కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు.
హైదరాబాద్: చందానగర్లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారి తన స్కూల్ ఐడీ కార్డుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కూల్లో తోటి పిల్లలు ఏడిపించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.ప్రశాంత్(9) స్థానికంగా ఓ స్కూల్లో చదువుతున్నాడు. అయితే స్కూల్ యూనిఫామ్ సరిగా లేదని తోటి పిల్లలు ఆటపట్టించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. ఆపై బాత్రూమ్లోకి వెళ్లి తన ఐడీ కార్డుతో ఉరి వేసుకున్నాడు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆపై స్వగ్రామానికి తరలించారు. పిల్లాడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విద్యాసంస్థల్లో బుల్లీయింగ్ గురించి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.బుల్లీయింగ్కి(వేధింపులు) చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, ఆన్లైన్ వేదికల్లో జరిగే వేధింపులకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు.. సంబంధిత విద్యార్థిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే కౌన్సెలింగ్కి పంపడం జరుగుతుంది. నేరం తీవ్రతను(వయసు రిత్యా) బట్టి శిక్షలు విధించే అవకాశం లేకపోలేదు.
'అయ్ బాబోయ్ ఎంత పొడుగో'..!
అత్యున్నత హోదాలో ఉండి అంతే శారీరక ధృడత్వంతో మంచి ఎత్తుతో ఉంటే..కళ్లు తిప్పుకోలేం కదూ. అబ్బా పదవికి తగ్గ ఫిజిక్ అన్న ఫీల్ కలుగుతుంది. అలాంటి అనుభవమే ఎదురైంది ఇటాలియన్ ప్రధాని మోలోనికి. ద్వైపాక్షిక సమావేశం కోసం వచ్చినప్పుడూ ఆ దేశ అధ్యక్షులు ఘనంగా ఆహ్వానం పలకడం కామన్. అలానే మొజాంబిక్ దేశ అధ్యక్షుడకి చక్కగా ఆహ్వానం పలికింది ఇటలీ దేశం . అయితే ఆ దేశ అధ్యక్షుడిని చూడగానే ఒక్కక్షణంలో ఇటలీ ప్రధాని మెలోని రియాక్షన్ మారిపోయింది. అది స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తోంది కూడా. అంతేగాదు వారిద్దరిని కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు సైతం ఇబ్బంది పడ్డారు. అసలేం జరిగిందంటే గతవాంర మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో రోమ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్కు స్వాగం పలికేందుకు వచ్చిన ఇటలీ ప్రధానికి మెలోని ఒక్కసారిగా కంగుతింటుంది. ఎందుకంటే డేనియ చాపో ఎత్తు చూసి ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా అతనికి కరచాలనం చేయడానికి కూడా తడబడుతుంది. చెప్పాలంటే ఆమె ముఖంలో ఇంత పొడుగా అని విస్తుపోతున్నట్లు హవభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె మనసులో ఏదో అనుకుంటూ ఇబ్బందిగా మొజాంబిక్ అధ్యక్షుడు చాపోకి కరచాలనం ఇవ్వడానిక వస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అంతేగాదు అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లుకు సైతం ఇద్దర్నీ ఒకే ఫోటోఫ్రేంలో బంధించడం చాలా సవాలుగా మారుతుంది. ఎందుకంటే అత్యున్నత హోదాలో ఉన్నవారి శారీరక ఎత్తులలో మరి ఇంత వ్యత్యాసం కనపడుకుండా కవర్ చేసేందుకు నానాతంటాలు పడ్డారు ఫోటోగ్రాఫర్లు. కానీ అది దాదాపు అసాధ్యం.ఎందుకంటే మొజాంబిక్ అధ్యక్షుడు డేనియ్ చాపో ఎత్తు ఏకంగా 6'8 కాగా, మెలోని ఎత్త కేవలం 5'2. నెట్టంట అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు ఇటలీ మాట్టేయి ప్లాన్ ఫర్ ఆఫ్రికా శక్తి, వాణిజ్యం, సహకారం వంటి వాటిపై చర్చలు జరిపారు. కాగా, తన దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 70 శాతం మెజార్టీ ఓట్లతో ఈ ఏడాది ప్రారంభంలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.Ho ricevuto oggi a Palazzo Chigi il Presidente della Repubblica del Mozambico, Daniel Francisco Chapo.In particolare il colloquio, nel ricordare il cinquantesimo anniversario dell’indipendenza mozambicana e dello stabilimento delle relazioni diplomatiche, ha confermato la… pic.twitter.com/hI8kH3pFfO— Giorgia Meloni (@GiorgiaMeloni) December 11, 2025 (చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..)
రేపు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (డిసెంబర్ 18) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన పత్రాలను గవర్నర్కు అందజేయనున్నారు. ఈ భేటీలో వైఎస్ జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు ఉంటారు. దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి లోక్ భవన్కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.ఈ కార్యక్రమం తర్వాత వీరితో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ నివాసం లోక్ భవన్కు బయల్దేరి వెళ్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోటి మందికిపైగా చేసిన సంతకాల పత్రాలతో నిండిన వాహనాలు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి.
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై హైకోర్టు తీర్పు మరికాసేపట్లో..
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం..
Rupee fall: జీతం తగ్గుతుందా.. EMI పెరుగుతుందా?
19 ఏళ్లకే బట్టతల.. 50 ఏళ్లు దాటినా సింగిల్గా!
కోల్కతా స్టేడియం ఘటన.. స్పోర్ట్స్ మినిష్టర్ రాజీనామా
ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం!
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి మరో ఛాన్స్
‘సెవెన్ సిస్టర్స్’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్
బంగారం డబుల్: గంటల్లో తారుమారైన ధరలు!
కొత్త కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర నటి
అత్యధిక రెమ్యునరేషన్తో 'బిగ్బాస్' నుంచి భరణి ఎలిమినేట్..
ఈ రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో విజయం
బంగారం తులం రూ.1.5 లక్షలకు..
IPL 2026: గ్రీన్ ధర రూ. 30.50 కోట్లు.. ఎవరు కొన్నారంటే?
విశాఖ స్టీల్ ప్లాంటులో ప్రధాన ఉత్పత్తీ విభాగం ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల పిలుపు
జనవరి నుంచి పెరగనున్న టీవీ ధరలు
కోహ్లి ‘ప్రపంచ రికార్డు’ బ్రేక్ చేసిన తిలక్ వర్మ
తుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
'ధురంధర్' సినిమా రివ్యూ
‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
72 గంటలపాటు చెట్టును కౌగిలించుకుని..
దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ..
కేరళ రాజధానిలో కమల వికాసం.. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
మొన్న చిరంజీవి.. నేడు బాలయ్య.. అక్కడ అట్టర్ ఫ్లాప్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది
సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై హైకోర్టు తీర్పు మరికాసేపట్లో..
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం..
Rupee fall: జీతం తగ్గుతుందా.. EMI పెరుగుతుందా?
19 ఏళ్లకే బట్టతల.. 50 ఏళ్లు దాటినా సింగిల్గా!
కోల్కతా స్టేడియం ఘటన.. స్పోర్ట్స్ మినిష్టర్ రాజీనామా
ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం!
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి మరో ఛాన్స్
‘సెవెన్ సిస్టర్స్’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్
బంగారం డబుల్: గంటల్లో తారుమారైన ధరలు!
కొత్త కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర నటి
అత్యధిక రెమ్యునరేషన్తో 'బిగ్బాస్' నుంచి భరణి ఎలిమినేట్..
ఈ రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో విజయం
బంగారం తులం రూ.1.5 లక్షలకు..
IPL 2026: గ్రీన్ ధర రూ. 30.50 కోట్లు.. ఎవరు కొన్నారంటే?
విశాఖ స్టీల్ ప్లాంటులో ప్రధాన ఉత్పత్తీ విభాగం ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల పిలుపు
జనవరి నుంచి పెరగనున్న టీవీ ధరలు
కోహ్లి ‘ప్రపంచ రికార్డు’ బ్రేక్ చేసిన తిలక్ వర్మ
తుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
'ధురంధర్' సినిమా రివ్యూ
‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
72 గంటలపాటు చెట్టును కౌగిలించుకుని..
దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ..
కేరళ రాజధానిలో కమల వికాసం.. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
మొన్న చిరంజీవి.. నేడు బాలయ్య.. అక్కడ అట్టర్ ఫ్లాప్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది
సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్
ఫొటోలు
హ్యాపీ బర్త్ డే మై హార్ట్బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)
వంతారలో మెస్సీ.. వన్య ప్రాణులతో సందడి (ఫోటోలు)
హైదరాబాద్లో ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (చిత్రాలు)
తిరుమలలో నటి స్వాతి దీక్షిత్ (ఫోటోలు)
భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)
జోజినగర్కు వైఎస్ జగన్ రాక.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
తెలుగు రాష్ట్రాల్లో.. ఈ ఏడాది మేటి చిత్రాలు చూశారా?
రెట్రో ఎడిషన్ స్టైల్ థీమ్ పార్టీ ఫ్యాషన్ షో..మెరిసిన సెలబ్రిటీలు (ఫొటోలు)
విశాఖపట్నంలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)
సినిమా
'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ
'అవతార్' సినిమాలో మీకు నచ్చిన విషయం ఏంటంటే చాలామంది చెప్పే మాట గ్రాఫిక్స్(వీఎఫ్ఎక్స్). నీలం రంగు మనుషులు, వాళ్లు ఉండే ప్రదేశం, వింత వింత ఆకారాలు.. ఇలా ఒకటేమిటి మూవీలోని ప్రతిదీ కూడా ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడనదే. వీటన్నింటిని వందలాది మంది ఏళ్లకు ఏళ్లు కష్టపడి సృష్టించారు. అయితే పండోరా ప్రపంచాన్ని సృష్టించడంలో, వీఎఫ్ఎక్స్ విభాగాన్ని దగ్గరుండి నడిపించడంలో ఓ భారతీయ మహిళ కీలక పాత్ర పోషించిందని మీలో ఎంతమందికి తెలుసు?ప్రపంచంలో ఏ రంగంలో చూసినా భారతీయుల ఆధిపత్యం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మహిళలు కూడా పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా దూసుకెళ్తున్నారు. తాజాగా బయటపడిన ఓ సంగతి.. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రపంచ సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాల్లో 'అవతార్' ఒకటి. ఇప్పటికే రెండు భాగాలు రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం మూడో పార్ట్ థియేటర్లలోకి రానుంది.జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తీసిన ఈ అద్భుతమైన సినిమాల్లో వీఎఫ్ఎక్స్ టాప్ నాచ్లో ఏ మాత్రం వంకపెట్టడానికి వీల్లేని విధంగా ఉంటాయని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వెటా ఎఫ్ఎక్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. ఇందులో పావనీ రావు బొడ్డపాటి అనే భారతీయ మహిళ.. వీఎఫ్ఎక్స్ టీమ్ని లీడ్ చేస్తోంది. తాజాగా ఈమె.. తన గురించి, ఈ మూవీస్ కోసం తాము ఎంతలా కష్టపడ్డామనే విషయాన్ని చెప్పుకొచ్చింది.ఢిల్లీలో పుట్టి పావని రావు.. తల్లిదండ్రులు, నానమ్మ-తాతయ్యతో కలిసి పెరిగింది. తన నానమ్మ స్వతహాగా ఆర్టిస్ట్ అని, కనిపించిన ప్రతి పేపర్పైన ఏదో ఒక బొమ్మ వేస్తూనే ఉండేవారని.. ఆమె ద్వారా ఇటువైపు ఆసక్తి పెరిగిందని.. అలా తొలిసారి 2009లో 'అవతార్' కోసం లైటింగ్ టీడీగా పనిచేశానని.. అప్పటినుంచి పండోరా ప్రపంచంలో ఓ భాగమైపోయానని ఈమె చెప్పింది.పావని రావు విషయానికొస్తే.. ఢిల్లీలో పెరిగిన ఈమె.. ఇక్కడే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్లో బీఆర్క్ పట్టా పొందింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీ నుంచి ఎంఎఫ్ఏ, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో భర్తతో కలిసి నివసిస్తోంది. 2009లో తొలిసారి 'అవతార్' కోసం పనిచేసిన ఈమె.. ఇప్పుడు రాబోతున్న మూడో భాగానికి కూడా పనిచేసింది.తొలి భాగంలో ఈమె పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ.. 2022లో రిలీజైన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కోసం దాదాపు 3000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్, అవి కూడా ఎక్కువ భాగం నీటి అడుగున ఉన్నవి పావన్ టీమ్ సృష్టించారు. ఇప్పుడు అవతార్ 3( 'ఫైర్ అండ్ యాష్') కోసం అగ్ని, బూడిద తదితర వీఎఫ్ఎక్స్ షాట్స్ రూపొందించారు. మరి ఇవి ఎలా ఉండబోతున్నాయనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది. ఏదేమైనా 'అవతార్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్లో వీఎఫ్ఎక్స్ లాంటి కీలకమైన విభాగాన్ని భారతీయ మహిళ దగ్గరుండి నడిపించడం అంటే చాలా విశేషం.
పేరెంట్స్గా ప్రమోషన్.. లావణ్య నుంచి సోనియా ఆకుల వరకు!
ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు అంటారు. కానీ తరాలు మారుతున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసి చూడు, పిల్లల్ని కని చూడు అంటున్నారు. ఆ రేంజ్లో సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఎంత బిజీగా ఉన్నా సరే చిన్నపాపాయి నవ్వు చూస్తే ఆ ఒత్తిడి అంతా మటాష్ అయిపోతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు కెరీర్లో సెటిల్ అవగానే పేరెంట్హుడ్ గురించి ఆలోచిస్తున్నారు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందరు. ఆ జాబితాను చూసేద్దాం....వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠికొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నవీరిద్దరు.. 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 10న బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. వీళ్లిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జంటగా నటించారు..వశిష్ట సింహ- హరిప్రియవశిష్ట సింహ- హరిప్రియ 20203 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు ఈ జంటకు మగబిడ పుట్టింది. పెళ్లిరోజునే బాబు పుట్టడం మరో విశేషం!విక్కీ కౌశల్- కత్రినా కైఫ్హీరో విక్కీ కౌశల్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఓపక్క ఛావా విజయం, మరోపక్క పుత్ర సంతానంతో గాల్లో తేలుతున్నాడు. విక్కీ- కత్రినా దంపతులలకు నవంబర్ 7న బాబు పుట్టాడు.సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీసిద్- కియారా చాలాకాలం ప్రేమలో మునిగి తేలారు. 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్లోని జైసల్మీర్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు జూలై 15న తమ కుటుంబంలోకి బుజ్జి పాపాయి వచ్చినట్లు ప్రకటించారు. పాపకు సరాయా అని నామకరణం చేశారు.పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దాహీరోయిన్ పరిణీతి చోప్రా- నాయకుడు రాఘవ్ చద్దా 2023లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు అక్టోబర్ 19న పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ చిన్నోడికి నీర్ అని పేరు పెట్టారు.అర్బాజ్ ఖాన్- షురా ఖాన్బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు ఈ ఏడాది అక్టోబర్5న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ కూతురికి సిపారా ఖాన్ అని నామకరణం చేశారు.రాజ్కుమార్ రావు- పాత్రలేఖసినిమాలతో బిజీ ఉండే రాజ్కుమార్- పాత్రలేఖ.. ఇద్దరూ పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది తల్లిదండ్రులుగా ఒక స్టెప్ ముందుకు వేశారు. నవంబర్ 15న తమ మూడో పెళ్లి రోజునాడే పాప పుట్టిందని ప్రకటించారు.కేఎల్ రాహుల్- అతియా శెట్టిక్రికెట్ క్రీడాకారుడు కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి ఈ ఏడాది మార్చిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు ఎవారా అని నామకరణం చేశారు. దీనర్థం దేవుడు పంపిన బహుమతి.వీళ్లే కాకుండా బుల్లితెర నటులు సాయికిరణ్- స్రవంతి, మహాతల్లి జాహ్నవి జంట, బిగ్బాస్ సెలబ్రిటీలు సుదీప్, సోనియా ఆకుల కూడా తొలిసారి పేరెంట్హుడ్కు స్వాగతం పలికారు. బాలీవుడ్లో జైద్ దర్బార్- గౌహర్ ఖాన్, మాళవిక రాజ్- ప్రణవ్ బగ్గ, షీనా బజాజ్ - రోహిత్ పురోహిత్, షీనా బజాజ్ రోహిత్ పురోహిత్, జహీర్ ఖాన్- సాగరిక, నవరాజ్ హన్స్- అజిత్ కౌర్.. ఇలా పలు జంటల ఇళ్లలో చంటిబిడ్డల నవ్వులు వినిపించాయి.
ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు విరాళం
ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో హీరో నాగార్జున సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నారు. కాలేజీ కోసం రూ.2 కోట్లని విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద కళాశాల విద్యార్థులకు రూ.2 కోట్ల స్కాలర్షిప్ని నాగార్జున ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. నాన్నగారు స్థాపించిన ఏ సంస్థ అయిన నాకు ఎంతో ప్రత్యేకం. గుడివాడ రావడం భావోద్వేగంగా ఉంది. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగానూ ఉంది. మనుషులు శాశ్వతం కాదు వారు చేసే పనులే శాశ్వతం. తాను చదువుకో లేకపోయినా వేలాదిమంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం నాగేశ్వరరావు కళాశాల స్థాపించారు.రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు చదువు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. సినిమాకు రూ. 5 వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో లక్ష రూపాయలని కళాశాలకు విరాళంగా ఇచ్చారు. ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున ప్రతియేటా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాను. గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అని నాగార్జున చెప్పుకొచ్చారు.అక్కినేని నాగేశ్వరరావు విషయానికొస్తే.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు 255కు పైగా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. 'ధర్మపత్ని' (1941)తో ప్రారంభించి 'సీతారామ జననం' (1944)లో తొలి హీరోగా మారి, 'దేవదాసు' (1953)తో స్టార్డమ్ అందుకున్నారు, పౌరాణిక, జానపద, సామాజిక పాత్రలతో పాటు 'నవరాత్రి'లో తొమ్మిది పాత్రలు పోషించారు, 'అన్నపూర్ణ స్టూడియోస్' స్థాపించి, 'మనం' (2014) చిత్రంలో చివరగా నటించారు. తెలుగు సినిమాను మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.ఏఎన్నార్ తర్వాత నాగార్జున హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం నాగ్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది 'కుబేర', 'కూలీ' చిత్రాల్లో నాగ్ వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు.
సినిమా స్టోరీలా మారిన సెలబ్రిటీ లైఫ్
బెంగళూరు: నటి చైత్ర, ప్రముఖ నిర్మాత హర్షవర్ధన్కు సంబంధించిన కుటుంబ వివాదం ఇప్పుడు పోలీస్ కేసుగా మారింది. సొంత భార్యను నిర్మాత కిడ్నాప్ చేశాడంటూ చైత్ర తల్లి బెంగళూరులోని బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. నటి చైత్ర, నిర్మాత హర్షవర్ధన్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. కుటుంబ కలహాల కారణంగా దంపతులు వేరుగా నివసిస్తున్నారు. చైత్ర తన కుమార్తెను వెంట తీసుకుని మైసూరులో ఉంటుండగా, హర్షవర్ధన్ బెంగళూరులో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో తన కుమార్తెను చూడాలనే కారణంతో హర్షవర్ధన్ చైత్రను బలవంతంగా కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై బ్యాటరాయనపుర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇది కుటుంబ వివాదమా? లేక నేరుగా కిడ్నాప్ కేసా? అన్న కోణంలో పోలీసులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై చైత్ర, హర్షవర్ధన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Chaitra R (@chaitraram1998official)
క్రీడలు
కేకేఆర్లోకి పప్పు యాదవ్ కొడుకు.. ధర ఎంతంటే?
అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్కతా నైట్రైడర్స్ భారీ బిడ్డింగ్స్తో ఆశ్చర్యపరిచింది. రూ. 64.30 కోట్ల భారీ పర్సుతో వేలంలోకి దిగిన కేకేఆర్.. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టును పటిష్టం చేసుకుంది.ఈ వేలంలో కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఏకంగా రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. అదేవిధంగా కేకేఆర్.. భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా తమ పర్స్లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. కేకేఆర్ కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్) కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు. సార్థక్ను రూ. 30 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 29 ఏళ్ల సార్థక్ ఐపీఎల్కు ఎంపిక కావడం ఇదే తొలిసారి.సార్థక్ రంజన్ డొమెస్టిక్ క్రికెట్లో ఢిల్లీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 9.33 సగటుతో 28 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 105, టీ20ల్లో 5 మ్యాచ్లు 66 పరుగులు చేశాడు. ఇక తన కుమారుడు ఐపీఎల్కు ఎంపిక కావడం పట్ల పప్పు యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు."అభినందనలు సార్థక్! నీ టాలెంట్తో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో, నీ కలలను నిజం చేసుకో" అంటూ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా పప్పు యాదవ్ బీహార్లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
టీమిండియా ఓపెనర్కు అస్వస్థత..
టీమిండియా యువ ఓపెనర్, ముంబై స్టార్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ అనారోగ్యం బారిన పడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో మంగళవారం రాజస్తాన్తో జరిగిన సూపర్ లీగ్ మ్యాచ్ అనంతరం జైశ్వాల్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. దీంతో అతడిని వెంటనే పుణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యులు అతడికి స్కాన్లు నిర్వహించి 'అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్స్ (పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) ఉన్నట్లు తేల్చారు.అయితే జైశ్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అతడికి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అనారోగ్యంతోనే బ్యాటింగ్కాగా రాజస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో జైశ్వాల్ అస్వస్థతతో ఉన్నప్పటికీ ముంబై తరపున మైదానంలోకి దిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో అతడు చాలా అసౌక్యరంగా కన్పించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన జైశ్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. జైశ్వాల్ త్వరగా ఔటైనప్పటికి.. ముంబై 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అజింక్య రహానె (72*), సర్ఫరాజ్ ఖాన్ (73) అద్భుత హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అయితే ఈ మ్యాచ్లో ముంబై గెలిపించినప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ టోర్నీలో జైశ్వాల్ కూడా దుమ్ములేపాడు. మూడు మ్యాచ్లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ జైశ్వాల్ శతక్కొట్టాడు.చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
ఆస్ట్రేలియాకు ఊహించని షాక్.. ఆఖరి నిమిషంలో!
ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు స్టీవ్ స్మిత్ అనారోగ్యం బారిన పడ్డాడు. స్మిత్ 'వర్టిగో' (తల తిరగడం) వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో ఆఖరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరిచింది.స్మిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వికారం, తలతిరగడం వంటి లక్షణాలు అతడికి ఉన్నాయి. స్మిత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయానికి పూర్తిస్థాయిలో కోలుకోలేకపోయారు. అతడిని ఆడించి రిస్క్ తీసుకుడదని మెనెజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. అతడు తిరిగి నాలుగో టెస్టు సమయానికి పూర్తిగా కోలుకునే ఛాన్స్ ఉంది అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు మీడియాతో పేర్కొన్నాడు.అదరగొట్టిన ఉస్మాన్..ఇక స్మిత్ స్ధానంలో వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖావాజాకు తుది జట్టులో చోటు దక్కింది. గత రెండు టెస్టుల్లో ఆడని ఖవాజా.. స్మిత్ స్ధానంలో నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగాడు. అయితే ఉస్మాన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు.మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్లు వెనుదిరగడంతో ఖవాజా జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. 120 బంతుల్లో 82 పరుగులు చేసి కీలక నాక్ ఆడాడు. 48 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి జట్టులోకి రావడం ఆసీస్కు కాస్త ఊరటనిచ్చే ఆంశం.మూడో టెస్టుకు ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, కెమెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే
ఐపీఎల్-2026 మినీ వేలం అబుదాబి వేదికగా విజయవంతంగా ముగిసింది. పది జట్లు 77 మంది ఆటగాళ్ల స్ధానాలను భర్తీ చేశాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ నిలిచాడు. గ్రీన్ను రూ. 25.20 కోట్ల భారీ ధర వెచ్చించి మరీ కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకుంది. తద్వారా అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్గా రికార్డుకెక్కాడు. అదేవిధంగా అన్క్యాప్డ్ ఆటగాళ్ల పంట కూడా పండింది. ఉత్తరప్రదేశ్ స్పిన్ ఆల్రౌండర్ 20 ఏళ్ల ప్రశాంత్ వీర్, రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మలను రికార్డు స్ధాయిలో రూ.14.20 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది.రూ. 30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన ఈ ఇద్దరూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న అన్క్యాప్డ్ ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. అయితే ఈ వేలంలో స్టీవ్ స్మిత్, డెవాన్ కాన్వే వంటి కొంతమంది స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోలేదు. ఈ క్రమంలో అన్సోల్డ్గా మిగిలిన పూర్తి ఆటగాళ్ల జాబితాపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్-2026 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరేజేక్ ఫ్రేజర్-మెక్గుర్క్డెవాన్ కాన్వేగుస్ అట్కిన్సన్వియాన్ ముల్డర్దీపక్ హుడాకేఎస్ భరత్రహ్మానుల్లా గుర్బాజ్జానీ బెయిర్స్టోజామీ స్మిత్గెరాల్డ్ కోయెట్జీస్పెన్సర్ జాన్సన్ఫజల్హక్ ఫారూఖీమహేశ్ తీక్షణముజీబ్ ఉర్ రెహమాన్అథర్వ తైదేఅన్మోల్ప్రీత్ సింగ్అభినవ్ తేజ్రానాఅభినవ్ మనోహర్యష్ ధుల్ఆర్య దేశాయ్విజయ్ శంకర్రాజవర్ధన్ హంగారేకర్మహిపాల్ లోమ్రోర్ఈడెన్ ఆపిల్ టామ్తనుష్ కోటియన్సన్వీర్ సింగ్రుచిత్ అహిర్కమలేష్ నాగరకోటివంశ్ బేడీతుషార్ రహేజారాజ్ లింబానిసిమర్జీత్ సింగ్ఆకాష్ మధ్వల్శివం శుక్లావహిదుల్లా జద్రాన్కర్ణ్ శర్మకుమార్ కార్తికేయసెడిఖుల్లా అటల్మైఖేల్ బ్రేస్వెల్సీన్ అబాట్డారిల్ మిచెల్దాసున్ శనకచేతన్ సకారియావకార్ సలాంఖీల్సల్మాన్ నిజార్మయాంక్ రావత్కేఎమ్ ఆసిఫ్మురుగన్ అశ్విన్తేజస్ బరోకాకేసీ కరియప్పమోహిత్ రాథీడాన్ లారెన్స్తస్కిన్ అహ్మద్రిచర్డ్ గ్లీసన్అల్జారీ జోసెఫ్రిలే మెరెడిత్ఝే రిచర్డ్సన్ధీరజ్ కుమార్తనయ్ త్యాగరాజన్ఇర్ఫాన్ ఉమైర్చింతల్ గాంధీవిశాల్ నిషాద్నాథన్ స్మిత్డేనియల్ లాటెగాన్కరణ్ లాల్ఉత్కర్ష్ సింగ్ఆయుష్ వర్తక్జిక్కు బ్రైట్ఇజాజ్ సవారియామణిశంకర్ మురాసింగ్మనన్ వోహ్రామయాంక్ దాగర్మనీ గ్రేవాల్మాక్నీల్ నోరోన్హాసిద్ధార్థ్ యాదవ్రితిక్ టాడాచామ మిలింద్స్వస్తిక్ చికారావిలియం సదర్లాండ్ఆర్ఎస్ అంబరీష్
న్యూస్ పాడ్కాస్ట్
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు... కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు, బూట్లు... ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇక్కట్లు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా ‘కోటి’ గళాల గర్జన...
