తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్:వాతావరణ శాఖ తెలంగాణకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సైతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఎండలు సైతం తీవ్రంగా ఉండనున్నట్లు పేర్కొంది.
ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం!
బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ల ప్రయోజనాలే పరమావధిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే ప్రక్రియపై నిబంధనలను ఆర్బీఐ మరింత కఠినతరం చేసింది. రుణదాతలు, బ్యాంకింగ్ సిబ్బంది కస్టమర్లను తప్పుదారి పట్టించి ఉత్పత్తులను అంటగట్టే ‘మిస్ సెల్లింగ్’ పద్ధతులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్త గైడ్లైన్స్ను విడుదల చేసింది.అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే?సవరించిన నూతన మార్గదర్శకాలు తొలుత జులై 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతిక, కార్యాచరణ మార్పులు చేసుకోవడానికి వీలుగా సెంట్రల్ బ్యాంక్ గడువును పొడిగించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.నూతన మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలుబ్యాంకులు ఏ రకమైన ఆర్థిక ఉత్పత్తి లేదా సేవను విక్రయించాలన్నా సదరు కస్టమర్ స్పష్టమైన ఆమోదం తీసుకోవాలి. అలాగే ఆ ఉత్పత్తి కస్టమర్కు ఎంతవరకు అనుకూలమైనదో ముందే నిర్ధారించుకోవాలి.సంతకం చేసిన డిక్లరేషన్లు, ఓటీపీ-ఆధారిత ఆమోదాలు, డిజిటల్ ధ్రువీకరణలు లేదా ఒప్పంద పత్రాలలో స్పష్టంగా పేర్కొన్న సమ్మతి నిబంధనల ద్వారా మాత్రమే ఈ అనుమతిని సేకరించాల్సి ఉంటుంది.డిజిటల్ ప్లాట్ఫారమ్లు, యాప్లలో వినియోగదారులను తప్పుదారి పట్టించేలా లేదా మోసగించేలా రూపొందించే వినియోగదారు-అనుభవ పద్ధతులు లేదా డార్క్ ప్యాటర్న్స్(డిజిటల్ ప్లాట్ఫారమ్లు వినియోగదారులను మోసగించడానికి లేదా వారి ప్రమేయం లేకుండా కొన్ని పనులు చేయించడానికి ఉపయోగించే వ్యూహాలు) వాడకాన్ని ఆర్బీఐ పూర్తిగా నిషేధించింది.తప్పుగా విక్రయిస్తే.. పూర్తి రీఫండ్!బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యంత కీలకమైన నిబంధనను ఆర్బీఐ ఈసారి తీసుకొచ్చింది. ఆర్థిక ఉత్పత్తులను కస్టమర్లకు తప్పుగా విక్రయించినట్లు రుజువైతే బ్యాంకులు ఆ విక్రయాన్ని రద్దు చేయడమే కాకుండా.. కస్టమర్ నుంచి వసూలు చేసిన మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రద్దు, రీఫండ్ గురించిన సమాచారాన్ని కస్టమర్కు అధికారికంగా తెలియజేయడం తప్పనిసరి.ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏజెంట్లే..సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఆర్థిక ఉత్పత్తులను ప్రమోట్ చేసే వారిపై కూడా ఆర్బీఐ నిఘా పెంచింది. ప్రమోషన్లు లేదా కస్టమర్లను ఆకర్షించే ప్రక్రియలో పాల్గొనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సన్లు, అనుబంధ సంస్థలు, ఇతర డిజిటల్ మార్కెటింగ్ మధ్యవర్తులను ఇకపై డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు లేదా డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లుగానే పరిగణిస్తారు. తద్వారా వారికి కూడా బ్యాంకింగ్ నిబంధనలు, బాధ్యతలు వర్తిస్తాయి.ఉద్యోగుల ఇన్సెంటివ్లపై స్పష్టతబ్యాంక్ సిబ్బంది కస్టమర్లపై ఒత్తిడి తెచ్చి ఉత్పత్తులను విక్రయించకుండా చూసేందుకు ఆర్బీఐ ప్రోత్సాహకాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. థర్డ్ పార్టీ సంస్థలు (ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవి) నియంత్రిత సంస్థల/బ్యాంకుల ఉద్యోగులకు నేరుగా ప్రోత్సాహకాలు అందించడాన్ని పూర్తిగా నిషేధించారు. బ్యాంకులు లేదా నియంత్రిత సంస్థలు తమ సొంత సిబ్బందికి అంతర్గతంగా ప్రోత్సాహకాలను అందించుకోవచ్చు.గమనిక: అయితే, ఈ అంతర్గత ప్రోత్సాహక నిర్మాణాలు ఉద్యోగులను దూకుడుగా అమ్మకాలు జరిపేలా ప్రోత్సహించకూడదని, అది మిస్ సెల్లింగ్కు దారితీయకూడదని ఆర్బీఐ హెచ్చరించింది.ఈ నూతన నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు తమ సొంత ప్రకటనలు, మార్కెటింగ్, అమ్మకాల ప్రక్రియల కోసం ఒక సమగ్రమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో మిస్ సెల్లింగ్ మోసాలకు అడ్డుకట్ట పడటంతోపాటు కస్టమర్లలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం మరింత బలపడనుంది.ఇదీ చదవండి: బంగారు పంట పండింది!
‘సర్’లో టీడీపీ అక్రమాలపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో టీడీపీ సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని సోమవారం సచివాలయంలో కలిశారు. ‘సర్’ ప్రక్రియ సందర్భంగా ‘మై టీడీపీ యాప్’ ద్వారా ఓటర్ల కులం, ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను అధికార టీడీపీ సేకరించడంపై ఫిర్యాదు చేశారు.అనంతరం వారంతా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉన్న సచివాలయం ఐదో బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగా, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎదురుగా మరో బ్లాక్ ఎదుట మాట్లాడేందుకు వెళ్తుండగా అడ్డుకోవడం, సచివాలయ ఆవరణలో మాట్లాడకుండా నిరోధించటాన్ని వైఎస్సార్ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఆక్షేపించారు. సచివాలయం బయట మాట్లాడాలని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చెప్పడంపై మండిపడ్డారు.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన తర్వాత ప్రతిపక్షంగా తాము ఏం చెప్పామో వివరాలు వెల్లడించకూడదా? అంటూ నిలదీశారు. తాము ఎమ్మెల్సీలమని, సచివాలయంలో ఎమ్మెల్సీలను మీడియాతో మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సచివాలయం ఐదో బ్లాక్ ముందు మెట్లపై బైఠాయించారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు. మైక్లు లేకుండానే వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ‘సర్’ తొలిరోజే డేటా చోరీ..⇒ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా ⇒ ‘మై టీడీపీ’ యాప్ ద్వారా వ్యక్తిగత వివరాల సేకరణ ⇒ సీఈవోను కలిసి అక్రమాలపై ఫిర్యాదు చేశాంరాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీడీపీ నిస్సిగ్గుగా యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీకి తెర తీసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. సహచర ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తితో కలిసి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి వివేక్యాదవ్ని కలిసి సర్ ప్రక్రియ సందర్భంగా టీడీపీ చేస్తున్న అక్రమాలు, ఓటర్ల డేటా గోప్యతలో లోపాలపై ఫిర్యాదు చేశారు.అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని యాప్ ద్వారా సేకరిస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా ఒక్కో ఓటరును మీరు ఏ రాజకీయ పార్టీ? ఏ కులం? అని అడుగుతూ ఓటర్ల వివరాలను యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి అంశాలపై గోప్యత పాటించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఎక్కడా అది కనిపించడం లేదు. గోప్యంగా ఉండాల్సిన సమాచారం సేకరించి ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు ప్రయతి్నస్తున్నారు.ఎన్నికల కమిషన్, అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితాలు టీడీపీకి చెందిన బీఎల్ఏల చేతుల్లో కనిపిస్తున్నాయి. మాకు కూడా అలాంటి జాబితాలు ఇవ్వాలని అడిగాం. యాప్ లను అనుమతించే అవకాశం ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యాప్లను వినియోగించుకుంటుందని చెప్పాం. మ్యాపింగ్ కాని ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో డాక్యుమెంట్లు ఇస్తే తీసుకోవాలి.కానీ చాలాచోట్ల బీఎల్వోలు మాత్రం ఓటర్ల లిస్ట్ ప్రచురణ అయిన తర్వాత తీసుకుంటారని చెబుతున్నారు. అది సరికాదు. ఇప్పుడే డాక్యుమెంట్స్ ఇస్తే తీసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వాలని కోరాం. బీఎల్వోకు రాజకీయ పార్టీలు ఐడీ కార్డులు ఇస్తే వాటిని ఈసీ అధికారులు ధృవీకరించాలని కోరాం. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లను నమోదు చేశారు? ఎన్ని ఓట్లు మ్యాప్ చేశారు? ఎన్ని కాలేదు? అనే వివరాలు ఆన్లైన్లో పెట్టాలని సీఈవోను కోరాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు’ అని అప్పిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలకు గొంతెత్తి మాట్లాడే అవకాశం లేదా..? రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తరహాలో కూటమి ప్రభుత్వం ప్రజల గొంతులను నొక్కేందుకు యత్నిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నేతలు దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వం ఏ దిశగా పాలన చేయాలని ఆలోచిస్తోందో అర్థం కావడం లేదు. ఎమ్మెల్సీలుగా మాకు గొంతెత్తి మాట్లాడేందుకు మాకు అవకాశం లేదా? నియంత రాజ్యంలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. అధికారులను అడ్డుపెట్టుకుని మా గొంతు నొక్కాలని చూస్తోంది. ఎవరినీ అభిప్రాయాలు, సమస్యలు చెప్పుకోనివ్వడం లేదు. అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎన్ని నిర్భంధాలు పెట్టినా మేం ప్రజల గొంతుకగా మాట్లాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తాం’ అని అప్పిరెడ్డి స్పష్టం చేశారు.
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.6.44 వరకు, తదుపరి విదియ తె.4.22 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం: ఆరుద్ర రా.7.30 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.57 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు,అమృత ఘడియలు: లేవు.సూర్యోదయం : 5.29సూర్యాస్తమయం : 6.31రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం.... పరిచయాలు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనయోగం. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.వృషభం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మిథునం.... నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులు, సోదరుల నుంచి కీలక సమాచారం. భూవివాదాల పరిష్కారం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.కర్కాటకం.... రుణాలు చేయాల్సివస్తుంది. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.సింహం.... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు.కన్య.... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.తుల... మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు మీదపడతాయి.వృశ్చికం.... పనుల్లో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ధనుస్సు...... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో పూర్వవైభవం.మకరం.....శ్రమకు ఫలితం కనిపిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కుంభం...పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.....వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో అకారణంగా విభేదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
Health: కాళ్లు వాచిపోతే.. ఎలర్ట్ టైమ్!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు
డీల్పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట!
మరణ వాంగ్మూలం బీరువాలో.. ఫోటో ఆల్బంలో ఉంది!
లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా!
పెద్దిలో కొత్త సీన్స్.. థియేటర్లలో ఎప్పుడంటే?
ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం!
ఇక అణ్వాయుధాల జోలే లేదు.. నెతన్యాహు
విదేశీ యువతుల వలపు వల.. యువకుడికి దేహశుద్ధి
టీఎంసీలో మరో ట్విస్ట్.. అందుకు ఎమ్మెల్యేల నో!
పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!
లీటర్ పెట్రోల్.. 914 కిలోమీటర్ల మైలేజీ..
