‘వారణాసి’ చూసి యావత్ దేశం గర్వపడుతుంది: మహేశ్ బాబు
నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించాడు. గ్లోబ్ ట్రాటర్ పేరుతో హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్లో శనివారం ఈ మూవీ టైటిల్తో పాటు స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. ఈ ఈవెంట్ కేవలం టైటిల్ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్) సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
చంద్రబాబు విస్తృతార్థం పవన్కు తెలుసా?
రాజకీయ పరిపాలన అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కే తెలియదా? ఒకవైపు సీఎం చంద్రబాబేమో పదే పదే పొలిటికల్ గవర్నెన్స్ అంటూ అధికారులకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. ఆ విషయం తెలిసినా మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ చంద్రబాబుకు అసంతృప్తి కలుగుతుందో అని దానిని ఎమ్మెల్యేలపై నెట్టివేస్తూ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎమ్మెల్యేల దందా గురించి పవన్ ప్రస్తావించడం తప్పు కాదు. కాకపోతే అదేదో కేవలం ఎమ్మెల్యేలకి సంబంధించిన అంశమని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది.నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన సాగాలి కాని చంద్రబాబు నియంతృత్వంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏ పని చేయవద్దని బహిరంగంగా చెప్పి ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు కూడా అధికారులకు పార్టీ పరమైన ఆదేశాలు ఇస్తూ మొత్తం వ్యవహారాన్ని ఏకపక్షం చేస్తున్నారు. టీడీపీ ఐడీ కార్డుతో వచ్చే వారిని కూర్చొబెట్టి మర్యాదలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన సూచన సంగతి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడినా పోలీసు వ్యవస్థ వారి జోలికి వెళ్లడానికే జంకుతోంది. పైగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపైన అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. రాజకీయ పాలన అని దీనికి ముద్దు పేరు పెట్టుకున్నారు.మరి పవన్ కళ్యాణ్ ఏమని అర్థం చేసుకున్నారో తెలియదు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక విస్తృతార్థంలో పొలిటికల్ గవర్నెన్స్కు ప్రాధాన్యమివ్వాలని చెబుతుంటే.. కొందరు అధికారులు దాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏ చిన్న పనికోసం వెళ్లినా స్థానిక ఎమ్మెల్యే, నాయకులు చెబితేనే చేస్తామంటున్నారని, ప్రజల ఆస్తి వివాదాలలో కూడా తలదూర్చుతున్నారని దీనివల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తున్న ఒక ఎమ్మెల్యేని ఆయన మందలించారట. జనసేన ఎమ్మెల్యేనే అరాచకాలు చేస్తుంటే ఆయన నిరోధించలేక పోయారన్నమాట. కాని రాజకీయ పాలన అంటే చంద్రబాబు విస్తృతార్థం ఏమిటో పవన్కు తెలుసా?. చంద్రబాబు ఉద్దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ వారికి ఏ పని చేయకపోవడం, ఆ పార్టీ అభిమానులకు స్కీమ్లలో కోత పెట్టడం, సోషల్ మీడియా, సాక్షి వంటి మీడియా ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే పొలిటికల్ గవర్నెన్స్.అలాగే.. వేల కోట్లు అప్పులు తేవడం, కాణీ, అణాలకు ఎకరాలకు ఎకరాల భూమి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం. ఆఖరుకు టీడీపీ ఆఫీసులకు తక్కువ మొత్తానికి భూమి లీజులకివ్వడం కూడా రాజకీయ పాలనే అవుతుంది. అయితే, టీడీపీ మాదిరిగానే జనసేన పార్టీకి కూడా భూములు కేటాయించాలని మంత్రి దుర్గేశ్ కోరారట. టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అక్రమ సంపాదనకు పాల్పడుతున్న విషయం పవన్కు తెలియదా? రాష్ట్రంలో 90 శాతం మద్యం దుకాణాలను టీడీపీ వారికే దక్కేలా చేసింది నిజమే కదా?.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. పార్టీలు, కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హులైన వారందరికీ పథకాలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ వారికి ఏ పని చేయవద్దని బహిరంగంగానే చెప్పారు. అదేం పద్దతి? అని పవన్ అప్పుడు అడిగి ఉంటే గౌరవంగా ఉండేది. కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇవ్వడం లేదని, అధికారులపై కూడా పెత్తనం చెలాయిస్తున్నారని పలు వార్తలు వచ్చాయి. కొంతకాలం క్రితం భూముల రిజిస్ట్రేషన్లలో కూడా ఎమ్మెల్యేల దందా ఏంటని ఎల్లో మీడియా కూడా రాసింది. అప్పుడు తానే సంబంధిత ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. ఆ ప్రకారం సుమారు 35 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అయినా ఆ తర్వాత ఏమీ కాలేదని పవన్ వ్యాఖ్యల ద్వారా అర్దం అవుతుంది.టీడీపీ నాయకత్వం ఆదేశాలను పట్టించుకోని వారి సంఖ్య 48కి పెరిగింది. వారికి నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు పార్టీ ఆఫీస్కు ఆదేశాలు ఇచ్చారట. విచిత్రం ఏమిటంటే వారు పెన్షన్ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం లేదట. అందుకే నోటీసులు ఇచ్చారట. అంతే తప్ప, భూమి, లిక్కర్, ఇతర స్కాంలలో భాగస్వాములు అవుతున్నారని కాదట. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓపెన్గా టీడీపీ నేతల భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం దందా, గంజాయి అమ్మకాలలో కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మనుషులు భాగస్వాములు అవుతున్నారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి చర్య తీసుకోకపోగా, వాటన్నిటిని బయటపెడతావా అంటూ కొలికపూడి పార్టీ లైన్ దాటారంటూ ఆయనను మందలించే స్థితిలో టీడీపీ ఉంది. పొలిటికల్ గవర్నెన్స్ ప్రకారం పార్టీ నాయకులు అక్రమాలు చేసినా ఫర్వాలేదు కాని, అవి బయట పడకూడదనే కదా!. మరి పవన్ కళ్యాణ్కు అర్థమైన విస్తృతార్థం ఏమిటో?.ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఉపేక్షించవద్దని జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని పవన్ కోరినప్పుడు చంద్రబాబు ఏం జవాబు ఇచ్చారో తెలుసా? ఎల్లో మీడియా రాసిన దాని ప్రకారమే తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్చార్జీ మంత్రులదే అని చెప్పారు. అంటే ఆ రకంగా చంద్రబాబు చేతులు దులుపుకున్నారన్నమాట. దీని గురించి పవన్ ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయారు?. రాష్ట్రంలో పరిస్థితి ఎంత అరాచకంగా ఉందనే విషయం పవన్ కళ్యాణ్కు తెలియదా?. టీడీపీ ఎమ్మెల్యే జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న ఆరోపణలు వస్తే పవన్ కనీసం స్పందించలేకపోయారే!. శ్రీకాకుళం, తిరుపతి జిల్లాలలో ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన ఆరోపణలు వస్తే చర్య తీసుకోవాలని పవన్ కోరారా?. సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పటికీ రేషన్ మాఫియా కొనసాగుతోందని అనేక వార్తలు వస్తుంటే ఎందుకు నోరెత్తడం లేదు?.రాష్ట్రంలో జూద కేంద్రాలు నడుస్తున్నాయని భీమవరం డీఎస్పీపై తీవ్ర ఆరోపణలను పవన్ చేస్తేనే దిక్కులేదే!. అది నిజమా? కాదా? అన్నది కూడా చెప్పలేదే!. అయితే, ఒక్కటి మాత్రం జరుగుతోంది. వ్యూహాత్మకంగా కేబినెట్ సమావేశాలలో, ఇతరత్రా వీలైనప్పుడు పవన్ను పొగిడేసి చంద్రబాబు ఖుషీగా ఉంచుతున్నారని అనుకోవాలి. అంతేకాక పవన్ తన పదవిని ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వెళ్లాలన్నా, మరెక్కడికి వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లతో సమానంగా ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉంటున్నాయి. అలాగే తమకు కావల్సిన వారికి వందల ఎకరాల భూమిని పందేరం చేసుకుంటున్నారు. పవన్ సన్నిహితుడైన ఒక పారిశ్రామికవేత్తకు 1200 ఎకరాల భూమి కేటాయించారని గతంలో వార్తలు వచ్చాయి.తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేయడం రాజకీయ పాలన కిందకు వస్తుందేమో తెలియదు. విశాఖలో టీడీపీ నేత గోడౌన్లో పెద్ద ఎత్తున గోమాంసం పట్టుబడితే కిమ్మనకపోవడం, పిఠాపురంలో కల్తీ నెయ్యి తయారవుతున్న తీరుపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగడం వంటివి జరిగినా నోరెత్తినట్లు వార్తలు రాలేదు. పొలిటికల్ గవర్నెన్స్ వల్ల లబ్ది పొందుతున్న పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో నీతులు చెబితే కుదురుతుందా?. అందుకే కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల మాటేమిటి?. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి సంగతేమిటి? అని ప్రశ్నిస్తున్నారట. మంచి పాలన ద్వారా రాజకీయంగా లబ్ది పొందడం తప్పు కాదు కాని, అచ్చంగా రాజకీయాలు చేయడమే పాలన అనుకుంటే అంతకన్నా ప్రజాద్రోహం ఉండదు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలో(ఫిల్మ్నగర్) అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపి హంగామా క్రియేట్ చేసింది. కాగా, సదరు యువతిని డాక్టర్గా పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. ఫిల్మ్నగర్కు చెందిన యువతి శుక్రవారం అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి కారు(TS09FT0207) నడిపింది. ఈ క్రమంలో హైస్పీడ్తో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. దీంతో, కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం కారణంగా కారులోని డ్రైవర్ సీటులోనే ఆమె ఇరుక్కుపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు అద్దాలు పగులగొట్టి ఆమెను బయటకు తీశారు. అయితే, ప్రమాదం సమయంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే, కారు ప్రమాదంలో కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అనంతరం పోలీసులు ప్రమాదానికి గురైన కారును సీజ్ చేయకపోగా.. కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. కారు బీభత్సం అనంతరం విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ప్రమాదం జరిగిన తర్వాత రాత్రే కారును పోలీసులు వదిలేశారు. మద్యం మత్తులోనే ప్రమాదం అనంతరం కారు తీసుకొని ఆమె ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. దీంతో, ఫిల్మ్నగర్ పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఘోర పరాభవంపై ఆర్జేడీ ఫస్ట్ రియాక్షన్
పట్నా: బిహార్ ఘోర ఎన్నికల ఘోర పరాభవంపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ స్పందించింది. రాజకీయ ప్రయాణంలో ఓటమి అనేది ఒక భాగమేనని.. అలాగే ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియగా అభివర్ణించింది.‘‘ప్రజాసేవ అనేది అంతం లేని ప్రయాణం. ఇందులో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు సహజం. విజయం దక్కిందని అహంకారం ఉండదు. అలాగే.. ఓటమితో కుంగిపోం. రాష్ట్రీయ జనతా దళ్ అనేది పేదల పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదల మధ్య వారి గొంతును ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది’’ అని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు తేజస్వి యాదవ్ పేరిట సోషల్ మీడియాలో ఆ పార్టీ ఓ పోస్ట్ చేసింది.जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 202 సీట్లతో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరలించగా.. మిత్రపక్షం జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ 19 స్థానాలు నెగ్గి.. అత్యధిక స్ట్రయిక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది. ఇక.. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలోని ఆర్జేడీ (RJD) 143 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ.. ఈ ఎన్నికల్లో 25 స్థానాలకు పడిపోవడం గమనార్హం. 2010 తర్వాత ఆ పార్టీకి ఘోర పరాభవం ఇదే. మిత్రపక్షం కాంగ్రెస్ సైతం 61 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది(గత ఎన్నికల్లో 19 స్థానాలు నెగ్గింది). మహా కూటమిలో గేమ్ చేంజర్ అవుతుందని భావించిన వీఐపీ పార్టీ 0 స్థానాలతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సీపీఐ, సీపీఎం వామపక్షాలు 3 స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తంగా విపక్ష కూటమి 34 స్థానాలను మాత్రమే పరిమితమైంది.
ఫ్యామిలీ స్టార్స్!
మాస్ డ్యాన్స్కి రెడీ
‘వారణాసి’ చూసి యావత్ దేశం గర్వపడుతుంది: మహేశ్ బాబు
'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. బయటపెట్టిన రాజమౌళి
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమా వీడియో రిలీజ్
సన్రైజర్స్ వ్యూహం.. అతడు జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు
భవిష్యత్పై ఉద్యోగుల మనోగతం ఇదే!
మహేశ్ బాబు 'వారణాసి'.. 2027లో రిలీజ్
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
హెచ్–1బీ పూర్తిగా బంద్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
‘కాంత’ మూవీ రివ్యూ
సౌతాఫ్రికా కెప్టెన్ను ఎగతాళి చేసిన బుమ్రా!
సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!
ఫ్యామిలీ స్టార్స్!
మాస్ డ్యాన్స్కి రెడీ
‘వారణాసి’ చూసి యావత్ దేశం గర్వపడుతుంది: మహేశ్ బాబు
'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. బయటపెట్టిన రాజమౌళి
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమా వీడియో రిలీజ్
సన్రైజర్స్ వ్యూహం.. అతడు జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు
భవిష్యత్పై ఉద్యోగుల మనోగతం ఇదే!
మహేశ్ బాబు 'వారణాసి'.. 2027లో రిలీజ్
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
హెచ్–1బీ పూర్తిగా బంద్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
‘కాంత’ మూవీ రివ్యూ
సౌతాఫ్రికా కెప్టెన్ను ఎగతాళి చేసిన బుమ్రా!
సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!
