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రభాస్ స్పిరిట్లో ఏ రోల్ చేయడానికైనా సిద్ధమేనని అన్నారు. దీంతో స్పిరిట్లో యానిమల్ హీరో కనిపించడం ఖాయమని సినీ ప్రియులు ఫిక్సయ్యారు. దీనిపై ఇంకా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.అయితే రణ్బీర్ కపూర్ స్పిరిట్లో కనిపిస్తే నార్త్లోనూ బిగ్ హైప్ తీసుకొచ్చేలా సందీప్ రెడ్డి ప్లాన్ చేశారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఉన్నప్పటికీ.. యానిమల్ హీరో ఎంట్రీతో వేరే లెవెల్లో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది.
శ్రీలీల- శివకార్తికేయన్ పరాశక్తి.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ భారీఎత్తున నిర్మించారు. పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దివంగత నటుడు శివాజీగణేశన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం పేరు పరాశక్తి. అదే పేరుతో మళ్లీ ఇన్నాళ్లకు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రత్నమాల అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆంధ్ర కింగ్ తాలూకా.. రన్ టైమ్ ఎంతంటే.!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 40 నిమిషాలుగా(యాడ్స్, టైటిల్స్తో సహా) ఉండనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హీరో అభిమాని పాత్రలో రామ్ కనిపించనున్నారు. రామ్ పోతినేని ఎనర్జిటిక్ ఫర్మామెన్స్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఎమోషనల్గా అభిమానులను అలరించనున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో ఎమోషనల్ ఫర్మామెన్స్తో ఆకట్టుకోనున్నారు. ఈ మూవీలో రామ్ పాత్ర సినీ ప్రియులను కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తోంది. It is a U/A for #AndhraKingTaluka ❤🔥A film for all, a film relatable to all 💥GRAND RELEASE WORLDWIDE ON NOVEMBER 27th.BOOKINGS NOW OPEN!🎟️ https://t.co/LKMkGbt7jv#AKTonNOV27 Energetic star @ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/PlAdBO6p3w— Mythri Movie Makers (@MythriOfficial) November 25, 2025
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర రెస్టారెంట్ ప్రత్యేకతలు తెలుసా..?
బాలీవుడ్ లెజెండ్, 'హీ-మ్యాన్' ధర్మేంద్రకు కేవలం నటనపైనే కాదు, ఆహారం, ఆతిథ్యంపై కూడా మక్కువ ఎక్కువ. ఆయన సినీ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, పంజాబీ కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రారంభించిన రెస్టారెంట్ ప్రాజెక్టే ఈ 'గరం ధరం - ధాబా తే ఠేకా'.రెస్టారెంట్ ప్రత్యేకతలు ఇవే.. 'గరం ధరం ధాబా' కేవలం భోజనశాల కాదు, ధర్మేంద్ర అభిమానులకు ఒక ఆలయం లాంటిది. ధర్మేంద్ర వ్యక్తిత్వం, ఆయన నటించిన సినిమా లలోని ముఖ్య ఘట్టాలు, డైలాగ్లు ఈ ధాబాలోని ప్రతి గోడపై కనిపిస్తాయి.సందర్శకులను ఆకర్షించే థీమ్..ఈ రెస్టారెంట్ మొత్తం బాలీవుడ్ థీమ్తో అలంకరించి ఉంటుంది. ధర్మేంద్ర క్లాసిక్ చిత్రాల పోస్టర్లు, అద్భుతమైన డైలాగ్స్ గోడలపై కనిపిస్తాయి.ఐకానిక్ ఆర్ట్ వర్క్స్.. ధర్మేంద్ర వివిధ రూపాల పోర్ట్రెయిట్లు, గ్రాఫిటీ ఆర్ట్ ఈ స్థలాన్ని నింపుతాయి. 'షోలే' సినిమాలోని ప్రసిద్ధ 'ట్యాంకీ' సీన్, జై-వీరు ప్రయాణించిన ఐకానిక్ కారు మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.'దేశీ' ఇంటీరియర్ తో..ఇటుక గోడలు, రంగుల దీపాలు, పాతకాలపు హెడ్లైట్స్, చేతిపంపులు వంటివి ధాబాకు దేశీ రూపాన్ని ఇస్తాయి. హర్యానాలోని ముర్తల్లో ప్రారంభించిన మొట్టమొదటి అవుట్లెట్ 1,200 మంది కూర్చునే సామర్థ్యంతో, 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతిపెద్ద ధాబాగా ప్రసిద్ధి చెందింది.రుచికరమైన ఆహారం, దేశీ ఫ్లేవర్స్.. ఈ ధాబాలో నార్త్ ఇండియన్, పంజాబీ వంటకాలకు పెద్ద పీట వేస్తారు. రుచిలో రాజీ పడకుండా, ఇంటి భోజనాన్ని తలపించేలా ఇక్కడ వడ్డిస్తారు.మఖానీ పరాఠాలు, దాల్ మఖానీ, గలోటి కబాబ్లు, తందూరి పనీర్ టిక్కా, బిర్యానీ, వివిధ రకాల రుచికరమైన కూరలు ఇక్కడ లభిస్తాయి.ప్రత్యేక మెనూ ఏమిటంటే..?మెనూలో కొన్ని వంటకాలకు ఆయన సినిమాల పేర్లు పెట్టి, 'ధరం జీ స్పెషల్' అనే ప్రత్యేక పేజీని కూడా ఉంచారు. క్విర్కీ డ్రింక్స్ 'వీరూ కీ ఘుట్టీ', 'ప్యారే మోహన్ మసాలా నింబు' వంటి మోక్టైల్స్ ను బంటా అంటే దేశీ స్టైల్ సీసాలలో అందిస్తారు. ధాబా ఆవిర్భావం..ధర్మేంద్ర రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు చాలా రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత ఉమాంగ్ తివారీ, మిక్కీ మెహతా లతో కలిసి భాగస్వామ్యంలో మొదటి రెస్టారెంట్ ను ప్రారంభించారు.మొదటి ఔట్లెట్ ప్రారంభమైందిలా..ఫిబ్రవరి 23, 2018 న హర్యానాలోని ప్రసిద్ధ ఫుడ్ స్టాప్ ముర్తల్లో ఈ 'గరం ధరం ధాబా' తన మొదటి బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. ముర్తల్ బ్రాంచ్ విజయవంతం అయిన తర్వాత, దీని శాఖలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఘజియాబాద్ అర్థాలా, మోహన్ నగర్), నోయిడా, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వంటి అనేక ప్రదేశాలలో విస్తరించాయి.'హీ-మ్యాన్' రెస్టారెంట్.. 'గరం ధరం' విజయం తర్వాత, ధర్మేంద్ర కర్నాల్లో 'ఫామ్-టు-ఫోర్క్' కాన్సెప్ట్తో 'హీ-మ్యాన్' అనే తన రెండవ రెస్టారెంట్ను కూడా ప్రారంభించారు. ఈ 'గరం ధరం ధాబా' ధర్మేంద్ర అభిమానులకు ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన దేశీ జీవనశైలి గురించి గుర్తుచేసే ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.- సాక్షి స్పెషల్
క్రీడలు
మాంసం కొట్టులో పని.. ఆసీస్ గడ్డపై ‘భారత’ క్రికెటర్ సరికొత్త చరిత్ర
ఆస్ట్రేలియా గడ్డపై ఓ ‘భారత’ క్రికెటర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆసీస్ ఫస్ట్క్లాస్ హిస్టరీలో శతకం బాదిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. అతడే నిఖిల్ చౌదరి. గిల్ సహచర క్రికెటర్ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి.. దేశీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill).. భారత స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)లతో కలిసి లిస్ట్-ఎ క్రికెట్ ఆడాడు. అయితే, భారత్లో అతడికి ఆశించిన మేర అవకాశాలు రాలేదు.ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన నిఖిల్ చౌదరి.. కోవిడ్-19 (Covid 19)లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా అతడు భారత్కు తిరిగి రావాలని అనుకోలేదు. ఆస్ట్రేలియాలోనే ఉంటూ శాశ్వత నివాసిగా మారిపోయాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ కావాలన్న అతడి కల మాత్రం అలాగే ఉండిపోయింది.మాంసం కొట్టులో పనిఎలాగైనా తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పంతో నిఖిల్ చౌదరి.. శిక్షణ కోసం డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాడు. మాంసం కొట్టులో పని చేయడంతో పాటు.. పార్శిళ్లు అందించే డెలివరీ బాయ్గా.. ఉబర్ క్యాబ్ డ్రైవర్గా.. ఇలా ఎన్నో పనులు చేశాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడు.కొన్నాళ్ల తర్వాత నిఖిల్ చౌదరి శ్రమకు ఫలితం దక్కింది. ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్లో ఆడే అవకాశం అతడికి వచ్చింది. హోబర్ట్ హ్యారికేన్స్కు ప్రాతినిథ్యం వహించే సమయంలో నిఖిల్ చౌదరి.. పాకిస్తాన్ ఓవరాక్షన్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో సిక్సర్ బాది.. దానిని తొడగొడుతూ మరీ సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్గా నిలిచింది.సరికొత్త చరిత్రఈ క్రమంలోనే ఆసీస్ దేశీ క్రికెట్ జట్ల యాజమాన్యాలను ఆకర్షించిన నిఖిల్ చౌదరికి ఊహించని విధంగా ఓ అవకాశం వచ్చింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు జాతీయ జట్టులోకి వెళ్లగా.. టాస్మేనియా జట్టు నుంచి నిఖిల్కు పిలుపు వచ్చింది. ఆ తర్వాత అతడు జట్టులో భాగమైపోయాడు.ఆసీస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్లో టాస్మేనియాకు ఆడుతున్న నిఖిల్ ఇటీవలే సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూ సౌత్ వేల్స్తో మ్యాచ్లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. శతక్కొట్టాడు. 184 బంతుల్లోనే 163 పరుగులు రాబట్టాడు. తద్వారా ఆసీస్ దేశీ రెడ్బాల్ టోర్నీలో సెంచరీ చేసిన భారత మూలాలున్న తొలి క్రికెటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్మేనియా న్యూ సౌత్ వేల్స్పై ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో గెలవడం విశేషం.ఫాస్ట్ బౌలర్గా మొదలుపెట్టి..ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి పంజాబ్లో పెరిగాడు. పంజాబ్ తరఫున అన్ని ఏజ్ గ్రూపులలోనూ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్తో సమయం గడిపే అవకాశం అతడికి వచ్చింది. నిజానికి నిఖిల్ తొలుత ఫాస్ట్ బౌలర్ కావాలని భావించాడు.అయితే, కాలక్రమేణా తన నైపుణ్యాలకు మెరుగు దిద్దుకుని లెగ్ స్పిన్నర్గా ఎదిగాడు. ఐపీఎల్ ట్రయల్స్లో ముంబై ఇండియన్స్ సెలక్షన్కు వెళ్లినప్పటికీ నిఖిల్కు నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన 29 ఏళ్ల నిఖిల్.. అక్కడి స్థానిక క్లబ్లలో ఆడుతూ టాస్మేనియా జట్టులో కుదురుకున్నాడు.చదవండి: స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఏం జరిగింది?