కొంపముంచిన అర్జున్ టెండూల్కర్
'నమ్మకం' లేదు
అఖిలేష్ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి
కాంచన-4లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్
22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
భూమిపై ఆఖరి చెట్టు.. గగుర్పాటు కలిగించే రెస్క్యూ ఆపరేషన్!
గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్మెంట్ మహాలక్ష్మి
సరిపోదు! ఇంకా త్యాగం చేయాలయ్యా!!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
ఈ రాశి వారికి ఆస్తి లాభం
బంగారం, వెండి ధరలు ఇలా..
CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!
కృతీ... నువ్వు సూపర్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
చహల్ విధ్వంసం.. 29 బంతుల్లోనే శతక్కొట్టాడు!
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
డోంట్ వర్రీ సార్! ఈసారి అమరావతి గ్రాఫిక్స్ ఏఐలో చేద్దాం!!
Health: కాళ్లు వాచిపోతే.. ఎలర్ట్ టైమ్!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు
డీల్పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట!
మరణ వాంగ్మూలం బీరువాలో.. ఫోటో ఆల్బంలో ఉంది!
లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా!
పెద్దిలో కొత్త సీన్స్.. థియేటర్లలో ఎప్పుడంటే?
ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం!
ఇక అణ్వాయుధాల జోలే లేదు.. నెతన్యాహు
విదేశీ యువతుల వలపు వల.. యువకుడికి దేహశుద్ధి
టీఎంసీలో మరో ట్విస్ట్.. అందుకు ఎమ్మెల్యేల నో!
పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!
లీటర్ పెట్రోల్.. 914 కిలోమీటర్ల మైలేజీ..
కొంపముంచిన అర్జున్ టెండూల్కర్
'నమ్మకం' లేదు
అఖిలేష్ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి
కాంచన-4లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్
22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
భూమిపై ఆఖరి చెట్టు.. గగుర్పాటు కలిగించే రెస్క్యూ ఆపరేషన్!
గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్మెంట్ మహాలక్ష్మి
సరిపోదు! ఇంకా త్యాగం చేయాలయ్యా!!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
ఈ రాశి వారికి ఆస్తి లాభం
బంగారం, వెండి ధరలు ఇలా..
CM Vijay: సీఎం విజయ్ విడాకుల కేసు.. రెండోసారి కూడా..!
కృతీ... నువ్వు సూపర్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
చహల్ విధ్వంసం.. 29 బంతుల్లోనే శతక్కొట్టాడు!
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
డోంట్ వర్రీ సార్! ఈసారి అమరావతి గ్రాఫిక్స్ ఏఐలో చేద్దాం!!
ఫొటోలు
‘ఇసాకపట్నం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)
సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)
బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాలను దర్శించుకున్న ముఖేష్ అంబానీ(ఫొటోలు)
హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)
‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్ లాంచ్లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)
ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)
‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినిమా
హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్
తెలుగులో పదుల సంఖ్యలో ఆల్బమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దారిపొంటొత్తుండు, పెద్దిరెడ్డి, నా పేరు ఎల్లమ్మ లాంటి హిట్ సాంగ్స్ మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అయితే తెలుగులో 'కలివనం' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది గానీ ఇదొకటి రిలీజైందనే సంగతి కూడా చాలామందికి తెలియదు! ఇప్పుడు తమిళంలో ఎంట్రీకి సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలోనే నాగదుర్గనే మెయిన్ హీరోయిన్. 'లవ్ ఓ లవ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే హీరోయిన్ పాత్రకు బాగానే ఇంపార్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రియుడితో ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మోడ్రన్ అమ్మాయిగా నాగదుర్గ కనిపించనుంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు.ఇప్పటికే తమిళంలో గౌరిప్రియ, శ్రీదివ్య లాంటి తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాగదుర్గ, వైష్ణవి చైతన్య లాంటి వాళ్లు కూడా తమిళంలోకి వెళ్లిపోతున్నారు. మరి తమిళంలో వీళ్లకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగు దర్శకులు మాత్రం వీళ్లని పెద్దగా పట్టించుకోవట్లేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)
వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది
'పెద్ది' సినిమాకు బోలెడంత హైప్ రావడానికి, అలానే చిన్నపాటి వివాదానికి 'చికిరి చికిరి' సాంగ్ ఎంతలా కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు నెలల క్రితం దీని లిరికల్ వీడియో రిలీజైనప్పుడు వెంటనే శ్రోతలకు నచ్చేసింది. అదే టైంలో 'సరకు సామాను' అనే లిరిక్స్పై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. వాటిని సరిచేసి థియేటర్లో కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. చిరు, రామ్ చరణ్ ఘనత)'సరకు సామాను' అని ఉన్న చోట 'సొగసు సింగారం' అని మార్చారు. ఇకపోతే మూవీలో జాన్వీ కపూర్ పాత్ర, అందచందాలని చూపించిన తీరుపైన చాలానే విమర్శలు వచ్చాయి. దీంతో దర్శకుడు బుచ్చిబాబు.. క్షమాపణ కూడా చెప్పాడు. అలానే సదరు సన్నివేశాల్ని కూడా తొలగిస్తామని పేర్కొన్నాడు. బుధవారం నుంచి ఇందుకు సంబంధించిన కొత్త వెర్షన్స్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇంతలోనే చికిరి చికిరి పూర్తి వీడియోని యూట్యూబ్లో విడుదల చేశారు. ఇకపోతే మూవీ విడుదలకు ముందు ప్రమోషన్లలో తెగ కనిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. తర్వాత మాత్రం ఒక్కటంటే ఒక్కదానిలోనూ కనిపించలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)
అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ముందే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రేక్షకుడికి మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేశామని నాగార్జున తెలిపారు.అయితే ఈ మూవీని పెద్ది కోసమే లెనిన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న పెద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేందుకే లెనిన్ విడుదల వాయిదా వేయడమే సరైన నిర్ణయమని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. దీంతో లెనిన్ వాయిదాకు పెద్దినే కారణమని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది.
టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. తండ్రి, తనయుల ఘనత..!
రామ్ చరణ్ పెద్ది మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల రాబట్టేలా కనిపిస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన దక్షిణాది చిత్రంగా ఘనత సాధించింది.తండ్రి, తనయుల అరుదైన రికార్డ్..అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సైతం బాక్సాఫీస్ వద్ద నిలిచాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓకే ఏడాది తండ్రి, తనయులు సినిమాలు రూ.300 కోట్లకు పైగా వసూళ్ల సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ సినీ చరిత్రలోనే కొత్త రికార్డ్ సృష్టించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #Peddi grosses over 393 CRORES WORLDWIDE IN 11 DAYS 🔥🔥Running successfully all over in its second week 💥🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/bayNZVZzB3— PEDDI (@PeddiMovieOffl) June 15, 2026
క్రీడలు
నేటి నుంచి రగ్బీ ప్రీమియర్ లీగ్
సాక్షి, హైదరాబాద్: ఏడాది క్రితం భారత యువ క్రీడాభిమానులకు అలరించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్కు రంగం సిద్ధమైంది. ఈసారి టోర్నీకి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదిక కావడం విశేషం. నేడు ప్రారంభం కానున్న రగ్బీ లీగ్ ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. పురుషుల విభాగంలో 34, మహిళల విభాగంలో 14 కలిపి 13 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల విభాగంలో 6 టీమ్లో బరిలో నిలిచాయి. చెన్నై బుల్స్ డిఫెండింగ్ చాంపియన్ కాగా...హైదరాబాద్ హీరోస్, ఢిల్లీ రెడ్స్, కోల్కతా బంగా టైగర్స్, ముంబై డ్రీమర్స్, బెంగళూరు బ్రేవ్హార్ట్స్ పోటీ పడుతున్నాయి. గత ఏడాది టోర్నీలో హైదరాబాద్ హీరోస్ మూడో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో ఇవే పేర్లతో ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. హైదరాబాద్, బెంగళూరు జట్లకు మహిళల విభాగంలో ప్రాతినిధ్యం లేదు. రగ్బీ సెవెన్ ఫార్మాట్లో లీగ్ను నిర్వహిస్తారు. 22 నిమిషాల పాటు జరిగే ఒక్కో మ్యాచ్ను నాలుగు క్వార్టర్లుగా నిర్వహిస్తారు. మ్యాచ్లో ఒక్కో క్వార్టర్ తర్వాత 2 నిమిషాల చొప్పున మూడు ‘బ్రేక్’లు ఉంటాయి. టోర్నీ ఆరంభానికి ముందు రోజు సోమవారం జరిగిన కార్యక్రమంలో రగ్బీ ఇండియా అధ్యక్షుడు, ప్రీమియర్ లీగ్ కమిషనర్ అయిన రాహుల్ బోస్ ట్రోఫీతో పాటు టోర్నీ ప్రత్యేక బంతిని ఆవిష్కరించారు.
ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జడ్డూ అద్భుత ఆటగాడని.. అతడిని వన్డే వరల్డ్కప్-2027లో ఆడిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే, అందుకోసం ముందుగా జడేజా సెలక్టర్లను ఒప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.ఈ ఏడాది మూడు వన్డేలు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓవర్కు ఆరు చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో వన్డే సిరీస్కు జడ్డూ ఎంపిక కాలేదు. యువ ఆల్రౌండర్ హర్ష్ దూబే తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు.మరోవైపు.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడగా.. నితీశ్ కుమార్ రెడ్డి అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ 37 ఏళ్ల జడ్డూ భవిష్యత్తు గురించి మాట్లాడాడు. హార్దిక్ పాండ్యా తిరిగి వస్తే.. ‘‘జడేజాను ఇప్పుడే లెక్కలోంచి తీసేయొద్దు. అతడు ఇప్పటికీ అద్భుతమైన క్రికెటరే. నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యా తిరిగి వస్తే.. నితీశ్కు బదులు అతడే జట్టులో ఉంటాడు.ఇక హార్దిక్తో పాటు జట్టులో ఉన్న మరో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజానే. అతడు ప్రపంచకప్ వరకు కొనసాగితే బాగుంటుంది. అయితే, అందుకు జడ్డూ తన ప్రదర్శనతో సెలక్టర్లను మెప్పించాల్సి ఉంది. ప్రస్తుతం అతడు ఫామ్లో లేకపోవచ్చు. కానీ జట్టు నుంచి పూర్తిగా తప్పిస్తామంటే మాత్రం అది మూర్ఖత్వమే అవుతుంది’’ అని చిక్కా పేర్కొన్నాడు.ఫామ్లోకి వస్తేనేకాగా 2027లో జరిగే వన్డే వరల్డ్కప్లో దిగ్గజ బ్యాటింగ్ ద్వయం విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ ఆడతారా లేదా? అన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక అరుదుగా జట్టుకు దూరమయ్యే కోహ్లి.. తొడకండరాల గాయంతో అఫ్గన్తో వన్డే సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. మరోవైపు.. ఫిట్నెస్ సాధించి తిరిగి వచ్చిన రోహిత్ అఫ్గనిస్తాన్తో తొలి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 16 పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో చిక్కా మాట్లాడుతూ.. రోహిత్ ఫామ్లోకి వస్తేనే ప్రపంచకప్ జట్టులో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. లేదంటే అతడికి చోటు దక్కడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.చదవండి: శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం
న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం అందుకుంది. లార్డ్స్ వేదికగా తొలి టెస్టులో పర్యాటక కివీస్ను 115 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం (జూన్ 17) నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగారెండో టెస్టు మొదలుకానుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తాజాగా తమ తుదిజట్టును ప్రకటించింది. నైట్క్లబ్ వివాదం నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ బెన్స్టోక్స్పై వేటు వేసిన బోర్డు.. అతడి స్థానంలో రెండో టెస్టుకు వెటరన్ ప్లేయర్ జో రూట్ సారథిగా వ్యవహరిస్తాడని తెలిపింది.ఇద్దరి అరంగేట్రంఇక కివీస్తో రెండో టెస్టు సందర్భంగా తమ జట్టు తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నట్లు ఈసీబీ వెల్లడించింది. వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్, హాంప్షైర్ ఫాస్ట్ బౌలర్ సోనీ బేకర్ టెస్టుల్లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది.కాగా జోర్డాన్ ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున మూడు వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్లు ఆడాడు. మరోవైపు.. బేకర్ ఇప్పటికి రెండు వైట్బాల్ మ్యాచ్లలో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, చివరగా అతడు 2025లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక జోర్డాన్ ఎనిమిది నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు.ఇదిలా ఉంటే.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా రెండో టస్టు సందర్భంగా జట్టుతో చేరుతున్నాడు. కాగా నైట్క్లబ్ వివాదంలో స్టోక్స్తో పాటు ఆల్రౌండర్ గస్ అట్కిన్సన్ మీద కూడా వేటు పడింది. ఇక ఓలీ రాబిన్సన్ను విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో జోర్డాన్, బేకర్, ఆర్చర్ తుదిజట్టులోకి వచ్చారు.న్యూజిలాండ్తో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మ్యాట్ ఫిషర్, ఎమీలియో గే, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.చదవండి: శ్రీలంకప్లేయర్ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ..
