శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం శాస్త్రోక్తంగా ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ వేడుకలను ఐదు రోజుల పాటు ఈ నెల 20వ తేదీ వరకు అంగరంగవైభవంగా నిర్వ హించనున్నారు.
తొలి రోజు శ్రీశైల భ్రామరి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులను దీవించారు.
ఉత్సవ నిర్వహణలో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, స్థానాచార్యులు, అర్చకులు, పండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజలు చేసి కంకణాలను ధరించారు.