సినిమా
30 నిమిషాల ఫైట్ సీక్వెన్స్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్
దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు మొన్నటివరకు బయటపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ అనేసరికి అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. ప్రస్తుతం వేలాదిమంది సమక్షంలో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మూవీ గురించి, మహేశ్ యాక్టింగ్ గురించి కూడా అద్భుతమైన అప్డేట్ వచ్చేసింది.'వారణాసి' కథని రాసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా తాలూకు 30 నిమషాల యాక్షన్ ఎపిసోడ్ చూశాను. అందులో సీజీ లేదు, బీజీఎం లేదు, అయినా కానీ మహేశ్ బాబుని అలా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను మంత్రంతో కట్టి పడేసింది. మీరు కూడా అనుభూతి పొందుతారు. మహేశ్ తాలూకు విశ్వరూపం చూసి షాక్ అవుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కానీ కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నారు. ఏం చేయాలో చెబుతూ ఉన్నారు' అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.30 నిమిషాల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ అంటే కచ్చితంగా ఇది క్లైమాక్స్ అయి ఉండొచ్చు. విజయేంద్రప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే కొంతమేర తీశారు. కాకపోతే దీనికి సీజీ, గ్రాఫిక్స్, బీజీఎం లాంటివి జోడిస్తే ఏ రేంజులో ఉంటుందోనని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
సుమ 'గ్లోబ్ ట్రాటర్' ప్రిపరేషన్ వీడియో.. రాజకుమారిగా ఆషిక
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ప్రిపరేషన్ వీడియోతో సుమరాజకుమారిగా ఆకట్టుకునేలా ఆషికా రంగనాథ్చుడీదార్లో మరింత అందంగా అనుపమ పరమేశ్వరన్దుబాయిలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పార్టీ మూడ్మేకప్ లేకుండానే గ్లామరస్గా రుక్మిణి వసంత్బ్లాక్ డ్రస్సులో మరింత హాట్గా బిగ్బాస్ దివి View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Divi (@actordivi)
'ఐ-బొమ్మ' రవి అరెస్ట్.. పోలీసుల చేతిలో కీలక ఆధారాలు!
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ(iBomma ) నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం కూకట్పల్లిలో రవి(Immadi Ravi)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టుకి తరలించారు. రవి నుంచి వైరసీ వెబ్సైట్కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. రవి ఆంధప్రదేశ్లోని వైజాగ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.కూకట్పల్లిలోని అపార్ట్మెంట్లో అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను హోల్డ్ చేసినట్టు సమాచారం. రవిని అదుపులోకి తీసుకొని విచారించగా..సంచలన విషయాలు బయటపడ్డాయట. పైరసీ వెబ్సైట్ని రన్ చేస్తున్న మరికొంతమంది పేర్లు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాలు విసిరారు. ఆ ఛాలెంజింగ్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని.. శనివారం ఉదయం కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మహేశ్-రాజమౌళి సినిమా టైటిల్ 'వారణాసి'
ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ హడావుడి గురించే డిస్కషన్. హైదరాబాద్ శివారులో ఈ కార్యక్రమం భారీగానే ప్లాన్ చేశారు. అభిమానులతో పాటు వేలాదిమంది దీన్ని వీక్షిస్తున్నారు. అయితే ఈవెంట్ ప్రారంభంలోనే మూవీ టైటిల్ ఏంటనేది ప్రకటించేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే 'వారణాసి' అని ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియోని ఈవెంట్ స్క్రీన్ పై ప్రసారం చేశారు.టైటిల్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. గత కొన్నిరోజుల నుంచి రుద్ర, వారణాసి.. ఇలా పలు టైటిల్స్ వినిపించాయి. వీటిలో ఏది పెడతారా అనే డిస్కషన్ అయితే నడిచింది. ఫైనల్గా రాజమౌళి 'వారణాసి' అనే పేరుకే కట్టుబడి ఉన్నట్లు ఇప్పుడీ వీడియోతో క్లారిటీ వచ్చేసింది.ఇందులో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రియాంక చోప్రా, మందాకిని పాత్రలో.. పృథ్వీరాజ్ సుకుమారన్, కుంభ అనే విలన్గా కనిపిస్తాడు. వీళ్లు ముగ్గురు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారనేది వీడియోలో రివీల్ చేస్తారేమో చూడాలి?
న్యూస్ పాడ్కాస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
క్రీడలు
IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు విడుదల చేశాయి. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన చేశాయి.గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ జాబితా ఇదే (Gujarat Titans Retention List)శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), అనూజ్ రావత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్, కగిసో రబడ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.సన్రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ జాబితా (SRH Retention List)ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్.ఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు (DC Retention List)అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్.కోల్కతా నైట్ రైడర్స్ రిటెన్షన్ జాబితా (KKR Retention List)అజింక్య రహానే, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (LSG Retention List)అబ్దుల్ సమద్, దిగ్వేశ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్, ఐడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్. ఆకాశ్ సింగ్, మణిమరన్ సిద్దార్థ్, ప్రిన్స్ యాదవ్. అర్జున్ టెండుల్కర్ (ముంబై నుంచి ట్రేడింగ్), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్ పంత్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మొహమమ్మద్ షమీ (సన్రైజర్స్ నుంచి ట్రేడింగ్), ఆయుశ్ బదోని, మిచెల్ మార్ష్.ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా (MI Retention List)అల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్బవా, తిలక్ వర్మ, హార్దిక్పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్.పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ లిస్టు (PBKS Retention List)అర్ష్దీప్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముషీర్ ఖాన్. సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ పన్నూ, నేహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, వైశాక్ విజయ్కుమార్, లాకీ ఫెర్గూసన్, ప్రియాంశ్ ఆర్య, జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, పైలా అవినాశ్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, యజువేంద్ర చహల్.రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (RR Retention List)ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, డొనొవాన్ ఫెరీరా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్), యుధ్వీర్ చరక్, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్ హెట్మెయిర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, శుభమ్ దూబే, నండ్రీ బర్గర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), వైభవ్ సూర్యవంశీ.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అట్టిపెట్టుకున్న ప్లేయర్ల జాబితా (RCB Retention List)అభినందన్ సింగ్, నువాన్ తుషార, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, యశ్ దయాళ్, జేకబ్ బెతెల్, రసిఖ్ ధార్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్వుడ్, సూయాంశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్.
తిప్పేసిన జడ్డూ.. పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత బౌలర్లు మరోసారి సత్తా చాటారు. ప్రొటిస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్లు ప్రభావం చూపితే.. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లు తిప్పేశారు. ఫలితంగా అరవై పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. శనివారం ఆట ముగిసే సరికి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కాగా రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైన విషయం తెలిసిందే. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలింగ్ చేసింది. పర్యాటక జట్టును తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూల్చింది.తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్ల సత్తాటీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్ల చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ (Axar Patel) ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (31), రియాన్ రికెల్టన్ (23).. వియాన్ ముల్దర్ (24), టోనీ డి జోర్జి (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఇక 37/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. మరో 152 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.ఓపెనర్ కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా 189 పరుగులు చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికాపై ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ప్రొటిస్ బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.భారత స్పిన్ దెబ్బకు సఫారీలు విలవిలఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు ఆది నుంచే భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. రియాన్ రికెల్టన్ (11)ను కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూ చేసి వికెట్ల వేట మొదలుపెట్టగా... జడ్డూ ఐడెన్ మార్క్రమ్ (4), వియాన్ ముల్దర్ (11)లను వెనక్కి పంపి సఫారీలకు కోలుకోలేని షాకిచ్చాడు..@imkuldeep18 comes into the attack… and STRIKES instantly! 💥South Africa lose their first as Rickelton falls LBW to the Chinaman! 👌🏻Catch the LIVE action ⬇️#INDvSA 1st Test LIVE NOW 👉 https://t.co/uK1oWLgsfx pic.twitter.com/OOZQRsBLzl— Star Sports (@StarSportsIndia) November 15, 2025 అదే విధంగా.. టోనీ డి జోర్జి (2), ట్రిస్టన్ స్టబ్స్ (5) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వికెట్ కీపర్ కైలీ వెరెన్నె (9)ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా.. కుల్దీప్ యాదవ్.. మార్కో యాన్సెన్ (13)ను పెవిలియన్కు పంపించాడు. Spinning a web! 🕸️🌀Some gun bowling from the No.1 Test All-rounder #RavindraJadeja has South Africa 3 down!#INDvSA 1st Test LIVE NOW 👉 https://t.co/uK1oWLgsfx pic.twitter.com/qgrOk7lvGW— Star Sports (@StarSportsIndia) November 15, 2025నాలుగేసిన జడ్డూఫలితంగా శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా 35 ఓవర్లలో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే కేవలం 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇక మూడోరోజైన ఆదివారం ఆటలో ఆరంభంలోనే మిగిలిన మూడు వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారంటే.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యమే ఉంటుందని చెప్పవచ్చు. స్పిన్నర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. టార్గెట్ వంద కంటే తక్కువగానే ఉండొచ్చు.ఇదిలా ఉంటే.. సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లో జడేజా నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. బుమ్రా ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు. సిరాజ్ చేతికి ఇంకా బంతి రానేలేదు.చదవండి: ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే..
అందుకే రాజస్తాన్ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీ ట్రేడ్ డీల్స్ పూర్తి చేసుకున్నాయి. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసేందుకు శనివారమే (నవంబరు 15) ఆఖరి తేదీ కావడంతో తాము ట్రేడ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడిస్తున్నాయి.జడ్డూ అటు.. సంజూ ఇటుఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన భారీ ట్రేడ్ వార్తల్లో నిలిచింది. ముందుగా ఊహించినట్లే సీఎస్కే.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను.. రాజస్తాన్కు ఇచ్చేసి.. ఆ జట్టు సారథి సంజూ శాంసన్ను తమ చెంతకు చేర్చుకుంది.ధరలో మార్పుఅయితే, ఈ ఒప్పందంలో భాగంగా సీఎస్కే సంజూకు రాజస్తాన్ గతంలో చెల్లించిన మొత్తాన్ని ఇచ్చి రూ. 18 కోట్లకు తీసుకోగా.. రాజస్తాన్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడ్డూతో పాటు సామ్ కర్రన్ (రూ. 2.4 కోట్లు)ను కూడా సీఎస్కే నుంచి తీసుకుంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ను వీడిన నేపథ్యంలో సంజూ శాంసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. సమయం వచ్చింది గనుకే తాను జట్టును వీడానంటూ అతడు స్పష్టతనిచ్చాడు.నా సర్వస్వం ధారబోశానుఈ మేరకు.. ‘‘మనం ఇక్కడ (ప్రపంచంలో) కొన్నాళ్ల పాటే ఉంటాము. ఫ్రాంఛైజీ కోసం నా సర్వస్వం ధారబోశాను. క్రికెట్ను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, బంధాలు పోగు చేసుకున్నాను. ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యుడిగానే భావించాను. ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను ఈ జట్టును వీడి వెళ్తున్నా.నాకు ఇక్కడ లభించిన దానికి నేను ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను’’ అంటూ సంజూ శాంసన్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా రాయల్స్తో చేరిన తొలి నాళ్లలో దిగిన ఫొటోను సంజూ షేర్ చేశాడు. కాగా 2013లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరిన కేరళ స్టార్ సంజూ.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్కు మారాడు. రెండేళ్లు అదే జట్టుకు ఆడాడు.ఫైనల్కు చేర్చిన సారథిఆ తర్వాత మళ్లీ 2018లో రాయల్స్లోకి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 2025 వరకు జట్టుతో కొనసాగాడు. కెప్టెన్గా రాజస్తాన్ను ముందుకు నడిపించిన సంజూ 2022 సీజన్లో ఫైనల్కు చేర్చాడు. అయితే, గుజరాత్ టైటాన్స్తో టైటిల్ పోరులో ఓడిన రాజస్తాన్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 176 మ్యాచ్లు ఆడిన సంజూ.. 4704 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉండటం విశేషం.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్
ఒక్క ఛాన్స్ ప్లీజ్: గిల్ను బతిమిలాడిన సిరాజ్.. కట్ చేస్తే..
టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఇందుకు వేదిక.రాణించిన భారత బౌలర్లుఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్.. సఫారీలను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) చెరో రెండు.. అక్షర్ పటేల్ (Axar Patel) ఒక వికెట్ దక్కించుకున్నారు.అయితే, బుమ్రా ఆది నుంచే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. హైదరాబాదీ పేసర్ సిరాజ్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో అప్పటికే 43 పరుగులు ఇచ్చేసిన సిరాజ్ మియా చేతికి ఆ తర్వాత బంతి రావడానికి చాలా సమయమే పట్టింది.ఒకే ఓవర్లో రెండుఎట్టకేలకు తను వేసిన పదో ఓవర్లో సిరాజ్ అద్భుతం చేశాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 45వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన ఈ రైటార్మ్ పేసర్.. తొలి బంతికి కైల్ వెరెన్నె(16)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి మార్కో యాన్సెన్(0)ను బౌల్డ్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు.ప్లీజ్.. ఒక్క ఓవర్ వేసే అవకాశం ఇవ్వుఈ నేపథ్యంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట తర్వాత సిరాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లీజ్.. ఒక్క ఓవర్ వేసే అవకాశం ఇవ్వు అని గిల్ను అడిగాను. అదే ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు తీశాను’’ అని సిరాజ్ తెలిపాడు.అదే విధంగా బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వికెట్ తీయడానికి నేను ఇబ్బంది పడుతున్న సమయంలో జస్సీ భాయ్ వచ్చి.. స్టంప్స్ మీదకు బౌల్ చేయమని చెప్పాడు. ఎల్బీడబ్ల్యూ కోసం ట్రై చేయమన్నాడు. బౌల్డ్ చేయడం.. క్యాచ్లు పట్టడం.. ఇలా వికెట్ తీయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయని.. నన్ను కేవలం బౌలింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టమని చెప్పాడు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. తాను నిరాశకు గురైన వేళ బుమ్రా తనలో ఆత్మవిశ్వాసం నింపాడని తెలిపాడు. కాగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ మొత్తంగా 12 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.స్వల్ప ఆధిక్యంకాగా తొలిరోజు సౌతాఫ్రికాను 159 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా.. శుక్రవారం ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో ఆటలో భాగంగా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్
బిజినెస్
విల్లాలకు దీటుగా హైరైజ్ అపార్ట్మెంట్లు
అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న హైదరాబాద్ మహా నగరంలో ఆకాశహర్మ్యాలే నగరవాసుల కలల సౌధాలుగా అవతరిస్తున్నాయి. పది అంతస్తులపైన నివసించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సిటీజనుల హైడ్రీమ్స్ను ప్రతిబింబించే విధంగా హైరైజ్ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలకు దీటుగా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.నగరవాసుల అభిరుచికి తగినట్లు నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) గడిచిన 9 నెలల కాలంలో 77 హైరైజ్ బిల్డింగ్లకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సుమారు 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైరైజ్ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.ఇప్పటికే న్యూయార్క్ వంటి నగరాలను తలపించే విధంగా కనిపిస్తున్న పడమటి ప్రాంతంలో మరిన్ని ఆకాశ సౌధాలు అందుబాటులోకి రానున్నాయి. రెండేళ్ల క్రితం 37.03 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 55 హైరైజ్ భవనాలకు అనుమతి ఇవ్వగా ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లోనే అంతకు రెట్టింపు సంఖ్యలో అందజేసినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మరోవైపు కోకాపేట్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో బహుళ వినియోగ జోన్లు, బహుళ అసంతస్తుల భవనాలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీఏ మరోసారి భూముల వేలానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కోకాపేట్ నియోపోలిస్లో రెండు విడతలుగా స్థలాలను విక్రయించగా అనూహ్యమైన స్పందన లభించింది. ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. ఈ క్రమంలో ఈ నెల 24, 26 తేదీల్లో మరోసారి ఆన్లైన్ బిడ్డింగ్కు సన్నద్ధమైంది. ప్రస్తుతం కోకాపేట్లో అత్యధికంగా 63 అంతస్తుల వరకు హెచ్ఎండీఏ నిర్మాణ అనుమతులను అందజేసింది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరిన్ని అంతస్తుల నిర్మాణాలకు సైతం అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.‘అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు అందుబాటులో ఉండే నివాస సముదాయాలకు డిమాండ్ భారీగా ఉంది. ఇందుకు అనుగుణంగా హైరైజ్ భవనాల నిర్మాణం క్రమంగా ఊపందుకుంటోంది.’ అని ఒక హెచ్ఎండీఏ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం కోకాపేట్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో 49 అంతస్తుల నుంచి 63 అంతస్తుల భవనాల వరకు నిర్మాణ అనుమతులను అందజేశారు.హోదాగా భావిస్తున్నారు.. ప్రపంచదేశాల్లోని పలు నగరాల్లో వంద అంతస్తులకు పైగా నివాస భవనాలు ఉన్నాయి. అంతస్తులు పెరుగుతున్న కొద్దీ ఆకాశంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్న అనుభూతి లభిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అత్యంత ఎత్తు నుంచి వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది. పైగా వాహనకాలుష్యం, శబ్దకాలుష్యం వంటి సమస్యలకు హైరైజ్ భవనాలను పరిష్కారంగా భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా హైరైజ్ భవనాల్లో నివసించడాన్ని కొంతమంది ఉన్నత హోదాగా భావిస్తున్నారు. దీంతో ఇది ఒక ట్రెండ్గా మారిందని నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు సమీపంలో, సకల వసతులతో, పార్కింగ్ సదుపాయాలతో ఉండే ఈ భవనాల్లో పటిష్ట భద్రతా వ్యవస్థ కూడా ఉంటుంది. ఇలాంటి సానుకూలమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎన్ఆర్ఐలు హైరైజ్ భవనాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే సాఫ్ట్వేర్ నిపుణులు సైతం హైరైజ్నే ఎంపిక చేసుకుంటున్నారు. యూఎస్, కెనడా, యూరోప్ వంటి దేశాల్లో చాలాకాలంగా బహుళ అంతస్తుల భవనాలే నివాస సముదాయాలుగా కొనసాగుతుండగా హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి నగరాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అభివృద్ధి చెందుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు 88.15 లక్షల చ.మీ.ల నిర్మాణాలు మరోవైపు నిర్మాణ రంగ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. దీంతో ఈ ఏడాది సుమారు 88.15 లక్షల చదరపు మీటర్లకు పైగా భవన నిర్మాణాలకు అనుమతులను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇళ్లు, లేఅవుట్లు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, తదితర నిర్మాణాల కోసం 3,677 దరఖాస్తులు హెచ్ఎండీఏకు అందాయి. వాటిలో 2,887 దరఖాస్తులను పరిష్కరించి అనుమతులు మంజూరు చేశారు. దీంతో గతేడాది కంటే 79 శాతం ఆమోద రేటును సాధించినట్లు ఇది 2024లో 38 శాతం కావడం గమనార్హం.గతేడాది 3,209 దరఖాస్తుల్లో 1,216 మాత్రమే పరిష్కారమయ్యాయి. పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి కాల పరిమితి తగ్గించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఫైళ్లను పరిష్కరించేందుకు అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. పర్మిట్ ఫీజుల రూపంలో ఈ ఏడాది రూ.1,225 కోట్లు లభించాయి. గతేడాది పర్మిట్ ఫీజులపై మొదటి 9 నెలల కాలానికి రూ.355 కోట్లు మాత్రమే లభించడం గమనార్హం. బిల్డ్నౌ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థ కూడా నిర్మాణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.
ట్రంప్, జేడీ వాన్స్ పరస్పరం విభిన్న వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విదేశీ కార్మికుల సమస్యపై సాహసోపేతమైన ప్రకటన చేశారు. విదేశీ ఉద్యోగులను చౌక కార్మికులని పేర్కొనడంతో పాటు అమెరికాకు వారి అవసరం లేదని స్పష్టం చేశారు. సీన్ హన్నిటీతో జరిగిన పాడ్కాస్ట్ సంభాషణలో వాన్స్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ మోడల్ ప్రకారం.. తక్కువ వేతనాలు తీసుకునే ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులు యూఎస్లో ఉన్నారని చెప్పారు. ఇది దేశంలోని ఉద్యోగాలు, వేతనాల శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కార్మికులను శక్తివంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా వారు అధిక వేతనాలు పొందుతారని, దేశం మెరుగుపడుతుందని తెలిపారు.భారతీయ టెక్నాలజీ రంగం, వైద్య రంగం నిపుణులు, వైట్ కాలర్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులుగా ఉన్న హెచ్-1బీ వీసాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంస్కరణల ప్రక్రియ మొదలైంది. ఇది గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం భారతీయుల మార్గాలను నేరుగా ప్రభావితం చేయనుంది.వీసా సంస్కరణలుసెప్టెంబర్ 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది నాన్ ఇమ్మిగ్రెంట్ కార్మికుల ప్రవేశంపై పరిమితి విధించాలని భావించారు. దాంతో హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సంస్కరించడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసిన కొన్ని హెచ్-1బీ పిటిషన్లకు అర్హత షరతుగా అదనంగా రూ.1,00,000 డాలర్లు చెల్లించాలి. ఈ భారీ రుసుము పెంపు వీసా ప్రోగ్రామ్ లక్ష్యాన్ని, లబ్ధిదారులను గణనీయంగా ప్రభావితం చేయనుంది.ట్రంప్ వైఖరి నుంచి వాన్స్ ‘యూటర్న్’వలస ఉద్యోగులకు సంబంధించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వైఖరితో భిన్నంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో నిర్దిష్ట ప్రతిభ ఉన్న కార్మికులు లేరని చెప్పారు. ఆ కొరతను తీర్చడానికి విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, వాన్స్ అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఈ చర్చ అమెరికన్ శ్రామిక శక్తికి కీలకం ఉంది. ఒకవైపు తక్కువ వేతనాల కోసం విదేశీ కార్మికులను తీసుకురావడం ద్వారా దేశీయ ఉద్యోగాలు దెబ్బతింటాయని విమర్శకులు భావిస్తున్నారు. మరోవైపు, ట్రంప్ సూచించినట్లుగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాల్లో ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి, ఆవిష్కరణలను కొనసాగించడానికి, తయారీ రంగంలో శిక్షణ ఇవ్వడానికి హెచ్-1బీ వీసాదారులు అవసరం అని పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్..
రూ.6 లక్షల జాబ్ ఔట్.. వెంటనే డైవోర్స్!
బంధాలు, ప్రేమానురాగాలు అంతా ఒక బూటకం అన్నాడో సినీ కవి. కానీ చైనాకు చెందిన ఈ భార్యా బాధితుడి వేదన వింటే అది అక్షర సత్యం అనిపించక మానదు. నెలకు రూ. లక్షల్లో జీతమొచ్చే ఉద్యోగం అలా పోయిందో లేదో ఇలా తన భార్య తనకు విడాలిచ్చి వెళ్లిపోయిందని గోడు వెళ్లబోసుకోవడంతో ఇటీవల చైనా అంతటా వైరల్గా మారాడు.163.కామ్ ప్రకారం.. కియాన్ కియాన్ అనే 43 ఏళ్ల లా గ్రాడ్యుయేట్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలో పనిచేసేవాడు. నెలకు 50,000 యువాన్లు అంటే రూ.6.23 లక్షలు జీతం. కానీ వివాహం తన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందంటున్నాడు.ఆమె విలాసవంతమైన ఖర్చుల కోసం పాపం ఉన్న ఒక్క ఫ్లాటునూ అమ్ముకోవాల్సి వచ్చింది. విడాకుల సమయానికి తనకంటూ ఎలాంటి ఆస్తి లేకుండా పోయిందని వాపోయాడు. పాపం మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తమ ఏడేళ్ల సహవాసంలో వాళ్లు దగ్గరైంది 7-8 సార్లు మాత్రమే అంటే ఎవరూ నమ్మరేమో..కియాన్ తన సంపాదనలో ఎక్కువ భాగం తన భార్య కోసమే ఖర్చు చేశాడు. కారణాలు తెలియదు కానీ, పాపం కియాన్ భారీ జీతమొచ్చే ఉద్యోగాన్ని ఐదేళ్ల క్రితం పోగొట్టుకున్నాడు.అప్పటి నుండి డెలివరీ రైడర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడతడి జీతం నెలకు 10,000 యువాన్లు అంటే రూ.1.24 లక్షలే.తన భార్య చాలా సౌందర్యవతి అని చెప్పుకొచ్చిన కియాన్.. తన జీతం తగ్గిపోగానే ఆమె విడాకులు కోరిందని ఘొల్లుమన్నాడు. ‘నేను ప్రేమిస్తున్నది నీ డబ్బునే కానీ, నిన్ను కాదు’ అని ఆమె తెగేసి చెప్పిందని వాపోయాడు.ఇంతా చేస్తున్న ఆమె ఏదైనా పనిచేస్తుందా అంటే అదీ లేదు. కియాన్ కియాన్ సంపాందించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ వచ్చేది.వామ్మో ఇవేమీ ఖర్చులుఆమె పెట్టే ఖర్చుల గురించి వింటే అవాక్కవాల్సిందే. ఆమె దుస్తులు కొన్నప్పుడల్లా ఒక్కోటి మూడు రంగులలో కొనేదట. ఒకసారి ఆమె ఒక్కొక్కటి 15,000 యువాన్లు (రూ.1.87 లక్షలు) పెట్టి రెండు డిజైనర్ బ్యాగులను కొనిందని వాపోయాడు కియాన్.మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. కియాన్ భార్య చేతులు, కాళ్ళకు కూడా ఖరీదైన ఫేషియల్ క్రీములను వాడేదట. ఇక సన్నగా ఉండటానికి ఖరీదైన సప్లిమెంట్లను తీసుకునే ఆమె చాలాసార్లు కాస్మొటిక్ చికిత్సలూ చేయించుకుందట. ఇంత చేసినా ఇప్పటికీ తన మాజీ భార్య అంటే తనకు ద్వేషం లేదంటున్నాడు అమాయక కియాన్కియాన్.
బీమాకు పెరిగిన ఆదరణ: కారణం ఇదే!
ముంబై: జీఎస్టీ రేట్ల సవరణ అనంతరం బీమా రంగంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) సభ్యుడు దీపక్ సూద్ అన్నారు. అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.జీఎస్టీని సున్నా చేయడం ద్వారా బీమా రక్షణను సైతం నిత్యావసర వస్తువు కిందకు తీసుకొచ్చినట్టు చెప్పారు. మరింత మందికి బీమాని చేరువ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పరిశ్రమపై ఉన్నట్టు వ్యాఖ్యానించారు. జీఎస్టీ ప్రయోజనాన్ని పూర్థి స్థాయిలో బదిలీ చేయడం ద్వారా బీమాను మరింత అందుబాటు ధరలకే తీసుకురావాలని కోరారు. ‘‘అక్టోబర్లో గణాంకాలను చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్, రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ గణనీయమైన వృద్ధిని చూశాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది’’అని దీపక్ సూద్ పేర్కొన్నారు.టెక్నాలజీని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పంపిణీ వ్యయాలు తగ్గించుకోవచ్చని, తప్పుడు మార్గంలో విక్రయాలను అరికట్టొచ్చని చెప్పారు. ‘‘బీమా ప్రీమియంను జీడీపీ నిష్పత్తితో పోల్చి విస్తరణను చూస్తుంటాం. అలా చూస్తే ప్రపంచంలో భారత్ సగటున సగంలోనే ఉంటుంది. కానీ, ఎంత మంది బీమా కవరేజీ పరిధిలో ఉన్నారన్నది చూడడం ద్వారానే మన దేశ జనాభాలో బీమా ఎంత మందికి చేరువ అయ్యిందన్నది అర్థం చేసుకోగలం’’అని చెప్పారు. ప్రకృతి విపత్తులకు సంబంధించి ప్రత్యేకమైన బీమా ఉత్పత్తులను తీసుకురావాలని పరిశ్రమను కోరారు. రాష్ట్రాల వారీ ప్రత్యేకమైన ప్లాన్లపైనా దృష్టి సారించాలని సూచించారు.
ఫ్యామిలీ
భాగ్యనగరంలో లెర్న్ విత్ భీమ్..!