అంపైర్లతో తిలక్ వర్మ, వైభవ్ వాగ్వాదం.. తిలక్ను తోసేసి..
భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది.అయితే, శ్రీలంక ఇన్నింగ్స్లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.Vaibhav Sooryavanshi sending off Captain Tilak Varma from arguing with Umpire.pic.twitter.com/067cYfhmo2— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026అయితే, కాసేటికే తిలక్ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో తిలక్ బంతిని అర్షద్ ఖాన్కు ఇవ్వగా.. లంక కెప్టెన్ సహన్ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్కాగా.. తదుపరి మరో సింగిల్ వచ్చింది.మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్గా మలచగా.. ఆరో బంతి నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్ విషయంలో కూడా తిలక్ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే బ్యాటింగ్కు దిగగా.. భారత్కు ఓటమే ఎదురైంది. A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026చదవండి: శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. వీడియో వైరల్
న్యూస్ పాడ్కాస్ట్
వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ‘సర్’ పేరుతో టీడీపీ యాప్
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి... వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయడం హేయం... చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో హైఅలర్ట్... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
ఏపీలో చంద్రబాబు దగా పాలనపై ప్రజా ఉద్యమం... ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీల్లో ఉప్పొంగిన జనహోరు
దగా ‘డీఎస్సీ’.. ‘మెగా’ స్కామ్!. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్...
నేడు విశాఖకు వైఎస్ జగన్మోహన్రెడ్డి... స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
బిజినెస్
జూన్ 30 డెడ్లైన్.. ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్!
భారతదేశంలో ఎల్పీజీ సబ్సిడీలను పారదర్శకంగా.. సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లక్షలాది ఎల్పీజీ వినియోగదారులు, ముఖ్యంగా 'ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన' (PMUY) లబ్ధిదారులు, తమ eKYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఈ ప్రక్రియను 2026 జూన్ 30లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులు ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులకు ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ వంటి సంస్థల ద్వారా వచ్చే సబ్సిడీలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.ఈకేవైసీ ప్రక్రియ సులభంగా ఉంటుందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. వినియోగదారులు తమ మొబైల్ యాప్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇండేన్ వినియోగదారులు ఇండియన్ఆయిల్ వన్ యాప్ ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్ యాప్ ద్వారా, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు హెచ్పీ పే యాప్ లేదా ఆధార్ ఫేస్ఆర్డీ యాప్ ద్వారా ఈకవైసీ పూర్తి చేయవచ్చు. ఇందులో ఓటీపీ ధృవీకరణ, ఆధార్ లింకింగ్, ఫేస్ అథెంటికేషన్ వంటి దశలు ఉంటాయి.ఇదీ చదవండి: కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. కాగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పరిధిలో లేని వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి కాదు. అయితే అయితే అర్హులైన వారు సమయానికి పూర్తి చేయకపోతే సబ్సిడీ ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి గడువు (జూన్ 30)లోపు ఈ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసుకోవడం ఉత్తమం.एलपीजी सब्सिडी का लाभ बिना किसी रुकावट के प्राप्त करते रहें।30 जून 2026 से पहले अपना eKYC पूरा करें। यह प्रक्रिया सरल, सुरक्षित और पूर्णतः निःशुल्क है। आप इसे इंडियनऑयल ONE ऐप, अपने इंडेन वितरक या एलपीजी डिलीवरी कर्मी के माध्यम से आसानी से पूरा कर सकते हैं।आज ही eKYC करवाएँ… pic.twitter.com/E7bukytXWA— Indian Oil Corp Ltd (@IndianOilcl) June 12, 2026
అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ నియామకం
ప్రముఖ కార్పొరేట్ వైద్య సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తమ సరికొత్త హెల్త్ టెక్ స్పిన్-ఆఫ్ (నూతన విభాగం) పునర్నిర్మాణంలో భాగంగా కీలక ప్రకటన చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి ఈ ప్రతిపాదిత పథకానికి తుది ఆమోదం లభించిన అనంతరం అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా శోభన కామినేనిని నియమించనున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. కంపెనీ ప్రతిపాదిత విభజన, అపోలో హెల్త్ టెక్ లిస్టింగ్ (స్టాక్ మార్కెట్లో నమోదు), కార్పొరేట్ గవర్నెన్స్ (పాలనా ఫ్రేమ్ వర్క్)కు సంబంధించిన అదనపు వివరాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.12 మందితో బోర్డు ఏర్పాటుదీర్ఘకాలిక విలువ సృష్టి, పారదర్శకమైన పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ పునర్నిర్మాణ పథకంలో బలమైన అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ను రూపొందించినట్లు అపోలో తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. అపోలో హెల్త్ టెక్ బోర్డులో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉంటారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బోర్డులో సగం మంది (ఆరుగురు) స్వతంత్ర డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. బోర్డులోని ప్రతి డైరెక్టర్ తమ విశ్వసనీయ విధులకు కట్టుబడి ఉంటారని, స్వతంత్ర డైరెక్టర్లు స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ సమతుల్య నిర్ణయాలు తీసుకునేలా చూస్తారని కంపెనీ పేర్కొంది. నిబంధనలను పర్యవేక్షించేందుకు ఒక లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ను నియమించనున్నట్లు, బోర్డు వ్యవహారాలను క్రమానుగతంగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది.శోభన కామినేని నియామక నిబంధనలు, పదవీకాలం, వేతన ప్యాకేజీకి సంబంధించి వాటాదారుల అనుమతిని త్వరలోనే కోరనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, పాలనాపరమైన పారదర్శకత కోసం పెట్టుబడిదారు లేదా ప్రమోటర్ గ్రూప్ వాటా 10 శాతం కంటే తగ్గితే వారి నామినేషన్ హక్కులు ముగుస్తాయి.అప్సైడ్ అగ్రిమెంట్ వివరాలుఈ విలీన పథకంలో భాగమైన ‘అప్సైడ్ అగ్రిమెంట్’ గురించి వస్తున్న ఊహాగానాలకు అపోలో తెరదించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిధులను వ్యూహాత్మక పెట్టుబడిదారు రాస్మేలి (Rasmeley) మాత్రమే సమకూరుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వల్ల అపోలో హెల్త్ టెక్ నుంచి గానీ, దాని ప్రస్తుత వాటాదారుల నుంచి గానీ ఎటువంటి నగదు బయటకు వెళ్లదు.వ్యూహాత్మక పునర్నిర్మాణం లక్ష్యం ఇదే..అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చేపట్టిన ఈ భారీ విభజన, పునర్నిర్మాణ పథకం వెనుక స్పష్టమైన వ్యాపార వ్యూహం ఉంది. కంపెనీకి చెందిన సేవలను విడివిడిగా విభజించి (స్పిన్ ఆఫ్), విలీనం చేయడం ద్వారా స్వతంత్రంగా మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఓమ్నిఛానల్ రిటైల్ ఫార్మసీ, ఫార్మసీ పంపిణీ వ్యాపారం, డిజిటల్ హెల్త్ వ్యాపారం (Apollo 24/7 వంటి డిజిటల్ సేవలు) వంటి విభాగాలన్నింటినీ ‘అపోలో హెల్త్ టెక్’ గొడుగు కిందికి తెచ్చి ప్రత్యేకంగా వృద్ధి పథంలో నడిపించనున్నారు.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం
భారత్లో మరో టెస్లా కారు.. డెలివరీ షురూ!
టెస్లా భారతదేశంలో లాంచ్ చేసిన మోడల్ వైఎల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. 6-సీటర్ ఎలక్ట్రిక్ SUV రూపంలో లాంచ్ అయిన ఈ కారు ప్రారంభ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ మోడల్ కంటే కూడా విశాలమైన క్యాబిన్ పొందుతుంది. ఇది 2+2+2 సీట్ల అమరికలో ఉంటుంది.మోడల్ YLలో 16-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం 8-అంగుళాల టచ్స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్, 2వ వరుస సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, 19-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.మోడల్ YL డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది. ఇది 5.0 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుందని. ఇది ఒక ఫుల్ ఛార్జితో 681 కి.మీ రేంజ్ అందిస్తుందని టెస్లా పేర్కొంది. ఇది 250 kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 15 నిమిషాల్లో 288 కి.మీ వరకు ప్రయాణించగల ఛార్జింగ్ పొందగలరు.
బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాల వృద్ధికి రూ.10 కోట్ల విరాళం
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ హిమాలయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ క్షేత్రాల అభివృద్ధి, నిర్వహణ కోసం రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. శతాబ్దాల నాటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.కట్టుదిట్టమైన భద్రతఉదయం 10:00 గంటలకు ముఖేష్ అంబానీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బద్రీనాథ్ హెలిప్యాడ్కు చేరుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా వలయం నడుమ ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న అంబానీ దాదాపు 20 నిమిషాల పాటు బద్రి విశాల్ భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 10 నిమిషాల పాటు సాంప్రదాయ ఆచారాలను నిర్వహించారు.కమిటీతో భేటీ - విరాళంపూజా కార్యక్రమాల అనంతరం బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు పుణ్యక్షేత్రాల మౌలిక వసతులు, అభివృద్ధి, నిర్వహణ పనుల నిమిత్తం రూ.10 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఉదయం 10:40 గంటలకు బద్రీనాథ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:15 గంటలకు కేదార్నాథ్ చేరుకున్నారు. అక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి జలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.జై శ్రీరామ్ నినాదాలతో..కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో అంబానీని చూసిన భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అంబానీ చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తులను పలకరించారు. పర్యటన ముగిసిన అనంతరం ఆయన మధ్యాహ్నం తిరుగుపయనమయ్యారు.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం
ఫ్యామిలీ
పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్ సివిల్స్ విజయగాథ..!