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే అంకెల గారడీ. చంద్రబాబు జీఎస్డీపీ ముందస్తు అంచనాలపై వైఎస్ జగన్ ధ్వజం
తెలంగాణ రైజింగ్ విజన్ సాధిస్తాం... గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
బిజినెస్
ఈ వింటర్ వెకేషన్కు అంతా అక్కడికే!
దేశీయంగా పర్యాటకుల్లో దాదాపు 55 శాతం మంది ఏటా శీతాకాలంలో విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ట్రావెల్ సీజన్లో గోవా, కేరళ ప్రధాన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. సెలవ రోజులు గడిపేందుకే కాకుండా కాస్త రిలాక్స్ అయ్యేందుకు కూడా శీతాకాలం ట్రిప్లను భారతీయులు ఎంచుకుంటున్నారు. టెక్ హాస్పిటాలిటీ కంపెనీ ఎయిర్బీఎన్బీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.‘ఎయిర్బీఎన్బీ అంతర్గత డేటా ప్రకారం ఈ శీతాకాలం సీజన్లో గోవా, కేరళ, రాజస్థాన్, హిమాలయ ప్రాంత రాష్ట్రాలపై ట్రావెలర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బీచ్లు, బ్యాక్వాటర్లు, సంస్కృతి, శీతాకాలపు వాతావరణం, ఔట్డోర్ అనుభూతులు మొదలైన అంశాలు ఇందుకు సానుకూలంగా ఉంటున్నాయి‘ అని ఎయిర్బీఎన్బీ కంట్రీ హెడ్ అమన్ప్రీత్ బజాజ్ తెలిపారు.సానుకూల చల్లని వాతావరణం, ఆకర్షణీయమైన ప్రాంతాల దన్నుతో ప్రస్తుతం ఫేవరెట్ ట్రావెల్ సీజన్లలో శీతాకాలం కూడా చేరిందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను ఎయిర్బీఎన్బీ రూపొందించింది. 2,155 మంది పర్యాటకులు ఇందులో పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు..లక్షద్వీప్లోని అగట్టి, గౌహతితో పాటు పంజాబ్లోని చిన్న నగరాలు, కేరళలో పెద్దగా తెలియని తీర ప్రాంత, బ్యాక్వాటర్స్ పట్టణాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.యువ ట్రావెలర్లు .. వారణాసి, బృందావన్లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో పర్యటిస్తున్నారు.శీతాకాలంలో పర్యటించే వారిలో దాదాపు సగం మంది జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ వారే ఉంటున్నారు. చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన, అందమైన లొకేషన్స్ను ఆస్వాదించేందుకు శీతాకాలంలో ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.సీజనల్ సెలవలను గడిపేందుకు శీతాకాలంలో ప్రయాణిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 30 శాతం మంది తెలిపారు. సేద తీరేందుకు ట్రావెల్ చేస్తున్నట్లు 30 శాతం మంది, సరికొత్త సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు ఈ సీజన్ను ఎంచుకుంటున్నట్లు 20 శాతం మంది వివరించారు.పర్యటనల విషయంలో ఎక్కువ శాతం మంది తమకు అత్యంత సన్నిహితులతోనే కలిసి వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. 50 శాతం మంది తమ జీవిత భాగస్వామితో కలిసి వెళ్తుండగా, మూడో వంతు మంది.. స్నేహితులతో కలిసి వెళ్తున్నారు. రెండు మూడు తరాల కుటుంబ సభ్యులతో కలిసి తాము ట్రిప్లను ప్లాన్ చేస్తామని 30 శాతం మంది వివరించారు. గోవా బీచ్లు, కేరళ బ్యాక్వాటర్స్ నుంచి మనాలీ, ముస్సోరీలో పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రాలుగా ఉండే ఉదయ్పూర్, జైపూర్లాంటి నగరాల వరకు దేశీయంగా కొత్త ప్రాంతాల్లో పర్యటించడంపై, వాటి గురించి తెలుసుకోవడంపై ఆసక్తి పెరుగుతోంది.
ఫండ్ పరిశ్రమకు సిప్ దన్ను
అర్థవంతమైన, దీర్ఘకాలిక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లు (సిప్), మార్కెట్ వృద్ధితో అసెట్ విలువలు పెరుగుతుండటంలాంటి అంశాలు మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో నిమేష్ షా తెలిపారు. రిటైర్మెంట్ లేదా పిల్లల చదువులాంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం సిప్ విధానంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు మదుపరులు, చివరివరకు పెట్టుబడులను కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు.యాక్టివ్ వ్యూహాలు అత్యధిక రాబడులను అందించినంత వరకు వాటిపై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతుందని షవివరించారు. దేశీయంగా యాక్టివ్ ఫండ్లు సహేతుకమైన పనితీరును కనపరుస్తున్నందున వాటిల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏదైనా ఫండ్ సంస్థకు ఇతర సంస్థల నుంచి పోటీ, లేదా నియంత్రణ నిబంధనలపరమైన రిసు్కల కన్నా పనితీరు ఆశించినంత స్థాయిలో లేకపోవడమే పెద్ద రిసు్కగా ఉంటుందని షా వివరించారు.‘‘డిజిటైజేషన్, డెమోగ్రాఫిక్స్, ఆర్థిక అసెట్ద్లోకి కుటుంబాల పొదుపు మొత్తాలు భారీగా వస్తుండటంలాంటి అంశాల దన్నుతో భారత జీడీపీ గణనీయంగా వృద్ధి నమోదు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల ఊతంతో దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కంపెనీల ఆదాయ వృద్ధి రూపంలో ఈక్విటీ మార్కెట్లలో కూడా ఇది ప్రతిఫలిస్తోంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులను కొనసాగించే వారికి సముచితమైన ప్రతిఫలం దక్కుతుందని ఇవి నమ్మకం కలిగిస్తున్నాయి’’ అని షా తెలిపారు.లిస్టయినా జవాబుదారీతనం యథాతథం.. ‘‘స్టాక్ మార్కెట్లలో కంపెనీ లిస్టయినప్పటికీ మా జవాబుదారీతనం, బాధ్యతలేమీ మారవు. ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించి, వారి సంపద వృద్ధి చెందితేనే మా ఆదాయాలు పెరుగుతాయి కాబట్టి యూనిట్హోల్డర్లకు ఒనగూరే ప్రయోజనాలతో షేర్హోల్డర్ల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అన్నింటికన్నా ప్రధానంగా డబ్బును నిర్వహించే రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీగానే మమ్మల్ని మేము భావిస్తాం. లిస్టింగ్ తర్వాత కూడా అదే కొనసాగుతుంది. ఫండ్ పరిశ్రమ చాలా విస్తృత స్థాయి వ్యాపారం. ఇన్వెస్టర్లకు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నియంత్రణ సంస్థ వ్యయాలను క్రమబదీ్ధకరించింది. దీనితో ఇన్వెస్టర్లకు ఫండ్స్ మరింత అందుబాటులోకి వస్తాయి. అలాగే మార్జిన్లు తగ్గినా పరిమాణం పెరగడం వల్ల సంస్థకు ఆ మేరకు భర్తీ అవుతుంది. కాలక్రమేణా అధిక లాభాలకు దోహదపడుతుంది’’ అని షా చెప్పారు.ఇక ఐపీవో వల్ల కంపెనీ నిర్వహణ స్వరూపం ఏమీ మారదన్నారు. గత మూడు దశాబ్దాలుగా పెట్టుబడులు కొనసాగిస్తున్న ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ పాక్షికంగానే వాటాలను విక్రయిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంకు మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుందని తెలిపారు. కాబట్టి అదే మేనేజ్మెంట్, అవే పెట్టుబడి సూత్రాలు, గవర్నెన్స్తో వ్యాపారం కొనసాగుతుందన్నారు. పబ్లిక్ ఇష్యూతో లిక్విడిటీ, యాజమాన్యం పెరుగుతుందే తప్ప కంపెనీ వ్యూహంలో మార్పు ఉండదని షా తెలిపారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎంతో పేరున్న పలు దిగ్గజ సంస్థలు యాంకర్ ఇన్వెస్టర్లుగా ఈ ఇష్యూలో పాలుపంచుకుంటున్నాయని వివరించారు. తమ బిజినెస్ మోడల్, నిర్వహణ క్రమశిక్షణ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, భారత అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమపై వాటికున్న నమ్మకానికి ఇది నిదర్శనంగా ఉంటుందని వివరించారు.
534 పాయింట్లు డౌన్
ముంబై: వాణిజ్య లోటు పెరుగుతుండటం, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత తదితర అంశాల కారణంగా రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతోంది. తాజాగా ఇంట్రాడేలో 91 మార్కును దాటేసింది. చివరికి డాలరుతో పోలిస్తే మరో 15 పైసలు క్షీణించి 90.93 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే ఇంట్రాడేలో 36 పైసల క్షీణతతో 91.14 స్థాయిని కూడా తాకింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలోనే రూపాయి మారకం విలువ 90 నుంచి 91కి పడిపోయింది. గత అయిదు సెషన్లలో ఏకంగా 1 శాతం పతనమైంది. ఈ నెలలోనే 92 మార్కును కూడా దాటేయొచ్చని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఈడీ అనిల్ కుమార్ భన్సాలీ తెలిపారు. ఈ ఏడాది 5.1 శాతం డౌన్.. రాజ్యసభలోనూ ఈ అంశం చర్చకు రాగా, డేటా ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 3 వరకు రూపాయి విలువ 5.1 శాతం క్షీణించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. వాణిజ్య లోటు, అమెరికా–భారత్ ఒప్పందానికి సంబంధించిన పరిణామాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. అయితే, రూపాయి పతనంతో ఎగుమతులపరంగా పోటీతత్వం మెరుగుపడొచ్చని, ఇది ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. డేటా ప్రకారం డాలరుతో పోలిస్తే రూపాయి 2015లో 4.5 శాతం, 2016లో 2.6 శాతం క్షీణించగా, 2017లో 6.4 శాతం పెరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం క్షీణత కొనసాగింది. 91కి జారిన రూపాయిముంబై: విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ డీలాపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేమి, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 91 స్థాయిని బ్రేక్ చేయడం ఇన్వెస్టర్లను కలవరపరిచింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 84,680 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167 పాయింట్లు కోల్పోయి 25,860 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు, అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో రోజంతా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 592 పాయింట్లు క్షీణించి 84,621 వద్ద, నిఫ్టీ 193 పాయింట్లు పతనమై 25,834 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రమే రాణించాయి. రియల్టీ 1.36%, బ్యాంకెక్స్ 1.03%, కమోడిటీస్ 0.91%, ఐటీ 0.90%, ఐటీ 0.86%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83%, మెటల్ 0.82 శాతం నష్టపోయాయి. మిడ్క్యాప్ ఇండెక్సు 0.78%, స్మాల్క్యాప్ సూచీ 0.69% పతనమయ్యాయి. ∙యాక్సిస్ బ్యాంకు షేరు 5% పతనమై రూ.1,220 వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ వరకూ నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సిటి ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ షేరు పడింది.