ఇప్పటి తరం పిల్లలు ట్యాబ్, మొబైల్ చేతిలో పెట్టుకొని పెద్దలకంటే ముందే టెక్నాలజీని వాడేస్తున్నారు. అలాంటి డిజిటల్ యుగంలో చిన్నారులు డిజిటల్ వేదికగా సరైన విషయాలను నేర్చుకోవడానికి గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ ‘లెర్న్ విత్ భీమ్’ పేరుతో కొత్తగా యాప్ విడుదల చేసింది. ఈ యాప్ పిల్లల అభ్యసనా ప్రపంచానికి సరికొత్త రంగులు అద్దుతోంది. నేటి బాలల దినోత్సవం నేపథ్యంలో ఈ యాప్ చిన్నారులకు అద్భుత వేదికగా మారింది. ఈ యాప్లో చోటా భీమ్, మైటీ లిటిల్ భీమ్ వంటి మనసుకు దగ్గరైన పాత్రలతో పిల్లలు ఆసక్తిగా నేర్చుకోవచ్చు. 2 నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం రూపొందించిన ఈ యాప్ ద్వారా రంగులు, ఆకారాలు, అక్షరాలు, సంఖ్యలు మొదలైనవి సరదాగా నేర్చుకునే వీలు కల్పిస్తుంది. దీంతో పాటు గేమ్స్, పజిల్స్, కథల రూపంలో పాఠాలు అందుబాటులో ఉంచారు. దీనివల్ల పిల్లలకు ఇది పాఠశాల మాదిరిగా కాకుండా ఓ ఆటలా అనిపిస్తుందని గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకుడు రాజీవ్ చిలకా తెలిపారు. చోటా భీమ్ ప్రపంచాన్ని ఇప్పుడు ఎడ్యుకేషన్లోకి తీసుకువస్తున్నాం. పిల్లలు భీమ్ వంటి ఫ్రెండ్లీ క్యారెక్టర్స్తో నేర్చుకోనున్నారు. ముఖ్యంగా వయసు ఆధారంగా లెరి్నంగ్ మాడ్యూల్స్ డిజైన్ చేసిన ఈ యాప్లో 2–3 ఏళ్ల పిల్లల కోసం బేసిక్ కాన్సెప్ట్స్, 4–5 ఏళ్ల పిల్లలకు లాంగ్వేజ్ – మ్యాథ్స్ బేసిక్స్, 6–7 ఏళ్ల పిల్లలకు క్రియేటివ్ యాక్టివిటీస్, 8 ఏళ్లు పైబడిన వారికి లాజిక్ పజిల్స్, క్విజ్, క్రికెట్–బాస్కెట్బాల్ వంటి గేమ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎడ్యుటైన్మెంట్ (ఎడ్యుకేషన్–ఎంటర్టైన్మెంట్) దిశగా భారతీయ యానిమేషన్ ఇండస్ట్రీ ముందుకు సాగుతున్న తరుణంలో ఇదో ముందడుగు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్న ‘లెర్న్ విత్ భీమ్’ యాప్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్తో పాటు యాడ్–ఫ్రీ ఆప్షన్ కూడా కలిగి ఉంది. చైల్డ్–సేఫ్ డిజైన్తో రూపొందించిన ఈ యాప్ ద్వారా పిల్లలు సురక్షితంగా, సరదాగా నేర్చుకోవచ్చు. (చదవండి: చిరుప్రాయంలో చిగురిస్తున్న ఆలోచనలు..!
సరికొత్త లాగిన్ మెకానిజం..! పాస్వర్డ్లు గుర్తించుకోనవసరం లేదు
పాస్వర్డ్ల మాదిరిగా కాకుండా మన ఎకౌంట్ను యాక్సెస్ చేయాలనుకున్న ప్రతిసారీ పాస్కీలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ‘పాస్కీ’ అనేది సంపద్రాయ పాస్వర్డ్ సిస్టమ్కు ప్రత్యామ్నాయాన్ని అందించే కొత్త లాగిన్ మెకానిజం. పాస్వర్డ్ దొంగతనం, ఫిషింగ్లను నివారించడానికి ఫిడో అయెన్స్, డబ్ల్యూ3సీ పాస్ కీ’ని అభివృద్ధి చేశాయి.ప్రతి వెబ్సైట్ లేదా యాప్లకు ప్రత్యేకమైన క్రిస్టోగ్రాఫిక్ కీ జత చేస్తాయి పాస్కీలు. ఈ పాస్కీలను యూజర్ డివైజ్లలో స్టోర్ చేస్తారు. ఫేస్ఐడీ, ఫింగర్ప్రింట్, పిన్లాంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ల ద్వారా లాగిన్ కావచ్చు. సర్వర్తో ‘కీ’లను సింథనైజింగ్ చేయడం ద్వారా క్రిస్టోగ్రాఫిక్ సిస్టమ్ పనిచేస్తుంది.పాస్వర్డ్ టైప్ చేయకుండానే లాగిన్లను అనుమతిస్తుంది. డివైజ్ వెలుపల డేటా షేరింగ్ కాకుండా నిరోధిస్తుంది. పాస్కీలు యూజర్ పాస్వర్డ్ను ఇంటర్నెట్ ద్వారా బదిలీ చేయవు. సర్వర్లో నిల్వ చేయవు. ఫిషింగ్ ఎటాక్స్, పాస్వర్డ్ దొంగతనం...మొదలైన ముప్పులను తగ్గిస్తాయి. ఆండ్రాయిడ్, క్రోమ్, మైక్రోసాఫ్ట్, వాట్సాప్, పేపాల్, అమెజాన్లాంటి ఎన్నో ప్రధానమైన ఫ్లాట్ఫామ్లు పాస్కీల ఎంపికను మొదలుపెట్టాయి. యూజర్లకు సంబంధించి అన్ని పరికరాల్లో పాస్వర్డ్–రహిత లాగిన్లకు వీలు కల్పిస్తాయి.పాస్కీల ద్వారా యూజర్లు ప్రతి వెబ్సైట్, యాప్ కోసం వేర్వేరు పాస్వర్డ్లను సెట్ చేసుకొని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ విధానం లాగిన్ల వేగం, సులభతరం చేస్తుంది. భద్రత మెరుగుపడుతుంది. ‘పాస్కీ అనేది జటిలమైన విషయమేమీ కాదు. చాలా సులభం. ఇవి సైన్–ఇన్లను సులభతరం చేస్తాయి. పాస్వర్డ్ల ప్రతికూలతలు తొలగించడానికి సహాయపడతాయి’ అంటున్నాడు సాంకేతిక నిపుణుడు రెవ్.(చదవండి: ఏఐకి.. బావోద్వేగ స్పర్శ...!)
ఏఐకి.. భావోద్వేగ స్పర్శ...!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా ఎక్కడ ఉంది?’ అనే ప్రశ్నకు జవాబు చెప్పాలనుకున్నాడు రాజస్థాన్లోని జైపుర్కు చెందిన ఐఐటీ–బిహెచ్యూ గ్రాడ్యుయేట్ స్పర్శ్ అగర్వాల్. ‘పిక్సా ఏఐ’ స్టార్టప్తో తొలి అడుగు వేశాడు. ‘లూనా’తో మరో అడుగు వేసి ఏఐ సాంకేతికతలో మన దేశం ఎక్కడ ఉందో చెప్పకనే చెప్పాడు. ‘ఏఐతో జనరేట్ చేసిన మాటలు ఎంతైనా యాంత్రికంగానే ఉంటాయి’ అనే విమర్శ విన్న అగర్వాల్ యాంత్రిక వాసనలు లేని, రకరకాల భావోద్వేగాలతో అచ్చం మనిషిలా సహజంగా మాట్లాడే, పాడే ‘లూనా’ను ఆవిష్కరించాడు...పాడడం, గుసగుసలాడడం, విరామం తీసుకొని మాట్లాడడం నుంచి సందర్భానికి తగినట్లు భావోద్వేగంతో స్పందించడం వరకు ‘లూనా’ పేరుతో స్పీచ్–టు–స్పీచ్ ఫౌండేషనల్ మోడల్కు రూపకల్పన చేశాడు స్పర్శ్ అగర్వాల్. లూనా ఏఐ మోడల్ ఆడియోను టెక్ట్స్గా మారుస్తుంది. భాష కృత్రిమంగా ఉండకుండా సహజంగా ఉంటుంది. ‘అచ్చం మనిషిలాగే మాట్లాడుతుంది’ అనిపిస్తుంది.‘ఏఐకి సంబంధించి ఇండియా ఎక్కడ ఉంది? అనే ప్రశ్న ప్రతి వాట్సాప్ గ్రూప్లో కనిపిస్తోంది. కాన్ఫరెన్స్ హాల్లో వినిపిస్తోంది. దీనికి లూనాతో మేము సమాధానం చె΄్పాం. లూనా అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి స్పీచ్–టు–స్పీచ్ ఏఐ మోడల్ అని గర్వంగా చెబుతున్నాం’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాడు అగర్వాల్. ‘నాకు రిసెర్చ్ల్యాబ్ లేదు. పెద్దగా ఆర్థిక వనరులు లేవు’ అంటాడు అగర్వాల్. పరిమిత వనరులతోనే ‘లూనా’కు రూపకల్పన చేయడం విశేషం.ఆటోమేకర్స్, గేమింగ్ ΄్లాట్ఫామ్స్, కన్జ్యూమర్ ఏఐ కంపెనీల నుంచి ‘లూనా’కు డిమాండ్ మొదలైంది. ‘చాలా వాయిస్ మోడల్స్ కస్టమర్ స΄ోర్ట్ కోసం నిర్మించబడ్డాయి. లూనా మాత్రం ఎమోషన్ ఆధారంగా నిర్మించబడింది’ అంటాడు అగర్వాల్. పిల్లల కోసం వాయిస్ ఏఐ బొమ్మలను తయారుచేసే క్రమంలో ఎమోషన్కు సంబంధించిన సాంకేతికత ‘ఏఐ’లో మిస్ అవుతుందనే విషయం గ్రహించిన అగర్వాల్ ‘భావోద్వేగ ‘ఏఐ’పై దృష్టి పెట్టాడు.‘జ్ఞాని’లాంటి భారతీయ వాయిస్ మోడళ్ళు కస్టమర్–సర్వీస్ ఇంటరాక్షన్, టెక్ట్స్–టు–స్పీచ్ సిస్టమ్లను ఆటోమేట్ చేయడంపై దృష్టి సారిస్తుండగా లూనా వేరే మార్గాన్ని ఎంచుకుంది. దానిని భావోద్వేగంతో కూడిన, స్వచ్ఛమైన స్పీచ్–టు–స్పీచ్ సిస్టమ్గా అభివృద్ధి చేసింది. ‘వాయిస్ ఏఐ అనేది కాల్ సపోర్ట్ సెంటర్లను ఆటోమేట్ చేయడం మాత్రమే కాదు, కృత్రిమ భావోద్వేగ మేధస్సును నిర్మించడం అని మేము నమ్ముతున్నాం’ అంటున్నాడు అగర్వాల్. ప్రస్తుతం లూనా ఇంగ్లీష్కు మాత్రమే సర్ట్ చేస్తుంది. ‘రాబోయే రోజుల్లో లూనాకు బహుభాషా సామర్థ్యాలు జోడించబడతాయి’ అంటున్నాడు అగర్వాల్. ‘అతడి ఆవిష్కరణ అద్భుతం’ అంటున్నారు హెచ్సీఎల్ కో–ఫౌండర్, అజయ్ చౌదరి, స్మాలెస్ట్.ఏఐ ఫౌండర్ సుదర్శన్ కామత్.డబ్ల్యూడీఎఫ్ ఫండ్కు పదిహేనువేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి ఎంపికైన ఏకైక సోలో ఫౌండర్ స్పర్శ్ అగర్వాల్. అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కి సంబంధించి ఇండియా ఎక్కడ ఉంది? అనే ప్రశ్న ప్రతి వాట్సాప్ గ్రూప్లో కనిపిస్తోంది. కాన్ఫరెన్స్ హాల్లో వినిపిస్తోంది. ‘లూనా’తో మేము సమాధానం చె΄్పాం. ‘లూనా’ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి స్పీచ్–టు–స్పీచ్ ఏఐ మోడల్ అని గర్వంగా చెబుతున్నాం. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ మన దేశం నుంచి కూడా వస్తుంది అని చెప్పడానికి లూనా బలమైన ఉదాహరణ. ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఏఐ ఇన్నోవేషన్ హబ్గా ఇండియా రూపుదిద్దుకోవడానికి ‘లూనా’తో మా వంతు ప్రయత్నం చేశాం.– స్పర్శ్ అగర్వాల్, పిక్సా ఏఐ, ఫౌండర్ View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia) (చదవండి: Bhavya Narasimhamurthy on: అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!)