ఎన్నో సివిల్స్ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో మరోసారి సివిల్స్కి సన్నద్ధమైంది. కానీ ఈ సారి వరుస వైఫల్యాలు ఎదురవ్వుతున్నా.. వెనక్కి తగ్గకుండా ప్రయత్నించి ఐఏఎస్ అధికారి అయ్యింది. అపజయం అంటే విజయానికి ముగింపు కాదని..ప్రయత్నం ఆపకపోవడం అని చాటిచెప్పి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే కేరళకు చెందిన కాజల్ రాజు. ఆమె పుట్టుకతో ఫోకోమెలియా సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి కారణంగా కుడి ముంజేయి లేకుండా జన్మించింది. ఆమె చిన్ననాటి నుంచి చదువులో ముందంజలో ఉండేది. అలా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన ఐఐటి మద్రాస్లో డెవలప్మెంట్ స్టడీస్లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిందామె. అయితే క్యాంపస్లో ఉన్నప్పుడే ప్రజా సేవపై మక్కువ ఏర్పడింది. అలా సివిల్స్ వైపు అడుగులు వేసింది. అయితే తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుని ఆల్ ఇండియా 910వ ర్యాంకు దక్కించుకుని ఐఆర్ఎస్కు ఎంపికైంది. అయితే కాజల్ అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరడమే లక్ష్యంగా మరోసారి సివిల్స్కి సన్నద్ధమైంది. ఈసారి మరింతగా ర్యాంకును మెరుగుపరుచుకోవాలనుకుంటే..మరింతగా ర్యాంకు దిగజారగా, మూడోసారి ఏకంగా ప్రిలిమ్స్లోనే ఓటమిని చవి చూసింది. నిజానికి ఈ వరుస వైఫల్యం ఎవ్వరికైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయేలా చేస్తుంది. కానీ కాజల్కి మరింతగా బలంగా ప్రిప్రేరవ్వాలన్న కసి అంతకంతకు పెరిగింది. అలా ఆమె సివిల్స్లో చివరికి ఆల్ ఇండియా ర్యాంక్ 167కి మెరుగుపరుచుకుని ఐఏఎస్ అధికారి అయ్యింది. ఇక్కడ కాజల్కి రైల్వే సర్వీస్ శిక్షణ, యూపీఎస్సీ ప్రిపరేసన్ అత్యంత సవాలుగా మారింది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ చదవడం అత్యంత కష్టంగా ఉన్నా..ఏదోరకంగా ప్రిపరేషన్ కొనసాగించేది. తనకు ఏ కాస్త చిన్న సమయం దొరికినా..పుస్తకాలతో కుస్తీ పట్టేది. అంతేగాదు ఉద్యోగ బిజీ షెడ్యూల్ని, ప్రిపరేషన్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి క్రమశిక్షణతో కూడిన నిలకడ అవసరం. ఈ కథ ఎదురుదెబ్బలు విజయాన్ని ఆలస్యం చేయొచ్చేమో గానీ అందుకోసం ప్రయత్నం మాత్రం ఆపకూడదనే స్ఫూర్తిని సివిల్స్ ఔత్సాహికుల్లో నింపుతోంది కదూ..!.(చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..)
92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..
తొమ్మిది పదుల వయసులో వృద్ధాప్యాన్ని దిక్కరించేలా చురుగ్గా ఉందామె. సింపుల్గా చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తిలా ఉంది. ఆమె కండరాల శక్తి, యాక్టివిటీని చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు మించి తీవ్రమైన వ్యాయామాలు చేస్తంటుంది. పైగా 60 దాటినవారు చేయకూడని వ్యాయమాలే అయినా..ఈ బామ్మ మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తుంది. అంతేగాదు ఆమెను చూడగానే తొమ్మిది పదుల వయసు ఉన్న వ్యక్తిలా కనిపించదు..జస్ట్ 30 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఇంతలా యంగ్లుక్లో ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఆ బామ్మ పేరే ఎమ్మా మరియా మజెంగా. ఇటలీలో పాడువాలో నివశిస్తున్న రిటైర్డ్ సైన్స్ టీచరమ్మ. ఆమె ఎన్నో ప్రపంచిరికార్డులు కలిగి ఉన్న అగ్రశ్రేణి స్ప్రింటర్. పరుగు పందెంలో ఆమెకు సాటిలేరెవ్వెరూ అన్నట్లుగా ఎన్నో పతకాలు సొంతం చేసుకుందామె. వయసు పరంగా 90 ఏళ్లు పైబడిన వ్యక్తిలా ఉండదు..30 ఏళ్ల మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధాప్యాన్నే ధిక్కరించేలా హెల్దీగా ఉండే తీరు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపర్చింది. వాళ్లు సైతం ఆమె ఆరోగ్యంపై స్టడీ చేయగా..ఆమె శరీరంలోని కండరాలు..30 ఏళ్ల వ్యక్తుల మాదిరిగా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. తొంభై ఏళ్ల వయసులో కూడా ఈ రన్నింగ్ పోటీల్లో ఎలా పాల్గొనగలుగుతోందే అనే కుతూహలంతో ఆమె శరీరం తీరుపై పరిశోధన చేయగా..30 ఏళ్ల క్రీడాకారుల ఫిట్నెస్ని పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేగాదు ఆక్సిజన్ను శక్తిగా మార్చే మైటోకాండ్రియా, ఆమె కండరాలలోని 20 ఏళ్ల యువకుడిలో ఉన్నంత దృఢత్వంతో పనిచేస్తోందట. ఎమ్మా కథ వ్యాయామ దినచర్య వృద్ధాప్యాన్ని తిరగరాయగలదని చెబుతోంది. అయితే గంటల తరబడి మారథాన్ చేయదామె..కేవలం నిలకడతో తేలికపాటి వ్యాయామాలోతోనే ఈ ఫిట్నెస్ని సాధించిందామె. ఎమ్మా చేసే వ్యాయామం గంటలోపే పూర్తవ్వుతుందట. వార్మప్, తేలికపాటి జాగింగ్, లక్షిత స్ప్రింట్ల శ్రేణి, వాకింగ్, చిన్నపాటి తీవ్రత వ్యాయామాలు ఉంటాయంతే. అలాగే డైట్ పరంగా గుడ్లు, చేపలు, కూరగాయలపై దృష్టి పెడుతూ..సమతుల్యత పాటిస్తానంటోందామె.ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలుఎమ్మా జీవనశైలి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం దీర్ఘాయువు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్వకాలను అనుగుణంగా ఉంటుందట. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం డబ్ల్యూహెచ్ఓ వారమంతా 150 నుంచి 300 నిమిషాల తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను, లేదా 75 నుంచి 150 నిమిషాల అధిక-తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను సిఫార్సు చేస్తుంది. అలాగే పడిపోవడాన్ని నివారిస్తూ..ఎముకల ఆరోగ్యం కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు శక్తి శిక్షణకు ప్రాధాన్యతనిచ్చే వర్కౌట్లను సూచించింది. అలాగే వృద్ధులు తమ వ్యక్తిగత ఫిట్నెస్కు అనుగుణంగా తమ శ్రమ స్థాయిలను సర్దుబాటు చేసుకోవాలని WHO స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎమ్మా వంటి వారు అందుకు విభిన్నమని తొంభైలో కూడా యువకుల మాదిరి అధిక తీవ్రత వ్యాయమాలు చేయగలరని తెలుస్తోంది. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost) (చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..)
ది డివోర్స్
ఆరోజు వాట్సప్లో వచ్చిన ఆ ఉత్తరాన్ని చదివిన విపుల్ భార్య నివ్వెరపోయింది. అది విడాకులు కోరుతూ తన భర్త లాయర్ నుంచి వచ్చిన నోటీస్. కారణం ఇన్ కంపాటిబిలిటీ. ఆమె అహం దెబ్బతింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా ఆ నోటీస్ని పంపాడని ఆమె మథనపడసాగింది. అది ఆమెకి నమ్మశక్యంగా లేదు. తల్లికి మైనర్ సర్జరీ జరుగుతూంటే తను వారం క్రితం పుట్టింటికి వచ్చింది. ఆమె దాన్ని తన తండ్రికి ఫార్వర్డ్ చేసింది. పావుగంట తర్వాత ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కంగారుగా అడిగాడు. ‘‘ఏమిటిది బేబీ విచిత్రంగా?’’ ‘‘అవును. నాకూ చిత్రంగానే ఉంది.’’‘‘ఇన్ కంపాటిబిలిటీ అంటే ఏమిటో అతగాడికి ఫోన్ చేసి కనుక్కో.’’ ఆయన కోపంగా చెప్పాడు.‘‘నేను కనుక్కోను. ఇలాంటి విషయాల్లో ముందు నాతో సంప్రదించడం మర్యాద. అతను ఆ మర్యాదని నిలబెట్టుకోలేదు.’’ ఆమె కఠినంగా చెప్పింది. ‘‘నేను కనుక్కుంటాను. మీ మధ్య పోట్లాటేదైనా జరిగిందా?’’ ఆయన అడిగాడు.‘‘వచ్చే ముందు చిన్న పోట్లాట జరిగింది. ఇల్లు కట్టుకుంటానంటే నాతో చెప్పకుండా తన తమ్ముడికి ఐదు లక్షలు పంపాడు. నేను నెలకి ఎంత చొప్పున ఎంతకాలంలో తిరిగి ఇవ్వాలో షెడ్యూల్ కూడా పంపమని సలహా ఇచ్చాను. తన తమ్ముడికి అప్పు ఇవ్వలేదని, బహుమతి ఇచ్చానని చెప్పాడు. క్రితం నెలలోనే తల్లి పుట్టినరోజుకి ఏభై వేలు పెట్టి పట్టుచీర కొన్నాడు. నేను పదివేల చీర సరిపోదా అని అడిగాను.’’‘‘రేపు పిల్లలు పుడితే అతనికే జాగ్రత్త వస్తుంది.’’ ఆయన చెప్పాడు. ‘‘లేదు. లేదు. రాదు. ఆ మనిషికి తన వాళ్ళంటే ప్రేమ. ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఇంత దాకా పాతిక లక్షల దాకా ఇచ్చి ఉంటాడు. ఇంకో పాతిక వేసుకుంటే మన ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేది. నెలకి రెండున్నర వేలైనా అద్దె వచ్చేది.’’‘‘ఫైనాన్స్ కాక ఈమధ్య ఇంకేమైనా పొరపొచ్చాలు ఉన్నాయా?’’ ‘‘లేవు. మా అత్తమామలు వచ్చి మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. మా మామగారి డామినేషన్ భరించలేను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి పూట ఏది వండాలి, ఇలా అన్నీ ఆయన శాసించినట్లే జరగాలి.’’ ‘‘అవును. పెళ్ళిలోనే అది గమనించాను.’’ అరగంట తర్వాత ఆయన కూతురికి ఫోన్ చేసి చెప్పాడు.‘‘మాట్లాడానమ్మా. కారణం ఇదని స్పష్టంగా చెప్పలేదు. ‘మోస్ట్ ఇన్కంపాటిబుల్ వైఫ్తో జీవించలేను’ అన్నాడు. ‘మా నాన్న కోతా కాఫీ పౌడర్ని కొనమంటే బ్రూక్బాండ్ కొన్నది లాంటి అన్నీ సిల్లీ కారణాలే. అతని మనసులో అసలు కారణం ఏదో ఉంది. అది దాస్తున్నాడు. అతను ఇంకెవరితోనైనా క్లోజ్గా ఉండటం నీకు తెలుసా?’’‘‘లేదు. నాకా అనుమానమే లేదు. అతను అలాంటివాడు కాదు. నేనంటే చాలా చాలా ప్రేమ నాన్నగారు.’’కూతురి కంఠంలోని దుఃఖాన్ని ఆయన పసిగట్టాడు.‘‘నేను వీకెండ్కి వచ్చి పర్సనల్గా మాట్లాడతానని చెప్పాను. ‘మాది ప్రేమ వివాహం. మీ ప్రమేయంతో జరగలేదు. కాబట్టి ఇప్పుడు మీ ప్రమేయం వద్దు’ అన్నాడు. రాజీమార్గాలన్నీ ఖండించాడు. నాకు అంతా అయోమయంగా ఉంది.’’ ఆయన బాధగా చెప్పాడు. ఆయన భార్య మాత్రం తొణకలేదు. కూతురికి ధైర్యం చెప్తూ చెప్పింది.‘‘ఈరోజుల్లో విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకోవడం చాలా మామూలు. మీకు పిల్లల కూడా లేరు. కాబట్టి మళ్ళీ పెళ్ళి తేలిక. ఈ కాలం పిల్లలు జీవితాన్ని వృథా చేసుకోవడం లేదు. నీకు వచ్చే జీతం తక్కువేం కాదు. తన మీద నువ్వు ఆధారపడి లేవు. ’’బయటకి చెప్పకపోయినా ఆవిడ మనసులో బాధగానే ఉంది.‘‘ఏం జవాబు చెప్పావు? లాయర్ నోటీస్ వస్తే మనం జవాబు ఇవ్వకపోతే ఒప్పుకున్నట్లు అవుతుంది అని విన్నాను.’’ ఆవిడ అడిగింది. ‘‘అతను కచ్చితంగా డైవర్స్ కోరుకుంటే నేను అతన్ని పట్టుకుని వేలాడను. మళ్ళీ లాయర్ ఖర్చు కూడా ఎందుకు? కామ్గా ఉందాం. ఇదే ఫైనల్ డెసిషన్.’’