రోడ్డు మీద కూడా ఆడలేరా?.. ఈ టెస్టు కూడా పోయినట్లేనా?
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రొటిస్ జట్టు విధించిన 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే తడ‘బ్యాటు’కు లోనైంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కేవలం 27 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.రోడ్డు మీద కూడా ఆడలేరా?ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై ముఖ్యంగా బ్యాటర్లపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం మండిపడుతున్నారు. ‘‘రోడ్డు లాంటి పిచ్ మీద సఫారీలు రయ్ రయ్మని దూసుకుపోతుంటే.. మీరు మాత్రం ఇంత చెత్తగా ఆడతారా?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘మరో వైట్వాష్ పరాభవానికి ముందుగానే సిద్ధమైపోయారు.. భేష్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.చేదు అనుభవం తప్పదా?స్వదేశంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైంది టీమిండియా. సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇలా దారుణ ఓటమి చవిచూడటం టీమిండియా చరిత్రలోనే తొలిసారి. తాజాగా మరోసారి అదే చేదు అనుభవం ముంగిట నిలిచింది భారత జట్టు.సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో తొలిసారి జరుగుతున్న టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్లు ఆరంభంలో కాస్త పొదుపుగా బౌలింగ్ చేసినా.. ఆ తర్వాత ప్రొటిస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్ (93) ఇన్నింగ్స్ బాదడం టీమిండియా చెత్త బౌలింగ్కు నిదర్శనం. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఏకంగా 489 పరుగులు చేసింది.యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగిసఫారీ బ్యాటర్లు అదరగొట్టిన ఈ పిచ్పై భారత బ్యాటర్లు మాత్రం అట్టర్ఫ్లాప్ అయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58)తో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (48) ఫర్వాలేదనిపించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఫలితంగా 201 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్లో కుప్పకూలగా.. ప్రొటిస్ 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అనంతరం టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.మరోసారి మనోళ్లు ఫెయిల్రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (35), ఐడెన్ మార్క్రమ్ (29) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ భారీ హాఫ్ సెంచరీ (94) సాధించాడు. కెప్టెన్ తెంబా బవుమా (3) విఫలం కాగా.. టోనీ డి జోర్జి (49), వియాన్ ముల్దర్ (35 నాటౌట్) రాణించారు. ఇక భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (288) కలుపుకొని సౌతాఫ్రికా టీమిండియాకు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. అయితే, కొండంత టార్గెట్ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేసి.. యాన్సెన్ బౌలింగ్లో వెనుదిరగగా.. కేఎల్ రాహుల్ 6 పరుగులు చేసి సైమన్ హార్మర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.గువాహటిలో నాలుగో రోజు ఆట ముగిసేసరికి సాయి సుదర్శన్ 2, కుల్దీప్ యాదవ్ 4 పరుగులతో క్రీజులో నిలిచారు. టీమిండియా విజయానికి ఇంకా ఏకంగా 522 పరుగుల దూరంలో ఉండగా.. సౌతాఫ్రికాకు ఎనిమిది వికెట్లు చాలు!!.. ఆఖరిదైన ఐదో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఈ మ్యాచ్లో ఓడిపోవడాన్ని ఎవరూ ఆపలేరు!!చదవండి: పీవీ సింధు ఫిట్నెస్పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు
స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి...
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ (Palash Mucchal)పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అతడు స్మృతిని మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు వచ్చాయి. పెళ్లికి ముందు రాత్రే స్మృతికి ఈ విషయం తెలిసిందని.. వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయడానికి ఇదే కారణమనే వదంతులు వ్యాపిస్తున్నాయి.ఇండోర్ కోడలు కాబోతోంది అంటూకాగా మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన.. ఇండోర్ మూలాలున్న పలాష్ ముచ్చల్తో 2019 నుంచి డేటింగ్లో ఉంది. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. స్మృతి భారత క్రికెట్ జట్టు ఓపెనర్, వైస్ కెప్టెన్గా రాణిస్తుండగా.. పలాష్ బాలీవుడ్లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇదిలా ఉంటే.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత స్మృతి పెళ్లి వార్త తెరమీదకు వచ్చింది. పలాష్ సైతం.. ‘త్వరలోనే స్మృతి ఇండోర్ కోడలు కాబోతోంది’ అంటూ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. తనకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని స్మృతి ధ్రువీకరించింది.తండ్రికి గుండెపోటు!ఆ తర్వాత పలాష్.. స్మృతి వరల్డ్కప్ గెలిచిన డీవై పాటిల్ స్టేడియంలోనే ఆమెకు ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు. అనంతరం హల్దీ, సంగీత్ వేడుకల్లో జంటగా సందడి చేశారు. నవంబరు 23న వివాహానికి కొన్ని గంటల ముందు వీరి పెళ్లి వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది.తండ్రికి గుండెపోటు వచ్చిన కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి చెప్పినట్లు ఆమె మేనేజర్ వెల్లడించాడు. ఆ తర్వాత అనూహ్యంగా పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సంచలన విషయాలు తెరమీదకు తెచ్చారు.‘బంధం’ పాతబడిందని..కొరిగ్రాఫర్ అని చెప్పుకొనే మేరీ డికోస్టా పేరుతో.. పలాష్ తనతో చాట్ చేసినట్లుగా స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. ఇందులో పలాష్.. స్మృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనతో ‘బంధం’ పాతబడిందని.. మేరీని తనతో డేటింగ్కు రావాల్సిందిగా, ఎంజాయ్ చేద్దామంటూ ‘పర్సనల్’ చాట్ చేసినట్లు వైరల్ అవుతోంది.నిజమేనా?ఈ విషయాన్ని గుర్తించిన స్మృతి తండ్రి.. పలాష్ను నిలదీయడంతో గొడవకు దారి తీసిందని.. అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చిందని గాసిప్రాయుళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసినప్పటికీ.. పలాష్తో గతంలో దిగిన ఫొటోలన్నీ స్మృతి అలాగే ఉంచింది. ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్ బంధం గిట్టని వాళ్లే ఇలా చేస్తున్నారని.. స్మృతి తండ్రి కోలుకోగానే.. వీరి పెళ్లి జరుగుతుందంటూ అభిమానులు అండగా నిలుస్తున్నారు.అయితే, నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్నా ఇరు కుటుంబాల నుంచి నేరుగా ఎటువంటి స్పందనా రాలేదు. పలాష్ అక్క, బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ మాత్రం.. ‘‘స్మృతి తండ్రి అనారోగ్యం వల్లే పెళ్లిని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకండి’’ అని ఇన్స్టా వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
గువాహటి వేదికగా భారత్తో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) సమిష్టిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన సఫారీలు.. ఆతిథ్య జట్టును కేవలం 201 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు.తొలి ఇన్నింగ్స్లో..ఫలితంగా టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్ను ఫాలో ఆన్ ఆడించకుండా సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓవర్నైట్ స్కోరుకు మంగళవారం మరో 234 పరుగులు జత చేసింది.టార్గెట్ ఎంతంటే?తద్వారా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది సౌతాఫ్రికా. వన్డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్కు తోడు.. టోనీ డి జోర్జి 49 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వియాన్ ముల్డర్ 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా (288+260) టీమిండియాకు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. కాగా ఆసియాలో ఇంత వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 400కు పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి.మరి టెస్టుల్లో భారత్ అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? (టాప్-5 జాబితా)🏏1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో టార్గెట్ 403.. భారత్ విజయం (406/4)🏏2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో టార్గెట్ 387.. భారత్ విజయం (387/4)🏏2021లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టార్గెట్ 328.. భారత్ విజయం (329/7)🏏2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో టార్గెట్ 276.. భారత్ విజయం (276/5)🏏2001లో కాండీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్లో టార్గెట్ 264.. భారత్ విజయం (264/5).చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో ఐటీ ముసుగులో రియల్ దందా...
ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచిందెక్కడ?... ఏపీ సీఎం చంద్రబాబుపై ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు విడుదల, జీవో జారీ చేసిన ప్రభుత్వం
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?... సీఎం చంద్రబాబు
ఉప్పొంగిన అభిమానం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం
మనమంతా సాయి మార్గంలో నడుద్దాం... శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలోగా నిర్ణయం తీసుకోండి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిజినెస్
క్రాష్ తర్వాత ఎయిరిండియా కొత్త ఆశలు
వచ్చే ఏడాది (2026) ఆఖరు నాటికి కొత్తగా 26 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ (Air India CEO Campbell Wilson) వెల్లడించారు. అలాగే అప్గ్రేడ్ చేసిన విమానాలతో 81 శాతం ఇంటర్నేషనల్ సర్వీసులను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అయితే, మొత్తం మీద విమాన ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వివరించారు.‘ఏఐ 171 క్రాష్ కావచ్చు లేదా ఇతరత్రా పరిస్థితులు కావచ్చు గత కొద్ది నెలలుగా ఎదురైన ప్రతికూలతలు ఎలా ఉన్నా, 2026లో ఎయిరిండియాలో సుస్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మేము పెట్టుబడుల ప్రణాళికలను కొనసాగిస్తున్నాం‘ అని విల్సన్ చెప్పారు. ‘కొత్త విమానాలు వస్తున్నా, కొన్ని విమానాలను లీజుదార్లకు తిరిగి ఇచ్చేయనుండటం, చాలా మటుకు విమానాలకు రెట్రోఫిట్ చేస్తుండటం వల్ల వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్యాపరంగా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు.ఎయిరిండియా గ్రూప్లో ప్రస్తుతం 300 విమానాలు (ఎయిరిండియాకి 187, ఎయిరిండియా ఎక్స్ప్రెస్కి 110 విమానాలు) ఉన్నాయి. ఎయిరిండియా వద్ద సుదీర్ఘ దూరాలకు ప్రయాణించగలిగే బోయింగ్ 777 విమానాలు 22, అలాగే బోయింగ్ 787 రకం విమానాలు 32 ఉన్నాయి. వచ్చే ఏడాది ఎయిరిండియాకు 20 చిన్న విమానాలు, 6 పెద్ద ఎయిర్క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తాయని విల్సన్ చెప్పారు. 2026 ఆఖరు నాటికి బోయింగ్ 787 విమానాల్లో మూడింట రెండొంతుల ఎయిర్క్రాఫ్ట్లు అప్గ్రేడ్ అవుతాయని వివరించారు.
టాటా సియెర్రా వచ్చేసింది.. ఇదిగో ఇదే ధర..
ఆటోమొబైల్ ఔత్సాహికులు ఎంతో గానో ఎదురుచూస్తున్న కొత్త తరం టాటా సియెర్రా మార్కెట్లోకి వచ్చేసింది. రూ. 11.49 లక్షలు (పరిచయ ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద భారతదేశంలో సియెర్రా ఎస్యూవీని టాటా విడుదల చేసింది.టాటా సియెర్రా ప్రధానంగా నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి వాహనాలను టాటా సంస్థ డెలివరీ చేయనుంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుఈ కొత్త తరం టాటా సియెర్రాలో సరికొత్త 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 158 బీహెచ్పీ శక్తి, 255 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ ఏటీ గేర్బాక్సతో మాత్రమే వస్తుంది. ఇక సియెర్రా 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 105 బీహెచ్పీ శక్తి, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీటీసీతో పొందే అవకాశం ఉంది.అలాగే డీజిల్ 1.5-లీటర్ ఫోర్-పాట్ ఇంజన్ 116 బీహెచ్పీ శక్తి, 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీసీటీతో లభిస్తుంది. టాటా సియెర్రా ఏడబ్ల్యూడీతో వస్తోంది. అంటే ఇంజిన్ శక్తి నాలుగే చక్రాలకు ప్రసరిస్తుంది. తద్వారా అన్ని రకాల ఉపరితలాలపై వాహన వేగం, స్థిరత్వం, నియంత్రణ మెరుగ్గా ఉంటాయి. ఇలాంటి సాంకేతికతను పొందిన మొదటి టాటా మోడల్ ఇదే అవుతుంది.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది.టాటా సియెర్రా డిజైన్కు సంబంధించిన ముఖ్యాంశాలలో బాక్సీ సిల్హౌట్, ఆల్పైన్ గ్లాస్ రూఫ్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫుల్-ఎల్ఈడి లైట్ ప్యాకేజీ, రియర్ స్పాయిలర్, సిగ్నేచర్ టాటా గ్రిల్ కొత్త వెర్షన్ ఉన్నాయి.
ఏఐ హైప్ కాదు.. ఎంతో సమయం ఆదా!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అంటే ఏదో హైప్ కాదని, దీని వల్ల ఎంతో సమయం అవుతోందని లాజిస్టిక్స్ టెక్ సంస్థ షిప్రాకెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాహిల్ గోయల్ తెలిపారు. దాన్ని చెడుగా భావించకుండా, సద్వినియోగం చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.ప్రతి పరిశ్రమలో కీలక మార్పులు తెచ్చే సత్తా ఏఐకి ఉందనే విషయం గుర్తెరగాలని ఆయన చెప్పారు. ఏఐ కంపెనీల వేల్యుయేషన్లపై విమర్శలు, ఇది ఎప్పుడైనా పేలిపోయే బుడగలాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఏఐ వేల్యుయేషన్స్ అనేవి మార్కెట్కి సంబంధించినవని, దీన్ని విస్తృత ఉపయోగాల గురించి వేరుగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీర్ఘకాలంలో ఏఐ సాధనాలు మనకు అనుకూలంగా పని చేస్తాయన్నారు. కృత్రిమ మేథతో రోబోటిక్స్లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని గోయల్ తెలిపారు. దీని గురించి ప్రజలు తెలుసుకుని, నేర్చుకుని, ఉపయోగించడం మొదలుపెట్టాలని గోయల్ పేర్కొన్నారు.
బంగారం... ఎందుకీ హెచ్చుతగ్గులు?
బంగారం ధరలు కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని సార్లు అమాంతం తగ్గిపోతుంటాయి. ఇలా పెరుగుతూ.. తగ్గుతూ తులం గోల్డ్ రేటు రూ. 1.20 లక్షలు దాటేసింది. ఇంతకీ గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏమిటి?, ధరలు తగ్గడానికి దోహదపడే అంశాలు ఏమిటనేది.. ఇక్కడ తెలుసుకుందాం.గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణాలుద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగితే.. కరెన్సీ విలువ తగ్గుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో పసిడి ధర అమాంతం పెరుగుతుంది.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు & ఆర్థిక అస్థిరత: ప్రపంచ యుద్దాలు, రాజకీయ పరిణామాలు, ఆర్ధిక సంక్షోభాలు పెరిగినప్పుడు.. సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది కూడా బంగారం ధర పెంచడానికి కారణమవుతుంది.రూపాయి / డాలర్ విలువ: రూపాయి విలువ లేదా డాలర్ విలువ తగ్గినప్పుడు కూడా ప్రజలు బంగారంపైన పెట్టుబడి పెడతారు. ఈ సమయంలో ఆయాదేశాలు దిగుమతి చేసుకునే బంగారం విలువ పెరుగుతుంది. దీంతో కొనుగోలుదారులు కూడా బంగారం కొనుగోలు చేయడానికి కొంత ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.పండుగ సీజన్స్: ముఖ్యంగా భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం పండుగ సీజన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే దీపావళి, ధనత్రయోదశి వంటి పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని భావించే చాలామంది ఫాల్స్ కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతుంది.సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు: ప్రపంచ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచితే మార్కెట్లో.. గోల్డుకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే.. ధరలు తప్పకుండా పెరుగుతాయి.బంగారం ధరలు తగ్గడానికి కారణాలుఆర్థిక పరిస్థితులు: ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడినప్పుడు పెట్టుబడిదారులు బంగారానికి ప్రత్యామ్నాయంగా.. స్టాక్ మార్కెట్, బాండ్స్ వంటి అధిక రిటర్న్స్ ఇచ్చే వాటిమీద పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య తగ్గుతుంది. దీంతో ధరలు కూడా తగ్గుతాయి.డాలర్ విలువ: డాలర్ విలువ పెరిగినప్పుడు.. పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపరు. దీంతో గోల్డ్ రేటు తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.వడ్డీ రేట్లు: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచితే.. డిపాజిట్లు, బాండ్స్ వైపు తిరుగుతారు. ఇది గోల్డ్ మీద ఆసక్తిని తగ్గిస్తుంది. ధరలు ఆటోమాటిక్గా తగ్గుతాయి.సెంట్రల్ బ్యాంకులు: సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మినప్పుడు కూడా గోల్డ్ రేటు తగ్గుతుంది.సీజన్: పండుగలు, పబ్బాలు లేనప్పుడు చాలామంది సాధారణ ప్రజలు బంగారం కొనాలనే ఆలోచన చేయరు. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గుతాయి.''ఒక్కమాటలో చెప్పాలంటే.. పసిడికి డిమాండ్ పెరిగితే, ధరలు పెరుగుతాయి. డిమాండ్ తగ్గితే.. ధరలు కూడా తగ్గుతాయి.''ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
ఫ్యామిలీ
వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..