చిల్డ్రన్స్ డే: బాలతారల ఇంటర్వ్యూలు
నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన కొందరు బాలతారల ఇంటర్వ్యూలు, సిక్స్ ఇయర్స్ ఏజ్లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, సిక్స్టీన్లోకి అడుగు పెట్టి, యువ హీరో కావడానికి రెడీగా ఉన్న ర్యాన్ జాయ్తో మాటామంతీ!చిన్నప్పటి మహేశ్ని!ఆరేళ్ల వయసులోనే బాల నటుడిగా కెరీర్ స్టార్ చేసి, ఇప్పుడు స్వీట్ సిక్స్టీన్లో ఉన్నాడు ర్యాన్. కొంచెం మహేశ్బాబు పోలికలతో కనిపించే ర్యాన్ చిన్నప్పటి మహేశ్గా రెండు సినిమాల్లో నటించాడు. ఆ విశేషాలతో పాటు మరిన్ని విశేషాలు ఈ విధంగా పంచుకున్నాడు ర్యాన్ జాయ్.→ మా నాన్నగారి వృత్తిరీత్యా మేం చిన్నప్పుడు ముంబైలో ఉండేవాళ్లం. నేను అక్కడే పుట్టాను. నాకు సిక్స్ ఇయర్స్ అప్పుడు మా అమ్మ నన్ను ఆడిషన్స్కి తీసుకెళ్లేవారు. ఆ క్యారెక్టర్లకు కావల్సిన ఏజ్ లేదని సెలక్ట్ చేసేవాళ్లు కాదు. ఫైనల్లీ ‘హైదరాబాద్ లవ్స్టోరీ’లో చాన్స్ వచ్చింది. తెలుగులో నా కెరీర్ ఆ సినిమాతో మొదలై, ఈ మధ్య చేసిన ‘జయమ్మ పంచాయతీ’ వరకూ సక్సెస్ఫుల్గా సాగుతోంది.→ నా ఫీచర్స్ మహేశ్ సార్కి దగ్గరగా ఉండటంవల్లే ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ చిత్రాల్లో చిన్నప్పటి మహేశ్బాబుగా యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. అయితే మహేశ్ సార్తో నా కాంబినేషన్ సీన్స్ ఉండవు కాబట్టి, ఆయన్ను కలవలేదు. ఒకే ఒక్కసారి ‘మహర్షి’ సెట్స్లో ఆయన ఉన్నప్పుడు ఆ దగ్గర్లోనే నేను ఉన్నాను. ఫొటో కావాలని అడిగితే, అప్పుడు ఎమోషనల్ సీన్స్ చేస్తున్నారు. ఆయన కళ్లనిండా నీళ్లు ఉన్నాయి. కొంచెం ఆగమన్నారు. చాలా టైమ్ పట్టింది. ఇక వెళ్లిపోతుంటే, ఆయనే పిలిచి ఫొటో దిగే చాన్స్ ఇచ్చారు.→ ఇప్పటివరకూ చైల్డ్ ఆర్టిస్ట్గా 20కి పైగా సినిమాలు చేశాను. వాటిలో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘నేల టికెట్టు’ వంటి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్గారు హీరోగా చేస్తున్న ఒక సినిమాలో లెంగ్తీ రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 16 కాబట్టి... అటు చైల్డ్ ఆర్టిస్ట్గా చేయలేను... ఇటు నా వయసున్న క్యారెక్టర్లు తక్కువ ఉంటాయి. సో... కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. → నేను హీరో అవాలనుకుంటున్నాను కాబట్టి... బాడీ బిల్డింగ్, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటి మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. చిన్నప్పుడు కరాటే నేర్చుకున్నాను. అలాగే థియేటర్ క్లాసెస్ తీసుకుందామనుకుంటున్నాను. హీరో అనిపించుకోవడానికి ఏమేం కావాలో అన్నీ నేర్చుకుంటాను. నాకు ఏదైనా బిజినెస్ చేయాలని కూడా ఉంది. మెయిన్ టార్గెట్ హీరో అయినప్పటికీ ఫ్యూచర్లో బిజినెస్ మీద కూడా ఫోకస్ పెడతాను. → ఒక కంప్లీట్ యాక్టర్గా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. ఆమిర్ ఖాన్లా అన్నమాట. ఆయన చేసే సినిమాలు ఒకదానికి ఒకటి పోలిక ఉండవు. వెరైటీగా ఉంటూ ట్రూగా ఉంటాయి. అలా నిజాయతీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నాను. సినిమా...నాటిక‘ఒక్క క్షణం, కేజీఎఫ్ 2, తండేల్, కింగ్డమ్, కిష్కింధపురి, లవ్స్టోరీ, సరిలేరు నీకెవ్వరు’.. వంటి మూవీస్తో గుర్తింపు తెచ్చుకున్న భానుప్రకాశ్ చెప్పిన విశేషాలు.→ అన్నమయ్య జిల్లా సోమల మండలం నెల్లిమంద గ్రామం ఎగువపల్లి మా ఊరు. మా నాన్న సురేశ్ అమసగారు. చిన్నప్పుడే మా తాతయ్య హైదరాబాద్కి వచ్చేశారు. మా నాన్న ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ కాంట్రాక్టర్గా చేస్తున్నారు. మా నాన్నకి డైరెక్టర్ కావాలని లక్ష్యం. అయితే ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో నిర్మాతగా సుమారు 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు నాన్న. అలా మా నాన్న నిర్మిస్తున్న ‘నీ కొరకు నేను వేచి ఉంటాను’ షార్ట్ ఫిల్మ్లో ఒక పాత్రకి ఓ అబ్బాయి కావాల్సి వచ్చింది. ఎవరూ సెట్ కాలేదు.. ‘నువ్వు చేస్తావా? అని నాన్న అడగడంతో చేశాను. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అల్లు శిరీష్ సార్ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ (2017) బాల నటుడిగా నా ఫస్ట్ మూవీ. → నేను హైదరాబాద్లో పుట్టి, పెరిగాను. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు నేను సెట్స్కి బుక్స్ తీసుకెళతాను. ఆ రోజు జరిగిన క్లాస్ నోట్స్ని నా ఫ్రెండ్స్ని అడిగి, షూటింగ్ గ్యాప్లో రాసుకుంటాను. చాలా సందర్భాల్లో ఒకే సమయంలో ఇటు ఎగ్జామ్స్, అటు షూటింగ్స్ వచ్చాయి. అయితే షూటింగ్స్ షెడ్యూల్ సడెన్ గా ఫిక్స్ అవుతుంటాయి కాబట్టి వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎఫ్ఏ 1, ఎఫ్ఏ 2 వంటి పరీక్షలుంటే టీచర్స్ నా కోసం మళ్లీ కండక్ట్ చేస్తారు. → నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంత తోపు, తురుం అయినా కానీ ఫ్రెండ్స్ వద్ద నేను జస్ట్ భానుప్రకాశ్ అంతే... నేను నటించిన ఏదైనా సినిమా చూసినప్పుడు నా నటన గురించి టీచర్లు, ఫ్రెండ్స్ మాట్లాడతారు. వాళ్లందరికీ నేను నటించిన ఓ మంచి సినిమా చూపించాలని కోరిక. మా బంధువులు నేను నటించిన సినిమా చూస్తున్నప్పుడు ‘హే.. భాను వచ్చాడు...’ అంటూ బాగా ఎగ్జయిట్ అవుతారు. → ప్రస్తుత పరిస్థితుల్లో నాటకాలు అంతరించిపోతున్నాయి. వాటికి ఆదరణ దక్కడం లేదు. నేను ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అనే నాటికలో నటించాను. ఈ ఏడాది మార్చి 28న తొలి ప్రదర్శన ఇచ్చాను. ఇప్పటివరకూ పద్దెనిమది ప్రదర్శనలు ఇచ్చాను. ఆ నాటిక ఎక్కడ వేసినా శశి అనే నా పాత్రకు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తోంది. సినిమా పుట్టకముందు నుంచి నాటకరంగం ఉంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ ఉన్న నాలాంటి చైల్ట్ ఆర్టిస్ట్స్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు కానీ, బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదు. కానీ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటకం ఎక్కడ ప్రదర్శించినా ఉత్తమ నటుడిగా నాకు అవార్డు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. హిందీలో, గుజరాతీలోనూ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక వేశాం. పేరెంట్స్కి గిఫ్ట్స్‘‘భవిష్యత్లో నేను ఒక మంచి ఆర్టిస్టును అవ్వాలనుకుంటున్నాను. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే రోల్స్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నాను. యాడ్స్ కూడా చేస్తున్నాను. వేటికవే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్’’ అని చెప్పాడు ఉజ్వల్ తేజ్. ‘భైరవం, ఆయ్’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు ‘గాలివాన, పరంపర’ వంటి వెబ్ సిరీస్లోనూ మెరిశాడు ఉజ్వల్ తేజ్. ‘నిండు నూరేళ్ళ సావాసం’, ‘పాపే మా జీవనజ్యోతి’ వంటి సీరియల్స్తో బిజీగా ఉంటున్న ఉజ్వల్ పంచుకున్న కొన్ని విషయాలు...→ మా స్వస్థలం కర్నూలు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాం. 8వ క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పట్నుంచి యాక్టింగ్, డ్యాన్స్ ఇష్టం. వాటిలో నాకున్న స్కిల్ని మా పేరెంట్స్ గమనించి, డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయించారు. అక్కడ మా పేరెంట్స్ ఫ్రెండ్ ఒకరి సలహాతో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో పోటీ చేశాను. తమిళనాడులో తెలంగాణ స్టేట్ను, దుబాయ్లో ఇండియానూ రిప్రజెంట్ చేసి, విజేతగా నిలిచాను.→ నా తొలి సినిమా పేరు ‘నా సినిమా ఆగిపోయింది’. ఈ చిత్రంలో యాక్ట్ చేసేప్పుడు నాకు సరిగ్గా యాక్టింగ్ రాదు. కానీ ఆ సినిమా డైరెక్టర్ ప్రోత్సాహంతో బాగా నటించగలిగాను. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుంది. దీనికన్నా ముందు నేను యానీ మాస్టర్తో ఓ యాడ్ చేశాను.ఏ ఒక వైపు యాక్టింగ్... మరోవైపు స్టడీస్... ఈ రెంటినీ ఎలా బ్యాలన్స్ చేస్తున్నానంటే.. షూటింగ్ స్పాట్కి బుక్స్ తీసుకు వెళ్తాను. షూటింగ్లో నాకు ఖాళీ దొరికినప్పుడల్లా మా అమ్మగారు నా చేత చదివిస్తుంటారు. నేను ఏవైనా క్లాసులు మిస్ అయితే నా టీచర్స్ నాకు రీ క్యాప్ చేస్తారు. నా ఫ్రెండ్స్ నోట్స్లు ఇస్తారు. → మా స్కూల్లో చిల్డ్రన్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక చిల్డ్రన్స్ డేకి మా స్కూల్లో ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. కానీ అదే రోజు నేను షూటింగ్లో పాల్గొనాలి... అయితే అనుకోకుండా నేను ఆ షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఇది తెలిసి మా ప్రిన్సిపాల్ మేడమ్ నన్ను పిలిపించి, అప్పటికప్పుడు నాతో డ్యాన్స్ చేయించారు. అది నాకో హ్యాపీ మూమెంట్. కొన్నిసార్లు నాకు షూటింగ్ ఉన్న రోజే ఎగ్జామ్స్ కూడా ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో నేను సినిమా యూనిట్ దగ్గర అనుమతి తీసుకుని, ఎగ్జామ్స్ రాసేవాడిని. ఇలా కుదరకపోతే మా ప్రిన్సిపాల్ నాకు సపోర్ట్ చేస్తారు.ఏ నా తొలి సంపాదనతో మా అమ్మానాన్నలకు బహుమతులు ఇవ్వడం నాకెంతో సంతృప్తినిచ్చింది. నా మూవీస్ ‘బ్రిలియంట్ బాబు’, ‘స్మాల్ టౌన్ బాయ్స్’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. సుద్దపూసని కాదు‘‘హ్యాష్టాగ్ 90స్’ వెబ్ సిరీస్లోలాగా నేను చదువులో సుద్దపూసని కాదు. నాకెప్పుడూ 90కి పైగా మార్కులు వస్తుంటాయి. నాకు పరీక్షలు ఉన్నప్పుడు ఏవైనా షూటింగ్స్ ఉంటే అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే ఫస్ట్ చదువుకే ప్రియారిటీ.. ఆ తర్వాతే ఏదైనా. అందుకే ఏ పరీక్షనూ ఇప్పటివరకు మిస్ అవలేదు’’ అని రోహన్ రాయ్ తెలిపాడు. ‘వినయ విధేయరామ, రాజుగారి గది 2, రంగుల రాట్నం, మిస్టర్ మజ్ను, చెక్, సూపర్ మచ్చి, గుడ్లక్ సఖి..’ వంటి పలు సినిమాలతో పాటు సీరియల్స్లో, ‘హ్యాష్టాగ్ 90స్’ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించిన రోహన్ రాయ్ చెప్పిన విశేషాలు.మా నాన్న సుబ్బారాయుడుగారు (చీరాల) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. అమ్మ రాధామాధవి బేసికల్గా నా మేనేజర్ కూడా. నా కోసం తన పని వదులుకుంది. నా డేట్స్ చూసుకోవడంతో పాటు షూటింగ్స్కి నా వెంట వస్తుంటుంది. → చిన్నప్పుడు ఇంట్లో టీవీ బాగా చూసేవాణ్ణి. నా వయస్సు ఐదేళ్లున్నప్పుడే ఎవరైనా మా ఇంటికి వచ్చి వెళ్లాక వాళ్లని ఇమిటేట్ చేసేవాణ్ణి. వాళ్లు కూర్చునే, నడిచే విధానాన్ని కూడా. అప్పుడు నాకు, మా కుటుంబ సభ్యులకు అర్థమైంది నాకు నటన అంటే ఇష్టం అని. టీవీలో స్క్రోలింగ్ చూసి ‘డ్రామా జూనియర్స్’ ఆడిషన్స్కి నన్ను తీసుకెళ్లింది అమ్మ. అందులో నేనే ఫస్ట్ కంటెస్టెంట్. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4 చేశాను. ‘డ్రామా జూనియర్స్’లో నా నటన చూసి డైరెక్టర్ బోయపాటి శ్రీనుగారు ఆడిషన్ చేసి, ‘వినయ విధేయ రామ’ సినిమాకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఓంకార్గారు ‘రాజుగారి గది 2’లో చాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి నా ప్రయాణం కొనసాగుతోంది. → హీరోలు నానీగారిని, నవీన్ పొలిశెట్టిగారిని చూసినప్పుడు నేను కూడా వారిలా కావాలనిపించేది. తెరపై వాళ్లు నటిస్తున్నట్లు ఉండదు... వారిద్దరూ నేచురల్ యాక్టర్స్. కథ, పాత్రల్ని ఎంపిక చేసుకునే విధానంలో వాళ్లిద్దర్నీ స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటాను. నానీగారు హీరో కాదు.. ఆర్టిస్ట్. కథ నచ్చితే ఆయన ఏదైనా చేయగలరు.→ నా జీవితంలో మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘హ్యాష్టాగ్ 90స్’ వెబ్ సిరీస్. దాని తర్వాత వెంట వెంటనే సినిమాలు రావడం, మంచి పాత్రలు ఎంచుకుని చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరువీర్గారు హీరోగా రాహుల్ శ్రీనివాస్గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రంలో నేను చేసిన రాము పాత్రకి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం శివాజీగారితో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమా చేశాను. త్వరలో విడుదల కానుంది. → షూటింగ్ ఉన్నప్పుడు క్లాసులు మిస్ అవుతాను. నైట్ లేదా షూటింగ్ గ్యాప్లో చదువుకోవడం, రాసుకోవడం చేస్తుంటాను. యూట్యూబ్, గూగుల్ తల్లి కూడా ఉంది. వాటి నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాను. రాత్రిళ్లు మేలుకుని నోట్స్ రాసుకుంటాను. ఈ విషయంలో మా ఫ్రెండ్స్, టీచర్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అప్పులు తీర్చాను‘కిష్కింధపురి, పరాక్రమం’ చిత్రాల్లో బాలనటుడిగా ప్రేక్షకులను మెప్పించాడు అర్షిత్. చిరంజీవి, నాగార్జునలను స్ఫూర్తిగా తీసుకుని, భవిష్యత్లో పెద్ద నటుడు కావాలనుకుంటున్న అర్షిత్ పంచుకున్న కొన్ని విషయాలు....