తల్లిదండ్రులకి కూతురు సంగతి తెలుసు కాబట్టి ఆమె మనసు మార్చటానికి గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఆమె విపుల్ నుంచి వ్యక్తిగత మెసేజ్ కోసం ఎదురు చూసింది. కాని రాలేదు. రెండు వారాల తర్వాత కోర్ట్ నించి విడాకుల కేసుకి నోటీస్ వచ్చింది. అప్పటికే అందుకు సిద్ధపడ్డ ఆమె విచారించలేదు. వరసగా మూడు వాయిదాలకి సమన్ వచ్చినా ఆమె కోర్ట్కి హాజరు కాలేదు.∙∙ విపుల్ నుంచి ఆమెకి ఓ రోజు మెసేజ్ వచ్చింది. ‘ఇప్పుడే విడాకులు మంజూరయ్యాయి. ఎందుకో నీకు చెప్పాలి. ఐ లవ్ యు. అందులో మార్పు లేదు. మరి ఈ విడాకులు దేనికి? నేను మరణించాక నా ఆస్తి, పి.ఎఫ్. బెనిఫిట్స్ నా తల్లితండ్రులకి అందడానికి. భార్యగా నువ్వు హక్కుగా అవి వాళ్ళకి వెళ్ళకుండా కోర్ట్కి ఎక్కుతావని నాకు తెలుసు. వాళ్ళు ఆస్తిని పోగొట్టుకుంటారు తప్ప నీతో కోర్ట్లో ఫైట్ చేయరు. దాన్ని నివారించడానికి విడాకులని ఎన్నుకున్నాను. నీకు ఆర్థికంగా ఏ లోటూ లేదు. నువ్వు నామీద ఆధారపడిలేవు. నీ ఉద్యోగం, నీ ఆస్తి నీకు ఉన్నాయి. ఆరు నెలల తర్వాత నేను నీకు, నా తల్లిదండ్రులకి, అసలు ప్రపంచానికే కనిపించను. ఫోర్త్ స్టేజిలోని నా కేన్సర్ ఐదారు నెలలు మించి నన్ను బతకనివ్వదని డాక్టర్ చెప్పాడు. గెట్ మేరీడ్ డార్లింగ్. ఐ లవ్ యు అండ్ గుడ్లక్.’’ మల్లాది వెంకట కృష్ణమూర్తి(చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు)
కాబోయే అమ్మకు కడుపులో వికారం
గర్భధారణ తర్వాత చాలామంది మహిళల్లో వాంతులు అవుతుండటం చాలా సాధారణం. వాంతులు కావడం అనే లక్షణాన్ని బట్టి ఒక మహిళ గర్భవతి అయ్యిందనే సూచన మన చాలా సినిమాల్లో కనిపించడం సాధారణమే. గర్భవతులైన అందరిలోనూ ఇదే లక్షణం కనిపించకపోయినప్పటికీ కొందరిలో ఇలా వాంతులు కావడం చాలా సాధారణం. అలాగే గర్భధారణ జరిగిన చాలామంది మహిళల్లో వికారం (నాసియా) అనే లక్షణమూ కనిపిస్తుంది. గర్భవతుల్లో ఇలా ఎందుకు జరుగుతుందో, వికారంగా ఉండటం లేదా వాంతులు ఎక్కువగా అవుతున్న మహిళల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.గర్భవతుల్లో కనిపించే వాంతులు ఎక్కువగా కావడం, వికారంగా ఉండటాన్ని డాక్టర్లు సాధారణ పరిభాషలో ‘మార్నింగ్ సిక్నెస్’గా డాక్టర్లు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపించడానికి దేహంలో స్రవించే ఒక హార్మోన్ కారణమవుతుంది. మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్న మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... మార్నింగ్ సిక్నెస్ కారణంగా వాంతులు అవుతున్న గర్భవతులు రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. కొవ్వులు, మసాలాలూ ఎక్కువగా ఉండే హెవీ ఫుడ్ కాకుండా... ఆహారం చాలా తేలిగ్గా ఉండి, సులువుగా జీర్ణమయ్యేలాంటి బ్లాండ్ డైట్ తీసుకుంటూ ఉండటం మేలు. ద్రవాహారాలు... అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పండ్లు కూడా ఎక్కువగానే తింటూ ఉండటం మంచిది. పచ్చళ్లు, నూనెవస్తువులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వాంతులు అవుతున్నా దాన్ని విస్మరించి, ఏదో ఒకటి తింటూ ఉండండి. ఎందుకంటే... వాంతులవుతున్నందున అసలే తినకపోతే ఎసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరువాంతులు, రక్తపువాంతులు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటివారు అవసరమైనప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే కొన్ని రకాల యాంటాసిడ్ మందులు, వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన యాంటీఎమెటిక్ మందులను వాడవచ్చు. అయితే వీటిని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. చాలామందిలో మార్నింగ్ సిక్నెస్ చాలా సహజం. దాని గురించి ఆందోళన అక్కర్లేదు. అయితే అది చాలాకాలం కొనసాగుతుంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. వాంతుల కారణంగా బిడ్డకు పోషకాలు అందవా?కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు తమకు చాలా ఎక్కువగా వాంతులు అవుతున్నాయనీ, దాంతో కడుపులోని బిడ్డకు అందాల్సిన పోషకాలు అందవేమోనని ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వాంతులు అవుతున్నా బిడ్డకు అందాల్సిన పోషకాలు అందుతూనే ఉంటాయి.ఇటీవలి అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే...ఇటీవల ఓ తాజా అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... గర్భవతుల్లో వాంతులకు ప్రధానంగా గ్రోత్ డిఫరెన్సియేషన్ ఫ్యాక్టర్ –15 (జీడీఎఫ్–15) అనే అంశం కూడా ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ ఫ్యాక్టర్ వల్ల కొత్తగా గర్భధారణ జరిగిన మహిళల్లో... ఆకలి లేకపోవడం, ఏ ఆహారమూ రుచిగా అనిపించక΄ోవడం / రుచి తెలియక΄ోవడం, వికారం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయం తాజాగా వెల్లడయ్యింది. గర్భధారణ తర్వాత మహిళల్లో వాంతులు ఎందుకంటే...ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రాపిన్’ (హెచ్సీజీ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. మహిళ దేహానికి ఈ హర్మోన్ ఒక సందేశం పంపిస్తుంది. అదేమిటంటే... ‘ఈ దేహంలో గర్భధారణ ప్రక్రియ మొదలైంది. కాబట్టి నెలనెలా వచ్చే పీరియడ్స్ ప్రక్రియను ఆపేసి, ఇక గర్భధారణ ప్రక్రియ కోసం అవసరమైన ప్రొజెస్టెరాన్ను స్రవించమనీ, తద్వారా... అండం ఆశ్రయం తీసుకోవాల్సిన ‘ఎండోమెట్రియమ్–యుటెరైన్’ పొరలను మరింత మందంగా చేయడం, తద్వారా గర్భం నిలబడేలా చేయాలం’టూ ఈ హెచ్సీజీ హార్మోన్ ద్వారా దేహానికి సందేశం అందుతుంది. అయితే కొందరిలో ఈ ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాపిన్ (హెచ్సీజీ) చాలా తక్కువ మోతాదులో, మరికొందరిలో చాలా ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఆ హార్మోన్ కారణంగా గర్భవతుల్లో కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఓ మోస్తరుగా, మరికొంతమందిలో చాలా ఎక్కువగా వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. డాక్టర్ పి. స్వప్న, సీనియర్ కన్సల్టెంట్ అబ్స్టెట్రిక్స్ – గైనకాలజీ నిర్వహణ: యాసీన్(చదవండి: ఫైట్ అండ్ ప్లైట్లో గ్రాండ్ మాస్టర్)
అంతర్జాతీయం
రాజభవనం టూ జైలు.. యువరాణి కుమారుడికి నాలుగేళ్ల శిక్ష
ఒస్లో: నార్వే రాజ కుటుంబాన్ని గత రెండేళ్లుగా కుదిపేస్తున్న లైంగిక దాడుల కేసులో కీలక తీర్పు వెలువడింది. నార్వే యువరాణి మెట్టే మారిట్(Mette-Marit) కుమారుడైన మారియస్ బోర్గ్ హోయిబీ(Marius Borg Hoiby)పై నమోదైన అత్యాచారం, గృహహింస, బెదిరింపులు తదితర కేసుల్లో ఓస్లో జిల్లా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, ఈ కేసు నార్వే చరిత్రలో రాజ కుటుంబానికి సంబంధించిన అత్యంత వివాదాస్పద నేర విచారణల్లో ఒకటిగా నిలిచింది. నెలల తరబడి సాగిన దర్యాప్తు, ఆరు వారాలకు పైగా కొనసాగిన విచారణ తర్వాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది.ఎవరు మారియస్?మారియస్ బోర్గ్ హోయిబీ నార్వే యువరాణి మెట్టే-మారిట్కి మొదటి వివాహం ద్వారా జన్మించాడు. 2001లో ఆమె యువరాజు హాకోన్ను వివాహం చేసుకుంది. అనంతరం, మారియస్ కూడా రాజకుటుంబంలో భాగమయ్యాడు. అయితే అతనికి రాజవంశ వారసత్వ హక్కులు లేదా అధికారిక రాజకుటుంబ హోదా లేవు. అయినప్పటికీ, చిన్నప్పటి నుంచే రాజకుటుంబ సభ్యుడిగా ప్రజల దృష్టిలో ఉన్నాడు.ఏయే ఆరోపణలు ఎదుర్కొన్నాడు?ప్రాసిక్యూషన్ ప్రకారం, మారియస్పై మొత్తం 40 వరకు క్రిమినల్ ఆరోపణలు నమోదయ్యాయి. వాటిలో.. నాలుగు అత్యాచార ఆరోపణలు, మహిళలపై లైంగిక దాడులు, గృహహింస, బెదిరింపులు, నిరోధాజ్ఞ (Restraining Order) ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి కేసులు ఉన్నాయి. దీంతో, ప్రాసిక్యూటర్లు అతడికి 7 సంవత్సరాల 7 నెలల జైలు శిక్ష విధించాలని కోరగా, కోర్టు చివరకు నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది.కోర్టు ఏం తేల్చింది?కోర్టు రెండు అత్యాచార కేసుల్లో మారియస్ను దోషిగా నిర్ధారించింది. మరికొన్ని అత్యాచార ఆరోపణల నుంచి అతడికి విముక్తి లభించినప్పటికీ, గృహహింస మరియు ఇతర నేరాల్లో కూడా దోషిగా తేలాడు. విచారణ సమయంలో బాధిత మహిళల వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్ డేటా, సందేశాలు, వీడియో ఆధారాలు తదితర అంశాలను కోర్టు పరిశీలించింది. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు నార్వే సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి.మరోవైపు.. మారియస్ అత్యాచార ఆరోపణలను ఎప్పటి నుంచో ఖండిస్తున్నాడు. తాను అత్యాచారాలకు పాల్పడలేదని, అయితే కొన్ని చిన్న నేరాలు, మాదకద్రవ్యాల రవాణా, దాడి వంటి ఆరోపణలను మాత్రం అంగీకరించాడు. తీర్పుపై అప్పీల్ చేసే హక్కు అతనికి ఉంది.రాజ కుటుంబంపై తీవ్ర ప్రభావంఈ కేసు నార్వే రాజ కుటుంబ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. విచారణ సమయంలో రాజ్యాంగ రాజరిక వ్యవస్థపై ప్రజల మద్దతు కూడా తగ్గిందని సర్వేలు సూచించాయి. అయితే ఇటీవలి నెలల్లో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఈ పరిణామాల మధ్య యువరాణి మెట్టే-మారిట్ తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె ప్రస్తుతం ఊపిరితిత్తుల మార్పిడి (Lung Transplant) కోసం వేచి ఉన్నట్లు సమాచారం. తన తల్లి ఆరోగ్య పరిస్థితి కారణంగా తాత్కాలిక విడుదల కోరిన మారియస్ అభ్యర్థనను కూడా అప్పీల్ కోర్టు తిరస్కరించింది.నార్వేలో చర్చనీయాంశంరాజ కుటుంబానికి సమీప వ్యక్తి అయినప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమేనని ఈ తీర్పు మరోసారి రుజువు చేసిందని మహిళా హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. రాజకీయ, సామాజిక వర్గాలు కూడా నార్వే న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశంసిస్తున్నాయి.