బరువు తగ్గడం సాధారణ వ్యక్తులుకే కాదు సెలబ్రిటీలకు సైతం కష్టమే. బాగా లగ్జరీ ఉంటారు కాబట్టి ఏవేవో షార్ట్కట్లతో అమాంతం బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు, కానీ అది అపోహే అని బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సోహా అలీఖాన్తో జరిగిన సంభాషణలో చాలా ఓపెన్గా నిజాయితీగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పిన విధానం వింటే..అబ్బా బరువు తగ్గడానికి ఇంత కష్టపడిందా అనిపిస్తుంది. ఇంతకీ ఆమెకు స్లిమ్ మారడానికి ఎంత టైం పట్టిందంటే..ఫరాఖాన్ సోహా అలీఖాన్తో జరిగిన పాడ్కాస్ట్ ఆల్ అబౌట్ హర్ సంభాషణలో 60 ఏళ్ల వయసులో తన బరువు తగ్గే జర్నీ గురించి మాట్లాడింది. అంతేగాదు ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చర్మం, జుట్టు సమస్యల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆ సంభాషణలో సోహా అలీ ఖాన్ ..మీరు ఎంతో అద్భుతంగా కనిపిస్తునన్నారని ఫరాని ప్రశంసిస్తుంది. అయితే ఎల్లప్పుడూ ఇలానే ఉండిపోలేం అని నవ్వుతూ కౌంటర్ ఇచ్చేసింది ఫరా. తాను పిల్లలు పుట్టే వరకు చాలా సన్నగా ఉండేదాన్ని అని, అయితే చర్మం చాలా భయంకరంగా ఉండేదని తెలిపింది. అందులోనూ తాను డే అండ్ నైట్ షిప్ట్లో నిరంతరం పనిచేస్తూ ఉండటంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసినట్లు వెల్లడించింది. ఒకసారి తన భర్త, పిల్లలను తీసుకుని వెకేషన్కి వెళ్లామని, అప్పుడు తాను చాలా అధిక బరువుతో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారామె. అయితే తాము అక్కడ ఒక రూమ్ తీసుకుని ఉన్నప్పుడూ ఒక మహిళా క్లీనర్ వచ్చి..తన భర్తను చూసి మీ అబ్బాయిని బయటకు వెళ్లమనిండి ఇల్లు తుడుస్తాను అంటుంది. దాంతో ఫరా కంగుతింటుంది. ఆ ఘటన తనను చాలా కలవరపాటుకు గురి చేసిందని తెలిపింది. అలా తాను 60 ఏళ్ల వయసులో బరువు తగ్గే జర్నీని ప్రారంభించానని, అదనపు బరువు కోల్పోవడానికి తనకు ఏడేళ్లే పైనే పట్టిందని తెలిపింది.తనకు పుట్టుకతో అదనపు చర్మం ఉండటం వల్ల బరువు తగ్గడంలో మార్పులు సత్వరం కనిపించలేదని, అందుకోసం టమ్మీ టక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాదు 50 ఏళ్ల వయసులో చర్మ వ్యాధి నిపుణుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం, దాంతోపాటు వెల్నెస్ స్పాలో విటమిన్ డ్రిప్స్, లింఫాటిక్ మసాజ్లు వంటివి తీసుకున్నట్లు వివరించింది. ఇక తన జుట్టు కోసం కూడా క్రమం తప్పకుండా విటమిన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతలా కేర్ తీసుకుంటే గానీ ఫరా అంతలా స్లిమ్గా మారలేదన్నమాట. (చదవండి: కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!)
కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!
నవంబర్21, 2025న మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది ఫాతిమా బాష్. ఆ కిరీటం తోపాటు పూర్వీకులు(ఇంతకుమునుపు ఆ కీరిటం గెలుపొందినవారు) నెరవేర్చిన బాధ్యతలను సైతం స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఆమె ఇన్స్టాగ్రామ్తో నీలిరంగు దుస్తులతో ఆ కిరీటం తోపాటు వెండి రంగు రిబ్బన్ కూడా ధరించి. ఇంతకీ ఇది దేనికి సంకేతం, దాని ప్రాముఖ్యత ఏంటంటూ అంత తెగ వెతికేస్తున్నారు. మరి అదెంటో తెలుసుకుందామా..!.సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు ధరించే ముడివేసిన రిబ్బన్ దేనికోసం నిలబడుతున్నారనేది తెలుపుతుంది. ఎరుపు రంగు ఎయిడ్స్, గుండెజబ్బుల అవగాహనను సూచిస్తుంది. అదే గులాబీ రంగు రిబ్బన్ రొమ్ము కేన్సర్ని సూచిస్తుంది. ఇక పసుపు ఆత్మహత్య నివారణను సూచిస్తుంది. అలా ఇలా కాకుండా సిల్వర్ కలర్ ధరించిన ఫాతిమా దేనికోసం కృషి చేసింది, ఏ అంశంపై అవగాహన కల్పిస్తుంది అంటే..వెండి రిబ్బన్ ప్రాముఖ్యత..మిస్ యూనివర్స్ ఫాతిమా బాష్ ధరించిన వెండి రిబ్బన్ స్కిజోఫ్రెనియా, పార్కిన్సన్స్, డైస్లెక్సియాతో సహా మెదడు వ్యాధులు, రుగ్మతలు, వెకల్యాలకు మద్దతును సూచిస్తుంది. ఆరోగ్య సమస్యల చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించి, పరిశోధన, మద్దతు కోసం తన ఫాలోవర్లుకు అవగాహన కల్పించేలా ప్రభావితం చేసేందుకు ఆ రిబ్బన్ని ధరించారామె. అదే ఎందుకంటే..ఫాతిమా బాస్ పాఠశాలలో ఉన్నప్పుడు డిస్లెక్సియా ADHDతో ఇబ్బంది పడినందున ఆమె ముడి వేసిన వెండి రిబ్బన్ను ధరించి కనిపించింది.ఇక ఆమెక చదవు అంటే మహా ఇష్టం. ఆ అభిరుచితోనే జస్ట్ 16 ఏళ్లకే యూఎస్ వెళ్లింది. ఆమె తన కెరీర్ని పూర్తిగా ఫ్యాషన్కే అంకితం చేసింది. అలాగే కేన్సర్తో పోరాడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా కూడా పనిచేస్తుంది. వీక్ ఆఫ్ సమయాల్లో వార్షిక టోయ్ డ్రైవ్ని నిర్వహిస్తుందట View this post on Instagram A post shared by Fatima Bosch (@fatimaboschfdz) (చదవండి: పిల్లలు నాకే పుట్టారా?.. డీఎన్ఏ టెస్టుల కలకలం)
పిల్లలు నాకే పుట్టారా?.. డీఎన్ఏ టెస్టుల కలకలం
ఆఫ్రికా దేశం ఉగాండాలో ఓ కొత్త సామాజిక సమస్య తలెత్తింది. తాము ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లలు తమకు పుట్టినవారేనా అన్న అనుమానంతో పురుషులు భారీ సంఖ్యలో డీఎన్ఏ పితృత్వ పరీక్షల చేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తుండటం బాధకరం. అయితే, ఈ పరీక్షల ఫలితాలు వారి జీవితాలను అల్లకల్లోలం చేసి కాపురాలను కూల్చేస్తున్నాయి. ప్రస్తుతం ఉగాండ దేశంలో ఈ ధోరణి ఏ స్థాయిలో ఉందంటే, సాక్షాత్తు ప్రభుత్వమే రంగంలోకి దిగి "గుండె ధైర్యం ఉంటే తప్ప ఈ పరీక్షలకు వెళ్లొద్దు" అని సలహా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇటీవల కంపాలాలోని ఓ సంపన్న విద్యావేత్త కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనం సృష్టించింది. కోర్టు ఆదేశాల మేరకు జరిగిన డీఎన్ఏ పరీక్షలో, ఆయన ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆయనకు పుట్టలేదని తేలింది. స్థానిక మీడియాలో ఈ వార్త విపరీతంగా హల్చల్ చేయడంతో, ఒక్కసారిగా చాలామంది పురుషుల్లో తమ సంతానంపై సందేహాలు మొదలయ్యాయి. ఇదే అదనుగా దేశవ్యాప్తంగా డీఎన్ఏ పరీక్షా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిసిపోయాయి. ఆఖరికి రేడియోలు, ట్యాక్సీలపై కూడా ఈ టెస్టులకు సంబంధించిన ప్రకటనలు హోరెత్తించేస్తున్నాయి. మరోవైపు ఉగాండా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైమన్ పీటర్ ముండేయీ ప్రకారం, స్వచ్ఛందంగా డీఎన్ఏ పరీక్షలు చేయించుకుంటున్న వారిలో 95% పురుషులే ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, వీరిలో 98% మందికి పైగా ఫలితాలు తాము ఆ పిల్లలకు జీవసంబంధ తండ్రులు కారని నిర్ధారిస్తున్నాయి. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమై..ఎన్నో ఏళ్ల బంధాలు తెగిపోతున్నాయి. అలా చేయడం నేరం..దీంతో ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మతపెద్దలు, తెగల నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు స్థానిక గిరిజన నాయకుడు మోసెస్ కుటోయ్ వంటి సంప్రదాయ పెద్దలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గరకు వచ్చే కుటుంబ వివాదాలను పరిష్కరించే క్రమంలో..తాను కూడా తన తండ్రి పోలికతో ఉండనంటూ ఉదాహణగా చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదీగాక ఇలా పిల్లల పితృత్వాన్ని శంకించడం పూర్వకాలంలో పెద్ద నేరమని, జరిమానా కూడా విధించేవారంటూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వివాదాలు ఎక్కువగా ఆస్తి పంపకాలు, విడాకుల సమయంలోనే జరుగుతున్నట్లు సమాచారం. నిజానికి మత పెద్దల మాటలు ఒకప్పుడు కుటుంబాలను విచ్చిన్నం అవ్వకుండా కాపాడేవి. కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ చేదు నిజాన్ని నిగ్గుతేల్చి చెప్పేయడంతో, ఉగాండా సమాజం తీవ్రమైన కలవరపాటుకి గురవుతోంది. అదే ఈ సమస్యకు మూలం..ఇక ఆఫ్రికా సంప్రదాయం ప్రకారం మహిళ తన భర్తకు సంతానాన్ని కని ఇవ్వకపోతేవిడాకులు ఇవ్వడం లేదా ఆమెను ఇంటి నుంచి బయటకు పంపడం చేసే వారు. చాలా కేసుల్లో పురుషుల్లోనే సంతాన సమస్యలు ఉన్నా, శిక్ష మాత్రం తమకు పడుతుండటంతో చాలా మంది మహిళలు ఇతరులతో కలిసి పిల్లలను కంటున్నారని ఓ అధికారి వెల్లడించారు.(చదవండి: Inspiring Story: సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..)
సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..
కంటతడి పెట్టించే కష్టాల కొలిమి..సాధించాలన్న ఆశయాన్ని కన్నీళ్లు చుట్టుముట్టేస్తున్నా..వెనకడగు వేయలేదు. మనసును మెలిపెట్టే బాధనంతటిని లక్యాన్ని మరింత చేరువ చేసే సాధనంగా మార్చాడు. జీవిత పోరాటంలో ఎలా గెలుపుని ఒడిసి పట్టుకోవాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. అతడు అడగడుగునా ఎదురయ్యే సవాళ్లను, కంటతడి పెట్టిస్తున్న ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ఉన్నతస్థాయికి చేరుకోవడమే గాక, తన బాధ్యతల విషయంలోనూ రాజీకి తావివ్వకుండా ఎలా సమర్థవంతంగా నిర్వర్తించింది రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు.ఆ పోస్ట్లో తాను ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని పేర్కొన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అతడి తండ్రి తన పిల్లలకు మంచి మెరుగైన జీవితాన్ని అందించాలనే తపనతో ఢిల్లీ వెళ్లాడు. కానీ విధి మరోలా తలిచింది. అనూహ్యంగా 2013లో తండ్రి ఆకస్మిక మరణం తన జీవితాన్ని పూర్తిగా విషాదకరమైన జీవితంలోకి నెట్టేసింది. అయితే అతడు ఎంతటి కఠినమైన సమస్యలు వచ్చినా..చదువును వదలకూడదన్న సంకల్పంతో ముందుకు సాగాడు. అలా 2015లో రూ. 3.15 లక్షల ప్యాకేజ్తో బహుళ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ సక్సెస్ని అక్కడితో ఆపకుండా 2018 నాటికి వేరే కంపెనీకి మారి రూ. 7.5 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు. ఢిల్లీ అద్దె ఇంట్లో ఉంటూ అప్పులన్నీ తీర్చేశాడు. కానీ నవంబర్ 2020లో మళ్లీ విషాదం చుట్టుమట్టింది. ఆ ఏడాది తన తల్లిని కోల్పోయాడు. దాంతో అతడిపై తమ్ముడు, చెల్లి బాధ్యతలు మీద పడ్డాయి. తనలా తన తోబుట్టువులను కూడా మంచి స్థాయిలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వారి చదువుల విషయంలో రాజీపడకుండా చదివించాడు. దాని ఫలితం సోదరికి రూ. 11 లక్షల వార్షిక ప్యాకేజ్తో ఉద్యోగం రాగా, తమ్ముడికి బీటెక్ సెకండియర్లో ఉండగానే జాబ్ కొట్టేశాడు. అలాగే తన స్వగ్రామంలోని ఇంటిని 2021లో పునర్నిర్మించే పనులు ప్రారంభించాడు. ఆ ఇల్లు అక్టోబర్ 2022 నాటికి పూర్తవ్వగా, నవంబర్ 2022లో, తాను వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. అలాగే తన వివాహం ఇంటి నిర్మాణాన్ని కవర్ చేయడానికి సుమారు రూ. 20 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నానని, దాని ఈ ఏడాది ఆగస్టు 2025 నాటికి క్లియర్ చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం తన దగ్గర ఎలాంటి పొదుపులు లేవు గానీ అతిపెద్ద సక్సెస్ని సాధించగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. ఇదేంటి అనుకోకండి. ఎందుకంటే జీవితం నన్ను బాధించే కష్టాల కడలిలో ముంచినా..వెనక్కిచూడలేదు, ఆగిపోలే..!. స్థైర్యంతో ముందుకు సాగిపోయాను..మంచి స్థాయికి చేరుకున్నా. అలాగే నా తోబుట్టువులను సెటిల్ చేయగలిగా. ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నా. గుర్తించుకోండి సక్సెస్ అటే ఎన్ని కోట్లు కూడబెట్టాం అన్నది కాదు. జీవితం మనల్ని ఎంత కష్టబెట్టినా..తడబడకుండా ముందుకు సాగడం అని సగర్వంగా పోస్ట్లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకర్షించడమే కాదు..ఇది గొప్ప స్ఫూర్తిగాకమైన స్టోరీ బ్రదర్ అంటూ అభినందనలు వెల్లువెత్తాయి. (చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!)
అంతర్జాతీయం
10వేల సంవత్సరాల తర్వాత బద్ధలై..
ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం(Hayli Gubbi ) దాదాపు 10,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెందింది. నవంబర్ 23 ఉదయం డనాకిల్ డిప్రెషన్ ప్రాంతంలో ఈ విస్ఫోటనం గుర్తించబడింది. భూమి క్రింద నిశ్శబ్దంగా ఉన్న ఈ షీల్డ్ వోల్కానో నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసి పడుతూ ఆకాశాన్ని కమ్మేసింది.టూలూస్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ (VAAC) నివేదిక ప్రకారం.. ఇది అత్యంత అరుదైన విస్పోటనం, ఎర్ర సముద్రం దాటి యెమెన్, ఒమాన్ వైపు వోలకనో కదులుతోంది. ఈ ప్రాంతం అత్యంత వేడి, చేరుకోవడం కష్టమైనది. అందువల్ల భూగర్భ పరిశోధకులు ఉపగ్రహ డేటా, వాతావరణ రీడింగ్స్ ఆధారంగా మాత్రమే పరిశీలిస్తున్నారు.హైలీ గుబ్బి అగ్నిపర్వతం హోలోసీన్ కాలంలో(ఐస్ ఏజ్ ముగిసిన తర్వాత.. 11,700 సంవత్సరాల కాలం) ఎప్పుడూ విస్ఫోటనం కాలేదని నిర్ధారించుకున్నారు. ఈ విస్ఫోటనం ఆఫ్రికా కొమ్ము ప్రాంతంలో(హార్న్ ఆఫ్ ఆఫ్రికా) దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన అగ్నిపర్వత సంఘటనగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడంతో ఒమన్, యెమన్ ప్రాంత ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ఎయిర్ క్వాలిటీ వార్నింగ్ నేపథ్యంలో శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని మార్గాల్లో విమానాలు మళ్లించబడ్డాయి. ఉత్తర భారతదేశం వైపుగా దీని ప్రభావం ఉండే అవకాశం నెలకొంది. దీంతో.. భారత విమానయాన అధికారులకు అలర్ట్ జారీ అయ్యింది నవంబర్ 24న కన్నూర్ నుంచి అబుదాబీ వెళ్తున్న ఇండిగో విమానం (6E 1433) అహ్మదాబాద్కు మళ్లించబడింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.❗️🌋🇪🇹 - Ethiopia's Hayli Gubbi Volcano Awakens After 10,000 YearsIn a stunning geological event, Ethiopia's Hayli Gubbi volcano—long dormant in the remote Danakil Depression of the Afar Rift—erupted explosively for the first time in recorded history on November 23, 2025. The… pic.twitter.com/bZby4sAuOC— 🔥🗞The Informant (@theinformant_x) November 24, 2025
భారత్కు రష్యా బంపరాఫర్..