→ స్వస్థలం గోదావరి ఖని. హైదరాబాద్లో ఉంటున్నాం. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. నాకు నటన అంటే ఆసక్తి కలగడానికి మా అక్క కారణం. అలాగే ‘పిల్లలు పిడుగులు’ టీవీ షో నుండి ‘డ్రామా జూనియర్స్’ వరకు... నేను ఇండస్ట్రీలోకి రావడానికి చాలామంది స్ఫూర్తిగా నిలిచారు. షూటింగ్ సమయంలో ఎగ్జామ్స్ ఉంటే ముందుగా షూటింగ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను పరీక్షలకు హాజరు కాకపోయినా వాళ్ళు నాకు విడిగా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. నా క్లాస్లో నేనే టాపర్ని. షూటింగ్ గ్యాప్లో చదువుకుంటాను. నా ట్విన్ సిస్టర్ స్టడీ సిలబస్లో నాకు సహాయం చేస్తుంది. ఇంట్లో కూడా అమ్మానాన్నలు నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు.→ సినిమాల్లో నటిస్తూ, సిల్వర్ స్క్రీన్ పై కనిపించినంత మాత్రాన నన్ను క్లాస్లో ప్రత్యేకంగా ఏం చూడరు. క్లాస్లో అందరిలానే నేనూ ఓ సాధారణ అబ్బాయిని. అయితే మా బంధువులు నన్ను చూసి గర్వపడుతుంటారు. పెద్ద హీరోలతో పని చేయడం నాకు స్ఫూర్తినిస్తుంది. సెట్స్లో వారి కష్టాన్ని గమనిస్తుంటాను. వాళ్ల కష్టాన్ని చూసి, నేను చాలా నేర్చుకుంటుంటాను. హీరోలతో కలిసి పని చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.→ చైల్డ్ ఆర్టిస్టుగా నా మొదటి సినిమా ‘సర్కిల్’. ఈ చిత్రంలో నటించినందుకు రూ. 1000 పారితోషికం ఇచ్చారు. నా తొలి సంపాదనను మా తల్లిదండ్రులకు ఇచ్చేశాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించగా, నేను యాక్ట్ చేసిన ‘పచ్చిపులుసు’ షార్ట్ ఫిల్మ్కి, రూ. 15 లక్షల ప్రైజ్ మనీ బహుమతిగా లభించింది. ఆ తర్వాత మా అప్పులు కొన్ని తీర్చేశాను. ‘కిష్కింధపురి’ సినిమా తర్వాత నాకు మంచి గుర్తింపు లభిస్తోంది. నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఒక మంచి యాక్టర్గా ప్రేక్షకుల చేత గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం.యాక్టింగ్... చారిటీ బాల నటుడిగా 25కి పైగా సినిమాల్లో నటించాడు నాగచైతన్య వర్మ. ‘అమీర్పేటలో, నారప్ప, నా సామిరంగా, జటాధర, పేకమేడలు, లగ్గం’ వంటి పలు సినిమాలతో పాటు ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్తో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న నాగచైతన్య వర్మ తన ఫ్యూచర్ ప్లాన్స్ని ఇలా పంచుకున్నాడు... → మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చమర్తివాండ్ల పల్లి. నటుడు కావాలనే నా ఆకాంక్షను మా అమ్మానాన్న వరలక్ష్మి దేవి, నాగార్జున రాజు ప్రోత్సహించారు. ‘అమీర్పేటలో’ సినిమాతో నటుడిగా నా జర్నీ మొదలైంది. ప్రస్తుతం ఎయిత్ క్లాస్ చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు స్కూల్కి సెలవు పెడతాను కదా... అప్పుడు ఫ్రెండ్స్ని అడిగి నోట్స్ రాసుకుంటాను. స్కూల్ వాళ్లు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. నా ఫస్ట్ ప్రియారిటీ ఎగ్జామ్స్కే. ఎగ్జామ్స్లో నాకు 80 శాతంపైన మార్కులు వస్తుంటాయి. టాప్ 5 ర్యాంక్స్లో కచ్చితంగా నేను ఉంటాను.→ నా సినిమాలు చూసినప్పుడు ‘బాగా నటించావ్.. ఇలాగే ముందుకెళ్లు’ అని టీచర్లు, నా స్నేహితులు చెబుతుంటారు.. ఈ ఆగస్టులో విడుదలైన ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్లో అవసరాల శ్రీనివాస్గారి చిన్నప్పటి పాత్రలో నెగటివ్ రోల్ చేశాను. నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. ఈ నెల 7న విడుదలైన ‘జటాధర’ సినిమాలో హీరో సుధీర్ బాబు చిన్నప్పటి పాత్ర చేశాను. మంచి మూవీ చేశానని పొగిడారు.→ నేను నటించడం మా బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకి చాలా ఇష్టం. ‘నువ్వు ఇంకా బాగా నటించి, మంచి స్థాయికి వెళ్లాలి’ అని అంటుంటారు. నా సినిమా చూసి బాగా చేశావని చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. తెలుగు సినిమా వేదిక మా తెలుగు తల్లి, కళావారధి సౌజన్యంతో 2023లో నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో ఉత్తమ బాలనటుడిగా ఆర్. నారాయణమూర్తి సార్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. → జూలై 28న నా పుట్టినరోజు సందర్భంగా కడపలోని బాలల అనాథాశ్రమానికి నా పారితోషికంలో నుంచి ప్రతి ఏడాదీ నగదు సాయం చేయడం నాకెంతో సంతృప్తినిస్తుంది.ఏ ప్రస్తుతం ప్రభాస్గారి ‘ఫౌజి’తోపాటు ‘హే భగవాన్, యుఫోరియా, సహకుటుంబానాం, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, బ్యాచ్ మేట్స్, అర్జునుడి గీతోపదేశం’ సినిమాలు చేస్తున్నాను. ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవాలనుకుంటున్నా. ఏడేళ్లు...మూడు గంటలు...ఏడు రికార్డులు∙నృత్య ప్రతిభకళ పట్ల ప్రేమ ఉంటే ఏ వయసు అయినా వండర్స్ సృష్టించవచ్చు అనడానికి నిదర్శనం శర్నీథా దత్త రచ్చ. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉంటున్న ఈ చిన్నారి వయసు ఏడేళ్లు. ఇటీవల రంగప్రవేశం (సోలో అరంగేట్రం)తో ఏకధాటిగా మూడు గంటల పాటు కూచిపూడి నృత్యం చేసిన అరుదైన గుర్తింపుతో పాటు ఏడు రికార్డులను సొంతం చేసుకుంది. అతి పిన్న వయస్కురాలైన కళాకారిణి గా శర్నీథ వార్తల్లో నిలిచింది.శర్నీథా దత్త రచ్చ రెండవ తరగతి చదువుతోంది. రెండేళ్లక్రితం శాస్త్రీయ నృత్యంలో ఓనమాలు దిద్దిన శర్నీథ ఇటీవల సంక్లిష్టమైన నాట్య భంగిమలను, తిల్లానాలను అత్యద్భుతంగా ప్రదర్శించి ఎంతోమంది ప్రశంసలను అందుకుంది.సాధనమున రికార్డులు... శర్నీథా నృత్యాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, డైమండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. చూసి శర్నీథ ప్రతిభను గుర్తించాయి. అసాధారణమైన ఈ ప్రతిభకు శారద కళాక్షేత్రం నుంచి ’నాట్యమయూరి’ అవార్డును గురువు భావన పెద్రపోలు నుంచి అందుకున్నది. అలసట ఎరగని తపన... శర్నీథా తల్లిదండ్రులు రచ్చ హరి వినోద్, నరీనా దేవి కూతురి మూడేళ్ల వయసు నుంచి శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. ‘నృత్యం అంటే శర్నీథకు ప్రాణం. ప్రాక్టీస్ అంటే చాలు సాధన చేస్తూనే ఉంటుంది. నృత్యాంగేట్రం చేయడానికి ఎనిమిది నెలలు ప్రాక్టీస్ చేసింది. వారణాసి లో అసి ఘాట్, అయోధ్య రామమందిరం లోపల, చిదంబరం గర్భగుడి దగ్గర, బాసరలో... నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ సబ్ జూనియర్లో పాల్గొని, ఐదవ స్థానంలో నిలిచింది. శర్నీథ నృత్యసాధనలో చూపే భక్తి, శ్రద్ధ ప్రముఖ నృత్యకారులను కూడా మెప్పిస్తుంది. అభినయంలో చిన్న వయస్సులోనే చూపే ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను సమ్మోహ పరుస్తుంది. – నిర్మలారెడ్డి
ఫొటోలు
నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
#KrithiShetty : క్యూట్ లూక్స్తో కృతి శెట్టి (ఫొటోలు)
‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)
ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)
ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)
అంతర్జాతీయం
‘బంగ్లా’లో మళ్లీ హింస.. భయం గుప్పిట్లో ఢాకా
ఢాకా: పొరుగుదేశం బంగ్లాదేశ్ బాంబులతో దద్దరిల్లుతోంది. పదవీచ్యుతురాలైన ప్రధాని షేక్ హసీనాపై నేడు (గురువారం) కోర్టు నుంచి కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగ్లాదేశ్.. కాల్పులు, దేశీయ బాంబు దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇది 2024లో చోటుచేసుకున్న విద్యార్థి నిరసనలను తలపించింది. నాడు జరిగిన హింసాకాండలో 500 మందికి పైగా విద్యార్థులు, ప్రజలు మృతిచెందారు.రాజధాని ఢాకా గురువారం పటిష్టమైన కోటగా మాదిరిగా మారింది. హసీనాకు చెందిన ‘అవామీ లీగ్ ’ ఢాకా లాక్డౌన్కు పిలుపునివ్వడంతో అటు పోలీసులు, ఇటు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) సభ్యులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఢాకా ఎంట్రీ పాయింట్ల వద్ద బహుళ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజా రవాణాను అణువణువునా తనిఖీ చేస్తున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఢాకాలోని రద్దీగా ఉండే రోడ్లలో నిశ్శబ్దం నెలకొంది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా, ఆమె సహాయకులపై మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాల కేసులో నేడు (నవంబర్ 13)న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) తీర్పు వెలువరించనుంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది ఆగస్టులో భారతదేశానికి చేరుకున్న హసీనా పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వాటిలో హత్య, కుట్రతో పాటు పలు ఆరోపణలున్నాయి.కాగా తాజాగా జరిగిన అల్లర్లలో నిరసనకారులు బ్రహ్మన్బారియాలోని ఒక గ్రామీణ బ్యాంకు శాఖకు నిప్పంటించి, అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పేదలకు మైక్రో క్రెడిట్ అందించడానికి 1983లో ముహమ్మద్ యూనస్ ఈ గ్రామీణ బ్యాంకును స్థాపించారు. నిరసనకారులు రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో పలు బస్సులను తగులబెట్టారు. ఢాకా పరిధిలో 17 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయని, ముగ్గురు గాయపడ్డారని పలు నివేదికలు చెబుతున్నాయి.రాజకీయ కార్యకలాపాల నుంచి నిషేధించిన హసీనా ‘అవామీ లీగ్’కు చెందిన 44 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు ఢాకా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నారాయణగంజ్లో, పార్టీకి చెందిన మరో 29 మంది నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలోని ఒక ఇంటి నుండి పెద్ద మొత్తంలో ముడి బాంబులు, పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: Bihar Election: నితీష్ ఇంటి ముందు ‘టైగర్’ పోస్టర్
అమెరికాలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది: ఫోర్డ్ సీఈఓ
ప్రఖ్యాత ఆటోమెుబైల్ సంస్థ ఫోర్డ్ లో ఉద్యోగాల కొరత ఏర్పడినట్లు ఆ సంస్థ సీఈఓ జిమ్ ఫార్లీ పేర్కొన్నట్లు ఫార్చ్యూన్ నివేదిక తెలిపింది. ఫోర్డ్ సంస్థలో 5వేల మంది మెకానిక్ లు అవసరమున్న ఆనైపుణ్యం గల వ్యక్తులు లేరన్నారు. ఈ సమస్య కేవలం ఫోర్డు కంపెనీకి చెందింది మాత్రమే కాదని ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులే తయారి రంగంలో అమెరికా వ్యాప్తంగా ఏర్పడ్డాయని జిమ్ ఫార్లీ పేర్కొన్నారు.అమెరికాలో స్కిల్డ్ లేబర్స్ కొరత ఏర్పడినట్లు ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ తెలిపినట్లు ఫార్చ్యూన్ నివేదిక పేర్కొంది. యూఎస్ స్కిల్డ్ లేబర్ మార్కెట్ లో పది లక్షలకు పైగా జాబులు ఖాళీగా ఉన్నాయని పలు నివేదికలు తెలుపుతున్నాయి. అత్యవసర సర్వీసులైన, ప్లంబర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, ఎలక్ట్రిషన్స్, ట్రక్ డ్రైవర్స్ ఉద్యోగాలలో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీచేసే నిపుణుల కొరత తీవ్రంగా ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. బ్యురో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ డేటా ఆగస్టు రిపోర్టు ప్రకారం కేవలం తయారిరంగంలో 4 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశంలో నిరుద్యోగిత రేటు 4.3 ఉన్నప్పటికీ ఈ రంగంలో ఉద్యోగాల ఖాళీలు అధికంగా ఉన్నాయన్నారు.ఫోర్డ్ కంపెనీ మెకానిక్ జాబులకు వార్షిక వేతనం లక్ష 20 వేల డాలర్లు ఇస్తుందని, ఈ ప్యాకెజీ అమెరిన్స్ తలసరి ఆదాయం కంటేఇది రెట్టింపని తెలిపారు. ఇంత మంచి ప్యాకెేజ్ ఉన్నప్పటికీ మెకానిక్ ల భర్తీ జరగడం లేదన్నారు. 2024లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లో అవసరమున్న ఉద్యోగాలలో సగం మందిని నియమించుకోవడం చాలా కష్టమని ఒకవేళ వారి భర్తీ చేపట్టిన వారు ఎక్కువ కాలం ఈ జాబులలో ఉండడం లేదని సర్వే తెలిపిందని పేర్కొన్నారు. దేశ అధ్యక్షుడు ట్రంప్ తయారీరంగాన్ని అమెరికాకు తీసుకొస్తున్నానని ప్రకటిస్తున్నారని అయితే పరిస్థితులు చూస్తుంటే అమెరికన్స్ ఆ రంగంలో ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఫోర్ట్ సీఈఓ జిమ్ ఫర్లీ తెలిపినట్లు ఫార్చ్యూన్ నివేదిక పేర్కొంది.