స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్కు చేదు అనుభవం
స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగం చేస్తుండగా కొందరు విద్యార్థులు వాకౌట్ చేశారు. ప్రభుత్వ మరియు రక్షణ రంగ సంస్థలతో గూగుల్ ఒప్పందాలకు నిరసనగా కొంతమంది విద్యార్థుల బృందం సభ నుండి బయటకు వెళ్ళిపోయి నిరసనను వ్యక్తం చేసింది. ప్రభుత్వ, రక్షణ సంబంధిత పనులలో ప్రధాన టెక్ సంస్థల ప్రమేయంపై యూఎస్ క్యాంపస్లలో విద్యార్థులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ నిరసన చోటు చేసుకోవడం గమనార్హం.సాధారణంగా విద్యార్థుల ఆనందోత్సాహాలు, సాధించిన విద్యా విజయాలతో ఎంతో ఉత్సాహంగా జరగాల్సిన ఈ వేడుక విద్యార్థుల వాకౌట్తో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. ప్రసంగం కొనసాగుతుండగా పలువురు గ్రాడ్యుయేట్లు ఒకేసారి లేచి బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా'స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా', 'నో టెక్ ఫర్ అపార్తీడ్' వంటి సామాజిక సంస్థలు ఈ నిరసన చేపట్టాయి. దీంతో పిచాయ్ తన ప్రసంగాన్ని టెక్నాలజీ అంశాలపై లోతైన చర్చకు దూరంగా, పట్టభద్రులకు సాధారణ సలహాలకే పరిమితం చేశారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మరియు ఇమ్మిగ్రేషన్ విభాగాలతో గూగుల్ కుదుర్చుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఈ నిరసన చేపట్టారు.Stanford grads walk out as Google CEO Sundar Pichai takes the stage as commencement speaker. No mention of AI, unlike other uni speakers getting booed down this year. Story for @sfgate shortly pic.twitter.com/qvS2rJ91Ip— Matt Brown (@maattttbrown) June 14, 2026మరోవైపు ఇటీవల ఇతర యూనివర్సిటీల్లో ఇలాంటి విషయాలపై టెక్ ప్రముఖుల ప్రసంగాలకు విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో 2015 నుండి గూగుల్కు నాయకత్వం వహిస్తున్న, స్టాన్ఫర్డ్ పూర్వ విద్యార్థి పిచాయ్, తన ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా సాంకేతిక రంగ పరిణామాల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?సుందర్ పిచాయ్ సందేశంపిచాయ్ ప్రసంగాన్ని చాలా సరళంగా, వ్యక్తిగత విషయాలకే పరిమితం చేశారు. 1990లలో కాలిఫోర్నియాలో తన తొలి రోజుల నాటి ఒక జ్ఞాపకాన్ని పంచుకున్నారు. అలాగే ఈ వేదికపై "ఏం మాట్లాడకూడదో" తనకు చాలా సలహాలు వచ్చాయంటూ కాస్త హాస్యాన్ని జోడించారు. డిగ్రీ పూర్తి చేసుకుని కొత్తగా కెరీర్ ప్రారంభించబోయే విద్యార్థులు ఎల్లప్పుడూ ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్
నెతన్యాహుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుపై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన రహస్య చర్చల ఫలితంగా కుదిరిన శాంతి ఒప్పందం చివరి దశలో ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. మొత్తం ప్రక్రియను దాదాపు పట్టాలు తప్పించిందని ట్రంప్ ఆరోపించారు. నెతన్యాహు చాలా కఠినమైన వ్యక్తి అంటూ మండిపడ్డారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు దాదాపు చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నెతన్యాహూ చాలా కఠినమైన వ్యక్తి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చల ప్రక్రియను మరింత క్లిష్టం చేశాయి’ అని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇజ్రాయెల్కు బలమైన మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన ట్రంప్ నేరుగా నెతన్యాహూను విమర్శించడం విశేషంగా మారింది.అయితే, ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనుక అణ్వాయుధం చిక్కి ఉంటే, రెండు గంటల్లో ఇజ్రాయెల్ భూమిమీద లేకుండా ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కాగా.. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పంద చర్చల్లో ఇజ్రాయెల్ ప్రత్యక్ష భాగస్వామిగా లేకపోవడం గమనార్హం. దీంతో ఒప్పందంలోని కొన్ని అంశాలను ఇజ్రాయెల్ అంగీకరించడం కష్టమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా-ఇరాన్ ఒప్పందంపై వార్తలు వెలువడిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై కొనసాగుతున్న పోరాటాన్ని నిలిపివేయడానికి నెతన్యాహుపై అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ మధ్య విభేదాలా?ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలపై కొత్త చర్చ మొదలైంది. ఇరాన్ అంశంలో ఇరు దేశాల తుది లక్ష్యం ఒకటే అయినప్పటికీ, దాన్ని సాధించే మార్గాల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దౌత్య చర్చలు, ఒప్పందాలు, ఆంక్షల సడలింపులతో సమస్య పరిష్కారం చేయాలని అమెరికా భావిస్తుండగా.. కఠిన భద్రతా చర్యలు, సైనిక ఒత్తిడి, ముందస్తు దాడుల ద్వారా ఇరాన్ను నియంత్రించాలని ఇజ్రాయెల్ అనుకుంటోంది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్
ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవన శైలి, సమతుల ఆహారం, కనీసం వ్యాయామం అవసరమని ఆరోగ్యనిపుణులు నిరంతరం చెప్పేమాట. దాదాపు 93 ఏళ్ల వయసులోనూ సగం వయసున్న వారి కంటే ఎక్కువ ఫిట్నెస్తో జీవించాలంటే ఏం చేయాలి? శాస్త్రవేత్తలనే అబ్బుర పరిచిన ఇటలీకి చెందిన ఎమ్మీ మరియా మజ్జెంకా (Emma Maria Mazzenga) ఫిట్నెస్ రహస్యాల గురించి తెలుసుకుందాం.ఇటలీలోని పాడువా నగరానికి చెందిన 92 ఏళ్ల ఎమ్మీ మరియా మజ్జెంకా ఒక రిటైర్డ్ హైస్కూల్ సైన్స్ టీచర్. 90-94 ఏళ్ల విభాగంలో పలు ప్రపంచ రికార్డులను సృష్టించిన ఎలైట్ స్ప్రింటర్ (పరుగు పందెం క్రీడాకారిణి). ఆమె శారీరక దృఢత్వంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అద్భుతమైన విషయాలు వెలుగు చూశాయి.ఆమె శరీరం ఆక్సిజన్ను గ్రహించి, కండరాలకు సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం 30 ఏళ్ల యాక్టివ్ యువతులలో ఉన్నంత శక్తివంతంగా ఉంది. కణాలకు శక్తిని అందించే మైటోకాండ్రియా (Mitochondria) పని తీరు 20 ఏళ్ల యువతలో ఉన్నంత బలంగా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వ్యాయామం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను పూర్తిగా మార్చేయవచ్చని ఎమ్మీ జీవితం నిరూపిస్తోందని వ్యాయామ ఫిజియాలజిస్ట్ సిమోన్ పోర్సెల్లి పేర్కొన్నారు.ఎమ్మీ ఫిట్నెస్ వ్యూహం గంటల తరబడి కష్టపడే మారథాన్లపై ఆధారపడలేదు. ఆమె కేవలం క్రమశిక్షణ (Consistency) ను నమ్ముకున్నారు.వర్కౌట్ ప్లాన్ఆమె వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే వర్కౌట్ చేస్తారు. ప్రతి సెషన్ గంట లోపే ఉంటుంది. ఆమె సుదీర్ఘ పరుగు పందాల్లోనూ పాల్గొనరు.తేలికపాటి జాగింగ్తో వార్మప్, కొన్ని షార్ట్ స్ప్రింట్స్ (వేగవంతమైన పరుగు), ప్రతిరోజూ అవుట్డోర్ వాకింగ్, అప్పుడప్పుడు తేలికపాటి రెసిస్టెన్స్ వ్యాయామాలు అంతే ఆమె రొటీన్.ఇక ఆహార నియమాలువిషయానికి వస్తే..పెద్దగా నియంత్రణలు కూడా ఏమీలేవు. కఠినమైన డైట్ జోలికి వెళ్లరు. కానీ చాలా తేలికపాటి సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా చేపలు, గుడ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు. అయితే, తనకు నచ్చినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా మాంసం కూడా తింటూ సమతుల్యతను కాపాడుకుంటారు.90 ఏళ్ల వయసు దాటినా కూడా శరీరం వ్యాయామానికి ఎంతో అద్భుతంగా స్పందిస్తుందని ఎమ్మీ మరియా మజ్జెంకా జీవితం ప్రపంచానికి నిరూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మీ జీవనశైలి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వృద్ధాప్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.WHO ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు పాటించాల్సిన రూల్స్ వారానికి కనీసం 150 నుండి 300 నిమిషాల మధ్యస్థ-తీవ్రత కలిగిన వ్యాయామం, లేదా 75 నుండి 150 నిమిషాల కఠినమైన వ్యాయామం .శారీరక సమతుల్యత , కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలను వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు చేయడం వల్ల కింద పడకుండా ఉండటంతో పాటు ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.కదలికలు లేకుండా కూర్చునే అలవాట్లను మానుకుని, కేవలం తేలికపాటి వాకింగ్ చేసినా కూడా వృద్ధాప్యంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?