న్యూఢిల్లీ: భారత్కు రష్యా బంపరాఫర్ ప్రకటించింది. రోస్నెఫ్ట్, లుకోయిల్ వంటి ప్రధాన రష్యన్ చమురు సంస్థలపై అమెరికా గత వారం ఆంక్షలు విధించడంతో, రష్యా తన ముడి చమురును రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు భారత్కు అందించేందుకు సిద్ధమైంది.భారత రిఫైనర్లకు యురల్స్ ధర డెలివరీ ప్రాతిపదికన డేటెడ్ బ్రెంట్తో పోలిస్తే బ్యారెల్పై ఏడుడాలర్ల వరకు తగ్గించింది. ఈ ఆఫర్ డిసెంబర్లో లోడ్ అయ్యే, జనవరిలో భారత్కు చేరే కార్గోలపై వర్తించనుంది.అమెరికా ఆంక్షలకు ముందు యురల్స్ బ్యారెల్కు మూడు డాలర్ల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. రోస్నెఫ్ట్, లుకోయిల్పై ఆంక్షలు అమలులోకి వచ్చిన తర్వాత భారత రిఫైనర్లు రష్యన్ చమురు ఆర్డర్లు తగ్గించాయి. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత భారత్ చౌకైన చమురును విస్తృతంగా దిగుమతి చేసుకుంది. కానీ ఆంక్షల కారణంగా దిగుమతి నిలిపివేసింది. రోస్నెఫ్ట్, లుకోయిల్తో పాటు గాజ్ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్నెఫ్టెగాస్పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత రిఫైనర్లు మధ్యప్రాచ్యం సహా ఇతర ప్రాంతాల నుండి ఎక్కువ ముడి చమురును కొనుగోలు చేస్తున్నారు. రష్యా చమురు ధరలు తగ్గడం భారత్కు తాత్కాలిక లాభం కలిగించవచ్చు. కానీ ఆంక్షల కారణంగా సరఫరా స్థిరత్వం అనిశ్చితంగా మారింది. రిఫైనర్లు తక్కువ ధరల ఆకర్షణతో రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నా, దీర్ఘకాలంలో అమెరికా ఆంక్షలు వాణిజ్యాన్ని మరింత క్లిష్టం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స
Khaleda Zia under intensive care బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్పి) చైర్పర్సన్, మాజీ ప్రధాన మంత్రి బేగం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గుండె, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాబోయే 12 గంటలు చాలా కీలకమని వైద్యులు ప్రకటించారు.జియా కోసం ఏర్పాటు చేసిన వైద్య బోర్డు సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ ఎఫ్ఎం సిద్ధిఖీ ఆమె ఆరోగ్యపరిస్థితిపై నిన్న రాత్రి మీడియాకు వివరించారు. "గత కొన్ని నెలలుగా, తరచుగా అనేక సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఆమె( ఎవర్కేర్ హాస్పిటల్) చికిత్స పొందుతున్నారని, ఛాతీలో కూడా ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. ఇప్పటికే ఆమెకు పర్మినెంట్ పేస్మేకర్, స్టంట్స్ వేయడం, గుండె సంబంధిత సమస్యలతో మిట్రల్ స్టెనోసిస్ అనే పరిస్థితితో కూడా బాధపడుతున్నారన్నారు. యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తున్నామని , మరోవైపుఅమెరికాకు చెందిన వైద్య నిపుణులు వర్చువల్గా సాయం అందిస్తున్నారని తెలిపారుఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా, గుండె, ఊపిరితిత్తులు ఒకేసారి ప్రభావితమయ్యాయి. దీనివల్ల తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది ఏర్పడిందన్నారు. బేగం జియాను ఇంటెన్సివ్ కేర్లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని , రాబోయే 24 గంటల్లో వచ్చే రిపోర్ట్స్ కీలకమని ప్రొఫెసర్ సిద్ధిఖీ తెలిపారు. బేగం జియా అస్వస్థత వార్తలతో బీఎన్పీ నేతలు, శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్య నాయకులు ఆమె ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఇంత విషాదం చోటు చేసుకున్నా కంటిన్యూ చేస్తారా?
దుబాయ్లో శుక్రవారం నాటి ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ నమాంశ్ సియాల్(37) దుర్మరణం చెందాడు. యుద్ధ విమానం అదుపు తప్పి క్రాష్ కావడంతో పైలట్ మృత్యువాత పడ్డారు ఇంతటి విషాదం చోటు చేసుకున్న సదరు ఎయిర్ షో కొనసాగించడంపై యూఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్ మేజర్ టేలర్ ఫెమీ హీస్టర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇంతటి దారుణం చేసుకున్నా షోను ఎలా కొనసాగిస్తారంటూ ప్రశ్నించాడు. ఇదేనా సాటి పైలట్ ఇచ్చే గౌరవం అంటూ షో నిర్వహకులపై మండిపడ్డారు. అదే సమయంలో తాను ఈ షోలో పాల్గొననంటూ వైదొలిగారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు హీస్టర్. ‘ మా తుది ప్రదర్శనను ఇవ్వడానికి మా టీమ్ సిద్ధంగా లేదు. ఈ షో నుంచి మేము వైదులుగుతున్నాం. అందుకు కారణం.. తేజస్ యుద్ధ విమానం కూలిపోయి భారత పైలట్ దుర్మరణం చెందితే షోను కొనసాగించాలనుకోవడం మంచి పరిణామం కాదు. ఇదేనా మనం తోటి పైలట్కు, వారి కటుంబానికి ఇచ్చే గౌరవం?’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పటికీ ఎగిరే ప్రదర్శనలు కొనసాగుతాయని సమాచారం అందిన తర్వాత ఏం జరిగిందనేది హీస్టర్ వివరించాడు. ప్రమాదం జరిగిన గంట, రెండు గంటల మధ్యలో అక్కడకి వెళ్లాను,. అది ఖాళీగా ఉంది. షో ఆపివేయబడుతుందని అనుకున్నాను. అలా జరగలేదు. మళ్లీ యథావిధిగా షో నిర్వహించారు. అందుకే మా టీమ్ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది’ యూఎస్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ తెలిపారు.ఆరోజు జరిగిన ప్రమాదం తేజస్ యుద్ధ విమానం కంట్రోల్ తప్పి నేలపై పడటంతో మంటలు చుట్టుముట్టాయి. ఆ ఘటనలో తేజస్ పైలట్ మాంశ్ సియాల్ ప్రాణాలు కోల్పోయాడు.సెల్యూట్తో భర్తకు కన్నీటి వీడ్కోలు
జాతీయం
స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా
Smriti Mandhana-Palash Muchhal wedding controversy మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలతో సందడి సందడిగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా స్థంభించిపోయింది. పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు అంటూ పెళ్లి వేడుకలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఆ తరువాత వరుడు కూడా ఆసుపత్రిలో చేరినట్లు కూడా వెల్లడైంది. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. అవును.. టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి వాయిదా గురించే. తన జీవితంలో బిగ్ డే కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తోంది స్మృతి. సన్నిహితులు, క్రికెట్ సహచరులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నవంబరు 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో పలాష్ ముచ్చల్తో ఆమె పెళ్లి వేడుక ముగియాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడమే పెద్ద చర్చగా మారింది. ఆమె వెళ్లి వాయిదాతో నెటిజన్లు షాక్ అయ్యారు. దీనికి తోడు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఇండియా భారీ విజయానికి దోహదపడిన క్రికెటర్ స్మృతి, పలాష్ ముచ్చల్(Palash Muchhal)తో ఉన్న తన ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుండి తొలగించడం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అది పాత కథ.. నీతో పిల్లల్ని కంటా.. తొలుత స్మృతి తండ్రి అనారోగ్యమే ఇందుకు కారణమని అందరూ భావించినా, క్రమంగా పలాష్ ముచ్చల్ కొరియాగ్రాఫర్తో డర్టీ మెసేజెస్ వెలుగులోకి వచ్చాయి. వీటిని స్వరయంగా మేరీ డి'కోస్టా షేర్ చేసింది. తనతో పలాష్ ముచ్చల్తో చాట్ల యొక్క అనేక స్క్రీన్షాట్లను పంచుకుంది. ఈ స్క్రీన్షాట్లు నిజమైనవో కాదో ఇంకా నిర్ధారణ కానప్పటికీ, పలాష్ పేరు, ఐడీ ఉన్నాయి గమనార్హం. ఈ చాట్ ప్రకారం తనను కలమని మేరీని అడిగాడు. మరి స్మృతి రిలేషన్ గురించి ఆమె ప్రశ్నించగా, అదొక పాత బంధం అని తేలిగ్గా కొట్టి పారేశాడు. పదే పదే స్మృతి ‘డెడ్’ అని సంబోధించడం, ఆమెను కలవని ఒత్తిడి చేయడం ఈ చాట్లో చూడవచ్చు. ఈమె వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. పలాష్ - స్మృతి వివాహానికి కొరియోగ్రఫీకి ఒప్పుకుందట.దీంతోపాటు రెడ్డిట్లో, పలాష్ ఒక అమ్మాయికి దగ్గరగా కనిపించాడని చాలా మంది యూజర్స్ పేర్కొన్నారు. వివాహానికి ముందు జరిగిన కార్యక్రమంలో జరిగిన ద్రోహాన్ని తొలుత స్మృతి తండ్రే గుర్తించారట. దీంతో ఇద్దరి మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కారణంగానే, అతనికి గుండెపోటు వచ్చిందనేది ప్రముఖంగా వినిపిస్తోంది.అయితే ఈ పుకార్లపై ఇరు వర్గాలు అధికారికంగా దృవీకరించనూలేదు, ఖండించనూ లేదు. అయితే పలాష్ స్మృతిని మోసం చేశాడనే ధృవీకరించని ఊహాగానాల మధ్య పలాష్ ముచ్చల్తో ఉన్న తన ఫోటోలన్నింటినీ తన సోషల్ మీడియా నుండి తొలగించడం ఈ అనుమానాలకు మరింత బలం పెరిగింది. పలాష్ ముచ్చల్ స్మృతి మంధానస్మృతి - పలాష్ తమ పరస్పర స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి 2019నుంచీ డేటింగ్ ప్రారంభించారు. క్రికెట్, సంగీతంపై వారి ఉమ్మడి ఆసక్తి వీరి మనసులు కలిసేలా చేసింది. 2024లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించగా, పలాష్ తన చేతికి స్మృతి జెర్సీ నంబర్ 'SM18' టాటూ వేయించుకున్నాడు. మరి అంత ప్రేమ కురిపించిన పలాష్, తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్మృతిని ఇంత దారుణంగా మెసం చేస్తాడా? మేరీ కాకుండా ఇంకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రస్తుతం కోట్లాది మంది స్మృతి అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే అధికారిక వివరణ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.చదవండి : వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే!