బంపర్ ఆఫర్: పిల్లలను కంటే రూ. 30 లక్షలు
రోమ్: ఆధునిక యువత పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడాన్ని భారంగా భావిస్తోంది. దీనికి ఆర్థిక అంశాలతో పాటు, ఉరుకులు పరుగుల జీవితం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. ఇటువంటి నేపధ్యంలో జననాల రేటు తగ్గుతున్నదనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిని గుర్తించిన ఒక దేశం పరిష్కార మార్గాన్ని కనుగొంది. పెళ్లి చేసుకునే యువతకు భారీ నగదు బహమతులు, గ్రాంట్లను ప్రకటించింది.ఇటలీ అసాధారణ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ ఏకీకరణ (1861) తర్వాత 2024లో కేవలం 370,000 జననాలతో అత్యల్ప సంఖ్యను నమోదు చేసింది. ప్రతి మహిళకు జనన రేటు రికార్డు స్థాయిలో 1.13కి పడిపోయింది. నిపుణులు దీనిని ‘జనాభా శీతాకాలం’(తక్కువ సంతానోత్పత్తి రేట్లు, వృద్ధాప్య జనాభా, పెరిగిన మరణాల రేటుతో ఏర్పడిన పరిస్థితి) గా అభివర్ణిస్తున్నారు.ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న జీవన వ్యయాలు, పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా యువ ఇటాలియన్లు వివాహం చేసుకునేందుకు, పిల్లలను కనేందుకు ఆలస్యం చేస్తున్నారు. ఇది ఇటలీ ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. యువతలో ఉన్న ఈ ధోరణిని తిప్పికొట్టేందుకు, జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు తక్షణమే చర్యలకు ఇటలీ ప్రభుత్వం ఉపక్రమించింది.తగ్గుతున్న జననాల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇటాలియన్ ప్రభుత్వం యువతకు విస్తృతమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనిలో గ్రామీణ పునరావాస గ్రాంట్ ఒకటి. దీని కింద గ్రామాలలో వదిలివేసిన ఇళ్లను కొనుగోలు చేసి,వాటిని పునరుద్ధరించే వారికి €30,000(రూ.30 లక్షలు) వరకు అందించనున్నారు. పుగ్లియాలోని ప్రెసిస్-అక్వారికా తదితర చిన్న పట్టణాల్లో నివాస స్థిరత్వం కోసం అక్కడి ప్రజలకు నెలవారీ స్టైపెండ్లు, వ్యాపార మద్దతును అందిస్తున్నారు. ఈ పథకం ముఖ్యంగా ఇటలీలో ఖాళీ అవుతున్న చిన్న,చారిత్రక పట్టణాలకు ఊపిరి పోయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అక్కడి జనాభా పెరిగేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.అలాగే దేశంలో జనాభా పెరిగేందుకు దోహదపడేలా పన్ను వ్యవస్థలో ముఖ్యమైన రాయితీలను ప్రవేశపెట్టింది. ఉద్యోగాల కోసం ఇటలీకి తరలివచ్చే నిపుణుల కోసం, ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల వారికి పదేళ్ల వరకూ వరకు వారి ఆదాయంలో 70 శాతం నుండి 90 శాతం వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిస్తున్నారు. దీనికితోడు విదేశీ కార్మికులు స్థానికంగా నివసించేందుకు, ఆర్థిక వ్యవస్థకు దోహదపడటానికి అనుమతించే డిజిటల్ నోమాడ్ వీసాను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రోత్సాహకాలు జనాభా క్షీణతను తిప్పికొట్టందుకు సరిపోకపోవచ్చని విశ్లేషకులు సూచిస్తునన్నారు. పిల్లల సంరక్షణ, కుటుంబ జీవితాన్ని ప్రోత్సహించేందుకు సాంస్కృతిక ప్రచారాలు వంటి నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని వారు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘యూనస్ ఉగ్రవాదుల ఫ్రంట్మన్’.. హసీనా ఆగ్రహం
హెచ్-1బీ పాలసీ.. ట్రంప్ సీక్రెట్ అదేనా?
విదేశీ కార్మికులు అవసరం తమ దేశానికి ఉందని ట్రంప్ ప్రకటన చేసి 24 గంటలైనా గడవక ముందే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ ట్రంప్ హెచ్-1బీ వీసా కొత్త విధానం ఉద్దేశ్యం బయటపెట్టారు. అమెరికా పౌరులను ఉన్నతమైన ఉద్యోగాలలో నియమించేందుకు విదేశాల నుంచి వలస కార్మికులు తాత్కాలికంగా అమెరికా వచ్చి ఆ దేశ పౌరులకు శిక్షణ ఇచ్చి తిరిగి తమ దేశాలకు వెళ్లాలన్నారు. తద్వారా అమెరికన్స్ ఉన్నతమైన ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం ఉద్దేశ్యం ఇదే అయిండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో తాత్కాలికంగా స్థిరపడిన విదేశీయులు, చదువుకోసం అమెరికాకెళ్లిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ సమయంలో తమను దేశం వదిలి వెళ్లమంటారో అని కంగారుపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల ఆ దేశం ఆమోందిచిన హెచ్-1బీ వీసా బిల్లు దానికి మరింత బలాన్ని చేకూర్చింది. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్షడాలర్లకు పెంచి ఆ దేశంలోకి వచ్చేవారి అవకాశాలను మరింత కఠినతరం చేశారు. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్యూలో ట్రంప్ హెచ్-1బీ పాలసీ వ్యూహం బహిర్గతం చేశారు. అమెరికన్స్ గత 20-30 ఏళ్లుగా తయారీరంగంలోని ఉన్నతమైన ఉద్యోగాలలో లేరు, ఓడలు, సెమీకండక్టర్స్ నిర్మించలేదు. ఆ రంగాలలో వారికి తగినంత ప్రతిభ లేదు. కనుక విదేశాలనుంచి నైపుణ్యత కలిగిన కార్మికులు అమెరికాకు వచ్చి రెండు, ఐదు, ఏడు సంవత్సారాలపాటు అమెరికాలో ఉండి ఆ దేశ కార్మికులకు శిక్షణ ఇచ్చి వెళ్లాలని.. ట్రంప్ నూతన పాలసీ విధానం ఉద్దేశ్యం ఇదే అయి ఉండవచ్చని బీసెంట్ అన్నారు.అలా శిక్షణ పొందిన అనంతరం తిరిగి ఆ ఉద్యోగాలను టేకాఫ్ చేసుకుంటారని అన్నారు. వలస కార్మికులు ఆ దేశంలో ఉండడంతో ఒక్క అమెరికన్ ఉద్యోగం పొందలేకపోతున్నారని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ల క్షేమం కొరకే పనిచేస్తుందని లక్ష డాలర్లు లోపల ఆదాయం ఉన్న కుటుంబాలకు పన్నులో రెండువేల డాలర్లు రాయితీ ఇచ్చే అంశం చర్చిస్తున్నామన్నారు. కాగా నిన్న ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ అమెరికన్లకు మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లో తగినంత నైపుణ్యత లేదని ఆ రంగాలలో విదేశీయులను నియమించుకునే అవసరముందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
జాతీయం
పాక్లో పంజాబ్ మహిళ అదృశ్యం
న్యూఢిల్లీ: గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా ‘ప్రకాశ్ పుర్బ్’ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్కు వెళ్లిన భారత్లోని పంజాబ్కు చెందిన ఒక మహిళా యాత్రికురాలు తిరిగి రాలేదు. సర్బ్జిత్ కౌర్గా గుర్తించిన ఈ మహిళ పంజాబ్లోని కపుర్తలా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందినది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పంజాబ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.సర్బ్జిత్ కౌర్ 2025, నవంబర్ 4న అట్టారి-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్కు చేరుకున్నారు. ఆమె 1,900 మందికి పైగా సిక్కు సభ్యులతో కూడిన ‘జాతా’ (తీర్థయాత్ర సమూహం)లో భాగంగా వెళ్లారు. ఈ బృందం గురుద్వారా నంకనా సాహిబ్లో ప్రార్థనలు నిర్వహించేందుకు, ఇతర చారిత్రక సిక్కు మందిరాలను సందర్శించేందుకు 10 రోజుల యాత్రకు వెళ్లింది. అయితే గురువారం రాత్రి ఈ బృందం భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, సర్బ్జిత్ కౌర్ వారిలో లేరు. ఆమె తిరిగి రాకపోవడాన్ని గుర్తించిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. #WATCH | Kapurthala, Punjab | Station House Officer (SHO) of Talwandi Chaudhrian, Nirmal Singh says, "Sarbjit Kaur, a resident of Amanipur village in Kapurthala, was part of the jatha which went to Nankana Sahib, Pakistan. She did not return. The police are conducting an… pic.twitter.com/fPpMWzjcuK— ANI (@ANI) November 14, 2025ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. తల్వాండి చౌదరియన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)నిర్మల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కపుర్తలాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే దీనిపై కేసు నమోదయ్యిదన్నారు. భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు కౌర్ కుటుంబ సభ్యుల నుంచి, ఆమె గ్రామం నుంచి మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె అదృశ్యం వెనుక కారణాలు, ఆమె పాకిస్తాన్లో ఉండిపోయారా? లేదా మరేదైనా జరిగిందా? అనే కోణాల్లో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.గురువారం తిరిగి వచ్చిన ఈ యాత్రికుల బృందం ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్కు వెళ్లిన మొదటి ‘జాతా’ కావడం గమనార్హం. గతంలో పలు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్తాన్కు ప్రయాణ ఆంక్షలు విధించింది. గత జూన్లో మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతికి సిక్కులు పాకిస్తాన్ను సందర్శించకుండా నిషేధించారు. సుమారు రెండు వారాల నిరాకరణ తర్వాత, అక్టోబర్ రెండున కేంద్ర ప్రభుత్వం ఈ తీర్థయాత్రకు అనుమతి ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో, ప్రస్తుతం భారత పౌరులు మాత్రమే అట్టారి సరిహద్దు ద్వారా ప్రయాణించగలుగుతున్నారు. ఈ కఠిన నిబంధనల మధ్య యాత్రికురాలు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’
‘మిషన్ త్రిశూల్’తో ఎన్డీఏ విజయం?
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమికి నిర్ణయాత్మక విజయం అందించడంలో ఆర్ఎస్ఎస్ అనుసరించిన ‘మిషన్ త్రిశూల్’ అమోఘంగా దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తన పనితీరుతో ఎన్డీఏకు నిశ్శబ్ద ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది.బీహార్ ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ‘మిషన్ త్రిశూల్’ చేపట్టారు. 2025, ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రచారంలో బీహార్ అంతటా 50 వేల నుండి 60 వేల సమావేశాలను నిర్వహించారు. అంటే సగటున ప్రతి నియోజకవర్గంలో 200 నుంచి 300 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో కేవలం రాజకీయ ప్రచారం చేయడమే కాకుండా, లోతైన సర్వేలు, ఓటర్ల సమీకరణపై దృష్టి సారించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, బజరంగ్ దళ్, వీహెచ్పీ, మజ్దూర్ సంఘ్ తదితర సంస్థలు ఈ సమన్వయ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి.మూడు దశల త్రిశూల్ వ్యూహం‘మిషన్ త్రిశూల్’ ప్రధానంగా మూడు దశల వ్యూహంగా రూపొందింది. ఇది సంప్రదాయ ఎన్నికల ప్రచారాలకు భిన్నంగా సాగింది.అసంతృప్త ఓటర్లను గుర్తించడం ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు.. అట్టడుగు స్థాయిలో సర్వేలు నిర్వహించి, స్థానిక సమస్యలైన నిరుద్యోగం, అభివృద్ధి కుంటుబాటు, మౌలిక సదుపాయాలలో లోపాలు, స్థానిక పాలన అంతరాల విషయంలో నిరాశ చెందిన ఓటర్లను గుర్తించారు. వారి ఫిర్యాదులను డాక్యుమెంట్ చేసి, పరిష్కార మార్గాలను బీజేపీ వేదికగా ప్రచారం చేశారు.స్థానిక,జాతీయ సమస్యలపై దృష్టిఈ మిషన్లో జీవనోపాధి, ఉద్యోగ కల్పన, వ్యవసాయ సంక్షోభం, కుల ఆధారిత రిజర్వేషన్ల వంటి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఈ సమస్యలను బీజేపీకి చెందిన విస్తృత జాతీయవాదం, అభివృద్ధి కథనాలతో సమర్థవంతంగా అనుసంధానించారు. తద్వారా స్థానిక, జాతీయ దృష్టికోణాల మధ్య సమతుల్యత సాధించారు.గుర్తింపు ఆధారిత విధానంఈ వ్యూహంలోని అత్యంత కీలకమైనది ‘గుర్తింపు ఆధారిత విధానం’.. జాతీయవాద గొడుగు కింద ఉన్న వివిధ హిందూ సమూహాలను ఏకం చేయడం దీని లక్ష్యం. ఇది ముస్లిం-యాదవ్ (ఎంవై) వంటి సంప్రదాయ ప్రత్యర్థి ఓటు సమూహాలలో మార్పులను సృష్టించి, ఎన్డీఏకి మద్దతు పెంచడంలో కీలక పాత్ర పోషించింది. స్వచ్ఛంద సేవకులు ప్రతి బూత్ను విశ్లేషించి, చివరి నిమిషంలో ఓటర్ల సమీకరణ ప్రయత్నాలను తీవ్రం చేశారు. ఇది ఓటింగ్ సరళిని స్పష్టంగా మార్చింది.తదుపరి లక్ష్యం.. పశ్చిమ బెంగాల్ 2026బీహార్లో ‘మిషన్ త్రిశూల్’ సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆర్ఎస్ఎస్ తన తదుపరి లక్ష్యంగా 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎంచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాన్ని పదునుపెట్టే పనిలో పడింది. పశ్చిమ బెంగాల్లో అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, శాంతిభద్రతల సమస్యలు, ఆర్థిక స్తబ్దత తదితర అంశాలను ప్రధానంగా హైలైట్ చేయాలని ఆర్ఎస్ఎస్ ప్రణాళిక వేస్తోంది. అలాగే మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో హిందూ ఏకీకరణను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున మతపరమైన కార్యక్రమాలు, ‘ఘర్ వాపసీ’ వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. బీహార్లో విజయానికి దోహదపడిన ఈ నిశ్శబ్ద సైద్ధాంతిక విస్తరణ వ్యూహాన్ని ఆర్ఎస్ఎస్ మరిన్ని రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు అమలు చేయనున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’