గుజరాత్ కిడ్నీ @ రూ. 108–114
న్యూఢిల్లీ: హెల్త్కేర్ కంపెనీ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభంకానుంది. 24న ముగియనున్న ఇష్యూకి తాజాగా రూ. 108–114 ధరల శ్రేణి ప్రకటించింది. దీనిలో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా దాదాపు రూ. 251 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్టర్లు కనీసం 128 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఈక్విటీ జారీ నిధులను అహ్మదాబాద్లోని పరేఖ్స్ హాస్పిటల్ కొనుగోలుతోపాటు.. ఇప్పటికే సొంతం చేసుకున్న అశ్విని మెడికల్ సెంటర్ పాక్షిక చెల్లింపులకు వెచ్చించనుంది. అంతేకాకుండా వడోదరలో కొత్త ఆసుపత్రి ఏర్పాటు, రోబోటిక్స్ పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులకు సైతం నిధులు కేటాయించనుంది. కంపెనీ గుజరాత్లో మధ్యస్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్ను నిర్వహిస్తోంది.
ఫ్యామిలీ
వాటర్ పూల్..బీచ్ ఫీల్..!
ఇక భాగ్యనగరవాసులు బీచ్ వైబ్స్ ఆస్వాదించడానికి గోవా, వైజాగ్, బందరు అంటూ దూరభారం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. సిటిజనుల కోసం నగరానికి కూతవేటు దూరంలోనే ఆర్టిఫిషియల్ సముద్ర తీరం అవతరించనుంది. సముద్రం అనేది లేకుండానే తీరం ఎలా అనే ప్రశ్నకు మానవ మేధస్సుతో సమాధానం చెబుతున్న దేశపు తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించనుంది. ఈ బీచ్ పరిసరాలు విందు, వినోదాలతో పాటు సకల సౌకర్యాలకు కేరాఫ్గా నిలువనుంది. పర్యాటక ఆకర్షణను దృష్టిలోపెట్టుకుని దీనిని తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జపాన్, దుబాయ్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలతో పాటు ప్రపంచంలో పలు మానవ నిర్మిత బీచ్లు సందడి చేస్తున్న క్రమంలో దేశంలోనూ అదీ హైదరాబాద్లో ఈ ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మితం కానుండడం విశేషం. చారిత్రక నేపథ్యానికి కొదవలేదు.. సాంస్కృతిక వారసత్వానికీ లోటు లేదు. సంప్రదాయ వంటకాల సంపదకు కరవు లేదు.. ఆధునిక పార్టీ కల్చర్కూ అడ్డు లేదు.. ఇలా పర్యాటకులను ఆకట్టుకునే అనేక హంగులు ఉన్న నగరంలో చెప్పుకోదగ్గ లోటు అంటూ ఏదైనా ఉందంటే అది బీచ్ ఒక్కటే అని చెప్పాలి. ఇప్పుడు ఆ వెలితిని కూడా పూడ్చే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ప్రకృతి సిద్ధంగా మాత్రమే సాధ్యమయ్యే సాగర తీరపు అందాలను మానవ శక్తితో పునర్సృష్టించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం, నగరానికి సమీపంలోని బీచ్ అంటే అది పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ మాత్రమే. అది కూడా దాదాపు 320 కి.మీ దూరంలో ఉంది. అయితే తెలంగాణ తొలి మానవ నిర్మిత బీచ్ గచి్చబౌలి నుంచి కేవలం 20 కి.మీ దూరంలో కొలువుదీరనుంది. భూమి లభ్యత, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా సులభంగా చేరుకోగలిగే రాకపోకల సౌలభ్యం కారణంగా కొత్వాల్ గూడను బీచ్ కోసం ఎంపిక చేశామంటున్నారు. దీనికి సంబంధించిన తుది ప్రాజెక్ట్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విశేషాలెన్నో.. మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ బీచ్ను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ దాదాపు రూ.225 కోట్ల నుంచి రూ.300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు సమాచారం. ఇసుక, నీరు మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్టులో భాగంగా తేలియాడే విల్లాలు, లగ్జరీ హోటళ్లు, సాహస క్రీడలు, సెయిలింగ్, బంగీ జంపింగ్, స్కేటింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు కానున్నాయి. ఇతర ఆకర్షణల్లో భాగంగా వేవ్ పూల్, ఫౌంటైన్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, షాక్లు, సైక్లింగ్ ట్రాక్లు, పిల్లల కోసం ఆట స్థలాలు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో కూడా... ఈ ప్రాజెక్టు సాకారమైతే, ఇది ప్రపంచ పర్యాటక ఆకర్షణగా మారుతుందని, హైదరాబాద్ స్థాయిని పెంచుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. దీనిలో పర్యావరణ అనుకూల నిర్మాణ పద్ధతులు ఖచి్చతంగా అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ పెట్టుబడిదారులను కూడా ఆకర్షిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలోనూ ఒక అర్బన్ బీచ్ నిర్మించేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ చాంపియన్స్ ఇన్ఫ్రాటెక్ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడితే హైదరాబాద్కు ఒకటి కాదు రెండు బీచ్లు అందుబాటులోకి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కృత్రిమ బీచ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని అధికారులు పరిశీలిస్తున్నారు. పారిస్ స్ఫూర్తితో.. ఫ్రెంచ్ రాజధాని సీన్ నదిని ఆనుకుని కృత్రిమ బీచ్లను సృష్టించిన పారిస్ ప్లేజెస్ ప్రాజెక్ట్ నుంచి సిటీ బీచ్ ఆలోచన ప్రేరణ పొందింది. తాము పారిస్ ప్లేజెస్ ప్రాజెక్ట్ను పరిశీలించామని, అక్కడ భౌగోళిక పరిస్థితులతో పోల్చే పరిస్థితులు అనుకూలంగా ఉన్న నగరం కాబట్టి, ఇక్కడ అదే రీతిలో బీచ్ సృష్టికి పారిస్ ప్లేజెస్ మాదిరి నమూనాను అనుసరించాలని భావిస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మరికొన్ని కృత్రిమ బీచ్లు కూడా అంతర్జాతీయంగా పేరొందాయి. దుబాయ్లోని పామ్ జుమేరాలో ప్రసిద్ధ మానవ నిర్మిత బీచ్లు ఉన్నాయి. ఇది విలాసవంతమైన రిసార్ట్లు, ప్రైవేట్ విల్లాలతో సందర్శకులకు ప్రత్యేకమైన విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. దుబాయ్లోని పామ్ జుమేరాలో ప్రసిద్ధ మానవ నిర్మిత బీచ్లు ఉన్నాయి. ఇది విలాసవంతమైన రిసార్ట్లు, ప్రైవేట్ విల్లాలతో సందర్శకులకు ప్రత్యేకమైన విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. బీచ్తో పాటు విందు, సకల వినోదాలకు కేరాఫ్ మాల్దీవ్స్ రాజధాని నగరం మాలేలోని తూర్పు తీరంలో కృత్రిమ బీచ్ క్రీడా కార్యక్రమాలు, కవాతు, కారి్నవాల్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలను నిర్వహించడానికి అనుకూలమైన వేదికగా మారింది. జపాన్లోని టోక్యోలో ఉన్న ఒడైబా సీసైడ్ పార్క్ పేరతో బీచ్ నిర్మించారు. టోక్యో బేలో ఒక ప్రసిద్ధ ప్రదేశంగా వినోద కార్యకలాపాలను అందిస్తుంది. అమెరికాలోని మిసిసిపీలో బిలోక్సీ మరొక ప్రసిద్ధ బీచ్. ఇది గల్ఫ్ తీరం వెంబడి ఉన్న 26 మైళ్ల పొడవైన మానవ నిర్మిత తీరప్రాంతంలో ఇది ఒక భాగం. సింగపూర్లోని 1,235 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెంటోసా మలేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఇసుకను కలిగి ఉన్న మూడు షెల్టర్డ్ బీచ్లు ఉన్నాయి. యూరప్లోని మొనాకో సిటీలో ఉన్న ఏకైక పబ్లిక్ బీచ్గా లార్వోట్టో బీచ్ పేరొందింది. రెస్టారెంట్లు, దుకాణాలు, కేఫ్లతో కళకళలాడే ఈ బీచ్లో కృత్రిమ ఇసుక కొంతవరకూ గులకరాళ్లలా ఉంటుంది. బీచ్కి వెళ్లేవారు దృఢమైన బూట్లు ధరించవలసి ఉంటుంది. పిల్లలు ఆట స్థలం కార్యకలాపాలు, బైక్ రైడ్లు ట్రాంపోలిన్ వినోదాన్ని అక్కడ ఆస్వాదించవచ్చు. (చదవండి: కాలినడకన.. 27 ఏళ్లు.. 31 వేల మైళ్లు! అంటే.. ప్రపంచం చుట్టొచ్చాడా?)
వయసులో ఫిట్..పరుగులో హిట్..!
ఆయన ఆలోచనలు, ఆశయం పరుగుపెడతాయి.. విజయాన్ని దక్కించుకోవాలన్న సంకల్పం పరుగుకు ముందుంటుంది. అందుకే ఆయన ముందు మారథాన్లు చిన్నబోతున్నాయి. 74 ఏళ్ల వయసులోనూ మారథాన్లు, అల్ట్రా మారథాన్లు పూర్తి చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. నూకలవారిపాలెం నుంచి వచ్చిన అతని ప్రస్థానం ఇప్పుడు బోస్టన్ మారథాన్ వరకూ పరుగుతీసింది. ఆయనే హైదరాబాద్కు చెందిన సీనియర్ రన్నర్ నాగభూషణరావు చలమలశెట్టి..కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నూకలవారిపాలేనికి చెందిన నాగభూషణరావు ప్రస్తుతం నగరంలోని మల్లాపూర్లోని కేఎల్ రెడ్డి నగర్లో నివసిస్తున్నారు. వయసు పెరుగుతోందని వెనక్కి తగ్గకుండా.. ఆరోగ్యమే జీవితానికి అసలైన బలం అన్న సందేశాన్ని తన పరుగుతో నిరూపిస్తున్నారు. పరుగుల ప్రపంచంలోకి ఆయన ఐదేళ్ల క్రితం అడుగుపెట్టారు. అమెరికాలోని చికాగోలో అతని కుమారుడు మారథాన్ పూర్తి చేశారు. అదే స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభంలో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వంటి చిన్న దూరాలతో మొదలుపెట్టి క్రమంగా స్టామినాను పెంచుకున్నారు. ఆ క్రమశిక్షణే దేశంలోని ప్రముఖ మారథాన్లలో నిలబెట్టేలా చేసింది.ఇది ఆయన రికార్డు..ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాల మారథాన్లతో పాటు లోనావాల నైట్ అల్ట్రా మారథాన్, 65 కిలోమీటర్ల సతారా అల్ట్రా మారథాన్ వంటి కఠిన పోటీలను ఆయన అవలీలగా పూర్తి చేశారు. ఇటీవల లద్దాఖ్ మారథాన్ సైతం పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మారథాన్ను విజయవంతంగా ముగించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఇప్పటివరకు 21 ఫుల్ మారథాన్లలో పాల్గొని 17 విజయాలను నమోదు చేశారు.వచ్చే ఏడాది బోస్టన్ మారథాన్కు..ఈ ఏడాది జులైలో నిర్వహించిన ఢిల్లీ మారథాన్ను ఆయన 4 గంటల 12 నిమిషాల 55 సెకన్ల సమయంలో ముగించారు. దీంతో ఆయన వచ్చే ఏడాది అమెరికాలోని బోస్టన్లో జరగనున్న 130వ బోస్టన్ మారథాన్కు అర్హత సాధించారు. భారత్ తరుపున పాల్గోనున్న ఆయన, హైదరాబాద్కు గర్వకారణంగా నిలవనున్నారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: పర్యావరణ హిత మష్రూమ్ ఫర్నీచర్..! జస్ట్ 180 రోజుల్లోనే..)
కాలినడకన.. 27 ఏళ్లు.. 31 వేల మైళ్లు! అంటే.. ప్రపంచం చుట్టొచ్చాడా?