Zubeen Garg: సింగర్ కేసులో సంచలన ప్రకటన
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. సింగర్ జుబిన్ గర్గ్ ప్రమాదవశాత్తు మరణం కాదని.. అదొక హత్య అని మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ హత్యకు గల కారణం కచ్చితంగా రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని పేర్కొన్నారు. అస్సామీస్తో పాటు బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో పాటలు పాడిన జుబీన్ సెప్టెంబర్ 19వ తేదీన సింగపూర్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తమ కల్చర్ను ఖండాంతరాలు దాటించిన గాయకుడి మరణాన్ని అస్సాం ప్రజలు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయించింది హిమంత ప్రభుత్వం. జుబిన్ గర్గ్ హత్య కేసు అంశంపై చర్చించాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఈ కేసు పురోగతిపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. జుబిన్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించలేదని.. ఆయనను కుట్రపూరితంగా హత్య చేశారన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది వెల్లడైందని.. నేరం వెనక ఉన్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని హిమంత తెలిపారు. నిందితులలో ఒకరు ఆయనను హత్య చేయగా.. మిగిలినవారు అతడికి సహకరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులపైనా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. డిసెంబర్లో హత్య కేసులో ఛార్జ్షీట్ సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారన్నారు.ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మొదటి మూడు రోజుల్లోనే హత్య కేసు నమోదు చేసింది. మరోవైపు జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, మరిన్ని సాక్ష్యాలను సమర్పించడానికి దర్యాప్తును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ కేసుపై సింగపూర్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడి పోలీసులు మాత్రం మృతిలో ఎలాంటి అనుమానాలు లేవనే అంటున్నారు. ఈ నెల మొదట్లో జుబిన్కు సంబంధించిన పోస్ట్మార్టం, టాక్సాలజీ నివేదికలను అస్సాం పోలీసులకు పంపించారు కూడా. సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదానికి గురైన జుబిన్ను సింగపూర్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే ఆయన మృతి చెందినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. మరోవైపు.. జుబిన్ బ్యాండ్మేట్ శేఖర్జ్యోతి గోస్వామి తన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడికి ఆయన మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషనర్ విషమిచ్చి దాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండొచ్చని అనుమానాలు వయక్తం చేశారు. జుబిన్ నోరు, ముక్కు నుంచి నురగ గమనించానని.. అయినా కూడా మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని.. తీరికగా వైద్యం అందించారని ఆరోపించారు. ఈ వాంగ్మూలంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నా భర్తొక నార్సిసిస్ట్, తీవ్ర హింస, రూ. 50 కోట్లు చెల్లించాలి: మాజీ మిస్ ఇండియా
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ (Celina Jaitly) విడాకులకు సిద్దమైంది. భర్త పీటర్ హాగ్ (Peter Haag-48)పై గృహ హింస కేసు దాఖలు చేసి, అతని వల్ల కోల్పోయిన ఆదాయం రూ. 50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నవంబర్ 21న ముంబై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త అయిన హాగ్ కు నోటీసు జారీ అయినట్టు తెలుస్తోంది.తన భర్త తనను తాను గొప్పగా ఊహించుకుంటాడని (నార్సిసిస్ట్), స్వార్థపరుడని సెలీనా ఆరోపించారు. పిల్లల పట్ల ప్రేమలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను తీవ్ర భావోద్వేగ, శారీరక, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని తెలిపారు. అంతేకాదు ఆస్ట్రియాలో విడాకుల కోసం దాఖలు చేశాడని కూడా ఆమె ఆరోపించింది. ఈ కారణంగానే తాను ఇంట్లోనుంచి పారిపోయి భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే సెలీనా తనకు నెలకు రూ. 10 లక్షల భరణం కోరింది. ముంబైలోని తన నివాసంలోకి ప్రవేశించకుండా అతడిని నిరోధించాలని కోర్టును అభ్యర్థించింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో హాగ్తో నివసిస్తున్న వారి ముగ్గురు పిల్లల కస్టడీ కూడా తనకు రావాలని పిటిషన్లో కోరింది. పిల్లలు పుట్టిన తరువాత ఏదో ఒక సాకుతో తనను పనిచేసుకోనీయకుండా అడ్డుపడ్డాడని.. తన ఆర్థిక స్వేచ్ఛను, గౌరవాన్ని హరించాడని ఆరోపించింది. అప్పుడప్పుడు చిన్న, చిన్న ప్రాజెక్టులను మాత్రమే చేయగలిగానని వెల్లడించింది.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!కాగా, 2010లో నటి సెలినా జైట్లీ హగ్ను పెళ్లాడింది. వీరికి విన్స్టన్, విరాజ్, ఆర్థర్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మార్చి 2012లో మగపిల్లలు (ట్విన్స్) పుట్టారు. తిరిగి ఏదేళ్ల తరువాత మళ్లీ ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది, వారిలో ఒకరు హైపోప్లాస్టిక్ గుండె కారణంగా మరణించారు. మాజీ మిస్ ఇండియా చమిస్ యూనివర్స్ రన్నరప్గా నిలిచిన సెలీనా.. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, మనీ హై తో హనీ హై, గోల్మాల్ రిటర్న్స్, థాంక్యూ లాంటి సినిమాలతో పాపులర్ అయింది. మరోవైపు గత వివాహ వార్షికోత్సవం సందర్భంగా హాగ్ కోసం సోషల్ మీడియాలో సుదీర్ఘమైన రొమాంటిక్ పోస్ట్ కూడా పెట్టింది. ఇంతలోనే ఈ విడాకుల వార్త అభిమానుల్లో అందోళన రేపింది.
ఇలా బుక్ చేసుకుంటే.. కన్నిస్వాములకు శబరిమల యాత్ర ఉచితం..!
మండలం-మకరవిలక్కు పూజలతో శబరిమల జనసందోహంగా మారింది. భక్తులు నిరంతరం పంపాలో స్నానం చేసి శబరిగిరిపైకి చేరుతారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివస్తారు. ముఖ్యంగా మొదటి సారి మాలధారణ చేసి, ఇరుముడితో కొండకు వచ్చే కన్ని స్వాములు శరణ్గుత్తిలో బాణం/శరం గుచ్చి, అయ్యప్పను దర్శించుకున్నాక.. మాలికపురోత్తమ మంజుమాత ఆలయానికి చేరుకుంటారు. ఇందుకు అనేక కారణాలున్నాయి.మహిషిని అయ్యప్ప సంహరించాక.. ఆమె మాలికాపురోత్తమ(మాలికాపురం) లేదా మంజుమాతగా అవతరించినట్లు చెబుతారు. ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆజన్మ బ్రహ్మచారి అయిన అయ్యప్ప.. ఆమె ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అయితే.. మాలికాపురోత్తమ నొచ్చుకోవడంతో.. ఏటా తన దర్శనానికి కన్నిస్వాములు రాని సంవత్సరం తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కన్ని స్వాములు ఏటా ఎరుమేలిలో వేటతుళ్లి ఆడేప్పుడు శరం/బాణం తీసుకుని, దాన్ని తమవద్దే భద్రపరుచుకుంటారు. పంపాస్నానం తర్వాత శబరిపీఠం దాటాక.. శరణ్గుత్తి వద్ద గుచ్చుతారు. ఏటా మకరవిళక్కు పర్వదినానికి ముందు మంజుమాత అయ్యప్ప సన్నిధి సమీపంలోని ఆలయం నుంచి ఏనుగు అంబారీపై శరణ్గుత్తి వరకు రావడం.. కన్నిస్వాములు వచ్చారనడానికి గుర్తుగా అక్కడ బాణాలు ఉండడం చూసి, నిరాశగా వెళ్లడం ఏటా జరిగే తంతులో భాగమే.అందుకే కన్నిస్వాములకు అయ్యప్ప యాత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) కూడా కన్నిస్వాముల కోసం ప్రత్యేక సేవలు అందిస్తోంది. కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకునే కన్ని స్వాములకు కేవలం ఒక్కరూపాయి చార్జీతో.. తిరువనంతపురం సెంట్రల్ నుంచి పంపాబేస్ వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ బస్సు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది. (చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!)