పద్మశ్రీ ‘సాలుమరద’ తిమ్మక్క కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, వృక్షమాతగా పేరు తెచ్చుకున్న సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు. 114 ఏళ్ల తిమ్మక్క కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె అక్కడే తుది శ్వాస విడిచారు.1911 జూన్ 30న జన్మించిన తిమ్మక్క బెంగళూరు దక్షిణ జిల్లాలోని హులికల్–కుదూర్ మధ్య 4.5 కి.మీ. విస్తీర్ణంలో 385 మర్రి చెట్లను నాటడంతో ఆమెకు ‘సాలుమరద’అనే పేరు వచ్చింది. నిరక్షరాస్యురాలైన తిమ్మక్కకు పిల్లలు లేకపోవడంతో.. మొక్కలనే పిల్లల్లా పెంచారు. ఆమె చేసిన కృషికి 2019లో పద్మశ్రీ అందుకున్నారు. అంతకుముందు హంపి విశ్వవిద్యాలయం నుంచి 2010లో నాడోజ అవారు, 1995లో జాతీయ పౌర పురస్కారం, 1997లో ఇందిరా ప్రియదర్శిని వృష మిత్ర అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రముఖుల సంతాపం.. తిమ్మక్క మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం తెలిపారు. ‘వేలాది చెట్లను నాటి, వాటిని తన సొంత పిల్లలలాగా పోషించిన తిమ్మక్క, తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసింది. పర్యావరణం పట్ల అమితమైన ప్రేమ కలిగిన ఆమెకు మరణం లేదు. ఆమె మరణం ఈ ప్రాంతానికి తీరని లోటు’అని పేర్కన్నారు. తిమ్మక్క మృతిపట్ల మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, కర్ణాటక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల ప్రహసనంలో ఐదుగురు అభ్యర్థులు అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది ఓట్ల లెక్కింపు సమయంలో ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఆ అభ్యర్థులు వీరే..1. రాధా చరణ్ సాహ్ (జేడీయూ)సందేశ్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత స్వల్ప తేడాతో విజయం సాధించిన రికార్డును నమోదు చేసింది. జేడీయూ అభ్యర్థి రాధా చరణ్ సాహ్ తన ప్రత్యర్థి, ఆర్జేడీకి చెందిన దిపు సింగ్ను కేవలం 27 ఓట్ల తేడాతో ఓడించారు. సాహ్ 80,598 ఓట్లు (43.99%) సాధించగా, సింగ్ 80,571 ఓట్లు (43.97%) దక్కించుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థుల తుది రౌండ్ లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఓటును అత్యంత జాగ్రత్తగా లెక్కించారు.2. సతీష్ కుమార్ సింగ్ యాదవ్ (బీఎస్పీ)రామ్గఢ్లో బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు. యాదవ్ 72,689 ఓట్లు (37.29%) సాధించగా, సింగ్ 72,659 ఓట్లు (37.29%) పొందారు. పోలింగ్ శాతంలో కూడా వీరి మధ్య స్వల్ప తేడానే ఉంది. ఇది బీఎస్పీకి బీహార్లో ఏకైక విజయంగా నిలిచింది. ఇది ఆ పార్టీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది. ఈ ఫలితం ఆఖరి వరకు ఉత్కంఠను రేకెత్తించింది.3. మహేష్ పాస్వాన్ (బీజేపీ)అగియాన్ నుంచి ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన బీజేపీపీ అభ్యర్థి మహేష్ పాస్వాన్, సీపీఐ(ఎంఎల్)కు చెందిన శివ ప్రకాష్ రంజన్పై కేవలం 95 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. పాస్వాన్ 69,412 ఓట్లు (45.2%) పొందగా, రంజన్ 69,317 ఓట్లు (45.14%) సాధించారు. ఈ నియోజకవర్గంలో వామపక్ష పార్టీ అభ్యర్థి నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఈ స్థానంలో లెక్కింపు పారదర్శకంగా ఉన్నప్పటికీ, స్వల్ప తేడా కారణంగా తుది ప్రకటన కోసం కొంత సమయం పట్టింది.4. ఫైసల్ రెహమాన్ (ఆర్జేడీ)ఢాకా నియోజక వర్గం ఆర్జేడీ అభ్యర్థి ఫైసల్ రెహమాన్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన పవన్ కుమార్ జైస్వాల్ను 178 ఓట్ల తేడాతో ఓడించగలిగారు. రెహమాన్ 1,12,727 ఓట్లు (45.72%) సాధించగా, జైస్వాల్ 1,12,549 ఓట్లు (45.64%) పొందారు. స్వల్ప తేడా ఉన్నప్పటికీ, మహాకూటమి తరపున ఆర్జేడీకి ఈ విజయం ముఖ్యమైనదిగా మారింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు దాదాపు సమాన సంఖ్యలో ఓట్లను పొందడం చర్చనీయాంశంగా మారింది,5. మనోజ్ బిశ్వాస్ (కాంగ్రెస్)ఫోర్బ్స్గంజ్ కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిశ్వాస్ బీజేపీకి చెందిన విద్యా సాగర్ కేషారీని 221 ఓట్ల స్వల్ప తేడాతో ఓడించారు. బిశ్వాస్ 120,114 ఓట్లు (47.77%) సాధించగా, కేషారీ 1,19,893 ఓట్లు (47.68%) పొందారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఉత్కంఠభరిత విజయాలలో ఒకటి. ఇది కూడా చదవండి: Sweden: జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి
ఎన్ఆర్ఐ
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
నా కొడుకును కొట్టి చంపేశారు!
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీ విద్యార్థి మరణంతో ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు మూడు వేల మంది విద్యార్థుల ధర్నాలు, నినాదాలతో హోరెత్తింది. తోటి విద్యార్థి సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో ఇన్నాళ్లు వారిలో దాగి ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ మంచి విద్యార్థిని అన్యాయంగా చంపేశారనే భావన వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో కొన్నేళ్లుగా కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు చేస్తున్న ఆగడాలు బట్టబయలవ్వడమే కాక కళాశాలలో ఇన్నాళ్లు గుట్టుగా జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమీ తెలియదట.. విద్యార్థి సృజన్ను రాత్రంగా సీనియర్లు కొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా.. మరుసటి రోజు ఉదయం సృజన్ ఆత్మహత్య చేసుకున్నా అంబులెన్సు వస్తే గానీ తనకు తెలియదని క్యాంపస్ డైరెక్టర్ చెప్పడం అక్కడి యాజమాన్య నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. గతంలోనూ ఆత్మహత్య ఘటనలు జరగడంతో పోలీసుల సాయంతో ఈ సారి కూడా గొడవను సద్దుమణిగేలా చేద్దామని యాజమాన్యం తీవ్రంగా ప్రయతి్నంచింది. కానీ విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనల ముందు ఇటు పోలీసులు, అటు కళాశాల యాజమాన్యం తలొగ్గక తప్పలేదు. కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆ రాత్రి కొట్టింది తొమ్మిది మంది అని చెప్పినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు 8 మందిని అదుపులోకి తీసుకోవడంతో కాస్త శాంతించి వెనుదిరిగారు. బుధవారం రాత్రే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించినా.. శుక్రవారం విద్యార్థులు, సృజన్ కుటుంబీకుల ఆందోళనలు సద్దుమణిగాకే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు ఘటనకు బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులు వై.అమిత్, ఎస్కే అనీష్ అహ్మద్, బి.అభిష్క్, జె.చిన్నబాబు, షేక్ అజీల్, ఎస్కే మస్తాన్, ఎస్కే సమీర్, ఎ.భానుప్రకాష్లను సస్పెండ్ చేశారు. తప్పుడు ప్రచారంపై మండిపాటు.. యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య ధోరణి కనిపించడం.. మీడియా ముందు వాస్తవాలు చెప్పేందుకు కూడా ఆంక్షలు పెట్టడంతో విద్యార్థులు తట్టుకోలేకపోయారు. దీనికితోడు ‘సృజన్ బ్యాక్లాగ్స్ ఉంచేశాడు.. కళాశాలలో ఉన్న అమ్మాయితో చెడుగా ప్రవర్తించాడు.. అమ్మాయి సోదరుడు ఒక్కరే రెండు చెంపదెబ్బలు కొట్టాడు..’ వంటి తప్పుడు వదంతులు సృష్టించారంటూ మండిపడ్డారు. ఉదయం నుంచే ధర్నా.. సృజన్ తల్లిదండ్రులు, కుటుంబీకులు గురువారం ఉదయం 6 గంటలకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పక ముందే డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు రెండు బృందాలుగా విడిపోయి ధర్నాకు దిగారు. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని సృజన్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ లోగా కళాశాల యాజమాన్యం సమక్షంలో సృజన్ తల్లిదండ్రులతో డీస్పీ వివేకానంద, సీఐ అవతారంలు చర్చించారు. విద్యార్థుల ఆందోళనను విరమించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకోవడం, సృజన్ తల్లిదండ్రులు సైతం విజ్ఞప్తి చేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.అవన్నీ అబద్ధాలే.. సృజన్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బ్యాక్లాగ్స్ ఉంచేశాడని, మంచివాడు కాడని, చదువు వల్ల చనిపోయాడన్నది నిజం కాదు. సీనియర్స్ దాడి చేశారన్నది నిజం. ముందు రోజు సృజన్పై దాడి ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకున్నాక తప్పుగా పోలీసులకు వెళ్లింది. 11వ తేదీ రాత్రి 11 నుంచి 3 గంటల వరకు సీనియర్లు 9 మంది కొట్టి వేధించారు. తెల్లవారేసరికి అంతా పరీక్షలకు వెళ్లాం. సృజన్ రాలేదు. వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సృజన్ జూనియర్ విద్యారి్థనిని చెల్లి అని పిలుస్తాడు. అదే భావంతో ఉంటాడు. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యారి్థని కజిన్కు ఈ విషయం నచ్చేది కాది. సృజన్ను హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ సృజన్ చనిపోయే ముందు అమ్మాయి పిలిచి మాట్లాడటం వేరే వాళ్ల ద్వారా వారికి తెలిసింది. అందుకే ఇలా జరిగింది. – సృజన్ క్లాస్మేట్స్ ఏం ప్రయోజనం.. ఎంతమంది ధర్నాలు చేస్తే ఏంటి.? ఎంతమంది పోలీసులు వస్తే ఏంటి..? చెట్టంత కొడుకుపోయాడు. – జ్యోతి, సృజన్ తల్లి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు.. మా మేనల్లుడు సృజన్ కుర్చీ వేసుకుని ఫ్యాన్కు ఉరేసుకున్నాడన్నారు. అది నిజం కాదు. వాడి ఎత్తు 5.9 అడుగులు. ఫ్యాన్ కూడా అందేస్తుంది. రాత్రి 11 నుంచి 3 వరకు హింసించి, కొట్టి చంపేశారు. అలా తెచ్చి ఫ్యాన్కు ఉరేసినట్లు కట్టారు. – చుక్కా శంకరరావు, మేనమామ కొట్టి చంపేశారు... నేను ఆటోడ్రైవర్ను. ఇంటర్ నుంచి ఇదే కళాశాలలో సృజన్ను చదివిస్తున్నాను. కుమారుడిని అన్యాయంగా కొట్టి చంపేశారు. కొట్టినవారిలో ఐదారుసార్లు డిబార్ అయినవారు కూడా ఉన్నారు. మీ సృజన్ అటువంటి వాడు కాదని, కావాలనే చెడు వ్యక్తిగా చిత్రీకరించారని 2వేల మందికి పైగా విద్యార్థులు అంటున్నారంటే మావాడు ఏమీ తప్పు చేయలేదని గ్రహించాలి. పోలీసులు న్యాయం చేయాలి. – శివకృష్ణ ప్రసాద్, సృజన్ తండ్రి
Hyderabad: అశ్లీల ఫొటోలు పంపి మహిళకు వేధింపులు
హైదరాబాద్: ఓ మహిళకు వాట్సాప్లో అశ్లీల ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. మార్గదర్శికాలనీ విజయలక్ష్మి అనెక్స్ అపార్టుమెంటులో ఓ మహిళ (41) నివాసముంటోంది. అదే అపార్టుమెంటులో ఉండే నాగిరెడ్డి నాగసుబ్బారెడ్డి (32) కొద్ది రోజులుగా ఆమె ఫోన్కు అశ్లీల చిత్రాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మందలించి పంపించారు. అయితే సుబ్బారెడ్డి బాధితురాలికి ఫోన్ చేసి ఇక ముందు అశ్లీల ఫొటోలు పంపించకుండా ఉండాలంటే తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. మరోసారి బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని వీహెచ్పీ నాయకులు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
అత్యాచార కేసులో 35 ఏళ్ల జైలు
శాంతినగర్/ ఎర్రవల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రవికుమార్ సంచలన తీర్పులు వెలువరించారు. ఇద్దరు బాలికల అత్యాచార కేసులకు సంబంధించి నిందితులకు 35, 25 ఏళ్ల జైలుశిక్ష, జరిమానా విధించారు. వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లికి చెందిన ఓ బాలికకు ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్కు చెందిన వడ్డె వెంకటరమణ అలియాస్ లక్కీ (23)తో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి హిందూపూర్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లి గతేడాది అక్టోబర్ 10న శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న మేజి్రస్టేట్... వెంకటరమణ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి 25 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.40 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఘటనలో.. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని గార్లపాడుకు చెందిన చాకలి హరిచంద్ర 2017లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కోదండాపురం పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ యాదగిరి విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను విన్న జడ్జి రవికుమార్ నేరస్తుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానాతోపాటు బా ధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాల ని తీర్పు వెలువరించారు. నిందితులకు శిక్ష ప డేలా కృషిచేసిన డీఎస్పీ, ఎస్ఐలు, న్యాయవా దులు, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
నడిరోడ్డుపై భార్యను కిరాతకంగా..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 14న విజయ్, సర్వసతీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి.. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్గా పని చేస్తుండగా.. భర్త విజయ్.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుందిప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?కాగా, ప్రత్యక్ష సాక్షి బాలయ్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతిని విజయ్ కత్తితో పొడిచిన సమయంలో తాను ఆపే ప్రయత్నం చేశానని తెలిపారు. ‘‘దగ్గరకి వెళ్తే.. మీకు దీని గురించి తెలియదు నన్ను అపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది అందుకే చంపేస్తున్నా అంటూ అరిచాడు. వద్దని వారించిన మెడపై కత్తి తో పొడిచాడు.. పీక కోసి రాక్షసుడిలా బిహేవ్ చేశాడు. ఆసుపత్రిలో సరస్వతి డ్యూటీ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. అప్పుడే కత్తితో దాడి చేశాడు‘‘ అని బాలయ్య వివరించారు.
వీడియోలు
మాజీ AVSO సతీశ్ కుమార్ మృతి కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్
YSRCP ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్
హిందూపురం YSRCP ఆఫీస్ పై దాడి సాకే శైలజానాథ్ వార్నింగ్
Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి
ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ
Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు
ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు
ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?
టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం
బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