ప్రపంచం చుట్టి రావాలనుకోవడం ప్రస్తుత రోజుల్లో పెద్ద విషయం కాదు. డబ్బుకి లోటు లేదు అనుకుంటే సులభంగా చుట్టొచ్చేయొచ్చు. అలాకాకుండా కాలినడకన చుట్టి రావాలనుకోవడం మాత్రం..కాస్త ఆలోచించాల్సిందే. అసలు ఈ ఆలోచన సాధ్యమేనా అనే సందేహం కచ్చితంగా వచ్చేస్తుంది. కానీ ఇతడు దృఢ సంకల్పమే ఆయుధంగా ఎలాంటి వాహనాలను ఉపయోగించకుండా కాలినడకన ప్రపంచం చుట్టి రావాలనుకున్నాడు. ఇప్పుడు దాదాపు చాలామేరకు చుట్టేశాడు. ఇంకొద్ది రోజుల్లో అతడి యాత్ర ముగింపుకి రానుంది. ఇంత పెద్ద ఘనతను సృష్టించిన ఆ వ్యక్తి ఎప్పుడు ఈ ప్రపంచ యాత్రను ప్రారంభించాడు?, ఎలా సాగింది వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.29 ఏళ్ల బ్రిటిష్ మాజీ పారాట్రూపర్ కార్ల్ బుష్బీ, ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఎలాంటి మోటారు వాహనాలు ఉపయోగించకుండా ప్రపంచం చుట్టి రావాలనే అసాధారణ లక్ష్యంతో బయలుదేరాడు. ఇప్పటికీ అతడి కల తీరనుంది. దాదాపు 29 ఏళ్ల సుదీర్ఘ యాత్ర అనంతరం 56 ఏళ్ల వయసుకు చేరుకున్న దశలో పూర్తి చేయనున్నాడు. అప్పటికీ పూర్తిగా మారిపోయిన ప్రపంచం, మరోవైపు సోషల్ మీడియా ఒత్తిడి వంటి సవాళ్లను అధిగమించి మరి ప్రపంచ యాత్రను ఇంకొద్ది రోజుల్లో విజయవంతంగా పూర్తిచేయనున్నాడు. తన యాత్ర పూర్తి అవ్వడానికి జస్ట్ వెయ్యి మైళ్ల దూరంలోనే ఉన్నాడంతే. ఇప్పటి వరకు చేసిన సాహస యాత్రల్లో ఈ వ్యక్తి చేసిన యాత్ర అత్యంత సుదీర్ఘమైన యాత్రగా నిపుణులు పేర్కొన్నారు. ఇక బుష్బీ తన ప్రపంచ యాత్రను 1998లో చిలీ సరిహద్దుల నుంచి ప్రారంభించాడు. అలా నడుచుకుంటూనే తన స్వదేశం ఇంగ్లాండ్కు చేరుకుంటానని భీష్ముడు మాదిరిగా ప్రతినబూనడట. ఇంతవరకు ఈ యాత్రలో ఎలాంటి యాంత్రిక రవాణాను వినయోగించకపోవడం విశేషం. ఇప్పడు తన యాత్ర చివరి దశలో ఉన్నాడు. అంతేగాదు అతడు వచ్చే ఏడాది సెప్టెంబర్ 2026 నాటికి తన స్వస్థలమైన ఇంగ్లాండ్కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నన్నా. ఇప్పటి వరకు 25 దేశాలు, ఎడారులు, యుద్ధ ప్రాంతాలు, అడవులు, గడ్డకట్టిన సముద్రాలను దాటాడు. ఈ డేరింగ్ యాత్ర అతడి అద్భుతమైన ఓర్పు, సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం 27 ఏళ్ల అనంతరం బుష్బీ ప్రయాణం పటగోనియా, ఆండీస్ పర్వతాలు, మధ్య అమెరికా, మెక్సికో, యుఎస్, రష్యా, మంగోలియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల గుండా సాగనుంది. అతడు బ్రిటిష్ సైన్యంలో పారాటూపర్గా పనిచేసిన అనుభవమే ఈ సాహన యాత్రకు పురికొల్పిందని అంటాడు బుష్బీ. సైన్యంలో ఉన్నప్పుడూ అద్భుతమైన ప్రదేశాలను చూశాను. అదే తనని ఈ ప్రపంచమంతా చుట్టిరావాలనే సంచార కాంక్షను ప్రేరేపించిందని చెప్పుకొచ్చాడు. యాత్ర సాగిన విధానం..బుష్బీ 31,000-మైళ్ల యాత్ర సుమారు ఎనిమిది నుండి పన్నెండేళ్లు పడుతుందని అతను అంచనా వేశాడు. 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక భౌగోళిక రాజకీయ, ఆర్థిక, లాజిస్టికల్ అడ్డంకుల కారణంగా దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంగా మారిపోయింది.అతను తన నడకను దక్షిణ అమెరికా దక్షిణ కొనలో ఉన్న చిలీలోని పుంటా అరేనాస్లో ప్రారంభించాడు. పనామా, కొలంబియా మధ్య ఉన్న ప్రమాదకరమైన డారియన్ గ్యాప్ను దాటడంతో సహా అమెరికా ఖండాల పొడవునా నడిచాడు. మార్చి 2006లో, అతను తోటి సాహసికుడు డిమిత్రి కీఫర్ అలాస్కా నుండి సైబీరియాకు కాలినడకన గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని దాటిన మొదటి వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు.అనధికారిక సరిహద్దు పాయింట్లోకి ప్రవేశించిన తర్వాత వీసా సమస్యలు, ఐదు సంవత్సరాల ప్రవేశ నిషేధం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది. దాంతో రష్యా గుండా వెళ్లటం సాధ్యపడలేదు. టండ్రా పరిస్థితుల దృష్ట్యా శీతాకాలం చివరిలో, వసంతకాలం ప్రారంభంలో మాత్రమే నడక మార్గం అనుకూలంగా ఉండేది బుష్బీకి. ఆగస్టు 2024లో, రాజకీయ ప్రమాదాల కారణంగా ఇరాన్ లేదా రష్యాలోకి ప్రవేశించకుండా కజకిస్తాన్ నుంచి అజర్బైజాన్కు కాస్పియన్ సముద్రం మీదుగా ఈదాడు. దీనికై విశ్రాంతి కోసం సహాయక పడవలతో 31 రోజులు పట్టిన 179-మైళ్ల క్రాసింగ్.ఆ తర్వాత కాకసస్, టర్కీ గుండా నడిచాడు, 2025లో బోస్ఫరస్ జలసంధిని దాటి యూరప్లోకి ప్రవేశించాడు. 2025 చివరి నాటికి, అతను యూకే నుంచి 1,400 మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న రొమేనియా గుండా నడక ప్రారంభించాడు. అయితే బుష్బీ సంకల్పించినట్లుగా తన ప్రధాన నియమం విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్తపడ్డాడు. కాలినడకనే తిరిగి ఇంటికి వెళ్లానే తన పట్టుదలను ఎక్కడ బ్రేక్ చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం బుష్బీ హంగేరీలో ఉన్నాడు. ఇంగ్లాండ్లోని తన స్వస్థలమైన హల్ నుంచి దాదాపు 932 మైళ్ల దూరంలో ఉన్నాడు. అతడి యాత్ర విజయవంతమైతే గనుక నిరంతరాయంగా నడిచిన తొలి వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకుని రికార్డు క్రియేట్ చేస్తాడు. చివరగా బుష్బీ 29 ఏళ్ల వయసులో ప్రపంచ యాత్ర మొదలుపెడితే 56 ఏళ్ల వయసుకు పూర్తి చేయనున్నాడు. నిజంగా ఇది అతిపెద్ద డేరింగ్ యాత్ర కదూ..!(చదవండి: ఆ యువ సైక్లిస్ట్ గట్స్కి మాటల్లేవ్..! ఆ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం..)
స్టార్ పేరెంటింగ్
‘పేరెంటింగ్ అంటే ఇలా ఉండాలి. ఇలా మాత్రమే ఉండాలి’ అని పుస్తకంలో రాసుకొని ఏ తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయరు. పిల్లల పెంపకంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అది సహజమైనది. సృజనాత్మకమైనది. ఎవరి దారి ఏదైనా అందులోని మంచి ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చోప్రా, ట్వింకిల్ఖన్నా, కరీనా కపూర్, సానియా మీర్జా... మొదలై వారు వివిధ సందర్భాలలో తమ పేరెంటింగ్ అనుభవాలను పంచుకున్నారు. పాతతరం, కొత్తతరంలోని అంశాలతో మిళితమైన ఈ నయా పేరెంటింగ్ గురించి...మన మూలాల్లోకి...‘గ్లోబల్ ఐకాన్’గా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ప్రియాంక చోప్రా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరవలేదు. కూతురు మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలు తెలిసేలా పెంచుతోంది. అమెరికాలో ఉన్నా సరే ఇంట్లో రోజూ హిందీ వినపడాల్సిందే. దీంతో మాల్తీ చిన్న చిన్న హిందీ మాటలు మాట్లాడుతుంటుంది. కూతురు నోటి నుంచి హిందీ వినిపించినప్పుడు ఆ తల్లి సంతోషం ఇంతాఅంతా కాదు!ప్రియాంక మాటల్లో చెప్పాలంటే... ‘భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే కాదు, కనెక్షన్ కూడా!’ భాష మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తుంది. అమెరికాలోని తన ఇంట్లో ఇండియాను ఆవిష్కరించడానికి మన పండగలను తప్పనిసరిగా జరుపుకుంటుంది ప్రియాంక. వాటి వి«శిష్ఠత గురించి పిల్లలకు చెబుతుంది. మనదైన సంగీతం వినిపిస్తుంది. మన జానపద కథలు చెబుతుంది. ఇంట్లో వండిన భారతీయ వంటకాల గురించి వివరిస్తుంది.‘మా అమ్మాయికి పనీర్, బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని సంతోషంగా చెబుతుంది ప్రియాంక. ‘నా ప్రయత్నాల వల్ల భౌగోళికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా తాను ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాల్తీ తెలుసుకోగలుగుతుంది’ అంటుంది ప్రియాంక. మన మూలాలను మరిచిపోనివ్వని పేరెంటింగ్ ఎలా ఉంటుందో ప్రియాంక పెంపకంలో చూడవచ్చు. ‘నా కూతురు నా నీడ కాదు. నా వారసత్వం... మాల్తీ ఒక ఫైర్’ అని కూతురు గురించి మురిసిపోతుంటుంది ప్రియాంక.తల్లే గురువుటెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్కు తల్లి మాత్రమే కాదు, ఆటలో గురువు కూడా. ఆమె తల్లి నసీమా మీర్జా షేర్ చేసిన వీడియోలో సానియ ఇజాన్తో కోర్టులో తిరగడం, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ గురించి నేర్పించడం కనిపిస్తుంది. నసీమా ఈ అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.... ‘నోస్టాల్జిక్, నోస్టాల్జిక్, నొస్టాల్జిక్! కూతురు, మనవడు ఒకే రకమైన పాషన్తో టెన్నిస్ ఆడుతున్న దృశ్యం చూడడం’ అని రాసింది.నసీమాకు సానియా బాల్యం గుర్తొచ్చి ఉంటుంది. చిన్నారి సానియాతో తాను కూడా టెన్నిస్ కోర్టులకు వెళుతుండేవి. ‘ఆటలెందుకమ్మా...చక్కగా చదువుకోకుండా’ అని ఆమె అని ఉంటే టెన్నిస్ స్టార్గా సానియా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘పిల్లల ఇష్టాయిష్టాలు కనిపెట్టాలి, ఇష్టపడే వాటిలోనే వారిని తీర్చిదిద్దాలి’ అనే సూత్రాన్ని నమ్మి పాటించింది నసీమా. ఇప్పుడు ఆమె కూతురైన సానియా కూడా అంతే. కుమారుడు ఇజాన్లోని ఇష్టాన్ని కనిపెట్టి ఆ చిన్నారికి టెన్నిస్లో ఓనమాలు దిద్దిస్తోంది. తల్లే గురువు అయితే అంతకంటే ఆనందం ఏముంటుంది! తల్లికొడుకులకు తేడా ఏమిటంటే... తల్లి రైట్–హ్యాండెడ్. కొడుకు లెఫ్ట్–హ్యాండెడ్. ఒక పాషన్తో ఏడు సంవత్సరాల ఇజాన్ స్ట్రోక్స్ ప్రాక్టిసింగ్ చూస్తుంటే, ఈ సాధన ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ఇజాన్ తల్లి మెచ్చిన తనయుడు అవుతాడు అనడంలో సందేహాం లేదు.ఆమె అడుగు జాడల్లో..పేరెంటింగ్కు సంబంధించి పెద్దలు మహా విశ్వవిద్యాలయాలు! కరీనా కపూర్కు సంబంధించి మహా విశ్వవిద్యాలయం ఆమె అత్తయ్య షర్మిలా ఠాగోర్. ‘ఎప్పుడూ మీ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తుంటాను’ అని షర్మిలా ఠాగోర్కు ఇటీవల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది కరీనా. ఈ సందర్భంగా అత్తయ్య ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. పిల్లలతో షర్మిల ఎలా కలిసిపోతుందో చెప్పడానికి ఈ ఫొటోలే సాక్ష్యం.ఆరోజుల్లో సినిమాలలో చాలా బిజీగా ఉండడం వల్ల చిన్నారి సైఫ్ అలీఖాన్తో ఎక్కువ సమయం గపపడానికి షర్మిలకు సమయం చిక్కేది కాదు. దాని గురించి ఇప్పటికీ బాధ పడుతూ ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతుంటుంది. ఎలాంటి అంతరాయం కలిగించకుండా పిల్లల మాటలను శ్రద్ధగా వింటుంది ఠాగోర్. ‘మన నుంచి పిల్లలే కాదు, పిల్లల నుంచి మనం నేర్చుకునేది కూడా ఏదో ఒకటి ఉంటుంది’ అంటుంది షర్మిలా.‘కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. పిల్లల పెంపకానికి సంబంధించి సంప్రదాయ విధానాలకు, ఆధునికి విధానాలను జత చేయాలి’ అంటుంది షర్మిలా ఠాగోర్. అత్తయ్య మాటలను అక్షరాల అనుసరించే ప్రయత్నం చేస్తోంది కరీనా కపూర్.ఆత్మగౌరవంపేరెంటింగ్కు సంబంధించి రచయిత్రి, నటి ట్వింకిల్ఖన్నా తన తల్లి డింపుల్ కపాడియాను సందర్భానుసారంగా ఉదాహరిస్తుంటుంది. ప్రసిద్ధ బాలీవుడ్ నటి డింపుల్ కపాడియ ఆరోజుల్లో మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉండేది. క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లల చదువు, బాగోగులకు సంబంధించి అశ్రద్ధ వహించేది కాదు. పొద్దున అయిదు గంటలకే లేచి వ్యాయామాలు చేస్తూ ఉండేది.‘వ్యాయామాలు చేస్తున్న అమ్మను చూస్తున్నప్పుడు సూపర్ ఉమెన్ను చూసినట్లుగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ట్వింకిల్ ఖన్నా. ఆత్మగౌరవానికి సంబంధించి తన తల్లి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతుంటుంది ట్వింకిల్. ‘మీరు ఆధారపడగల ఏకైక వ్యక్తి మీరే. ప్రతి మహిళా స్వతంత్రంగా ఉండాలి’ అని కూతుళ్లు ట్వింకిల్, రింకిలకు చెబుతుండేది డింపుల్.‘అత్తయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలతో మా ఇళ్లు సందడిగా ఉండేది. ఇంట్లో ఎందరు ఉన్నప్పటికీ అమ్మతో గడపడం అనేది అపురూపమై అనుభవం’ టింకిల్ ఖన్నా దృష్టిలో పేరెంటింగ్ అంటే... ‘పేరెంటింగ్ నిర్మాణత్మకంగా ఉండాలి. అదే సమయంలో స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్లో క్రమశిక్షణ ఉండాలి. సరదాగా నవ్వుకునే స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్లో బ్యాలెన్సింగ్ అనేది ప్రధానం’ ‘పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రులు సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారు’ అని చెబుతున్న ట్వింకిల్ ఖన్నా వాటి పరిష్కార మార్గాల గురించి పత్రికలలో, పుస్తకాలలో, సోషల్ మీడియాలో రాస్తూ ఉంటుంది.