జాతీయం
పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
లక్నో: వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కావాల్సిన బ్యాగ్స్,బుక్స్, పెన్నులు కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేషనరీ షాపులకు క్యూకట్టారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీస్శాఖ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసింది. స్టేషనరీ షాపుల్లో కొనుగోలు చేసే పెన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.పెన్నుల్లా కనిపించేవన్నీ పెన్నులు కాదని.. సంఘ విద్రోహ శక్తులు పెన్నులకు బదులు..వాటి ఆకారంలో ఉండే బాంబుల్ని తయారు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని విడుదల చేసింది.ఉత్తరప్రదేశ్లో పెన్ ఆకారంలో ఉన్న అనుమానాస్పద వస్తువులపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బులంద్షహర్ జిల్లా పోలీసులు (ఖుర్జా పోలీస్ స్టేషన్ పరిధి) ఈ అడ్వైజరీని విడుదల చేశారు. పెన్లా కనిపించే అనుమానాస్పద వస్తువులను తాకరాదని ప్రత్యేక సూచనలు చేశారు. ఇవి విస్ఫోటక పరికరాలుగా మార్పిడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ప్రజలు రోడ్లపై, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో లేదా ఎడారిలాంటి ప్రాంతాల్లో కనిపించే వస్తువులను తాకకుండా 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారం అత్యంత కీలకమని, శిక్షణ పొందిన భద్రతా సిబ్బందే ఇలాంటి వస్తువులను పరిశీలించాని తెలిపారు. ప్రజలు సూచనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.
64 శాతం భారీ లోటు : విస్తృత వర్షాలెక్కడ? షాకింగ్ అంచనాలు
దక్షిణ, మధ్య ప్రాంతాల్లోకి ఇటీవల రుతుపవనాలు విస్తరించినప్పటికీ, దేశంలోని చాలా ప్రాంతాలలో అనుకున్నంత వర్షపాతం నమోదు కాలేదు. మురిపించినట్టే మురిపించిన మేఘాలు తగినతంగానే వర్షించకుండానేమాయమైపోతున్నాయి. ఇదే విషయాన్ని ఉపగ్రహ చిత్రాలుకూడా వెల్లడిస్తున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాలు ఎందుకు దోబూచులాడుతున్నాయనే ఆందోళన నెలకొంది. ఐఎండి (IMD) గణాంకాల ప్రకారం, జూన్ 4 నుండి జూన్ 15 మధ్య సాధారణంగా కురవాల్సిన 53.7 మి.మీ. వర్షపాతానికి బదులుగా కేవలం 19.2 మి.మీ. మాత్రమే నమోదైంది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా వర్షపాతంలో 64 శాతం లోటు ఏర్పడింది. అంటే భారతదేశ నైరుతి రుతుపవనాలు దాదాపుగా అదృశ్యమైనట్లు కనిపిస్తోంది. శాటిలైట్ అండ్ ఐఎండి (IMD) డేటా ప్రకారం, భారతదేశంలోని చాలా ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడ్డాయి. ఈ వారం చివర్లో వర్షపాతం మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, ఎగువ వాతావరణంలోని గాలుల కారణంగా రుతుపవనాల కార్యకలాపాలు గణనీయంగా నిలిచిపోయాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ 14 , 15 తేదీలలో తీసిన INSAT-3DS ఉపగ్రహ చిత్రాలలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. నైరుతి రుతుపవనాలు కరుణించకపోవడంతో అటు రైతులు, ఇటు సామాన్యులు ఆకాశం వైపు చూస్తూన్నారు. ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ, వర్షం ఎందుకు కురవడం లేదు? అనే మీమాంసలో పడిపోయారు. భారీ వర్షపాత లోటుజూన్ 4 నుండి జూన్ 15 మధ్య కాలంలో సాధారణంగా కురవాల్సిన 53.7 మి.మీ. వర్షపాతానికి గానూ దేశంలో కేవలం 19.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏకంగా 64శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఐఎండీ (IMD) మ్యాప్ ప్రకారం మధ్య, దక్షిణ , తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందంటున్నారు.ఇదీ చదవండి: ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!సాధారణంగా రుతుపవనాలు యాక్టివ్గా ఉన్నప్పుడు దేశమంతటా దట్టమైన మేఘాలు వ్యాపించి ఉంటాయి. కానీ జూన్ 15 నాటి INSAT-3DS ఉపగ్రహ చిత్రాల ప్రకారం, ద్వీపకల్ప (పెనిన్సులర్), మధ్య భారతదేశ ఆకాశం అసాధారణంగా నిర్మలంగా కనిపిస్తోంది. మేఘాల కదలికలు కేవలం హిమాలయాలు, ఈశాన్య భారత్, ఇండో-గంగా మైదానాల ఉత్తర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అరేబియా సముద్రం వైపు రుతుపవన శాఖ బలహీనపడింది. ఇటీవలి రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగినప్పటికీ ఈ మందగమనం చోటుచేసుకుంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సమస్య చుట్టుపక్కల సముద్రాలపై తేమ కొరత వల్ల కాదు, భూ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల పైన జరుగుతున్న ఒక పెద్ద వాతావరణ సంఘర్షణ వల్ల ఏర్పడింది.ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి!రుతుపవనాలు మందగమనానికి కారణాలుసముద్రాలలో తగినంత తేమ ఉన్నప్పటికీ, వాతావరణంలో ఎగువ పొరల్లో జరుగుతున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రుతుపవనాల సమయంలో ఇది ఉత్తరానికి వెళ్లాల్సి ఉండగా, ఈసారి అసాధారణంగా దక్షిణం వైపునకు మరలిపోతున్నాయి. ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ పై ప్రభావమే కారణమా? ఈ బలమైన పశ్చిమ గాలులు (Westerlies), రుతుపవనాలకు ఇంజిన్లా పనిచేసే తూర్పు గాలుల (Easterlies) మెకానిజంను అణచివేస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమ ఉన్నప్పటికీ, మేఘాలు ఏర్పడటానికి మరియు వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులు లభించడం లేదు. అయితే వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే. ఈ వారం చివర్లో జెట్ స్ట్రీమ్ సరళి బలహీనపడి, రుతుపవన వ్యవస్థ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అప్పటి వరకు, నైరుతి రుతుపవనాలిచ్చే విస్తృత వర్షాల కోసం భారతదేశంలోని చాలా ప్రాంతాలు వేచి ఉండవలసిందే.ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?
టీచర్స్ స్కామ్.. అభిషేక్ బెనర్జీపై ప్రశ్నల వర్షం
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన భారీ అవినీతి స్కామ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ లోతైన విచారణ జరుపుతుంది. ఈ అంశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఈ రోజు (సోమవారం) అధికారులు విచారించారు. కోల్కతాలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిన్న ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అధికారులు అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు.మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలు ,నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల్లో ఆయన పాత్రపై ఈడీ అభిషేక్ బెనర్జీని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది. ఈనెట్వర్క్ ద్వారా, అర్హులైన అభ్యర్థుల కంటే లంచాలు చెల్లించిన వ్యక్తులకే ప్రాధాన్యత లభించిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. స్కామ్ నేపథ్యంపశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా మండలి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రూప్-సి, గ్రూప్-డి సిబ్బందితో పాటు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, అర్హత గల అభ్యర్థులను పక్కన పెట్టి, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అర్హత లేని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. అక్రమాల కోసం OMR షీట్ల తారుమారు చేశారని కొందరు ఖాళీ పేపర్లు వదిలినా వారికి ఉద్యోగాలు వచ్చాయని, అధికారిక అర్హత లేకపోయినా, అక్రమ మార్గాల్లో వందలాది మందికి నకిలీ సిఫార్సు లేఖల ద్వారా నియామక పత్రాలు అందజేశారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను వెనుకకు నెట్టి, లంచాలు ఇచ్చిన వారి పేర్లను మెరిట్ లిస్ట్లో పైకి చేర్చారని ఆరోపణలున్నాయి. దీంతో ఈ స్కామ్పై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ED అరెస్ట్ చేసింది. అర్పితా ముఖర్జీ నివాసాల నుంచి సుమారు రూ. 50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!
ఐవీఎఫ్ పేరుతో కొంతమంది వైద్యుల ఆగడాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కేసు సంచలనం రేపుతోంది. తమకు పుట్టిన పిల్లల డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో గురుగ్రామ్కు చెందిన దంపతులు లబోదిబో మన్న వైనం వెలుగులోకి వచ్చింది.గురుగ్రామ్కు చెందిన రాహుల్ రాథోడ్, అతని భార్య మీనూ రాథోడ్ సంతానంకోసం గత ఏడాది ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతిని ఎంచుకున్నారు. జనవరిలో మీనూ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఆ పిల్లలు తమ పోలికలతో అస్సలు సరిపోలకపోవడంతో అనుమానం వచ్చి, పిల్లల డీఎన్ఏ (DNA) పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నారు. టెస్ట్ రిపోర్ట్స్లో వారు షాకయ్యే నిజం తెలియడంతో పిల్లలు పుట్టారన్న సంతోషం కాస్తా పీడకలగా మారిపోయింది. మరొక జంటకు చెందిన పిండాన్ని (embryo) మీనూ రాథోడ్ గర్భాశయంలో ప్రవేశపెట్టారని ఆరోపిస్తూ భర్త పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఆరోపణపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఢిల్లీ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది.ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?दिल्ली में IVF से जन्मे जुड़वां बच्चों का DNA माता-पिता से नहीं हुआ मैच, FIR दर्ज #Delhi | @PallavMishra11 pic.twitter.com/sxyWJZSH5T— NDTV India (@ndtvindia) June 14, 2026ఏం జరిగింది?ద్వారకాలోని ఒక ఆసుపత్రి తమను ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో ఉన్న ఒక ఇన్ఫెర్టిలిటీ (సంతానలేమి) క్లినిక్కు ఐవీఎఫ్ చికిత్స కోసం పంపిందని, అక్కడ డాక్టర్ శివానీ సచ్దేవ్ ఈ కేసును పర్యవేక్షించారని రాహుల్ రాథోడ్ తెలిపారు. గత ఏడాది జనవరి 9న వైద్యులు ఆ మహిళకు ఐవీఎఫ్ సంబంధిత పరీక్షలు నిర్వహించి, భర్త వీర్యం, అండం ఉపయోగించే పిండాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలా అభివృద్ధి చేశామని చెప్పిన పిండాన్ని మే 14న మీనూ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 5న ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ట్విన్స్ పోలీకలపై అనుమానంతో టెస్ట్ చేయించారు. చివరికి వారు అనుమానించినట్టుగానే ఆ పిల్లలు బయోలాజికల్గా వారిద్దరికీ పుట్టినవారు కాదని ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లో తేలింది. దీంతో క్లినిక్ వాళ్లే ఏదో మాయ చేశారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రాహుల్ రాథోడ్ డిమాండ్ చేశారు. దర్యాప్తు కోసం ఆసుపత్రిలోని ఐవీఎఫ్ రికార్డులు, పిండానికి సంబంధించిన పత్రాలు, ల్యాబ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటా, సీసీటీవీ (CCTV) ఫుటేజీలను భద్రపరచాలని ఆయన కోరారు. తమలాగే ఐవీఎఫ్ క్లినిక్ల వల్ల మోసపోయిన పలు దేశాలలోని దంపతులనుండి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మీనూ రాథోడ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి!