ఎన్ఆర్ఐ
ఫీనిక్స్లో సాంస్కృతిక వేడుకలు.. శంకర నేత్రాలయ యూఎస్ఏకు భారీ విరాళం
మెసా(అరిజోనా): ఫీనిక్స్లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.దాతలకు సన్మానంగ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.హాస్యంతో హృదయాల హరివిల్లు“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.శంకర నేత్రాలయ సేవా లక్ష్యం1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.నిర్వాహకుల కృషివంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు.
శ్రీ శ్రీ రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి.
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
క్రైమ్
ఐబొమ్మ కేసు: రవిని ఎలా ట్రాప్ చేశారో చెప్పిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ పైరసీ కేసులో దర్యాప్తు పురోగతిపై అడిషనల్ సీపీ(క్రైమ్స్) శ్రీనివాసులు మంగళవారం మీడియా ఎదుట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రవిని ఎలా ట్రాప్ చేశారు? అతని నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు? తదితర వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ..‘‘నిఖిల్ అనే వ్యక్తి రవికి మిత్రుడు. పైరసీ వెబ్సైట్కు డిజైన్లు తయారు చేసేవాడు. అతని ద్వారానే రవిని ట్రాప్ చేశాం. గేమింగ్, బెట్టింగ్ యాప్స్తోనూ నిందితుడు బోలెడు డబ్బు సంపాదించాడు. యాడ్ బుల్ అనే కంపెనీ రవికి చెందిందే. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బ వచ్చేది. రవి సర్వర్లన్నీ నెదరలాండ్స్లో ఉన్నాయి. రవి టీం ఇంకా కరేబియనలోనే ఉంది. హైదరాబాద్, వైజాగ్లో రవి ఆస్తుల్ని గుర్తించాం. ఇప్పటిదాకా రూ.3 కోట్లు సీజ్ చేశాం’’ అని తెలియజేశారాయన. ఐబొమ్మ డొమైన్ని ఎన్ జిలా(N Jila) అనే కంపెనీలో రవి రిజిస్టర్ చేశాడు. మరో కంపెనీ నుంచి హోస్ట్ చేశాడు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఐబొమ్మ, బప్పమ్ ద్వారా సినిమాలు పోస్ట్ చేశాడు. బప్పం, ఐబొమ్మ వెబ్ సాఫ్ట్ వేర్లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశారు. తద్వారా రీడైరెక్ట్ ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లకు వెళ్లేది. అక్కడ వాటి యాడ్లను.. యాడ్ క్యాష్, యాడ్ స్టరా అనే కంపెనీలు మేనేజ్ చేస్తున్నాయి. బెట్టింగ్ సైట్లు యాడ్స్ డిస్ప్లే చేయడం ద్వారా వచ్చే డబ్బు ఇమ్మడి రవి ఖాతాలోకి వెళ్లేది’’ అని తెలిపారాయన.మరో వారం కస్టడీకి ఇవ్వండి!ఐబొమ్మ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి వారంపాటు రవిని కస్టడీకి కోరారు. విచారణకు రవి సహకరించలేదని.. మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడతామని మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎవరికీ కాపీలు ఇవ్వొద్దంటూ పోలీసుల మెమో దాఖలు చేశారు. దీని వల్ల కస్టడీ విచారణ నీరుగారుతోందని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అయితే కస్టడీ పిటిషన్పై రేపు ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
Zubeen Garg: సింగర్ కేసులో సంచలన ప్రకటన
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. సింగర్ జుబిన్ గర్గ్ ప్రమాదవశాత్తు మరణం కాదని.. అదొక హత్య అని మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ హత్యకు గల కారణం కచ్చితంగా రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని పేర్కొన్నారు. అస్సామీస్తో పాటు బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో పాటలు పాడిన జుబీన్ సెప్టెంబర్ 19వ తేదీన సింగపూర్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తమ కల్చర్ను ఖండాంతరాలు దాటించిన గాయకుడి మరణాన్ని అస్సాం ప్రజలు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయించింది హిమంత ప్రభుత్వం. జుబిన్ గర్గ్ హత్య కేసు అంశంపై చర్చించాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఈ కేసు పురోగతిపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. జుబిన్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించలేదని.. ఆయనను కుట్రపూరితంగా హత్య చేశారన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది వెల్లడైందని.. నేరం వెనక ఉన్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని హిమంత తెలిపారు. నిందితులలో ఒకరు ఆయనను హత్య చేయగా.. మిగిలినవారు అతడికి సహకరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులపైనా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. డిసెంబర్లో హత్య కేసులో ఛార్జ్షీట్ సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారన్నారు.ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మొదటి మూడు రోజుల్లోనే హత్య కేసు నమోదు చేసింది. మరోవైపు జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, మరిన్ని సాక్ష్యాలను సమర్పించడానికి దర్యాప్తును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ కేసుపై సింగపూర్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడి పోలీసులు మాత్రం మృతిలో ఎలాంటి అనుమానాలు లేవనే అంటున్నారు. ఈ నెల మొదట్లో జుబిన్కు సంబంధించిన పోస్ట్మార్టం, టాక్సాలజీ నివేదికలను అస్సాం పోలీసులకు పంపించారు కూడా. సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదానికి గురైన జుబిన్ను సింగపూర్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే ఆయన మృతి చెందినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. మరోవైపు.. జుబిన్ బ్యాండ్మేట్ శేఖర్జ్యోతి గోస్వామి తన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడికి ఆయన మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషనర్ విషమిచ్చి దాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండొచ్చని అనుమానాలు వయక్తం చేశారు. జుబిన్ నోరు, ముక్కు నుంచి నురగ గమనించానని.. అయినా కూడా మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని.. తీరికగా వైద్యం అందించారని ఆరోపించారు. ఈ వాంగ్మూలంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బ్యాంక్ ఉద్యోగినితో నా భర్తకు వివాహేతర సంబంధం..!
బాపట్లటౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికకు అర్జీదారులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 62 మంది బాధితులు హాజరై తమ సమస్యలను నేరుగా ఎస్పీకు విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.రూ.పది లక్షలు తెస్తేనే కాపురం చేస్తారంటానాకు 2016లో కందూకురుకు చెందిన గుజ్జుల శ్రీమన్నారాయణతో వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో మా అమ్మనాన్నలు నాకు కట్నం క్రింద రూ.5 లక్షలు నగదు ఇచ్చారు. నాకు పాప పుట్టింది. ఆడపిల్లను కన్నావు. మీ పుట్టింటి నుంచి రూ.10 లక్షలు తీసుకొని వస్తే నీతో కాపురం చేస్తాను. లేకుంటే నాకు నీవు అవసరం లేదంటూ గత ఏడాది నుంచి నన్ను పుట్టింటిలోనే వదిలేశాడు. ప్రస్తుతం కందుకూరు ప్రాంతంలోనే బ్యాంక్ ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకొని నన్ను నా భర్తతోపాటు అత్త, మామలు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. న్యాయం చేయాలి.– గుజ్జుల హేమ, ఈపూరుపాలెం, చీరాల మండలం
ఈ టార్చర్ భరిస్తూ బతకలేను.. మరిది వేధింపులతో..
మంచిర్యాలక్రైం: భర్త, అత్తమామల వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల సీఐ ప్రమోద్రావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రియాంకకు మందమర్రి మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్తో 2014లో వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు రామ్, లక్ష్మణ్(9) ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియాంకను భర్త, అత్తమామలు రమాదేవి, సత్యనారాయణ, మరిది ప్రదీప్ వేధించేవారు. ఈ నెల 9న ఆమెను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఎల్ఐసీ కాలనీలోని తల్లిగారింటి వద్దనే ఉంటోంది. అయినా వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతికి కారణమైన భర్త, మరిది, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి అంకం ఓదమ్మ ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.
వీడియోలు
నన్ను పరకామణి కేసులో ఇరికించాలని చూస్తున్నారు: భూమన
పులివెందుల చేరుకున్న జగన్
నల్లగొండ జిల్లాలో మద్యం వ్యాపారుల కొత్త ప్లాన్
Sri Chaitanya College: అన్నంలో పురుగులు శ్రీచైతన్య విద్యార్థుల ఆగ్రహం
DK Arun: ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలు
Sajjala: చంద్రబాబు ఫాలో అయ్యేది ఇదే వాళ్ల అమ్మ చెప్పిన కథ
Adi Srinivas: ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
Vizag: క్రిప్టో బాధితుల్లో దాదాపు 200 మంది పోలీసులు
Sajjala: రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు
మోదీ స్పీచ్ తో దద్దరిల్లిన అయోధ్య