అంతర్జాతీయం
చైనా ‘మ్యాప్’ రాజకీయం..!
చైనా.. మనకు పొరగునున్న దేశం. ఈ దేశం తీరు ఎవ్వరికీ అర్థం కాదు. ఒకవైపు మిత్రత్వం చేస్తూనే తమ సరిహద్దుల్లో ఉన్న భూభాగాల్ని తమదే అంటుంది. ఆ విషయం ఇటీవల రష్యా భూభాగాన్ని తన మ్యాప్లో చూపించడంతో చైనా వైఖరి మరోసారి బయటపడింది. అంతకుముందు భారత్ భూభాగాల్ని అనేకసార్ల తన మ్యాప్ల్లో చూపించింది చైనా.సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నా..చైనాతో ప్రస్తుతం భారత్ సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నప్పటికీ, అవకాశం వస్తే దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనుకాడదు అనేది గతంలో చాలాసార్లు నిరూపణ అయ్యింది. గాల్వాన్ ఎపిసోడ్లో ఎంతటి రాద్దాంతం జరిగిందో అందరికి తెలిసిందే. 2020, జూన్ 15వ తేదీన భారత–చైనా గాల్వాన్ జరిగిన ఘటన హింసాత్మకమనే చెప్పాలి.ఈ సంఘటనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది చైనా సైనికులు కూడా మరణించారు. ఇది 45 సంవత్సరాల తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద జరిగిన అత్యంత హింసాత్మక ఘర్షణగా నిలిచిపోయింది. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో చైనా దూకుడు తగ్గించింది. అదే సమయంలో భారత్తో స్నేహ సంబంధాలకోసం చేతులు చాచింది. ఆ క్రమంలోనే ఇటీవల ఇరదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి. ఐదేళ్ల తర్వాత భారత విమానాలు.. చైనా గగనతలంలోకి వెళుతున్నాయి.చైనా మారిందా.. నటిస్తుందా..?కానీ తన వైఖరిని పూర్తిగా మార్చుకుందా అనేది ప్రశ్నార్థకమే. ఎప్పుడు ఏదో వివాదంతో అగ్నికి ఆజ్యం పోయాలనే చూస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తూ తన పొరుగు దేశాలను ఏదో రకంగా గిల్లుతూనే ఉంటుంది. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే జరిగింది. రష్యాతో స్నేహం నటిస్తూనే ఆ దేశ భూభాగాన్ని చైనా తన మ్యాప్లో చూపించింది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే.. ప్రత్యర్థి దేశం ఏమాత్రం బలహీనంగా ఉన్నా వారిపైకి మెల్లగా తన అస్త్రాలను వదులుతుంది. రష్యా విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం రష్యా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఉక్రెయిన్తో సుదీర్గకాలంగా చేస్తున్న యుద్ధం కారణంగా రష్యా సైతం ఆర్థికంగా గాడిన పడటానికి అపసోపాలు పడుతోంది. ఇటువంటి తరుణంలో రష్యా భూభాగాన్ని తన మ్యాప్లో చూపించే యత్నం చేసింది డ్రాగన కంట్రీ. ఒక రాయి వేసి చూద్దాం అసలు ఏం జరుగుతుందా అనే వైఖరిని బాగా వంట బట్టించుకున్న చైనా.. అవకాశం వచ్చినప్పుడు ఈ జిత్తులు మారిన చేష్టలు చేస్తూనే ఉంటుంది.అమెరికాతో తీవ్రపోటీ..అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు ఆశాజనకంగా లేవనే సంగతిని పక్కన పెడితే. ఆ దేశంతో ఇటీవల కాలంలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది చైనా. పూర్తిగా ఇరు దేశాల మధ్య శత్వుత్వం లేకపోయినా తీవ్ర పోటీ ఉంది. ఆ క్రమంలోనే వారి మధ్య టారిఫ్ వార్ గట్టిగానే జరిగింది. ఇది కేవలం టారిఫ్ వార్గా అభివర్ణించినా, విషయం మాత్రం సీరియస్గానే ఉండటంతో మిత్రత్వం కోసం భారత్తో మిత్రత్వం కోసం పాకులాడింది.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి అనే భావన చైనాలో ఉండటమే కాదు.. అత్యంత నమ్మదగిన దేశాలలో భారత్ ఒకటి అనే విషయాన్ని కూడా చైనా బాగానే గ్రహించింది. దాంతోనే భారత్తో స్నేహం కోసం నిరీక్షించి మరీ ఆ దిశగా సక్సెస్ అయ్యింది. ఆ క్రమంలోనే ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాడిలో పడ్డాయి.అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ..ఇటీవల చోటు చేసుకున్న ఘటనను చూసుకుంటే.. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళను చైనా ఎయిర్పోర్ట్లో ముప్పుతిప్పలు పెట్టారు చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు. తన పాస్పోర్ట్ను పరిశీలించే క్రమంలో అరుణాచల్ ప్రదేశే్-భారత్ అని ఉందేంటని ఆ అధికారులు ఆ మహిళను వేధింపులకు గురి చేశారు. యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్ట్పై అరుణాచల్ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను.పెమా వాంఘజామ్ థోంగ్డాక్ అనే లండన్ నుంచి జపాన్కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. కానీ అక్కడ భారత ఎంబాసీ అధికారులు జోక్యం చేసుకోవడంతో చివరకు ఆ మహిళ ఎలాగోలా బయటపడింది. మరి ఈ విషయం ప్రపంచానికి తెలిసినప్పుడు చైనా ప్రభుత్వానికి తెలియదా.. కచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి ఏమైనా మాట్లాడిందా అంటే అదీ లేదు. ఇది చిన్న విషయంగా కనిపించినా, ఇటువంటి వాటిని ఆదిలోనే తుంచేయాలి. అలాగే డ్రాగన్ కంట్రీపై సీరియస్గా భారత్ దృష్టిసారించి ఉండాల్సిందే.ఇదీ చదవండి: రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను!
"సెవన్ సిస్టర్స్ చీలిపోతుంది"
బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్పై కారు కూతలు కూశారు. భారత్ను చీల్చే ప్రయత్నాలు చేసే వ్యక్తులకు, సంస్థలకు తమ దేశం ఆశ్రయం ఇస్తుందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఆశ్రయంతో భారత్లోని ఈశాన్యప్రాంతం ప్రాంతం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని తీవ్రంగా మాట్లాడారు. కాగా ఆ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు.బంగ్లాదేశ్ ఎన్సీపీ లీడర్ అబ్దుల్లా భారత్ను బెదిరిస్తూ పిచ్చిగా మాట్లాడారు. అబ్దుల్లా మాట్లాడుతూ "నేను ఒక విషయం భారత్కు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తాం. దానివల్ల భారత్ నుంచి ఈశాన్య ప్రాంతం వేరయ్యే అవకాశముంది". అని హెచ్చరించారు. బంగ్లాదేశ్ సౌర్వభౌమాధికారాన్ని, మానవహక్కులని గౌరవించని వారికి భారత్ ఆశ్రయం కల్పిస్తే బంగ్లాదేశ్ సమాధానమిస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. "ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవి, గతేడాది నుంచి తరచుగా ఈశాన్య రాష్ట్రాలని భారత్ నుంచి విడగొడతాం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ ఈ విషయంలో మౌనంగా ఉండకూడదు" అని హిమంత అన్నారు. భారత్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. త్రిపుర రాష్ట్రాలను కలిపి సెవెన్సిస్టర్స్ అని అంటారు.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటుంది. గతేడాది ఆ దేశంలో జరిగిన ఘర్షణల తర్వాత హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లో ఆశ్రయం పొందింది. అయితే కొద్దిరోజుల క్రితం హసీనాకు బంగ్లాదేశ్లోని కోర్టులు 21 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మరణశిక్ష విధించాయి. దీంతో షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది. అయితే దీనిపై భారత్ ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం వెల్లడించలేదు.
గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్న భారత సంతతి మహిళ అరెస్ట్
అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన 60 ఏళ్ల మహిళకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో 30 ఏళ్లుగా నివసిస్తున్నమహిళను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి రౌండ్లో అరెస్ట్ చేయడం కలకలం రేపింది. బబ్లీజీత్ కౌర్ అలియాస్ బబ్లీ అనే మహిళ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తన తల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆమె కుమార్తె జోతి మీడియాకు తెలిపారు. 1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబుల్జిత్ "బబ్లీ" కౌర్, పెండింగ్లో ఉన్న ఆమె గ్రీన్ కార్డ్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 1న తన తల్లి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయం డెస్క్ వద్ద ఉన్నప్పుడు, పలువురు ఫెడరల్ ఏజెంట్లు భవనంలోకి ప్రవేశించారని జ్యోతి చెప్పింది. ఆ తర్వాత ఫెడరల్ ఏజెంట్లు వెళ్లిన గదిలోకి కౌర్ను పిలిచి, ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని ఆమె తెలిపింది. కౌర్కు తన న్యాయవాదితో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించినప్పటికీ, ఆమెను నిర్బంధంలోనే ఉంచారని ఆమె కుమార్తె చెప్పింది. కొన్ని గంటల పాటు కౌర్ను ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులైన తమకు తెలపకుండానే, రాత్రికి రాత్రే అడెలాంటోకు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అమెరికా పౌరురాలైన ఆమె మరో కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న ఆమె భర్త నుండి ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ హోదాలో ఉన్నారని లాంగ్ బీచ్ వాచ్డాగ్ తన కథనంలో వివరించింది.ఎవరీ బబ్లీ కౌర్ కౌర్ కుటుంబం USకి వలస వచ్చిన తర్వాత, మొదట లగున బీచ్లో స్థిరపడ్డారు, తర్వాత లాంగ్ బీచ్కు వెళ్లారు. తరువాత ఉద్యోగ బాధతలరీత్యా బెల్మాంట్ షోర్ ప్రాంతానికి మారారు. కౌర్కు ముగ్గురు పిల్లలున్నారు. 34 ఏళ్ల జోతి, DACA (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) కింద USలో చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు ,ఆమె అన్నయ్య, సోదరి, ఇద్దరూ అమెరికా పౌరులుగా ఉన్నారు.రెండు దశాబ్దాలకు పైగా, కౌర్ , ఆమె భర్త బెల్మాంట్ షోర్లోని 2వ వీధిలో నటరాజ్ క్యూసిన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ అనే తినుబండారాల ఔట్లెట్ను నిర్వహిస్తున్నారు. లాంగ్ బీచ్ కమ్యూనిటీలో మంచి ఆదరణను కూడా పొందింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఫార్మసీ చైన్ దాని మిగిలిన స్థానాలను మూసివేసేంs వరకు ఆమె బెల్మాంట్ షోర్ రైట్ ఎయిడ్లో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసింది. ఇటీవల, ఆమె రాయల్ ఇండియన్ కర్రీ హౌస్లో రెస్టారెంట్ పనిలోకి రావడానికి తిరిగి సిద్ధమవుతోంది.బబ్లీ కౌర్ను విడుదల చేయాలని పిలుపులాంగ్ బీచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా, కౌర్ విడుదల కోసం పిలుపునిచ్చారు. ఆమె కుటుంబం ఆమె కేసు కొనసాగుతున్నందున కౌర్ను బాండ్పై విడుదల చేయడానికి అనుమతించే అదనపు చట్టపరమైన దాఖలును సిద్ధం చేస్తున్నందున, ఈ విషయంపై అతను ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపు తున్నట్లు ఆయన సిబ్బంది తెలిపారు.