ఎన్ఆర్ఐ
వందలాది భారతీయుల డ్యాన్సింగ్ వీడియో : దుమారం, అసలు ట్విస్ట్ ఇదీ!
కెనడాలోని రద్దీగా ఉండే టొరంటో వీధుల్లో వందలాదిమంది భారతీయులు నృత్యం చేసిన ఘటన, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా భారతదేశపు వలసరాజ్యం లా మారిపోతోంది అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా కెనడా స్థానికులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా జరగనివ్వమని స్థానికులు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది.ఒక యూజర్ వివాదాస్పదమైన క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కెనడా ఇప్పుడు భారతీయ వలసరాజ్యంగా మారిపోయింది. టొరంటోలో కెనడియన్లే ఇప్పుడు మైనారిటీలుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి సంఖ్య గతంలో కంటే మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనిని మనం ఇలాగే వదిలేయ కూడదు. కెనడియన్లారా, ఇప్పటికైనా మేల్కోండి అంటూ ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అంతేకాదు రాబోయే కొద్ది సంవత్సరాల్లో కెనడాలోని 'బ్రాంప్టన్' నగరం పూర్తిగా భారతీయ మూలాలున్న వారితో నిండిపోయి, వారే మెజారిటీగా మారే నగరంగా రూపాంతరం చెందుతుంది. ఇది కెనడాపై జరుగుతున్న థర్డ్ వరల్డ్ (మూడో ప్రపంచ దేశాల) ఆక్రమణ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.This is neither Indian culture nor art. This is a disgusting display of a cheap Bollywood reel. Come to Canada and see how despised the community is becoming. https://t.co/PzV8uFX4dP— Ashis Basu 🇨🇦 ashis.bluesky.social (@BasuAshis) June 3, 2026 Until they aren’t creating a chaos in public, causing hindrance to people in general, no traffic snarls They are allowed to spread #IndianCulture #IndianHeritage and #IndianHistory across the globe - Period pic.twitter.com/ElBYbX2TOE— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) June 3, 2026నెటిజన్ల స్పందనకల్చర్ మిస్ అవుతోంది, అసలు ఇది కెనడానా లేక ఇండియా అర్థం కావడం లేదు. కెనడా తన సొంత సంస్కృతిని కోల్పోతోంది. వలస వచ్చిన వారు ఇక్కడి సంస్కృతిని, పద్ధతులను గౌరవించాలంటూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఇండియన్స్కు మద్దతుగా నిలిచారు. భారీగా పన్నులు చెల్లిస్తూ, కీలకమైన ఉద్యోగ కొరతను తీర్చే వలసదారుల కష్టంతోనే కెనడాఎదుగుతోందని విమర్శించారు. .మరికొందరు ఈ వేడుకల వల్ల ఎవరికి నష్టం జరిగింది. ప్రజలు ఆనందంగా గడపడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్తో రోజుకు రూ. 1500మరోవైపు విదేశాల్లో భారతీయుల వ్యవహార శైలిపై కొంతమంది భారతీయులు విమర్శించారు. ఇది భారతీయ సంస్కృతీ కళ కానే కాదు. ఇది ఒక చౌకబారు బాలీవుడ్ రీల్స్ స్టంట్ అంటూ మండిపడుతూ ఆశిస్ బసు ట్వీట్ చేయగా, స్థానిక సంస్కృతిలో కలిసి పోకుండా విదేశాలలో తమ మాతృదేశ సంప్రదాయాలను ఎందుకు అనుకరిస్తున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. కొంతమందైతే, ఇటువంటి వేడుకలను పూర్తిగా నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు.2024 ലെ ഒരു വീഡിയോ. കാനഡയിലെ ടോറോന്റോയിൽ നിന്നുള്ളത്. ഇന്ത്യക്കാരാണ് ഡാൻസ് ചെയ്യുന്നത്. പക്ഷെ രണ്ടു വർഷത്തിന് ശേഷം, ഇപ്പോൾ വീണ്ടും ഈ വീഡിയോ സോഷ്യൽ മീഡിയയിൽ വൈറലാകുന്നുണ്ട്. ഈ ഡാൻസ് വീഡിയോയുടെ കമന്റ് സെക്ഷൻ മുഴുവൻ, വംശീയ അധിക്ഷേപങ്ങൾ കൊണ്ട് നിറഞ്ഞതാണ്. #dance #toronto pic.twitter.com/XO1RRZjQAZ— OBC - OffBeat Concerns (@OffBeatConcerns) June 5, 2026ట్విస్ట్ ఏంటంటే..ఇది 2024 నాటి వీడియో. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియో కామెంట్ సెక్షన్ మొత్తం జాతి వివక్షాపూరిత దూషణలతో నిండిపోయింది. ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: యూట్యూబర్ రమా నందన(అలియాస్ నందు), ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో నందన దంపతులు కోట్లలో మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు.. ఆ దంపతులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్లో మోసం చేశారంటూ నందు దంపతులపై వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.యూకే వీసా రెన్యువల్ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని క్రాంతి కుమార్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు.
23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్లు.. అసలేంటి ఈ కథ?
యూకేలో భారతీయ సంతతి మహిళ 23 ఏళ్ల విడాకుల పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. యూకేలోనే అత్యంత అరుదైన.. సుదీర్ఘమైన విడాకుల పోరాటంలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ ఏకంగా 6.6 మిలియన్ పౌండ్ల(సుమారు రూ. 85 కోట్లు) పరిహారాన్ని సాధించారు. ఈ కేసు 2002లో ప్రారంభమైంది. తన భర్త భద్రేష్ గోహిల్ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని.. అతని ప్రవర్తన సరిగ్గా లేదని వర్షా గోహిల్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఆనాటికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఆర్థిక సెటిల్మెంట్ చాలా సాదాసీదాగా ముగిసినట్లు కనిపించింది. వర్షా దాదాపు 2,70,000 పౌండ్లు (సుమారు రూ. 3.5 కోట్లు) నగదుతో పాటు కుటుంబానికి చెందిన ప్యుజో (Peugeot) కారును తీసుకోవడానికి అంగీకరించారు. కానీ, తన భర్త తన ఆస్తులన్నింటినీ నిజాయితీగా వెల్లడించలేదని ఆమె పేర్కొంది.నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో ముడిపడి ఉన్న భారీ మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి) కేసులో భద్రేష్ గోహిల్ ప్రధాన నిందితుడిగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆఫ్షోర్ కంపెనీలు, క్లయింట్ ఖాతాల ద్వారా భద్రేష్ మిలియన్ల కొద్దీ పౌండ్లను అక్రమంగా బదిలీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్రకు పాల్పడినట్లు రుజువు కావడంతో 2011లో భద్రేష్ గోహిల్ 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.విచారణలో మొదటి విడాకుల కేసు సమయంలో బయటపడని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ కంపెనీల ద్వారా భద్రేష్ దాదాపు 28 మిలియన్ పౌండ్లను దాచాడనే కారణంగా అధికారులు ఆ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ కొత్త ఆధారాలు వర్షా గోహిల్కు తన పాత విడాకుల సెటిల్మెంట్ను తిరిగి సవాలు చేయడానికి కొండంత బలాన్ని ఇచ్చాయి.ఈ కేసు చివరకు యూకే కోర్టుకు చేరింది. భర్తకు చెందిన జప్తు చేసిన ఆస్తుల నుంచి తనకు మరింత భరణాన్ని ఇవ్వలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన మొత్తం యావత్తూ అక్రమార్జన కాదని.. అందులో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో వర్షా గోహిల్ వాదనతో అంగీకరించిన కోర్టు.. జప్తు చేసిన మొత్తంలో 66 లక్షల పౌండ్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇకపై ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేయడంతో ఈ 23 ఏళ్ల సుదీర్ఘ సమరానికి ఎట్టకేలకు తెరపడింది.
న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్ని ఘనంగా సత్కరించారు.ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు.
క్రైమ్
కీచక ఎస్ఐ: భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేళ్లుగా..!
వరంగల్ క్రైం: ఓ వివాహితకు న్యాయం చేస్తానని నమ్మించి, పెళ్లి పేరుతో మోసం చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన సీసీఎస్ విభాగ ఎస్సై రాజ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆదివారం వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన ఓ యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అనంతరం వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో 2022 మార్చిలో బాధితురాలు తన భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాజ్కుమార్ బాధితురాలికి న్యాయం చేస్తానని నమ్మించాడు. తనకు పరిచయం ఉన్న న్యాయవాది ద్వారా ఆమెకు భర్త నుంచి విడాకులు ఇప్పించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నమ్మకం సంపాదించుకున్నాడు.ఈ క్రమంలో బాధితురాలితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంబంధం కారణంగా ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా రాజ్కుమార్ నిరాకరించినట్లు బాధితురాలు ఆరోపించింది.తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించడంతో నిందితుడు రాజ్కుమార్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
లైంగిక వేధింపులు భరించలేక.. బంధువునే చంపేశారు..!
అనంతపురం జిల్లా: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్ఎల్సీ కాలువ వద్ద అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ ఈనెల 7వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు వారంలోనే ఛేదించారు. ఆదివారం జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా కూడా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం ఎటువంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపడంతో ఈనెల 8వ తేదీన మోకా పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన యువకుడుని ఎవరు చంపారన్న దానిపై తీవ్రంగా చర్చానీయాంశమైంది. జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ దిశానిర్దేశంతో స్థానిక డీవైఎస్పీ, సీఐలు, ఎస్ఐలు రంగంలోకి దిగి హత్య కేసు మిస్టరీని ఛేదించారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టడంతో బసవన గౌడ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవన గౌడ, సోదరుడు విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వింత కేసు: పుంజు పెట్ట వద్దకు వెళ్లిందని గొడవ!
కాకినాడ: ఇదో కోళ్ల పంచాయితీ.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పెట్ట వద్దకు మరో సామాజిక వర్గానికి చెందిన వారి కోడి పుంజు వచ్చిందంట. అందుకు మండిపడిన కోడి పెట్ట యజమాని పుంజు కాలిపై గాయపరిచాడనేది పుంజు యజమాని ఆవేదన. తన పుంజును ఎందుకు కొట్టావని ప్రశి్నస్తే.. అతని కుటుంబ సభ్యులంతా కలసి అకారణంగా దూషించారట. దీంతో పుంజు యజమాని.. పెట్ట కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వెలువలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెలువలపల్లి గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు పక్క పక్క ఇళ్లలో నివాసముంటున్నారు. రెండు రోజుల క్రితం ఒకరికి చెందిన పుంజు, మరొకరికి చెందిన పెట్ట వద్దకు ప్రకృతి సిద్ధంగా వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. మరి ఈ పంచాయితీని పోలీసులు ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాలి.
ఇన్స్టాగ్రామ్లో చీర ఆర్డర్.. రీఫండ్ లింక్తో రూ.37 వేల టోకరా
హైదరాబాద్: ఇన్స్ట్రాగామ్ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్ పెడితే యువతిని సైబర్ మోసగాళ్లు లింక్ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరిలో నివసించే ఓ మహిళ ఇన్స్ట్రాగామ్ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్ సిల్క్ శారీస్ పేరుతో రీఫండ్ లింక్ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేసింది. అప్పటికే సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు
22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి
చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్
కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి
మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్
ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే
ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో
2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!
SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