జోర్డాన్ యువరాజు బీఎండబ్ల్యూలో ప్రధాని మోదీ
అమ్మాన్: ప్రధాని నరేంద్ర మోదీ.. కింగ్ అబ్దుల్లా- II ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్ రాజధాని అమ్మాన్కు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ యువరాజు, మహమ్మద్ ప్రవక్త ప్రత్యక్ష వారసుడైన అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా- II ప్రధాని మోదీకి అరుదైన గౌరవం అందించారు. యువరాజు తన వ్యక్తిగత బ్లాక్ కలర్ బీఎండబ్ల్యూ కారులో ప్రధాని మోదీని స్వయంగా అమ్మాన్లోని జోర్డాన్ మ్యూజియంనకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను చాటి చెప్పింది.అమ్మాన్లోని రాస్ అల్-ఐన్లో ఉన్న జోర్డాన్ మ్యూజియం పురావస్తు, చారిత్రక కళాఖండాలకు నిలయం. 2014లో నెలకొల్పిన ఈ మ్యూజియం జోర్డాన్ ప్రాంత సుదీర్ఘ నాగరిక ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇక్కడ 1.5 మిలియన్ సంవత్సరాల నాటి జంతువుల ఎముకలు ఉన్నాయి. అత్యంత పురాతన విగ్రహాలలో ఒకటైన తొమ్మిదివేల ఏళ్లనాటి ఐన్ ఘజల్ సున్నపు ప్లాస్టర్ విగ్రహాలు ఉన్నాయి.ఈ మ్యూజియంను ప్రధాని మోదీ సందర్శించారు. These outcomes mark a meaningful expansion of the India-Jordan partnership. Our cooperation in new and renewable energy reflects a shared commitment to clean growth, energy security and climate responsibility. Collaboration in water resources management and development will… https://t.co/SYbOTkd4B2— Narendra Modi (@narendramodi) December 16, 2025ప్రధాని మోదీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదపడింది. ఈ సందర్భంగా భారతదేశం, జోర్డాన్లు పలు కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి ఇండియా-జోర్డాన్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో కూడా ప్రసంగించారు. ఇరు దేశాలు వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడి సంబంధాలను పెంచగల రంగాలను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ మూడు దేశాల (జోర్డాన్, ఇథియోపియా, ఒమన్) పర్యటనలో జోర్డాన్ మొదటి మజిలీ.ఇది కూడా చదవండి: Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే..
జాతీయం
కారులో షికారు.. ప్రపంచ దేశాలకు మోదీ సరికొత్త పాఠాలు
ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలో.. సాధారణంగా అధికారిక సమావేశాలు, ప్రోటోకాల్లు, భద్రతా ఏర్పాట్లకు ప్రధానంగా చోటు ఉంటుంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకు మించిన పనే చేస్తున్నారు. వివిధ దేశాల అధినేతలతో కారులో షికార్లు కొడుతూ.. సరికొత్త దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి ఈ చర్యలు ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నాయో తెలుసా?.. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోందిగానీ.. ఆయన పర్యటనల్లో కనిపిస్తోందిగానీ సాధారణ ప్రోటోకాల్కి మించే. అయితే.. వ్యక్తిగతంగా దేశాధినేతలతో కారులో ప్రయాణించడం ద్వారా ఆయన తన ఫ్రెండ్లీ నేచర్ను కనబరుస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ నాయకులతో సంబంధాలను మరింత బలపరుచుకుంటూ ‘కార్ డిప్లమసీ’తో ప్రపంచ దేశాలకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. తాజాగా ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్తో టయోటా ఫార్చ్యూనర్లో ప్రయాణం.. దానికంటే కొన్నిగంటల ముందు జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా-II స్వయంగా డ్రైవ్ చేసిన కారులో ప్రయాణించడం.. ఇవన్నీ కేవలం ప్రోటోకాల్గా మాత్రమే కాదు, వ్యక్తిగత స్నేహానికి సంకేతాలు అనే చెప్పొచ్చు. India-UK friendship is on the move and is filled with great vigour! A picture from earlier today, when my friend PM Starmer and I began our journey to attend the Global Fintech Fest.@Keir_Starmer pic.twitter.com/3FyVFo69Rp— Narendra Modi (@narendramodi) October 9, 2025 In a special gesture, Jordan's Crown Prince Al Hussein bin Abdullah II, the 42nd-generation direct descendant of Prophet Muhammad, personally drives Indian PM Narendra Modi to the Jordan Museum during his visit to Amman. pic.twitter.com/A3kkSOmauj— Sidhant Sibal (@sidhant) December 16, 2025After Jordan Prince, Nobel Peace prize winning Ethiopian PM Abiy Ahmed drives PM Modi from the airport to hotel. pic.twitter.com/lLa9RKEbMb— Rishi Bagree (@rishibagree) December 16, 2025మోదీ పంథా.. దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలను బలపర్చుకునే వ్యూహం!. ప్రపంచ నాయకులు మోదీతో కారులో ప్రయాణించడం ద్వారా, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రజలకు, ప్రపంచానికి చూపిస్తున్నారు. స్నేహపూర్వక సంకేతంగా మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ వేదికపై తన ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించే మార్గం కూడా ఎంచుకున్నట్లు స్పష్టగా తెలుస్తోంది. అయితే..ప్రపంచ నాయకులు అప్పుడప్పుడు వ్యక్తిగత అనుబంధాన్ని చూపించడానికి కారులో ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు, కొన్ని దేశాధినేతలు ప్రత్యేక అతిథులను స్వయంగా డ్రైవ్ చేసి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి(మోదీ రష్యా పర్యటనలో పుతిన్ స్వయంగా వాహనం నడిపారు కూడా). కానీ దీనిని ఒక నిరంతర దౌత్య శైలిగా ఉపయోగించిన ఉదాహరణలు చాలా అరుదు. మోదీ దీన్ని సాఫ్ట్ పవర్ టూల్గా మార్చి.. వరుసగా పలు దేశాల్లో ప్రదర్శించడం వల్లే ఇది ప్రత్యేకంగా నిలుస్తోందనే చెప్పొచ్చు.
‘శాంతి’తో సంచలనం.. ఇక భారత ‘అణు శక్తి’ ప్రైవేటీకరణ!
న్యూఢిల్లీ: భారతదేశ ఇంధన రంగంలో చారిత్రక అధ్యాయం మొదలు కాబోతోంది. దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరతీస్తూ ప్రభుత్వం లోక్సభలో 'శాంతి' (SHANTI - Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) బిల్లు- 2025ను ప్రవేశపెట్టింది. 1962 నాటి పాత చట్టాలను రద్దు చేస్తూ, తీసుకువచ్చిన ఈ బిల్లు, భారతదేశాన్ని గ్లోబల్ న్యూక్లియర్ హబ్గా మార్చే దిశగా వేసిన తొలి అడుగు.ప్రైవేట్ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ఈ బిల్లులోని అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే, ఇకపై టాటా పవర్, అదానీ పవర్, రిలయన్స్ వంటి భారతీయ ప్రైవేట్ సంస్థలు సొంతంగా అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించుకోవచ్చు.. నిర్వహించుకోవచ్చు. ఇప్పటివరకు ఈ అధికారం కేవలం ప్రభుత్వ సంస్థలైన ఎన్పీసీఐఎల్ వంటి వాటికే పరిమితమై ఉండగా, కొత్త చట్టం ద్వారా ప్రైవేట్ రంగం కూడా ఇందుకోసం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, భద్రత దృష్ట్యా విదేశీ సంస్థల నియంత్రణలో ఉన్న కంపెనీలకు మాత్రం ఈ అనుమతి ఉండదు.విదేశీ పెట్టుబడులకు అడ్డంకులు తొలగింపుగతంలో విదేశీ సరఫరాదారులు భారతదేశంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేసేవారు. దానికి ప్రధాన కారణం 'న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, 2010'. ఏదైనా ప్రమాదం జరిగితే పరికరాల సరఫరాదారులపై కూడా బాధ్యత ఉండేది. అయితే ఈ ‘శాంతి’ బిల్లు ఈ అడ్డంకిని తొలగించింది. ఇకపై అణు ఘటనలకు బాధ్యత కేవలం ఆపరేటర్లకే పరిమితం అవుతుంది. సరఫరాదారులకు మినహాయింపు ఉంటుంది. ఇది వెస్టింగ్హౌస్, రోసాటమ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు భారతీయ సంస్థలతో చేతులు కలపడానికి మార్గం సుగమం చేస్తుంది.భద్రత.. కఠిన నిబంధనలుఅణుశక్తి నియంత్రణ బోర్డు (ఏఈఆర్బీ)కి ఈ బిల్లు చట్టబద్ధమైన హోదాను కల్పించింది. ఫలితంగా భద్రతా పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చిన్న తప్పులకు రూ. 5 లక్షల నుండి తీవ్రమైన నేరాలకు రూ. ఒక కోటి వరకు జరిమానాలు విధిస్తారు. అలాగే అణు ప్రమాదాల బాధ్యతను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 300 మిలియన్ల ప్రత్యేక డ్రాయింగ్ హక్కులకు (ఎస్డీఆర్లకు)పరిమితం చేస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా 'అణుశక్తి పరిష్కార సలహా మండలి'ని ఏర్పాటు చేయనున్నారు.2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యంప్రస్తుతం భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం కేవలం 8.2 గిగావాట్లు మాత్రమే. అయితే 2047 నాటికి దీనిని 100 గిగావాట్లకు పెంచాలని, 2070 నాటికి 'నెట్ జీరో' ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా, అణు శాస్త్రంలో ఆవిష్కరణలు, రవాణా, ఇంధన నిల్వ తదితర అంశాలలో కూడా ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. ఇది కూడా చదవండి: Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే..
మసక మసక చీకటిలో..
ముంబై: ఢిల్లీ విమానాశ్రయంలో తక్కువ దృశ్యమానత(విజిబిలిటీ) కారణంగా విమానాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీని ఫలితంగా మంగళవారం మొత్తం 131 విమానాలను రద్దు చేసినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అధికారి తెలిపారు. రద్దయిన 131 విమానాలలో 52 బయలుదేరే విమానాలు కాగా, 79 వచ్చే విమానాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో, ఎయిర్ ఇండియా ప్రధాన కేంద్రమైన ఢిల్లీలో, దట్టమైన పొగమంచు కారణంగా తక్కువ దృశ్యమానత నెలకొంది. దీని ప్రభావం మొత్తం నెట్వర్క్లోని విమాన షెడ్యూల్పై పడింది. ఈ సంవత్సరం శీతాకాలం కోసం, ఏవియేషన్ రెగ్యులేటర్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) డిసెంబర్ 10 నుండి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు అధికారిక ‘పొగమంచు విండో’గా ప్రకటించింది. ఈ అంతరాయాల కారణంగా, ఎయిర్లైన్ ఇండిగో తన నెట్వర్క్లో ఏకంగా 113 విమానాలను రద్దు చేసింది. అంతేకాకుండా, ఢిల్లీ వాతావరణం కారణంగా బుధవారం కూడా 42 విమానాలను నడపబోమని ఇండిగో ప్రకటించింది.
‘లవ్’ లీవ్ కావాలి!
అది చలికాలం మధ్యాహ్నం.. ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కార్యాలయం.. అందరూ మధ్యాహ్న భోజనం తర్వాత పనిలోకి జారుకుంటున్న వేళ.. ఓ కుర్ర ఉద్యోగికి మాత్రం మనసు మనసులో లేదు. ఎందుకంటే.. డిసెంబర్ 17న అతని గర్ల్ఫ్రెండ్ స్వరాష్ట్రం ఉత్తరాఖండ్కు వెళ్తోంది. మళ్లీ వచ్చేది జనవరి మొదటి వారంలోనే.. ఈ సుదీర్ఘ వియోగానికి ముందు ఆమెతో ఒక రోజు మొత్తం గడపాలి.. కానీ ఎలా?.. ఎలా? మేనేజర్కి ఏం చెప్పాలబ్బా..! సమస్య అల్లా మేనేజర్ వీరెన్ ఖుల్లర్.. సెలవు అడిగితే రొటీన్ సాకు చెప్పాలా? ’మామయ్యకి సుస్తీ’, ’ట్రైన్లో టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదు’.. లాంటి పాత ట్రిక్స్ వాడాలా? ఇవేవీ వద్దనుకున్నాడు మన లవర్బాయ్.. ఎందుకంటే, నిజాయితీనే అతిపెద్ద ఆయుధమని అతనికి తెలుసు. ఈమెయిల్ బాంబు.. మొత్తానికి అబ్బాయి.. ధైర్యం చేశాడు. కీబోర్డుపై వేళ్లు ఆనించి ఒక పారదర్శకమైన ఈమెయిల్ను టైప్ చేసేశాడు. అందులో ఎలాంటి అతిశయోక్తులు.. అలంకారాలు లేనేలేవు. సూటిగా చెప్పేశాడు.. ‘డిసెంబర్ 16న వ్యక్తిగత కారణాల వల్ల సెలవు కావాలి, ఎందుకంటే నా గర్ల్ఫ్రెండ్ తన సొంతూరు ఉత్తరాఖండ్కు డిసెంబర్ 17న వెళ్తోంది. జనవరి మొదటి వారం వరకు తిరిగి రాదు. అందుకే ఆమె వెళ్లే ముందు ఆ ఒక్కరోజు తనతో గడపాలని కోరుకుంటున్నాను..’ఇదీ సెలవు దరఖాస్తు సారాంశం. ఆ మెయిల్ ’సెండ్’ బటన్ నొక్కిన క్షణం.. ఆఫీసులో కాదు, కుర్రాడి గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వీడు మామూలోడు కాదు మేనేజర్ వీరెన్ ఖుల్లర్ మధ్యాహ్న భోజనం తర్వాత ఈమెయిల్స్ పరిశీలిస్తుండగా, ఆ అసాధారణమైన ’లవ్ రిక్వెస్ట్’ కంట పడింది. ఖుల్లర్ ముఖంలో చిరునవ్వు, ఆశ్చర్యం కలగలిసిన భావం. ‘ఓహో! పాత రోజుల్లో అయితే వీడు ఉదయం 9.15 గంటలకే ’ఫీవర్’ అని మెసేజ్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు చూడండి, ఎంత ధైర్యం!‘ అనుకున్నారు. నిజానికి, గతంలో ఇలాంటి రిక్వెస్ట్లు రాత్రికి రాత్రి ’జబ్బు’గా మారి, మర్నాడు ఉదయం అపాయింట్మెంట్ అడిగేవి. కానీ కుర్రాడి నిజాయితీ, పారదర్శకత బాస్కి తెగ నచ్చేశాయి. ప్రేమకు జై.. ఈ పోస్ట్ తక్షణం వైరల్ అయింది. నెటిజన్లు కుర్రాడి ధైర్యాన్ని, ఖుల్లర్ ఔదార్యాన్ని చూసి మనసారా మెచ్చుకున్నారు. ‘అసలైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇదే!’, ‘ఆ మేనేజర్కి సలామ్’, ‘సెలవు దొరకడమే కష్టం అనుకుంటే, ప్రేమ పేరుతో దొరకడం అంటే లక్’.. అంటూ ప్రశంసించారు. ఆఫీసు అంటే కేవలం కట్టుబాట్లు, కఠిన నియమాలు కాకుండా, నమ్మకం, మానవత్వం కూడా ఉంటాయని ఈ చిన్న సంఘటన నిరూపించింది. ప్రేమోద్యోగి కథ సుఖాంతమైంది. అతను తన ప్రేయసితో హ్యాపీగా గడిపేందుకు టిక్కెట్ సంపాదించాడు. బేబీ ప్రేమ విషయంలో, బాసు కూడా ఓడిపోక తప్పలేదు! పండగ చేస్కోరా బుడ్డోడా..అప్పుడే మేనేజర్ ఖుల్లర్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఈ క్షణికావేశంలో, తాను ఒక డైరెక్టర్ కాదు, కేవలం ఒక మనిషి మాత్రమే అని గుర్తు చేసుకున్నాడు. మనిషి జీవితంలో ప్రేమకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన గౌరవించాడు. సెలవు మంజూరు చేస్తూ.. ఆ మహా ప్రేమ లేఖ స్క్రీన్షాట్ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. దానికి ఆయన జత చేసిన వ్యాఖ్యే ఈ కథకు ’పంచ్’ పాయింట్.. ‘ప్రేమకు ’నో’ చెప్పే ధైర్యం మనకు ఎక్కడిది? సెలవును ఆమోదించాను! నువ్వు హ్యాపీగా వెళ్లు తమ్ముడూ!’.. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎన్ఆర్ఐ
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికా బర్మింగ్హామ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు.
నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!
మంచి ఉద్యోగం, మెరుగైన జీతం, సౌకర్యవంతమైన జీవితం, కెరీర్లో అవకాశాలు వీటికోసం కలలు కంటూ చాలామంది భారతీయులు విమానాల్లో విదేశాలకు ఎగిరిపోతున్నారు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులను కన్నతల్లి లాంటి ఊరినీ, వదిలి ఉండటం అంత సులువు కాదు. దేశం కాని దేశం, మన భాషకాదు..మన తిండి కాదు, మన జాన్ జిగిరీ దోస్తులు ఆసలే లేని చోట ఉండటం చాలా వేదనతో కూడుకున్నదే. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు ఒక పక్క ఒంటరితనం, మరోపక్క ఇంటి బెంగతో ఒక్కోసారి ఊపి రాడదు. ఇదీ నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) అనుభవించే మానసిక బాధ అందుకే ఒక ఎన్ఆర్ఐ ఏం చేశాడో తెలుసా?కష్టపడి ఐదేళ్ల పాటు కెనడాలో జీవితాన్ని గడిపేసిన ఎన్ఆర్ఐ ఇక నావల్ల కాదు బాబోయ్ అంటూ ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలన్న తన నిర్ణయంపై సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. అయిదేళ్లు కెనడాలో ఉన్నాను.విదేశాలలో జీవితం రోబోటిక్గా అనిపించింది. అందుకే ఇక భరించ లేను. ఇక్కడ స్నేహితులు ఉన్నప్పటికీ, కానీ సామాజిక ఒంటరితనం బాధిస్తోంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం అని పేర్కొన్న రెడ్డిట్ పోస్ట్ వైరలవుతోంది.చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడాకెనడాలో మితిమీరిన క్రమశిక్షణ భరించడం కష్టంగా ఉంది. ప్రతీదీ పద్ధతిగా సిస్టమ్యాటిగ్గా జరగాలి. కనీసం బియ్యం కొనడానికి దుకాణానికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వేచ్ఛను మిస్ అవుతున్నా అనిపిస్తోందన్నాడు. భారతదేశంలో వ్యవస్థీకృత గందరగోళం ఉంది. దానిని మిస్ అవుతున్నా. కానీ ఇండియాలో గడపబోయే జీవితంపై చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇండియాలో మురికి, కనీస పౌర జ్ఞానం లేకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది మన ఇల్లు. అందుకే ఇండియాకు తిగిరి వచ్చేస్తున్నానని పేర్కొన్నాడు.నెటిజన్లు అతని నిర్ణయాన్ని ప్రశంసించారు. మనసుకు నచ్చినట్టు జీవించాలి భయ్యా అని కొందరు, ప్రతి దేశానికి దాని సమస్యలు ఉంటాయి. ఏ దేశానికైనా దాని లాభనష్టాలు దానికి ఉంటాయి. ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఫైనల్గా ఎక్కడ సంతోషంగా ఉంటామో, అక్కడ ఉండటమే సరైంది అని మరికొందరు ఎంతైనా మన ఇల్లు ఇల్లే కదా భాయ్.. అనే కమెంట్లు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి : ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య
క్రైమ్
హైదరాబాద్: చందానగర్లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారి తన స్కూల్ ఐడీ కార్డుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కూల్లో తోటి పిల్లలు ఏడిపించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.ప్రశాంత్(9) స్థానికంగా ఓ స్కూల్లో చదువుతున్నాడు. అయితే స్కూల్ యూనిఫామ్ సరిగా లేదని తోటి పిల్లలు ఆటపట్టించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. ఆపై బాత్రూమ్లోకి వెళ్లి తన ఐడీ కార్డుతో ఉరి వేసుకున్నాడు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆపై స్వగ్రామానికి తరలించారు. పిల్లాడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విద్యాసంస్థల్లో బుల్లీయింగ్ గురించి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.బుల్లీయింగ్కి(వేధింపులు) చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, ఆన్లైన్ వేదికల్లో జరిగే వేధింపులకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు.. సంబంధిత విద్యార్థిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే కౌన్సెలింగ్కి పంపడం జరుగుతుంది. నేరం తీవ్రతను(వయసు రిత్యా) బట్టి శిక్షలు విధించే అవకాశం లేకపోలేదు.
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపుల కలకలం
ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో కొంత మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమను వేధిస్తున్నారని ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినులు ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్, రిజి్రస్టార్, డైరెక్టర్లకు ఈ – మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, పరీక్షల నిర్వహణ విభాగంలోని బోధనేతర సిబ్బంది పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని మెయిల్లో ఆరోపించారు. స్కాలర్షిప్ల కోసం వేలి ముద్రలు వేసే సమయంలో కొందరు బోధనేతర సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఈ నెల 11న ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి క్యాంపస్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. అయితే ఇది అనాధారిత మెయిల్ అని అధికారులు చెబుతున్నప్పటికీ... తమ పేరు బయటకు రాకుండా ఉన్నతాధికారులకు సమస్యలు నివేదించడానికి విద్యార్థులు ఇలా చేసి ఉండొచ్చని కొందరంటున్నారు. మెయిల్ ఎవరు చేశారనే కోణంలో కాకుండా ఫిర్యాదులోని వాస్తవాలపై విచారణ నిర్వహించాలని కోరుతున్నారు. మరోవైపు బోధనా సిబ్బందిలో చాలా మంది పాఠాలు చెప్పకుండా యూట్యూబ్, చాట్ జీపీటీలో చూసుకోమని సూచిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేజీవీడీ బాలాజీ తెలిపారు.
కన్నతల్లే కర్కశురాలై..
మేడ్చల్ జిల్లా: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్ మూడో అంతస్తు పైనుంచి కిందకు విసిరేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్మెంట్ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్ మేరీ ఉన్నారు. మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్ మేరీ తన తల్లి మొబైల్ ఫోన్ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భిన్న వాదనలు.. చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విని్పస్తున్నాయి. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఆధార్, పార్సిల్ అంటూ : మహిళా టెకీని బెదిరించి రూ. 2 కోట్ల మోసం
డిజిటల్ అరెస్ట్ మోసానికి బలవుతున్న బాధితులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నకిలీ అధికారుల వలలో పడి బాధితులు కోట్ల రూపాయలను నష్టపోతున్నారు. బాధితుల్లో విద్యాధికులే ఎ క్కువగా ఉండటం మరింత విచారకరం. తాజగా బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి 2 కోట్ల విలువైన ఆస్తులను అమ్ముకున్న వైనం ఆందోళన రేపుతోంది. బెంగుళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ నిపుణురాలు బబితా దాస్ డిజిటల్ అరెస్ట్ స్కామ్లో రూ. 2 కోట్లు నష్టపోయింది. నకిలీ పోలీసుల డిమాండ్లను నెరవేర్చేందుకు తను ఉంటున్న ఇంటినీ, మరో రెండు ప్లాట్లను తెగనమ్ముకుంది. బాధితురాలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి విజ్ఞాన్ నగర్లోని ఫ్లాట్లో నివసిస్తోంది బబితా. జూన్లో, కొరియర్ అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక అనుమానాస్పద లగేజీని తాము స్వాధీనం చేసుకున్నట్లు నమ్మించాడు.ఆ కాల్ను తక్షణమే ముంబై పోలీసు అధికారులుగా చెప్పుకుంటున్న మరో కేటుగాళ్లకు బదిలీ చేశాడు. అరెస్టు చేస్తామని బెదిరించి, ధృవీకరణ పూర్తయ్యేవరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మోసగాళ్లు ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయాలని బెదిరించారు. తమకు సహకరించి అలా చేయకపోతే, కొడుకువిషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తాము చెప్పినట్టుగా చెల్లింపులు చేసి, ఆ తరువాత పోలీసుల ద్వారా తిరిగి పొందవచ్చని నమ్మబలికారు.చదవండి: గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్నభారత సంతతి మహిళ అరెస్ట్దీంతో బిడ్డ భవిష్యత్తు గురించి భయపడిపోయిన ఆమె వాళ్లు చెప్పినట్టే చేసింది. తక్కువ ధరకే మలూరు లోని రెండు ప్లాట్లను , ఇటు తాను ఉంటున్న విజ్ఞాన్ నగర్ ఫ్లాట్ను కూడా అమ్మేసింది. తద్వారా వచ్చిన సొమ్మును ను మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో పాటు ఆమె బ్యాంకు నుండి రుణం కూడా తీసుకుని సుమారు రూ. 2 కోట్లు మోసగాళ్లకు చెల్లించింది. ఆ తరువాత మోసగాళ్లు తరువాత డబ్బును తిరిగి పొందడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లమని చెప్పి, అకస్మాత్తుగా కాల్ కట్ చేశారు. ఆ తర్వాత యథావిధిగానే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె వైట్ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ అరెస్ట్ స్కామ్పై దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి?
వీడియోలు
కలెక్టర్ల సాక్షిగానే తమ పాలన సరిగాలేదన్న చంద్రబాబు
అమ్మ, నాన్నల తరపున ANR కళాశాలకు నాగార్జున భారీ విరాళం
దుర్గా నగర్ చౌరస్తా వద్ద అదుపు తప్పిన వాహనం
బీజేపీ టార్గెట్ సోనియా, రాహుల్... కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
ఈనెల 18లోగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీం ఆదేశం
గెలిచిన తెల్లారే హామీ నెరవేర్చిన సర్పంచ్
జైలర్ 2.. కావాలయ్యా 2.0 మాస్ అప్డేట్!
TJR : సంపద సృష్టి నిజమే.. కానీ రాష్ట్రానికి కాదు నారా కుటుంబానికి
కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
460 కోట్ల టీటీడీ స్థలం బాబుపై భూమన సంచలన కామెంట్స్

